
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 29 March 2016
ప్రత్యంగిరా ఉపాసన ......!
ప్రత్యంగిరా ఉపాసన ......!
త్రేతాయుగములో రాక్షసరాజు రావణాసురుని తనయుడు ఇంద్రజిత్తు మహాగొప్ప మహాప్రత్యంగిరా సాధకుడు.ఆయన ఆ రోజుల్లో నికుంబలాదేవి పేరుతో ప్రత్యంగిరా ఉపాసనచేసాడు.అయితే ఈ ఉపాసన సిద్ధిస్తే ఇంద్రజిత్త్ ను యుద్ధంలో నిలవరించటం కష్టం అని తెలిసిన హనుమంతుడు ఇంద్రజిత్త్ సాధనను నిర్వీర్యం చేసాడని వాల్మీకి రామాయణంలో పెర్కోనబడింది.అయితే శ్రీ లలితా సహస్రనామాలలో ఈ తల్లిని జగజననీ లలితాంబికకు సేనాధిపతిగా వర్ణించారు విజ్ఞులైన అగస్త్య, లోపాముద్ర దంపతులు.
తత్వపరంగా ప్రత్యంగిరామాత రూపం దుష్టత్వంపై శిష్టత్వం సాధిచే విజయానికి ప్రతీక. మాత చేతి లోని ఆయుధాలు మానవాళి రక్షణకు సంకేతం అమె సిం హా ముఖం ఈ ప్రపంచాన్ని ఋణాత్మక శక్తి నుండి అంటే అభిచార కర్మలనుండి [ నెగిటీవ్ పవర్] రక్షించగలనని అభయమిస్తున్నట్లుంటుంది.
ప్రత్యంగిర సాధన గురించి మహామేరు తంత్రములో అత్యంత వివరంగా ఇవ్వబడింది.ప్రత్యంగిరను బాలాత్రిపురసుందరి చైతన్యాన్ని తత్వపరంగా మహాకాళి తో మిళితం చేసి మహాకాళిగానూ అలానే మహాలక్ష్మీ చైతన్యాన్ని తత్వపరంగా కమలాత్మికతో సంగమింపచేసి మహాకమలగానూ ,రాధాదేవి చైతన్యాన్ని తత్వపరంగా తారాదేవితో కలగలిపి మహాతారగానూ ఉపాసన చేయచ్చు అని "మహోదధి "అనే తంత్ర గ్రంధంలో పేర్కొనబడింది
ప్రత్యంగిరా సాధకులు అమావాస్యనాడు ,పౌర్ణమినాడుఎండు మిరపకాయలతో స్మశానంలో హోమంచేస్తారు ఉపాసనా తదనంతరం ఒ నల్లని కోడిని బలి ఇచ్చి రక్తాన్ని పారే నీటిలో కలుపుతారు కోడి మృతదేహాన్ని స్మశానంలో దక్షణ దిశలో పాతిపెడతారు. వేదోక్తంగా సాదన చేసేవారు నల్ల మిరియాలతో,కానీ నల్లనువ్వులతో కానీ హోమము చేస్తారు.కూష్మాండాన్ని అంటే మంచి గుమ్మడిని బలిగా సమర్పిస్తారు.తంత్రోక్తంగా సాధన చేసేవారు అమ్మవారి భీజాక్షరాలను ఓ సమర్ధుడైన శిల్పి చేత రాగిరేకు పై చెక్కించి ఆ ప్రత్యంగిరా యంత్రాన్ని షోడశొపచారంగా పూజించి ముద్రా సహితంగా వెయ్యసార్లు మంత్రాన్ని సాధనచేయ్యాలి. నలబైరోజుల పాటు దీక్షగా చేయ్యాలి. అందరూ సర్వసాధారణంగా జపించగల సాధారణ ప్రత్యంగిరా మంత్రాన్ని ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది ఈ మంత్రం నూట ఇరవై ఐదు భీజాక్షరాలతోకూడినది
అమ్మవారి ఒక మంత్రాన్ని తెలియజేస్తున్నాము..
||ఓం హ్రీం నమః కృష్ణవాసనే విశ్వసహస్రహింసినీ సహస్రవదనే మహాబలే అపరాజితే ప్రత్యంగిరే పరసైన్య పరకర్మ విధ్వంసిని పరమంత్రోచ్ఛాదిని సర్వభూతదమని సర్వదేవాన్ బంధ బంధ సర్వవిద్యా ఛింది ఛింది క్షోభయ క్షోభయ పరతంత్రాణి స్పోటయ స్పోటయ సర్వశృంఖలాన్ త్రోటయ త్రోటయ జ్వల జ్వల జిహ్వే కరాళవదనే ప్రత్యంగిరే హ్రీం నమః||.. దీనిని 10000సార్లు జపించిన తరువాత 1000సార్లు మంత్రం జపిస్తూ నల్ల నువ్వులతో హోమం చేస్తే సిద్ధి అవుతుంది..
మీ ఒక్కొక్క కోర్కెను తలుచుకుంటూ 108 సార్లు నల్ల నువ్వులతో హోమం చేస్తే మీ కోరికలు ఎలాంటివైనా అమ్మ అనుగ్రహం వల్ల సిద్ధిస్తాయి...
ప్రత్యంగిర ఉపాసన వలన అనారోగ్యం నుండి విముక్తి లబిస్తుంది శత్రువులపై విజయం లభిస్తుంది సంపదలు సమకూరుతాయి.అభిచారకర్మల నుండి రక్షణ లభిస్తుంది. అయితే ఈ మంత్ర సాధన చేసేవారు విధిగా పంచాక్షరి అక్షర లక్షలు జపంచేయాలి
న సిద్ధ్యతి క్రియాకాపి సర్వేషామ్ సద్గురుం వినా!
మయా శ్రుతా పురా సత్యం శ్రుతిరేషా సనాతనీ!!
సద్గురువు లేనిదే యే సాధనా ఫలించదన్న విషయం సనాతనమైన వేదవాక్యముకాబట్టి
హెచ్చరిక ఈ ప్రత్యంగిరా మంత్రాన్ని గురు ముఖతా ఉపదేశంతీసుకుని సాధన చేస్తే త్వరగా మంచి పలితాలను సాధించ వచ్చు ముఖ పుస్తకంలోచూసి మంత్రసాధన చేసేవారు వారి బాగుగోలుకు వారే భాధ్యులు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment