
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

Friday, 9 December 2022
దేవీ నవరత్నమాలికా స్తోత్రం
శ్రీషడానననామరత్నావళి
Sunday, 4 December 2022
ఆరోగ్యం కోసం సూర్య మంత్రం
🌹🌞🙏🌞🌹ఆరోగ్యం కోసం సూర్య మంత్రం:🌹
నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే!
ఆయురారోగ్య ఐశ్వర్యo దేహి దేహిదేవః జగత్పతే!!
అర్థం
ఓ సూర్యదేవ!జగత్ పరిపాలకా!నీకిదే నా నమస్కారము.నీవు సర్వరోగములను తొలగించువాడవు.శాంతిని వొసంగువాడవు.
మాకు ఆయువును,ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము🌹🙏🌹
*శ్రీ రామాయణ గ్రంథం.. వాల్మీకి, నారదమహర్షుల ప్రశ్నోత్తరాలతోనే ప్రారంభమవుతుంది.
*రామాయణంలో మహర్షులు.*
➖➖➖
*శ్రీ రామాయణ గ్రంథం.. వాల్మీకి, నారదమహర్షుల ప్రశ్నోత్తరాలతోనే ప్రారంభమవుతుంది.*
*‘షోడశగుణ పూర్ణుడైన మానవుడు ఈ లోకంలో.. ఈ కాలంలో ఉన్నాడా?’ అని.. తపోధనుడైన వాల్మీకి.. వేదవేత్తలలో శ్రేష్ఠుడైన దేవర్షి నారద మహర్షిని అడిగాడు.*
*దానికి నారదుడు.. “ఇక్ష్వాకు వంశంలో రాముడను పేరుతో ప్రసిద్ధి చెందిన, లోకంలోని వారందరిచే ప్రశంసింపబడుతున్న మానవుడు కలడు’’ అని బదులిచ్చాడు.*
*అలా శ్రీ రామాయణావతరణకు నారద వాల్మీకి మహర్షులే మూలకారకులు.*
*శ్రీ రామాయణ గ్రంథారంభం నుండి శ్రీరామపట్టాభిషేక ఘట్టం వరకు గల అనేక ముఖ్య సందర్భాలలో కీలకపాత్రను పోషించిన వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశానికి కులగురువు.*
*బ్రహర్షియైున వశిష్ఠుని ఆజ్ఞకు రఘు వంశ రాజులు ఏనాడూ ఎదురు చెప్పలేదు.*
*దశరథ మహరాజు నిర్వహించిన అశ్వమేధ, పుత్రకామేష్టి యాగాలు, దశరథ నందనుల నామకరణం, విశ్వామిత్రుని యాగ సంరక్షణ నిమిత్తం రామలక్ష్మణులను పంపించడానికి దశరథుని ఒప్పించడం.. ఇలా ఎన్నో విశిష్ట కార్యాలను నిర్వహించింది వశిష్ఠ మహర్షే.*
*అలాగే.. విభాండక మహర్షి కుమారుడైన ఋష్య శృంగ మహర్షి.. దశరథుని ఆహ్వానం మేరకు ‘పుత్రకామేష్టి’ అనే బృహద్యాగంలో పాల్గొని ఆశీస్సుల నందించి యాగ సాఫల్యానికి కారకుడయ్యాడు.*
*శ్రీరాముని శక్తిని, శ్రీరామతత్త్వాన్ని లోకానికి ముందుగా తెలియపరిచినవాడు విశ్వామిత్ర మహర్షి.*
*తన వద్దనున్న బల, అతిబల విద్యలను జృంభక మొదలైన అస్త్రాలను రామలక్షణులకు ఉపదేశించాడు.*
*తన యాగాలకు అడ్డంకులు కల్పిస్తున్న తాటక, సుబాహువుల సంహారం ద్వారా.. దుష్టశిక్షణకు, శిష్ట రక్షణకు అవతరించిన సత్య పరాక్రమవంతుడైన మహాత్ముడే శ్రీరాముడు అని లోకానికి చాటి చెప్పాడు.*
*ఆ తర్వాత రామలక్షణులను జనకుని కొలువుకు తోడ్కొని వెళ్లి, శివ ధనుర్భంగం చేయించి, సీతాదేవితో వివాహం జరిపించి, రావణవధకు బీజం వేసి లోక క్షేమానికి దోహదపడిన మహనీయుడు విశ్వామిత్ర మహర్షి.*
*వనవాస దీక్షలోనున్న సీతారామలక్ష్మణులకు ఆతిథ్యాన్ని ఇచ్చింది, చిత్రకూటము ఆశ్రమ నిర్మాణమునకు అనుకూల ప్రదేశమని తెలిపింది.. భరద్వాజ మహర్షి.*
*రావణ వధానంతరం తన ఆశ్రమానికి వచ్చిన శ్రీరామునికి రెండు వరాలను ఇచ్చింది కూడా భరద్వాజ మహర్షియే.*
*విరాధుడు చెప్పిన ప్రకారం శ్రీరాముడు శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు. ‘నేను చేసిన తపముతో ఎన్నెన్నో పుణ్యలోకాలు, మరెన్నో పుణ్యఫలాలు నాకు వశమయినాయి.*
*చిత్ర విచిత్రములైన సుఖాలను కలిగించే ఆ పుణ్యఫలాలను సమర్పిస్తానని శరభంగ మహర్షి చెప్పినా రాముడు ఒప్పుకోలేదు.*
*‘ఈ అడవిలో నివాసయోగ్యమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని తెలపండి చాలు’ అని శ్రీరాముడు కోరగా.. సుతీక్ష్ణ మహర్షి దగ్గరకు పంపాడు.*
*ఇక.. శ్రీరామ చంద్రునికి ఆదిత్యహృదయాన్ని ఉపదేశించి, రావణవధకు సహకరించిన తపోసంపన్నుడు.. అగస్త్య మహర్షి.*
*ఇలా ఎందరో మహర్షులు రాముని తీర్చిదిద్ది.. ఆ అవతారపురుషుని చరితను జనులకు శాశ్వతంగా అందించి, తరించడానికి కారకులయ్యారు.*
*అట్టి మహర్షులందరినీ నిత్యం తలుచుకుని వందనం చేయాలి.. ముందు తరాలకు ఈ చరిత్రలు బాసటగా నిలవాలి... *
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
శివుడే స్వయంగా సృష్టించిన పవిత్రక్షేత్రం..వారణాసి......!! ఋగ్వేదంలో కాశీ నగరాన్ని జ్యోతి స్థానం
శివుడే స్వయంగా సృష్టించిన పవిత్రక్షేత్రం..వారణాసి......!!
ఋగ్వేదంలో కాశీ నగరాన్ని జ్యోతి స్థానం
అని వర్ణించారు .
స్కంధ పురాణంలోని కాశీఖండంలో అయితే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు "ముల్లోకాలూ నాకు నివాసమే... అందులో కాశీ క్షేత్రం నాకు మందిరం. అని చెప్పినట్లుగా వర్ణన ఉంది.
ఈ నగర ప్రాశస్త్యం గురించి వివరించడానికి
ఇదొక్కటి చాలు .
గంగా నదితో "వరుణ", "అస్సి" అనే రెండు నదుల సంగమస్థానం మధ్య ఉన్నందున కాశీకి "వారణాసి" అనే మరో పేరు వచ్చింది.వారణాసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి నది సంగమ స్థానం ఉన్నాయి.
ఇంకో కథ ఏంటంటే "వరుణ" నదికే పూర్వకాలం "వారణాసి అనే పేరు ఉండేది.
కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. "వారణాసి" అనే పేరును పాళీ భాషలో "బారనాసి" అని రాసేవారు.
అది తరువాత ‘బవారస్’గా మారింది.
వారణాసిని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే నామాలతో ప్రస్తావించారు.
సుమారు 5వేల సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాల్లో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కంద పురాణం వంటి అనేక ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది.
కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య, బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపురాలలో ఒకటైన కాశీకి విచ్చేశారు.
ఆ నగరాలలో అయోధ్య, మథుర, గయ, అవంతిక, కంచి, ద్వారక నగరాలు మిగిలినవి.
ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రధమ స్థానంలో ఉందని పరిశోధనలు తెలియ జేస్తున్నాయి .
పురాతత్వ అవశేషాలు వారణాశి వేదకాల ప్రజల ఆవాసమని వివరిస్తున్నాయి.
కాశీ పట్టణం గురించి ప్రధమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. ఇవన్నీ ఎలా ఉన్నా ఆ విశ్వనాథుడు శరీరం అయితే.. కాశీ ఆయన ఆత్మ అని తరతరాలుగా భారతీయ ఆధ్యాత్మిక జగత్తు ఎలుగెత్తి చాటుతోంది.
ప్రపంచం మొత్తం ప్రళయంలో నాశనమైనా కాశీ మాత్రం చెక్కుచెదరదని మన పురాణాలు చెబుతున్నాయి.
దానికి తగ్గట్టే వేల సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లను ఎదుర్కుంటున్నా ఈ క్షేత్రం మాత్రం సజీవంగా తన ఉనికిని చాటుకుంటోంది.
వారణాసి అంటేనే ఆలయాలకు నెలవు.
చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి.
ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్నిచూడవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి.
ఒక లెక్క ప్రకారం కాశీ లో దాదాపు 23 వేల ఆలయాలు ఉన్నాయి.
అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడే ఆలయం విశ్వనాధ మందిరం, దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని "బంగారు మందిరం" అని కూడా అంటుంటారు.
ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లోఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు.
ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న స్వామి ... "విశ్వేశ్వరుడు" , "విశ్వనాథుడు" పేర్లతో పూజలందుకొంటున్నాడు.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం మిగిలిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం.
ఈ ఆలయం పలుమార్లు విధ్వంశం చేయబడి తిరిగి నిర్మించబడింది. ఆలయ సమీపంలో ఉన్న " గ్యాంవాపీ " మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అప్పటి మందిరం విధ్వంసం చేయబడింది.
1983 జనవరి 28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం స్వీకరించింది. అప్పటి కాశీ రాజు విభూతి నారాయణ సింగ్ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది.
కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి మందిరం ఉంది.
విశ్వనాథుని దర్శించుకున్న తరువాత భక్తులు విశాలాక్షిదేవిని దర్శించుకోవడం ఆచారం.
అలాగే.. కాశీ విశ్వనాథాలయానికి సమీపంలోనే అన్నపూర్ణాదేవి మందిరం కూడా ఉంది.
ఈ దేవాలయం లోపలనే కాశీ వచ్చే భక్తులకు
ఉచిత అన్నదానం నిర్వహించబడుతోంది.
కాశీ అనగానే గుర్తువచ్చే మరో ప్రత్యేకత..
గంగా తీరం అంతటా నిర్మించబడ్డ స్నాన ఘట్టాలు. ఇక్కడ స్నానం ఆచరించడానికి దేశం నలుమూలల నుంచీ వేలకొద్దీ ప్రజలు వస్తుంటారు.
కేవలం తమ పాపాలు పోగొట్టుకోవడానికే కాకుండా... తమ వారికి పిండ ప్రదానం చెయ్యడానికి వస్తుంటారు.
అందుకే వారి కోసం ఘాట్లను ఏర్పాటు చేశారు. వారాణసిలో మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి.
వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి.
ఈ స్నానఘట్టాలు మరాఠీలు, సింధియాలు, హోల్కార్లు, భోంస్లేలు, పెషావర్లచే నిర్మించబడ్డాయి. కొన్ని ఘాట్లు ప్రైవేటు ఆస్తులుగా ఉంటున్నాయి. ఎక్కువ ఘాట్లు స్నానానికి, దహనకాండలకు వాడతారు. కొన్ని ఘాట్లు పురాణ గాధలతో ముడిపడి ఉన్నాయి.
ఆధ్యాత్మిక, భౌతిక భావాలతో కూడిన పవిత్రభావాలకు ఈ స్నానఘట్టాలు ప్రతీకలుగా ప్రశంసిచబడుతున్నాయి.
వీటిలో దశాశ్వమేధఘట్టం, పంచ గంగ ఘట్టం, ధహనసంస్కారాలు జరిపించే మణికర్ణికా, హరిశ్చంద్రా ఘాట్లు ప్రత్యేకమైనవి.
ఉదయం బోటులో స్నానఘట్టాలను దర్శించడం యాత్రీకులను ఎక్కువగా ఆకర్షించే విషయాలలో ఒకటి.
కాశీలో ఉన్న పవిత్రాలయాలలో ‘సంకట్ మోచన్ హనుమాన్ మందిరం’ కూడా అతి ముఖ్యమైనది .
ఈ మందిరం " బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం " ఆవరణలో ఉన్న దుర్గా, ఆధునిక విశ్వనాథ్ మందిరాలకు పోయే మార్గంలో అసి నదీతీరంలో ఉంది.
ప్రస్థుత ఆలయం 1900 లో విద్యావేత్త, స్వాతంత్ర సమరవేత్త మదనమోహన్ మాలవ్యా చేత నిర్మించబడింది.
తులసి రామాయణం సృష్టికర్త అయిన తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో నిర్మించబడింది.
సీతారాముల ఆలయం కూడా ఉంది.
కేవలం ఇవి మాత్రమే కాదు ..
కాల భైరవ .. కేదార .. తదితర మహిమాన్విత ఆలయాలకు నెలవు వారణాసి నగరం.
ఆధునిక దేవాలయం గా పిలవబడే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం..
అంతరిక్ష పరిశోధనలకై జైపూర్ రాజా నిర్మించిన జంతర్ మంతర్.. ఇలా ఎటువైపు చూసినా .. ఆధ్యాత్మిక .. చారిత్రిక .. ఆధునిక దృక్పథాల సమాగమంగా విలసిల్లుతుంది కాశీ నగరం .
శివుడే స్వయంగా సృష్టించిన పవిత్ర క్షేత్రం "వారణాసి"
*కాశీలో 9 రోజులు ఉండాలి అనడంలో ఆంతర్యం ఏమిటి..?
*నవ దిన కాశీ యాత్ర*
➖➖➖
*కాశీలో 9 రోజులు ఉండాలి అనడంలో ఆంతర్యం ఏమిటి..?*
మనిషి తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉంటాడు. జన్మ రాహిత్యం ఇచ్చేది కాశి ఒక్కటే.. అందుకని వ్యాస మహర్షి కాశీ లో తొమ్మిది నెలలు దీక్ష లో ఉండి, ఆ తర్వాత స్వగ్రామం చేరి మంచి రోజు చూసి పూజ చేయాలి అని చెప్పాడు.
అయితే కలికాలంలో ఇంత శ్రద్ధతో అంతకాలం ఉండలేమని ఇంకేదైనా ఉపాయం చెప్పమని సామాన్యులు కోరారు.
దానికి ఆయన తొమ్మిది రోజులుంటే ఆ ఫలితం ఢోకా లేకుండా వస్తుంది అని చెప్పాడు.
అలానే ఇప్పుడు సమయం ఉన్న వారందరూ కాశీలో తొమ్మిది రోజులుండి వస్తున్నారు..
👉మరి ఆ రోజుల్లో ఏం చెయ్యాలి?
👉విశ్వేశ్వర నామ స్మరణ,
దానాలు చేయటం,
ధర్మ ప్రసంగాలు వినటం,
ఏక భుక్తం, ప్రాతఃకాల స్నానం,
ఉదయం, రాత్రి విశ్వేశ్వర దర్శనం,
కోపం లేకుండా ఉండటం,
అబద్ధమాడకుండా ఉండటం,
అనే ఎనిమిది అంశాలు ఖచ్చితంగా అమలు చేయాలి.
👉1. మొదటి రోజు కార్యక్రమం:
ఆగత్య మణి కర్న్యామ్తు –
స్నాత్వా దత్పధనంబహు –
వపనం కారయిత్వాతు –
స్నిత్వా శుద్ధాహ్ వయోవ్రతః
సచేల మభి మజద్యా ధ–
కృతా సంధ్యాధిక క్రియాహ్
సంతర్ప్య తర్మ్యాద పిత్రూన్ –
కుశ గంధ తిలొదకైహ్”
మొదటిగా మనసులో ముప్పది మూడు కోట్ల దేవతలు, తీర్ధాలతో సర్వ పరివారంతో సేవింప బడుతున్న...
శ్రీ కాశీ విశ్వేశ్వరా శరణు! అనుజ్ఞ! అని స్మరించుకొని మణి కర్ణికా తీర్దానికి వెళ్ళాలి. దీనినే చక్ర తీర్ధం అంటారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడ… మహా దేవుని సేవలో ఇక్కడ ధన్యమైనాడు. శివుడికి పార్వతి తర్వాత ఇష్టమైన వాడు విష్ణువే.
అందుకే “నారాయణీ సహా చరయ నమశ్శివాయ” అన్నారు.
విష్ణు సేవా ఫలితం గా ఏర్పడిన మణికర్ణిక కు గొప్పదనాన్ని ఆపాదించాడు విశ్వేశుడు.
యాత్రీకులు మణికర్ణిక లో స్నానం చేయాలి. బ్రాహ్మణులకు దానాలు చేయాలి..కేశఖండనం చేసుకొని మళ్ళీ స్నానం చేయాలి..
మహేశ్వరాదులను అర్చించి మళ్ళీ స్నానం చేయాలి..
రుద్రాక్ష మాల ధరించి ఈ కింది శ్లోకం చదువు కోవాలి....
’కిము నిర్వాణ పదస్య భద్ర పీతం – మృదులం తల్ప మదోను మోక్ష లక్స్యః
అధవా మణి కర్ణికా స్థలీ పరమానంద సుకాండ జన్మ భూమి చరా చరేషు సర్వేషు- యావంతస్చ సచేతనః –తావంతిహ్ స్నాంతి మధ్యాహ్నే – మణి కర్నీజతే మలే..
ఆ గంగా కేశవస్చైవ –
ఆ హరిన్ద్రస్చ మండ పాత్ –
ఆ మద్ధ్యా ద్దేవ సరితః
స్వర్ద్వారా న్మణికర్ణికా
నమస్తే నమస్తే నమః‘’.....
అని నమస్కరించి అక్కడ నుండి డుండి వినాయకుడిని దర్శించి 21 గరికలను, 21 కుడుములను సమర్పించి, 21 సార్లు గుంజీలు తీసి 21 రూపాయలు దక్షిణ గా సమర్పించాలి.
దున్దీ రాజ గణేశాన –
మహా విఘ్నౌఘనాశన –
నవాఖ్యాదిన యాత్రార్ధం –
దేహ్యాజ్ఞానం కృపయా విభో”
అని ప్రార్ధించాలి.
తర్వాతా అన్నపూర్ణా దేవిని సందర్శించాలి. ఆ తర్వాతా విశాలాక్షి , జ్ఞానవాపి, సాక్షి గణపతులను చూడాలి..
ఇది పూర్తీ చేసి నివాసం చేరి భోజనం చేయాలి. రాత్రికి విశ్వనాధుడిని దర్శించాలి..
ఫలాలు, పాలు ఆహారంగా గ్రహించాలి.
“హర సాంబ హర సాంబ సాంబ సాంబ హరహర –హర శంభో హర శంభో –శంభో శంభో హరహర మహాదేవ మహాదేవ విశ్వనాధ శివ శివ –
మహాకారి మహా కారి రక్ష రక్ష హరహర”
అంటూ పదకొండు సార్లు భజన చేసి నిద్రపోవాలి.
👉2. రెండవ రోజు కార్యక్రమం:
రెండో రోజు ఉదయాన్నే గంగా స్నానం చేసి విశ్వేశ్వర , అన్నపూర్ణా దర్శనం చేయాలి. మధ్యాహ్నం పన్నెండు గంటలకు మణి కర్ణికా ఘట్టం లో స్నానం చేయాలి. తీర్ధ శ్రాద్ధం చేయాలి. వెయ్యి సార్లు గాయత్రీ జపం చేయాలి..
గురు ఉపదేశం తో ....
“శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః” అనే మంత్రాన్ని వెయ్యి సార్లు జపించాలి. మధ్యాహ్నం విశ్వేశుని దర్శించి సాయంత్రం కూడా మళ్ళీ దర్శించాలి. రాత్రి ఫలహారం చేసి పడుకోవాలి .
👉3. మూడవ రోజు కార్యక్రమం:
తెల్లవారక ముందే అసీ ఘాట్ లో సంకల్ప స్నానం చేసి అక్కడున్న సంగమేశ్వర స్వామిని దర్శించాలి.
తర్వాత దశాశ్వ మేధ ఘాట్ కు చేరాలి. దీనికి “రుద్ర సరోవర తీర్ధం “ అనే పేరు కూడా ఉంది.. ఇక్కడ స్నానం చేసి శీతలా దేవిని దర్శించాలి. వరుణా ఘాట్ కు వెళ్లి స్నానం చేసి ఆదికేశవ స్వామిని దర్శించాలి. పంచనదీ తీర్ధమైన బిందు మాధవ ఘట్టం లో సంకల్ప స్నానం చేయాలి.
‘కిరణ దూత పాపాచ – పుణ్య తోయా సరస్వతీ గంగాచ యమునా చైవ –
పంచ నద్యోత్ర కీర్తితః’
అని స్మరిస్తూ స్నానం చేయాలి .
తర్వాతా బిందు మాధవ సంగమేశ్వర దర్శనం చేసుకోవాలి. మణి కర్ణేశుని, సిద్ధి వినాయకుని దర్శించి పూజించాలి.. అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం కావించి నివాస స్థలం చేరి భోజనం చేయాలి. రాత్రికి పాలు , పండ్లు మాత్రమే స్వీకరించాలి .
👉4. నాల్గవ రోజు కార్యక్రమం:
ఉదయమే గంగా స్నానం విశ్వేశరుడి దర్శనం చేసి డుండి వినాయకుడిని చూసి దండ పాణి అయిన కాల భైరవుని పూజించాలి.
కాశీ క్షేత్ర రాజ్యాన్ని మనసు లో స్మరించి..
“ఓం కాశ్యై నమః” అని 36 సార్లు అనుకోవాలి. తర్వాత బిందు మాధవుని దర్శించాలి.. గుహను, భవానీ దేవిని దర్శించాలి. ఇలా మధ్యాహ్నం వరకు తొమ్మిది దర్శనాలు చేసి మణి కర్ణిక చేరి మట్టి లింగాన్ని పూజించి మళ్ళీ అన్నపూర్ణా విశ్వేశులను దర్శించి భోజనం చేయాలి. రాత్రి నామ స్మరణ పాలు, పండ్లు ఆహారం... అంటే ఈ రోజు పది దర్శనాలన్న మాట.
👉5. అయిదవ రోజు కార్యక్రమం:
ప్రాతఃకాలమే గంగా స్నానం చేసి కేదారేశ్వరుని దర్శించి అక్కడే రుద్రాభిషేకం నిర్వహించాలి.. తర్వాత తిలా భాన్దేశ్వర, చింతామణి గణపతిని సందర్శనం చేయాలి.. దుర్గా దేవిని చూసి ఒడి బియ్యం, దక్షిణ సమర్పించి గవ్వలమ్మ ను చేరి అదే విధంగా పూజ చేయాలి.. ఈమెనే కౌడీబాయి అంటారు.
అన్నపూర్ణా విశ్వనాధ దర్శనం చేసి, భోజనం చేసి రాత్రి పాలు, పండ్లు తీసుకోవాలి.
👉6. ఆరవ రోజు కార్యక్రమం:
సూర్యోదయానికి పూర్వమే గంగా స్నానం చేసి బ్రాహ్మణ ముత్తైదువులకు పూజ చేసి ఆశీస్సులు పొంది, వైధవ్యం ఎన్ని జన్మలకైనా రాకూడదని దీవెనలు పొంది మూసి వాయన చేటల దానాన్ని చేసి, బేసి సంఖ్యలో జనానికి వాయన దానాన్ని చేయాలి.
వ్యాస కాశీ చేరి వ్యాసుని, రామలింగేశ్వరుని,
శ్రీ శుకులను దర్శించి.., కాశీ వచ్చి అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేయాలి.. తర్వాత భోజనం చేయాలి.. రాత్రి సంకీర్తనతో కాలక్షేపం చేసి పాలు, పండ్లను స్వీకరించాలి.
👉7. ఏడవ రోజు కార్యక్రమం:
గంగాస్నానం, నిత్య పూజ చేసి వెయ్యి గరికలను ఏరి సిద్ధం చేసుకోవాలి. దొరక్కపోతే నూట ఎనిమిదితో సరి పెట్టుకోవాలి. ఇరవై ఒక్క ఉండ్రాళ్ళను, నూట ఎనిమిది యెర్ర పూలతో పూజించాలి.. ముగ్గురు బ్రాహ్మణ ముత్తైదువు లకు భోజనం పెట్టి తాంబూలాలు ఇవ్వాలి..
డుండి వినాయకుడిని అర్చించి , అన్నపూర్ణా ఆలయంలో కుంకుమ పూజ చేయించాలి. అమ్మవారికి చీరా జాకెట్టు, ఒడిబియ్యం , గాజులు సమర్పించాలి... ఇలాగే విశాలాక్షి కీ చేయాలి . విశ్వేశునికి అభిషేకం చేయాలి. సహస్ర పుష్పార్చన.., సహస్ర బిల్వార్చన ,
హారతి ఇచ్చి తీర్ధ ప్రసాదాలను స్వీకరించాలి. హర సాంబ హర సాంబ అంటూ పదకొండు సార్లు జపం చేయాలి..
👉8. ఎనిమిదో రోజు కార్యక్రమం:
గంగాస్నానం, నిత్యపూజా తర్వాత కాల భైరవుడిని దర్శించి వడలు, పాయసం నివేదించాలి. ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి. ఆ రోజంతా కాల భైరవ స్మరణతో నిష్టగా గడపాలి.. అయిదుగురు యతులకు, ముగ్గురు బ్రాహ్మణ స్త్రీలకూ భోజనం పెట్టాలి.
దక్షిణా తాంబూలం సమర్పించాలి... భోజనం చేసి రాత్రి కాల భైరవ స్మరణ చేస్తూ నిద్ర పోవాలి.
👉9. తొమ్మిదో రోజు కార్యక్రమం:
గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనం చేసి అన్నపూర్ణా దేవిని దర్శించి, పూజించి,
నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి.. జ్ఞానులైన దంపతులను పూజించి భోజనం పెట్టి దక్షిణ లివ్వాలి.. ఆశీస్సులు పొందాలి..
రాత్రి అన్నపూర్ణాష్టకం చేసి నిద్ర పోవాలి .
👉10. పదవ రోజు కార్యక్రమం:
నవ దిన యాత్ర పూర్తీ చేసి పదవ రోజు గంగా స్నానం చేసి గంగను పూజించి సహస్ర నామ పూజ చేసి, అన్నపూర్ణా విశ్వేశ్వర దర్శనం చేసి తలిదండ్రులను, గురు దంపతులను పూజించాలి.. అందరి ఆశీర్వాదాలు పొంది ఇంటికి ప్రయాణమవ్వాలి....
ఇలా చేస్తే విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది....
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ .
ఓం శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
పళని పుణ్యక్షేత్రం
💐💐పళని పుణ్యక్షేత్రం💐💐
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది పళని. ఈ క్షేత్రం తమిళనాడు లోని దిండిగల్ జిల్లాలో, మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని. ఇప్పుడు ఉన్న మందిరం క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. ఆ తరువాత పాండ్యుల కాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధి చేయబడింది.
" ఆరు పడై వీడు – పళని దండాయుధ పాణి స్వామి
పార్వతి నందనా...సుబ్రహ్మణ్యా "
దండాయుధ పాణి
ఇక్కడ స్వామి వారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. తమిళులు ఈయనను “పళని మురుగా” అని కీర్తిస్తారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని, కౌపీన ధారియై, వ్యుప్త కేశుడై నిలబడి, చిరునవ్వులొలికిస్తూ ఉంటాడు. అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణ మహర్షిది. భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారము అని పెద్దలు చెప్తారు. ఇక్కడ స్వామి వారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్ధం “నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో” - అని మనకి సందేశము ఇస్తున్నారు అని అర్థం. అంటే ఈ పళని క్షేత్రము జ్ఞానము ఇచ్చే క్షేత్రము. అంతే కాదు ప్రఖ్యాత కావిడి ఉత్సవము మొదలయిన క్షేత్రము పళని.
ఆలయ గర్భ గుడి గోపురం
ఇక్కడ పళని మందిరంలోని గర్భ గుడిలోని స్వామి వారి మూర్తి నవపాషాణములతో చేయబడినది. ఇటువంటి స్వరూపం ప్రపంచములో మరెక్కడా లేదు. ఈ మూర్తిని సిద్ధ భోగార్ అనే మహర్షి చేశాడు. తొమ్మిది రకాల విషపూరిత పదార్ధాలతో (వీటిని నవపాషాణములు అంటారు) చేశారు. పూర్వ కాలంలో ఇక్కడ పళని స్వామి వారి మూర్తిలో ఊరు (తొడ) భాగము వెనుక నుండి స్వామి వారి శరీరం నుండి విభూతి తీసి కుష్ఠు రోగం ఉన్నవారికి ప్రసాదంగా ఇస్తే, వారికి వెంటనే ఆ రోగం పోయేదని పెద్దలు చెప్తారు. అలా ఇవ్వగా ఇవ్వగా, స్వామి వారి తొడ భాగం బాగా అరిగి పోవడంతో అలా ఇవ్వడం మానేశారు. ఇప్పటికీ స్వామి వారిని వెనుక నుండి చూస్తే ఇది కనబడుతుంది అని పెద్దలు చెప్పారు. కాని మనకి సాధారణంగా ఆ అవకాశం కుదరదు.
ఇక్కడ స్వామి వారిని ఈ క్రింది నామాలతో స్తుతి చేస్తూ ఉంటారు.
01. కులందైవళం,
02. బాలసుబ్రమణ్యన్, షణ్ముగన్,
03. దేవసేనాపతి,
04. స్వామినాథన్,
05. వల్లి మనలన్,
06. దేవయానై మనలన్,
07. పళని ఆండవార్,
08. కురింజి ఆండవార్,
09. ఆరుముగన్,
10. జ్ఞాన పండిత,
11. శరవణన్,
12. సేవర్ కోడియోన్,
13. వెట్రి వేల్ మురుగా .........
మొదలైన నామాలు ఎన్నో ఉన్నాయి స్వామికి ఇక్కడ.
కొండ ఎక్కడానికి వించి మార్గము
ఇంకొక విషయం ఏమిటంటే, పళని లో కొండ పైకి ఎక్కడానికి రెండు మార్గాలు ఉంటాయి. ఓపిక ఉన్న వారు మెట్ల మార్గంలో వెళ్లడం ఉత్తమం. మెట్లు కాకుండా, రోప్ వే లాంటి చిన్న రైలు సౌకర్యం కూడా ఉంది. దీనికి టికెట్ యాభై రూపాయలు. ఒక సారి వెళ్ళడానికి బావుంటుంది. (ఓపిక లేకపోతే ప్రతీ సారి)
పళని క్షేత్ర స్థల పురాణము
పూర్వము విఘ్నాలకు అధిపతిని ఎవరిని చెయ్యాలి అని, పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు మన బొజ్జ వినాయకుడిని, చిన్ని సుబ్రహ్మణ్యుడిని పిలిచి ఈ భూలోకం చుట్టి ( అన్ని పుణ్య నదులలో స్నానం ఆచరించి ఆ క్షేత్రములను దర్శించి రావడం) ముందుగా వచ్చిన వారిని విఘ్నములకు అధిపతిని చేస్తాను అని శంకరుడు చెప్తే, అప్పుడు పెద్దవాడు, వినాయకుడు యుక్తితో ఆది దంపతులు, తన తల్లి తండ్రులు అయిన ఉమా మహేశ్వరుల చుట్టూ మూడు మాట్లు ప్రదక్షిణ చేస్తాడు. మన బుజ్జి షణ్ముఖుడు ఆయన యొక్క నెమలి వాహనముపై భూలోకం చుట్టి రావడానికి బయలుదేరతాడు. కాని, వినాయకుడు “తల్లి తండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యం వస్తుంది” అనే సత్యము తెలుసుకుని, కైలాసంలోనే ప్రదక్షిణలు చేస్తూ ఉండడం వల్ల, సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రమునకు వెళ్ళినా, అప్పటికే అక్కడ లంబోదరుడు వెనుతిరిగి వస్తూ కనపడతాడు. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు. ఈ కథ మనకు అందరకూ తెలిసినదే.
కార్తికేయుడు శివ కుటుంబంలో చిన్న వాడు కదండీ, దానితో కాస్త చిన్న మొహం చేసుకుని కైలాసం వదిలి, భూలోకంలోకి వచ్చి ఒక కొండ శిఖరం మీద నివాసం ఉంటాడు అలకతో. ఏ తల్లి తండ్రులకైనా పిల్లవాడు అలిగితే బెంగ ఉంటుంది కదండీ, అందులోనూ చిన్న వాడు, శివ పార్వతుల ఇద్దరి అనురాగముల కలపోత, గారాల బిడ్డ కార్తికేయుడు అలా వెళ్ళిపోతే చూస్తూ ఉండలేరు కదా, శివ పార్వతులు ఇద్దరూ షణ్ముఖుని బుజ్జగించడం కోసం భూలోకంలో సుబ్రహ్మణ్యుడు ఉన్న కొండ శిఖరం వద్దకు వస్తారు.
శంకరుడు సుబ్రహ్మణ్యుని బుజ్జగిస్తూ.
ఆ కొండ శిఖరం ఉన్న ప్రదేశమును తిరు ఆవినంకుడి అని పిలుస్తారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకుని, “ నువ్వే సకల జ్ఞాన ఫలానివి రా నాన్నా” అని ఊరడిస్తాడు. సకల జ్ఞాన ఫలం (తమిళంలో పలం), నీవు (తమిళంలో నీ) – ఈ రెండూ కలిపి పళని అయ్యింది. అంతటితో ప్రసన్నుడు అయిన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతముగా ఆ కొండ మీదే కొలువు ఉంటానని అభయం ఇస్తాడు. సుబ్రహ్మణ్య క్షేత్రాలలో జరిగే “కావడి ఉత్సవం” మొట్ట మొదట ఈ పళని లోనే ప్రారంభం అయ్యింది.
కావడి ఉత్సవము - ఇడుంబన్ వృత్తాంతం
ఇడుంబుడు
సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క గొప్ప శిష్యులలో అగస్త్య మహా ముని ఒకడు. అగస్త్య మహా ముని స్వామి దగ్గర నుండి సకల జ్ఞానము పొందాడు. అగస్త్య మహర్షికి ద్రవిడ వ్యాకరణము సుబ్రహ్మణ్య స్వామి వారే నేర్పారు.
పూర్వము దేవ దానవ యుద్ధములో చాలా మంది దానవులు నిహతులై పోయారు. కాని అందులో ఇడుంబన్ అనే ఒక రాక్షసుడు మాత్రం అగస్త్య మహర్షి పాదములు పట్టుకున్నాడు. అగస్త్యుడు సంతోషించి, వీడిలో మిగిలిపోయిన కొద్ది రాక్షస భావాలు తొలగించాలి అనుకున్నాడు. సాధారణంగా ఎవరైనా పెద్దలు తన వల్ల కాని పని ఉంటే, తన గురువుకి అప్పచెప్తారు. వీడు రాక్షసుడు కదా అని సంహరించడం కాదు, వీడిలో ఉన్న ఆసురీ గుణములను తీసివేయాలి అని తలచి, లోకంలో ఆదిగురువు దక్షిణా మూర్తి, శంకరుడు ఉండేది కైలాసంలో కదా, అందుకని ముందు అక్కడికి పంపిద్దాము అనుకుని ఇడుంబుడిని పిలిచి, “ఒరేయ్ నేను కైలాసం నుండి రెండు కొండలు తెద్దామని చాలా కాలం నుండి అనుకుంటున్నాను, వాటిని శివగిరి, శక్తిగిరి అంటారు. నువ్వు వెళ్లి ఆ రెండు కొండలను, ఒక కావిడి లో పెట్టుకుని నేను ఉన్న చోటికి తీసుకురా” అని ఆజ్ఞాపించాడు.
సరే ఇడుంబుడు, వంట్లో ఓపికుంది కదా, కైలాసం వెళ్లి ఆ రెండు కొండలను తన కావిడిలో పెట్టుకుని బయలుదేరతాడు. శంకరుడు అనుకుంటాడు, ఈ రాక్షసుడి ఆసురీత్వం పోగొట్టడం, జ్ఞాన రాశి అయినటువంటి మా సుబ్రహ్మణ్యుడు చేస్తాడులే అనుకుని ఇడుంబుడిని వెళ్ళనిస్తారు. ఇక్కడ స్వామి పళని కొండ మీద చిన్న పిల్లవాడిగా ఉన్నాడు, ఇడుంబుడు దారిలో వస్తూ ఉండగా సరిగ్గా పళని దగ్గరకి వచ్చే సరికి ఆ కొండలు మోయలేక ఆయాసం వచ్చి, కాసేపు క్రింద పెట్టి సేద తీరాడు.
మళ్ళీ కావిడి ఎత్తుకుందామని క్రిందకి వంగి కావిడి బద్ద భుజం మీద పెట్టుకుని లేచి నిలబడి, రెండు వైపులా బరువు సమానంగా ఉండేలా సర్దుదామని చూస్తే ఒక వైపు ఎక్కువ బరువు, ఇంకో వైపు తేలిక అవుతోంది కాని, సమానంగా ఎంతసేపటికీ కుదరట్లేదు. ఇంక విసుగొచ్చి, ఏమిటిరా ఈ కావిడి అనుకుని, అలా పైకి చూస్తాడు ఇడుంబుడు. పైకి చూడగానే అక్కడ సుబ్రహ్మణ్యుడు చిన్న పిల్లవాడి రూపంలో పకపక నవ్వుతున్నాడు. ఇది చూసి వీడికి కోపం వచ్చింది. ఇదే రాక్షస ప్రవృత్తి అంటే, ఏదో చిన్న పిల్లవాడు నవ్వుతున్నాడులే అనుకోవచ్చు కదా. స్వామికేసి తిరిగి “ఏమిటా నవ్వు, నేనేమైనా ఈ కావిడి ఎత్తలేనని అనుకుంటున్నావా? కైలాసం నుంచి తీసుకొచ్చాను. ఏమిటా వెర్రి నవ్వు, నిన్ను చంపేస్తాను ఇవ్వాళ అని ఆ కొండ మీదకి పరిగెత్తాడు. తెలిసి పరిగెత్తాడో, తెలియక పరిగెత్తాడో పళని కొండ మీదకి పాదచారియై వెళ్లాడు. పైకి వెళ్ళాక, స్వామి రెండు గుద్దులు గుద్దాడు, ఇంక ప్రాణం వదిలేస్తున్నాను అన్నప్పుడు, వాడికి తెలిసింది, ఈ పిల్లవాడు సామాన్యుడు కాదురా, మా గురువు గారికి (అగస్త్యుడు) గురువు, సాక్షాత్తు ఈశ్వర పుత్రుడు.
అప్పుడు వేడుకుంటాడు “ఈశ్వరా తెలుసుకోలేక పోయాను, మీ చేతి గుద్దులు తిన్నాను, నాకు వరం ఇవ్వండి” అన్నాడు. ఏమిటో అడుగు అన్నాడు స్వామి. ఇడుంబుడు అన్నాడు, “స్వామీ, నేను ఈ పళనిలోనే కదా, కావిడి ఎత్తలేకపోయాను, ఈ కావిడి వల్లనే కదా, మిమ్మల్ని చేరడానికి మార్గం అయ్యింది, అందుచేత లోకంలో ఎవరైనా సుబ్రహ్మణ్యుడిని ఏ ఆరాధనా చెయ్యకపోయినా, ఒక్క సారి కావిడి పాలతో కాని, విభూతితో కాని, పూలతో కాని, తేనెతో కాని, నేతితో కాని భుజం మీద పెట్టుకుని, మేము సుబ్రహ్మణ్యుడి దగ్గరకి వెళ్ళిపోతున్నాం అని పాదచారులై నీ గుడికి వస్తే, అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యారాధన, శాస్త్రంలో ఎన్ని విధాలుగా చెయ్యాలని ఉందో, అంత ఆరాధనా చేసిన ఫలితం వాళ్లకి ఇచ్చేసెయ్యాలి” అన్నాడు ఇడుంబుడు.
స్వామి అనుగ్రహించి సరేనని ఆ కోరికని కటాక్షించి, ఇక పైన నా దగ్గరకు వచ్చే భక్తులు ఎవరైనా ముందు నీ దర్శనం చేసి నా వద్దకు రావాలని వరం ఇచ్చాడు. అందుకే అప్పటి నుంచి అన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో (ప్రత్యేకం గా తమిళనాడులో) స్వామి వారిని చేరే మార్గంలో ఇడుంబుడి మూర్తి ఉంటుంది, అక్కడ ఆయనకు నమస్కరించిన తరువాతే, సుబ్రహ్మణ్యుని దర్శనము చేసుకుంటారు.
సుబ్రహ్మణ్య కావడిలు💐
అప్పటి నుంచి, తమిళ దేశం వాళ్ళు సుబ్రహ్మణ్య కావిళ్ళు ఎత్తి, సుబ్రహ్మణ్యుడిని తమ దైవం చేసేసుకున్నారు. అంతే కాక, ప్రతీ ఏటా స్కంద షష్ఠి ఉత్సవాలలో ఏ దంపతులైతే, భక్తితో, పూనికతో స్వామికి నమస్కరించి ఈ కావడి ఉత్సవంలో పాల్గొంటారో వాళ్లకి తప్పక సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. వారి వంశంలో సంతానము కలగక పోవడం అనే దోషం రాబోయే తరాలలో ఉన్నా కూడా ఆ దోష పరిహారం చేసి స్వామి అనుగ్రహిస్తాడు అని పెద్దలు చెప్తారు. దీనినే కావిళ్ళ పండగ అని అంటారు
అంతటి శక్తివంతమైన క్షేత్రం, తప్పకుండా అందరూ చూడవలసిన క్షేత్రము పళని. పళని దండాయుధ పాణి స్వామి వారి దర్శనం చేసి, జీవితంలో ఒక్క సారైనా సుబ్రహ్మణ్య కావిడి ఎత్తి సుబ్రహ్మణ్య అనుగ్రహమును పొందగలమని ఆశిద్దాం.
ఈ క్షేత్రమును చేరే మార్గములు💐
పళని తమిళనాడు లోని మదురై కి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో కొండ మీద ఉంది. రోడ్డు ద్వారా: మధురై, కోయంబత్తూరు, తిరుచిరాపల్లి, చెన్నై, బెంగళూరు నగరాల నుండి అనేక బస్సులు ఉన్నాయి.
రైలు ద్వారా: పళని లో రైల్వే స్టేషను కలదు. ఇక్కడ నుండి మదురై కి, కోయంబత్తూరు కి రైళ్ళు ఉన్నాయి. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లు కొడైకెనాల్ ( 46 కి.మీ ), దిండిగల్ ( 48 కి.మీ. ) దూరం లో ఉన్నాయి.
విమానము ద్వారా: దగ్గరలో విమానాశ్రయములు కోయంబత్తూరు (116 కి.మీ.), మదురై (129 కి.మీ.), తిరుచిరాపల్లి ( 158 కి.మీ.), బెంగళూరు (306 కి.మీ.), చెన్నై ( 471 కి.మీ.) దూరంలో ఉన్నాయి..
వసతి సదుపాయము
పళని కూడా మదురై కి దగ్గరగా ఉండడం వల్ల, వసతి ఏర్పాటు మదురైలోనే చూసుకోవచ్చు. మదురైలో ఎన్నో హోటళ్ళు ఉన్నాయి. కాస్త మంచివి కావాలంటే, Tamil Nadu Tourism Development Corporation (TTDC) వాళ్ళ హోటళ్ళు రెండు ఉన్నాయి. ఇవి కూడా బాగుంటాయి. వీటిలో మదురై – 1 అనే హోటల్ అమ్మ వారి ఆలయమునకు చాలా దగ్గరలో ఉంది. ఇది పడమటి వేలి వీధి లో ఉంది. మదురై లోనే ఉండి, మదురై, పళని, తిరుప్పరంకుండ్రం, పళముదిర్చొలై అన్ని క్షేత్రాలు చూసుకోవచ్చును. ఈ హోటల్ బుకింగ్ ఇంటర్నెట్ లో చేసుకోవచ్చు. ఇది కాక పళని దేవస్థానం వాళ్ళ వసతి గృహాలు కూడా ఉన్నాయి. కాని అందులో ముందుగా బుక్ చేసుకోవాలంటే, వాళ్లకి డబ్బు డీడీ రూపం లో పంపవలసి ఉంటుంది.
ఆలయంలో ఆర్జిత సేవలు
పళని స్వామి వారికి వివిధ సేవలు జరుగుతాయి. ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదం తప్పకుండా స్వీకరించాలి. ఒక్కో ప్రసాదం డబ్బా యాభై రూపాయలు. సీల్ చేసిన డబ్బాలో ప్రసాదం ఇస్తారు. ఎన్ని రోజులైనా ఉంటుంది. చక్కగా ఇంటికి తీసుకువెళ్ళవచ్చు.
(సేకరణ)
అగ్ని నక్షత్రం..(రోహిణికార్తి ).....!!
అగ్ని నక్షత్రం..(రోహిణికార్తి ).....!!
ప్రాతఃకాలాన ఇంద్రాది దేవతలు , మధ్యాహ్నవేళలో వాయుభగవానుడు,
సాయంసంధ్యాసమయా వరుణదేవుడు , చంద్ర భగవానుడు ,రాత్రి అర్ధజామమున కుబేరుడు తెల్లవారుఝామున
త్రిమూర్తులు సూర్యనారాయణుడిని
దర్శిస్తారు.
కృత్తికా నక్షత్రానికి అధిపతి సూర్యభగవానుడు.
ప్రత్యాధి దేవత అగ్ని దేవుడు.
చైత్రమాసంలో
సూర్యుడు ఉఛ్ఛంలో వున్న సమయాన కృత్తికా నక్షత్రంతో కలిసినందువవన దహించుకుపోయే ఎండలు కాస్తాయి.
ఆ వేసవి దినాలను
రోహిణీ కార్తె లేదా అగ్ని నక్షత్రం గా చెప్తారు.
ఈ అగ్ని నక్షత్రానికి సంబంధించిన ఒక పురాణ గాధ యిలావుంది :
ఒకానొక సమయంలో అగ్ని
దేవుడు యజ్ఞ యాగాదులలో సమర్పించే నేయిని త్రాగి త్రాగి గుణపర్చడానికి వీలులేనంత అజీర్తి వ్యాధితో బాధ పడ్డాడు.
దేవతలంతా కూడా ఆయన వ్యాధిని నిర్మూలించే విధానం తెలియక వ్యాకుల పడ్డారు .
అగ్ని దేవుని అజీర్తివ్యాధి నిర్మూలనకు శ్రేష్టమైన వనమూలికలు గల దట్టమైన
అడవులను దహించడమొక్కటే మార్గము అని బ్రహ్మదేవుడు సూచిస్తాడు.
అగ్ని దేవుడు అలాటి వనమూలికలు గల దట్టమైన అడవులను వెతుకుతూ,
యమునాతీరాన వున్న
ఖాండవ వనానికి వచ్చి అక్కడ పచ్చగా, మూలికలతో
సమృధ్ధిగా నిండి వున్న ఆ వనాన్ని చూసి ఆనందంగా , ఆ వనాన్ని భక్షించేందుకు సంకల్పించాడు.
విషయాన్ని తెలుసుకున్న ఖాండవ
వనంలోని జీవులు, తరువులు తమని కాపాడమని వరుణ దేవుని వేడుకున్నాయి.
ఇంద్రుని పరి రక్షణ లోవున్న ఆ మూలికావనం ఎల్లప్పుడూ పచ్చగా వుంటుంది. వైద్యానికి అవసరపడే వనమూలికల అభివృధ్ధి కై ఇంద్రుడే
వానలను సకాలంలో వర్షింప చేస్తాడు.
అందుకే ఇంద్రునికి "ఖాండవవనుడు"
అనే పేరు కూడా వుంది.
విషయం తెలిసిన దేవేంద్రుడు తన వనంలోకి అగ్ని దేవుని
ప్రవేశాన్ని నిరోధిస్తూ తీవ్రమైన వానలు కురిపించాడు.
అగ్నిదేవుడు ఎన్ని విధాలుగా ఖాండవ వనంలోకి ప్రవేశించాలని ప్రయత్నించినా ఫలించలేదు.
మారువేషంలో ఒక వేదపండితునిలా యమునా తీరమున సంచరిస్తూండగా
కృష్ణార్జునుల రూపంలో నరనారాయణులు ఎదురు
పడతారు.
అగ్ని వారిని చూసి తన నిజరూపందాల్చి తన ఆరోగ్య సమస్య తీరడానికి ఖాండవవన దహనంలో తగు
సహాయం చేయమని శ్రీ కృష్ణుని కోరాతాడు
శ్రీ కృష్ణుడు ఇరవై ఒక్క రోజులపాటు అగ్నిదేవునికి ఇంద్రుడు అడ్డుపడకుండా తాము సహాయం చేస్తామని , ఆ గడువులోపల దహనకాండను పూర్తి చేయాలని శ్రీ కృష్ణుడు ఆదేశిస్తాడు.
శ్రీ కృష్ణుని ఆదేశం మేరకు అగ్నిదేవుడు ఖాండవవనంలో ప్రవేశించి దహించడం
ఆరంభించాడు. ఇది చూసిన ఇంద్రుడు వానలు కురుపించాడు.
ఆ వాన అగ్నిపై పడకుండా అర్జునుడు , తన బాణాలతో ఒక పెద్ద గుడారంనిర్మించాడు.శ్రీ కృష్ణుని కరుణతో, అర్జునుని సహాయం వలన అగ్ని తన ఏడు నాలుకలతోను
ఖాండవ వనాన్ని అంతా దహించ సాగాడు.
మొదటి ఏడురోజులు భూమికి అడుగున వున్న మూలికలను దహించాడు. ఆ సమయంలో
వాతావరణం వేడి ఎక్కడం ప్రారంభమయింది.
ఆ తరువాత వచ్చిన ఏడురోజులలో భూమిపైనున్న వృక్షాలను దట్టమైన అడవిని దహించాడు.
ఉష్ణోగ్రత బాగా పెరిగింది. ఆఖరి ఏడు
రోజులు రాళ్ళను దహించాడు.తరువాత వేడి తీవ్రత క్రమ క్రమంగా తగ్గి ఎండ మాత్రము కాయడం ప్రారంభించింది.
ఆ విధంగా ఖాండవ వనాన్ని అగ్ని దేవుడు దహించిన ఇరవై ఒక్క రోజుల నే "అగ్ని నక్షత్రం" లేదా రోహిణీ
కార్తెలు అంటారు.
రోహిణీకార్తె ఎండలకు రోళ్ళు కూడా పగిలిపోతాయని నిరూపిస్తాయి. నేటికీ వేసవి కాలపు వేడి తీవ్రత
అదే విధంగా వుండడం మనకు బాగా తెలిసిన విషయమే.
ఈ అగ్ని నక్షత్ర కాలంలో
భక్తులు అమ్మవారి ఆలయాలలో,
భరణి జన్మ నక్షత్రమైన
దుర్గాదేవిని ఆరాధించి
పూజించి , అమ్మవారి కటాక్షాన్ని పొందుతారు.
గృహాలలో కూడా అగ్ని నక్షత్ర
తీవ్రత తగ్గించేందుకు తమ పూజా గదిని శుభ్ర పరచి, సూర్యభగవానుని అర్చించి , ఆదిత్య హృదయం స్తోత్రాలు పారాయణ చేయాలి.
విసినికఱ్ఱలు , మజ్జిగ, పానకం వంటి శీతల ద్రావకాలు, వస్తువులు సూర్యదేవుని ముందు పెట్టి దీపారాధన చేసి భక్తితో పూజిస్తే సూర్యదేవుడు కొంత కరుణించి శాంతిస్తాడు...స్వస్తి...🙏
నేడు అపర ఏకాదశి
_*నేడు అపర ఏకాదశి🚩*_
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
వైశాఖ బహుళ ఏకాదశి
ఈ ఏకాదశి కే అపర ఏకాదశి అనే పేరు కూడా కలదు. ఉత్తరాదిన ఇదే ఏకాదశి ని అచల ఏకాదశి , భద్రకాళి ఏకాదశి , జల క్రీడ ఏకాదశి అనే పేర్లతో కూడా పిలుస్తారు.
ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి అపర ఫలితం వస్తుంది అని శాస్త్ర వాక్యం. పర అన్న జ్ఞానాన్ని కలిగించే ఏకాదశి అపర ఏకాదశి
వైశాఖ మాసం మాధవ ప్రియ మాసం అందుకే ఈ మాసానికి మాధవ మాసం అని పేరు కూడా కలదు.
ఏకాదశి కధ మాహాత్మ్యము అనుసరించి ఈరోజు బియ్యం ను రాక్షస అంశ అనుసరించి ఉంటుంది అందువలన ఈరోజు భోజనం నిషిద్దం. ఉపవాసం శ్రేయస్కరం హరి భక్తితో కాలం గడపడం , విష్ణు స్మరణ చేయడం పుణ్య దాయకం. ఆరోగ్య సమస్యలు లేని వారు ఈరోజు సంకల్ప పూర్వకంగా ఉపవసించి రేపు ద్వాదశి వచ్చిన తర్వాత పారణ చెయాలి.
పారణ అనగా ఉపవాసం ను ముగించడం. ఎవరైన అతిథి ని విష్ణు మూర్తి స్వరూపంగా ఆహ్వానించి అన్న పానాదులను ఏర్పాటు చేసి హితోధికంగ సత్కరించాలి. ఇది మాత్రమే శాస్త్ర సమ్మతమైన ఏకాదశి విధి.
ఈ పారణ లో కూడా ఉల్లి వెల్లుల్లి ఉపయోగించరాదు. సాత్విక ఆహారం మాత్రమే ఏర్పాటు చెయాలి.
ద్వాదశి రోజున వంకాయ కూర నిషిద్దం. తులసి దళములను కోయుట నిషిద్దం అది విష్ణు పూజకు ఆయినా సరే. ఈరోజు అంతా మీరు చేయదగిన విష్ణు స్తోత్రం లేదా విష్ణు నామ స్మరణం చేయండి.
గొప్ప స్తోత్రాల కన్నా భక్తి ప్రధానం అని తెలుసుకోండి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*స్తంభ చతుష్టయం
*స్తంభ చతుష్టయం.*
*శైవాగమాలలో పూజ ప్రధానంగా రెండు విధములగా చెప్పబడింది అది ఒకటి ఆత్మార్ధపూజ రెండవది పరార్ధ పూజ.తనకోసం తాను చేయునది ఆత్మార్ధపూజనియు. అలాగే లోక కళ్యాణార్ధం, పరులకోసం విద్యుక్తముగా ఆగమోక్తంగా నిర్మించిన దేవస్థానములలో దైవాన్ని శిలారూపకంగా ప్రతిష్టించి పూజించు దానిని పరార్ధపూజనియు అందురు.*
*ఈవిధంగా పరార్ధ పూజార్ధం నిర్మించిన దేవస్థానాదులలో ధ్వజస్థంభాన్ని కూడా స్థాపిస్తారు.ప్రధాన దేవతను ఉద్దేశించి జరిగే మహోత్సవాది కైంకర్యములకు సర్వదేవతలకు ఆహ్వానము తెలుపుటకు ఆ దేవత యొక్క వాహనమును ధ్వజపటం గా చిత్రీకరించి అధివాస పూర్వక ప్రాణప్రతిష్ఠ గావించి ధ్వజారోహణ చేస్తారు. శివాలయములో వృషభాన్ని చిత్రీకరించి ధ్వజారోహణం చేస్తారు. ఇందుకుగాను దేవస్థానముల లో జరిగే పూజా కైంకర్యాలలో ధ్వజస్తంభానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతగలదు.*
*ఈ స్తంభము నాలుగు విధములుగా ఉండునని కపర్దీ సంహిత తెలియజేస్తున్నది.*
*శ్లోకం.*
*మేఖలాసహితంకుర్యాద్ధ్వజస్తంభముదాహృతమ్.*
*నన్దినాసహితంకుర్యా న్నాందికంస్తమ్భముచ్యతే.*
*శూలేనసహితంకుర్యాచ్ఛూలస్తమ్భముదాహృతమ్.*
*దీపార్ధం స్థాపనంకుర్యాద్దీపస్తమ్భముదాహృతమ్.*
*మేఖలా సహితంగా రూపోందింపబడినటువంటి స్తంభాన్ని ధ్వజస్తంభమనియు, నంది సహితంగా రూపోందింపబడినటువంటి స్తంభాన్ని నంది స్తంభమనియు,త్రిశూల సహితంగా రూపోందింపబడినటువంటి స్తంభాన్ని శూలస్తంభమనియు, దీపమును వెలిగించుట కొరకు స్థాపింపబడినటువంటి స్తంభమును దీపస్తంభమని అందురు.*
*కపర్దీ సంహిత (శైవాగమం).*
🔝🔝🔝🔝🔝 ఎంతటి కష్టాన్ని అయిన పోగొట్టి అన్నింటిలో విజయాన్ని ఇచ్చే అతిశక్తివంతమైన స్త్రోత్రం హనుమ లాంగూల స్తోత్రమ్.............!
🔝🔝🔝🔝🔝
ఎంతటి కష్టాన్ని అయిన పోగొట్టి అన్నింటిలో విజయాన్ని ఇచ్చే అతిశక్తివంతమైన స్త్రోత్రం
హనుమ లాంగూల స్తోత్రమ్.............!!
ఈ స్తోత్రాన్ని నిత్యం పఠించడం వల్ల అన్నింటా విజయం లభిస్తుంది.
ఈ స్తోత్రాన్ని రావి చెట్టు క్రింద కూర్చుని చదవటం మరింత ఫలాన్ని కలిగిస్తిందని నమ్మకం.
హనుమ లాంగూల స్తోత్రం........
శ్రీమంతం హనుమంత మాత్త రిపుభి ర్భూభృత్తరు భ్రాజితం|
చాల్ప ద్వాలధిబధ్ధ వైరినిచయం చామీకరాది ప్రభం|
రోషా ద్రక్త పిశంగ నేత్ర నలినం భ్రూభంగ మంగస్ఫుర|
త్ర్పోద్య చ్చండమయూఖ మాండల ముఖం దుఃఖాపహం దుంఖినాం||
కౌపీనం కటిసూత్ర మౌంజ్యజినయు గ్దేహం విదేహాత్మాజా|
ప్రాణాధీశ పదారవింద నిహిత స్వాం తం కృతాంతం ద్విషాం|
ధ్యాత్వైవం సమరాంగణ స్థిత మథానీయ స్వహృత్పంకజే|
సంపూజ్యాఖిల పూజనోక్తవిధినా సంప్రార్ధయే త్ర్పార్ధితమ్||
హనుమన్నంజనీసూనో మహాబలపరాక్రమ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ౧
మర్కటాధిప మార్తండమండలగ్రాసకారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ౨
అక్షక్షపణ పింగాక్ష దితిజాసుక్షయంకర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ౩
రుద్రావతార సంసారదుఃఖభారాపహారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ౪
శ్రీరామచరణాంభోజమధుపాయితమానస |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ౫
వాలిప్రమథక్లాంతసుగ్రీవోన్మోచనప్రభో |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ౬
సీతావిరహవారాశిభగ్న సీతేశతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ౭
రక్షోరాజప్రతాపాగ్నిదహ్యమానజగద్వన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ౮
గ్రస్తాశేషజగత్స్వాస్థ్య రాక్షసాంభోధిమందర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ౯
పుచ్ఛగుచ్ఛస్ఫురద్వీర జగద్దగ్ధారిపత్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ౧౦
జగన్మనోదురుల్లంఘ్యపారావారవిలంఘన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ౧౧
స్మృతమాత్రసమస్తేష్టపూరక ప్రణతప్రియ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ౧౨
రాత్రించరతమోరాత్రికృంతనైకవికర్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ౧౩
జానక్యా జానకీజానేః ప్రేమపాత్ర పరంతప |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ౧౪
భీమాదికమహావీరవీరావేశావతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ౧౫
వైదేహీవిరహక్లాంతరామరోషైకవిగ్రహ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ౧౬
వజ్రాంగనఖదంష్ట్రేశ వజ్రివజ్రావగుంఠన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ౧౭
అఖర్వగర్వగంధర్వపర్వతోద్భేదనస్వర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ౧౮
లక్ష్మణప్రాణసంత్రాణ త్రాతతీక్ష్ణకరాన్వయ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ౧౯
రామాదివిప్రయోగార్త భరతాద్యార్తినాశన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ౨౦
ద్రోణాచలసముత్క్షేపసముత్క్షిప్తారివైభవ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ౨౧
సీతాశీర్వాదసంపన్న సమస్తావయవాక్షత |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ౨౨
ఇత్యేవమశ్వత్థతలోపవిష్టః
శత్రుంజయం నామ పఠేత్స్వయం యః |
స శీఘ్రమేవాస్తసమస్తశత్రుః
ప్రమోదతే మారూతజప్రసాదాత్ ౨౩
శ్రీరామ జయరామ జయ జయరామ..!!🕉️🕉️🕉️
వైశాఖ బహుళ దశమి, హనుమ జననం
వైశాఖ బహుళ దశమి శనివారం హనుమ జననం. మన దేశంలో ఆంజజనేయోపాసనకు ప్రాధాన్యం ఎక్కువ. అత్యధిక దేవాలయాలు ఈ స్వామికే ఉన్నాయి.
శివుని అష్టమూర్తుల్లో ఒకడైన వాయువు ద్వారా రుద్రతేజం అంజనీదేవిలో ప్రవేశించింది. ఆమె కారణ జన్మురాలైన అప్సరః కాంత. ఆ తల్లి తనయునిగా జన్మించాడు హనుమ. అతడు బాల్యంలోనే అలవోకగా సూర్యమండలం వరకు ఎగిరిన బలశాలి. వేదమూర్తి అయిన సూర్యుడికి శిష్యుడు. సూర్యుని నుంచి ఆయనకు వరంగా లభించిన దివ్య తేజశ్శక్తే సువర్చస్సు. ఈ శక్తినే స్త్రీ దేవతగా – ఉపాసనా సంప్రదాయంలో ‘సువర్చల’ అన్నారు.
రామాయణంలో తనకోసం కాక, పరులకోసం తన ప్రతాపాన్ని ప్రదర్శించిన వాడు ఆంజనేయుడే. రావణుని తాను సంహరించగలిగినప్పటికీ అది శ్రీరాముని అవతార కార్యమని, అందుకు తగిన సహకారం అందించాడు. “రాముని బాణంలా లంకలోకి వెళ్తాను’ అనడంలోనే తన వినయాన్నీ, భక్తిభావాన్నీ ప్రకటించాడు.
జ్ఞానం, వినయం, యోగం, బలం, ధైర్యం, చాతుర్యం, వాగ్వైభవం ఇన్నింటి కలబోత హనుమ.
అభయం, ఆనందం ఈ రెండూ హనుమ అందించే వరాలు. భయపడిన సుగ్రీవుడికి అభయమిచ్చి శ్రీరామ మైత్రిని అందించాడు. శోకంలో ఉన్న సీతకు శ్రీరామ సందేశాన్ని వినిపించి ప్రాణాలను నిలబెట్టి, సంతోషపరచాడు. సీత జాడను తెలిపి, లక్ష్మణుని ప్రాణాలు నిలిపి శ్రీరాముని ఆనందపరచాడు. ఇలా అభయాంజనేయునిగా, ఆనందాంజనేయునిగా భాసించాడు.
ఆదర్శవంతమైన వ్యక్తిత్వం, ఆరాధించదగిన దైవత్వం కలబోసిన పరమేశ్వర స్వరూపమే శ్రీ ఆంజనేయస్వామి.
త్వరలో అంతరించబోతున్న పాత తరం
👉🏼 *త్వరలో అంతరించబోతున్న పాత తరం... 😢🙏*
రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక క్రమశిక్షణ కలిగిన, కష్టపడిన తరం ఈ ప్రపంచం నుండి కనుమరుగు అవ్వబోతోంది.
అవును ఇది ఒక చేదు నిజం ।
ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు.
రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు !
ఉదయం పెందరాళే లేచేవాళ్ళు !
నడక అలవాటు ఉన్నవాళ్ళు!
మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు
ఉదయమే వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !
ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు!
మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు!
పూజకు పూలు కోసే వాళ్ళు !
పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !
మడిగా వంట వండేవాళ్ళు !
దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు!
దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు !
దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !!!
మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు.!!
అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు!
కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు !
స్నేహంగా మెలిగే వాళ్ళు!
తోచిన సాయం చేసేవాళ్ళు !
చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు !
ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు !
ఉత్తరాల తీగకు గుచ్చిన వాళ్ళు !
పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు!
ఫోన్ నెంబర్ లు డైరీ లో రాసిపెట్టుకునే వాళ్ళు!
పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు!
కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు !
సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు !
పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు !
తీర్థయాత్రలు చేసేవాళ్ళు !
ఆచారాలు పాటించే వాళ్ళు !
తిధి, వారం , నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు !
పుట్టిన రోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు !
.
చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు !
లుంగీలు, చీరలు కట్టుకుని ఉండేవాళ్ళు !
చిరిగిన చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు!
అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు !
వాళ్ళు ....
తలకు నూనె రాసుకునే వాళ్ళు !
జడగంటలు పెట్టుకున్నవాళ్ళు !
కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు !
చేతికి గాజులు వేసుకునే వాళ్ళు !
ఇప్పటిలా మనుష్యులను వాడుకుని వస్తువుల తో స్నేహం కాకుండా... వస్తువులను వాడుకుంటూ మనుషుల తో స్నేహంగా గడిపిన తరం.....
.
ఈ తరాన్ని చూసి మూగబోయిన వాళ్ళు
మీకు తెలుసా ?
వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు.
మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమె ఉన్నారు.
మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటె దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి
.లేదంటే .....
.లేదంటే .....
.లేదంటే .....
ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది.
.వాళ్ళ ప్రపంచం, వస్తువులతో కాకుండా, మనుషులతో మానవత్వం తో,స్నేహం తో కూడి ఉండే తరం...
సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది ,!
స్పూర్తిదాయక జీవనం గడిపిన తరం అది !
కల్లాకపటం లేని జీవనం గడిపిన తరం అది!
ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా ధైర్యంగా మాట్లాడగలిగిన తరం
ద్వేషం, మోసం లేని స్నేహ జీవనం గడిపిన తరం అది!
సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అదే
లోకానికి తప్పు చేయడానికి భయపడి జీవనం గడిపిన తరం అది !
ఇరుగుపోరుగుతో కలసిమెలసి జీవనం గడిపిన తరం అది!😊
తనకోసం కొంత మాత్రమే వాడుకుని, తన సంతానం వృధ్ధి కోసం పరితపించిన తరం
.
వారినుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది
మీ కుటుంబం లో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లకు మంచి సంస్కారం అందివ్వండి. .
సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజాలతో స్నేహంగా వుండేట్టు వారిని తయారు చేయాలి..
*సంస్కారం లేని దేశం ... సంస్కృతి లేని దేశం గా ఈ భారతాన్ని మార్చేయ్యకండి !!!*
తప్పులను సరిదిద్దగలది సంస్కారమే
సర్కారు చేసే చట్టాలు కాదు....🙏
*రాబోయే తరాలకు ఆస్తులనే కాదు ... ఆప్యాయతలను,స్నేహాన్ని కూడా అందిద్దాం.. లేకుంటే రాబోయే తరాలవారిని మనుషులుగా కాక మర యంత్రాలుగా పిలుస్తారు..🤔*
సేకరణ.. 🙏🏻
వైశాఖ బహుళ ఏకాదశి
_*నేడు అపర ఏకాదశి🚩*_
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
వైశాఖ బహుళ ఏకాదశి
ఈ ఏకాదశి కే అపర ఏకాదశి అనే పేరు కూడా కలదు. ఉత్తరాదిన ఇదే ఏకాదశి ని అచల ఏకాదశి , భద్రకాళి ఏకాదశి , జల క్రీడ ఏకాదశి అనే పేర్లతో కూడా పిలుస్తారు.
ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి అపర ఫలితం వస్తుంది అని శాస్త్ర వాక్యం. పర అన్న జ్ఞానాన్ని కలిగించే ఏకాదశి అపర ఏకాదశి
వైశాఖ మాసం మాధవ ప్రియ మాసం అందుకే ఈ మాసానికి మాధవ మాసం అని పేరు కూడా కలదు.
ఏకాదశి కధ మాహాత్మ్యము అనుసరించి ఈరోజు బియ్యం ను రాక్షస అంశ అనుసరించి ఉంటుంది అందువలన ఈరోజు భోజనం నిషిద్దం. ఉపవాసం శ్రేయస్కరం హరి భక్తితో కాలం గడపడం , విష్ణు స్మరణ చేయడం పుణ్య దాయకం. ఆరోగ్య సమస్యలు లేని వారు ఈరోజు సంకల్ప పూర్వకంగా ఉపవసించి రేపు ద్వాదశి వచ్చిన తర్వాత పారణ చెయాలి.
పారణ అనగా ఉపవాసం ను ముగించడం. ఎవరైన అతిథి ని విష్ణు మూర్తి స్వరూపంగా ఆహ్వానించి అన్న పానాదులను ఏర్పాటు చేసి హితోధికంగ సత్కరించాలి. ఇది మాత్రమే శాస్త్ర సమ్మతమైన ఏకాదశి విధి.
ఈ పారణ లో కూడా ఉల్లి వెల్లుల్లి ఉపయోగించరాదు. సాత్విక ఆహారం మాత్రమే ఏర్పాటు చెయాలి.
ద్వాదశి రోజున వంకాయ కూర నిషిద్దం. తులసి దళములను కోయుట నిషిద్దం అది విష్ణు పూజకు ఆయినా సరే. ఈరోజు అంతా మీరు చేయదగిన విష్ణు స్తోత్రం లేదా విష్ణు నామ స్మరణం చేయండి.
గొప్ప స్తోత్రాల కన్నా భక్తి ప్రధానం అని తెలుసుకోండి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గీతామాహాత్మ్యము
-: గీతామాహాత్మ్యము _ 2 :-
☀️☀️☀️☀️☀️☀️☀️
భారతామృతసర్వస్వం విష్ణువక్త్రా ద్వినిసృతమ్ |
గీతాగంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే ||
"గంగాజలమును పానము చేసినవాడే ముక్తిని పొందుచుండ భగవద్గీతామృతమును పానము చేసినవానిని గూర్చి వేరుగా పలుకునదేమున్నది? భగవద్గీత యనునది మహాభారతము నందలి దివ్యామృతము మరియు ఆదివిష్ణువైన శ్రీకృష్ణభగవానునిచే స్వయముగా ఉపదేశితమునై యున్నది " (గీతామాహాత్మ్యము - 5). భగవద్గీత పూర్ణపురుషోత్తముడైన శ్రీకృష్ణుని ముఖతః వెలువడగా, గంగానది ఆతని చరణకమలము నుండి వెలువడినది. దేవదేవుని వక్త్రమునకు, పాదములకు భేదము లేకున్నను పక్షపాతరహితమైన విచారణ ద్వారా భగవద్గీత గంగాజలము కన్నను అధిక ఆవశ్యకమైనదని మనము గుర్తించవచ్చును.
సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః |
పార్థోవత్సః సుధీర్భో క్తా దుగ్దం గీతామృతం మహత్ ||
"సర్వోపనిషత్తుల సారమైన గీతోపనిషత్తు (భగవద్గీత) గోవు కాగా, గోపాలునిగా ప్రసిద్ధి గాంచిన శ్రీకృష్ణభగవానుడు ఆ గోవు నుండి క్షీరమును పితుకువాడు. అర్జునుడు దూడ కాగా, పండితులు మరియు శుద్ధభక్తులు అమృతమయమైన భగవద్గీతాక్షీరమును పానము చేయువారై యున్నారు." (గీతామాహత్మ్యము - 6)
ఏకం శాస్త్రం దేవకీపుత్రగీతం ఏకో దేవో దేవకీపుత్ర ఏవ |
ఏకో మంత్రస్తస్య నామానియాని కర్మా ప్యేకం తస్య దేవస్య సేవా ||
(గీతామాహాత్మ్యము - 7)
ప్రస్తుత కాలమున జనులు ఒకే శాస్త్రము, ఒకే దేవుడు, ఒకే ధర్మము, ఒకే కర్మము ఉండవలెనని మిగుల వాంఛించుచున్నారు. కనుకనే ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం - భగవద్గీత ఒక్కటే సమస్త ప్రపంచమునకు సంబంధించిన గ్రంథమగు గాక. ఏకో దేవో దేవకీపుత్ర ఏవ - సమస్త ప్రపంచమునకు శ్రీకృష్ణభగవానుడు ఒక్కడే దేవుడు. ఏకో మంత్రః తస్య నామాని యాని - హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే అనెడి ఆ దేవదేవుని నామకీర్తన మొక్కటే ఏకైక మంత్రము మరియు ప్రార్థనము. కర్మా ప్యేకం తస్య దేవస్య సేవా - శ్రీకృష్ణభగవానుని సేవ ఒక్కటియే కర్మము. ⚛️
భగవంతుని పాట భగవద్గీత
*!*
➖➖➖
ఈ ప్రపంచంలో వ్యక్తులు పుట్టినరోజులు జరుపుకోవడం సర్వసాధారణం. కానీ, ఒక 'పాట' పుట్టినరోజు జరుపుకోవడం ఎక్కడైనా విన్నారా? ఆ పాట దేవుడే స్వయంగా పాడితే?! ఆ పాట పుట్టినరోజు కొన్ని వందల తరాలుగా జరుపుకునే గొప్ప సంఘటనగా మారుతుంది.
దాదాపు 5 వేల సంవత్సరాలకు పూర్వం శ్రీకృష్ణ భగవానుడు తన స్నేహితుడు, భక్తుడైన అర్జునుడిని ప్రోత్సహించడానికి పాడిన పాటనే *'భగవద్గీత'.*
*'శ్రీమద్ భగవద్గీత'* భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన, విస్తృతంగా అధ్యయనం చేయబడిన ఆధ్యాత్మిక గ్రంథాలలో ఒకటి. *'భగవద్గీత'* గంభీరమైన సిద్ధాంతానికి, రోజువారీ జీవితంలో ఆచరణాత్మక విలువలకు ఎంతో ప్రసిద్ధి చెందింది.
కురుక్షేత్ర యుద్ధభూమిలో సందిగ్ధంలో పడిన అర్జునుడికి సత్యాన్ని, తత్త్వాన్ని, వివేకాన్ని బోధించడానికి దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు పాడిన గొప్ప ఆధ్యాత్మిక గీతం 'భగవద్గీత'.
శ్రీకృష్ణుడు దీనిని మానవాళికి అందించిన రోజునే *'గీతా జయంతి'* గా భక్తులు స్మరిస్తారు.
జీవితసత్యాలను అర్థం చేసుకోవడానికి, మానవ జీవితాన్ని ఆదర్శవంతంగా గడపడానికి గీతాధ్యయనం అతిగొప్ప సాధనం.
'సంపూర్ణ విజ్ఞానం' అంటే, తాత్కాలికమైన ఈ భౌతిక ప్రపంచాన్ని, శాశ్వతమైన ఆత్మను, ఈ రెండిటికీ మూలమైన ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడమే.
'భగవద్గీత' మనకు అయిదు పరమ సత్యాలను బోధిస్తున్నది. *అవి:* అన్నిటికీ కారణభూతుడైన భగవంతుడు, ఆయన అంశలైన జీవులు, ఆయననుండి వెలువడిన ప్రకృతి (భౌతిక ప్రపంచం), అన్నిటినీ నియంత్రించే కాలం, కర్మ అంటే జీవుల మంచి-చెడు కార్యకలాపాలు. ఈ సత్యాల క్రమబద్ధమైన విశ్లేషణతోనే భక్తులకు భౌతిక, ఆధ్యాత్మికతలలోని సత్యం బోధపడి 'జ్ఞానోదయం' అవుతుంది.
గీతలోని 18 అధ్యాయాలను, 3 విభాగాలుగా విభజిస్తే కర్మ, భక్తి, జ్ఞాన యోగాలను ప్రధానంగా చూస్తాం. భగవద్గీత తొలి ఆరు అధ్యాయాల ప్రధానాంశం కర్మయోగం. స్వార్థపు కోరికలు లేకుండా (నిష్కామంగా) తమ కర్తవ్యాలను, విద్యుక్త ధర్మాలను బాధ్యతతో నిర్వర్తించడం కర్మయోగం. ఆత్మ తాలూకు శాశ్వత స్వభావాన్ని, భవబంధాలలో చిక్కుకోకుండా పనిచేసే ప్రక్రియలను శ్రీకృష్ణుడు వీటిలో వివరించాడు. మధ్యలోని ఆరు అధ్యాయాలలో ముఖ్యోద్దేశమంతా ఒక సారాంశంలా ఏర్పడిందే భక్తియోగం. 'భక్తి' అంటే భగవంతునికి నిస్వార్థంగా, నిరంతరాయంగా, ప్రేమపూర్వకంగా సేవ చేయడమే. దీనితో మనం భగవంతుని శాశ్వతధామాన్ని చేరుకోగలుగుతాం.
ఇక, భగవద్గీతలోని చివరి ఆరు అధ్యాయాలు జ్ఞానయోగం. మొదటి ఆరు అధ్యాయాలనే మరింత వివరంగా ఇవి విశ్లేషిస్తాయి. ఇందులో శ్రీకృష్ణుడు శరీరం, ఆత్మ, పరమాత్మల మధ్య వ్యత్యాసాన్ని, త్రిగుణాలు (సత్త్వ రజ స్తమో), వాటితో ప్రభావితమైన జీవుల ప్రవర్తన ఇందులో చదువుతాం.
'భక్తియోగం భగవద్గీత మధ్యలో ఎందుకు ఉంది?' అన్నది ఆసక్తికరమైన సందేహం. ఒక మహారాజు రథంలోనో, పల్లకీలోనో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన ముందు, వెనుక వేలాదిమంది సైనికులు, ప్రజలు, గుర్రాలు, ఏనుగులతోసహా సేవకులుకూడా ఉంటారు. రాజు వారందరిలో అతిముఖ్యమైన వ్యక్తి కనుక మధ్యలో ఉంటాడు. 'భక్తియోగం' ఎంతో ఉన్నతమైంది, నిగూఢమైంది. కాబట్టే, శ్రీ కృష్ణుడు గీత మధ్య అధ్యాయాలలో ప్రబోధించినట్టుగా అర్థం చేసుకోవాలి.
శ్రీ కృష్ణుడు చివరలో 'తనను సంపూర్ణంగా ఆశ్రయించి ఆరాధించే ప్రతీ ఒక్కరినీ అన్ని పాపాలనుండి సంపూర్ణంగా విముక్తులను చేస్తాను' (18-66) అని ప్రకటించాడు. 'గీతలోని ఈ బోధలను వ్యాప్తి చేసేవారు తనకెంతో ప్రియమైన వారనికూడా' ఆయన పేర్కొన్నాడు.
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏