What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 13 July 2015

ధర్మరాజు భీష్మ పితామహుణ్ణి ఇలా ప్రశ్నిస్తాడు.



ధర్మరాజు భీష్మ పితామహుణ్ణి ఇలా ప్రశ్నిస్తాడు.

ధర్మరాజు: స్వామీ! దైవానుగ్రహమా? పురుష ప్రయత్నమా? ఈ రెండింటిలో ఏది ప్రభావ వంతమైన సాధనము?

భీష్ముడు: దైవానుగ్రహమనేది సాధనమనడానికి వీల్లేదు. సాధన చేయడమనేది మనుష్యునికి సంబంధించినది. ఈ అనుగ్రహం భగవంతుడు ఇవ్వవల్సిందే కానీ మనుష్యుడు స్వేచ్ఛగా తీసుకోలేడు. దైవభక్తినైతే సాధనమనవచ్చు. దైవభక్తిని పురుష ప్రయత్నంలో భాగంగా అలవరుచుకోవడం వల్ల దైవానుగ్రహం పొందే వీలుంది. కనుక దైవభక్తిని పురుష ప్రయత్నంలో భాగంగా చేసి దేవునిపై భారం వేసి ప్రయత్నం చేయడమే ప్రభావయుతమైన సాధనం. దైవాన్ని పూర్తిగా వదిలివేసి ప్రయత్నం చేస్తే అప్పుడు దైవానుగ్రహం కోల్పోయినట్లే లెక్క. అప్పుడు అది పరిపూర్ణ ప్రయత్నమనిపించుకోదు. కాబట్టి దైవాన్ని ప్రార్థించడం ప్రయత్నంలో భాగంగా ఉండాలే కానీ, నా ప్రయత్నం గొప్పదా? దైవం గొప్పదా అని ప్రశ్నించుకోవడం సరి కాదు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML