What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 29 March 2016

మంత్రశాస్త్రము---అధర్వవేదము



మంత్రశాస్త్రము---అధర్వవేదము

వైదిక ధర్మములోని మంత్ర,తంత్ర ప్రయోగములన్నిటికి అధర్వవేదమే మూలము.అధర్వవేదము ఇరవైకాండములతోవున్నది.భృగుమహర్షి శిష్యుడు అధర్వుడు అతని ఇరవైమంది కుమారులుఅధర్వవేదములోని ఇరవైకాండలను దర్శించారు.ఈ ఇరవై కాండలలో 760 సూక్తములు,5,987 మంత్రములు వున్నాయి.తపస్సు చేస్తున్న బ్రహ్మ శరీరమునుండి అధర్వడు,అంగీరసుడు జన్మించారని వీరి వంశములవారిచేతనే అధర్వవేదము దర్శించబడిందని గోపధ భ్రహ్మణంలో చెప్పబడింది. ఇది రెండు వర్గాల ఋషులచే సంకలనం చేయబడింది. ఒకటి అధర్వణులు, రెండు అంగీరసులు. అందుకనే దీని ప్రాచీన నామం అధర్వాంగీరస వేదం

ఋగ్వేదము,యజుర్వేదము,సామవేదములెక్కువుగా ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి.కానీ అధర్వవేదము మాత్రము ఇహలోకంలో భాధలు నివృత్తి చేసుకోవటానికి భౌతికసుఖాలుసాధనకు,ధనలభ్ధికి,ఇష్టకామ్యసాధనకు,శారీరక,మానసిక ఆరోగ్యప్రాప్తికి మంత్ర,తంత్ర ఔషధంగా ఉపయోగపడుతుంది.అంతేకాకుండా అభౌతికమైన పరలోక మోక్షప్రాప్తికి కూడా అధర్వవేదము మానవాళికి ఎంతో ఉపయోగకరము.

ఇందులో ఆత్మలు, ప్రేతాత్మలు, మొదలైన వాటిని గురించి వివరించబడి ఉంటాయి కాబట్టి అధర్వణ వేదాన్ని చాలామంది గుప్త విజ్ఞానంగా భావిస్తారు. ఇందులో వేదకాలంలో సామాన్య మానవులు ఎలా ఉండేవారన్న విషయాలు కూడా ఉటంకించబడ్డాయి.

వైద్యశాస్త్రాన్ని గురించిన మొట్టమొదటి ప్రస్తావన ఇందులోనే ఉంది . రోగాలకు కారణమయ్యే క్రిమి కీటకాదుల వంటి జీవుల గురించిన సమాచారం కూడా ఇందులో పొందుపరచబడి ఉంది. ఇందులో యుద్ధ విద్యల గురించి కూడా సమాచారం కలదు. ముఖ్యంగా బాణాలకు విషం పూయడం, విషపు వలలను తయారు చేయడం, శత్రు సైనికులను రోగపీడితుల్ని చేసే క్రిమి కీటకాదుల ప్రయోగం మొదలైన విషయాలు వివరించబడ్డాయి.

చరణవ్యూహ అథర్వణవేదము (శౌనక మహర్షికి ఆపాదించబడింది) తొమ్మిది శాఖలు, లేదా పాఠశాలలు జాబితా:

పిప్పలాద, దక్షిణ నర్మదా నది ప్రాంతాలు

1. స్తౌద

2. మౌద

3. శౌనకీయ, ఉత్తర నర్మదా నది ప్రాంతాలు

4. జాజల

5. జలద

6. కుంతప

7. బ్రమవాద

8. దేవదర్శ

9. చారణవైద్య




అధర్వవేదములో మొత్తము తొమ్మిదిశాఖలున్నాయి.ప్రస్తుతము రెండు శాఖలుమాత్రమే మనుగడలో వున్నాయి.ఆ రెండే పిప్పలాద,శౌనక శాఖలు. పిప్పలాదశాఖ కాశ్మీరంలో ఎక్కువవ్యాప్తిలోవున్నది.శౌనకశాఖ నాధారము చేసుకోని మేధావులెందరో మహానిర్వాణతంత్రము.రసతంత్రము వంటి మంత్ర,తంత్ర గ్రంధములను వెలువరించారు

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML