What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 24 May 2013

రపంచంలోనే అతిపెద్ద ఆలయం...అతి పెద్ద ప్రార్థనా మందిరం! అదే చంద్రోదయ "దేవాలయం" మన దేశంలో రూపుదిద్దుకుంటుంది...కానీ దాన్ని కట్టిస్తున్నది భారతీయుడు కాదు ఒక విదేశీయుడు. ప్రపంచ ప్రఖ్యాత కార్ల కంపెనీ అధినేత హెన్రీ ఫోర్డ్ వారసుడు. అంబరీష్ ఉరఫ్ అల్ఫ్రెడ్ ఫోర్డ్ !

టావోయిజం, బౌద్ధం ఇలా అన్ని యిజాలు చూసారు కాని ఆయన సంతృప్తి చెందలేదు. మొదటిసారి ప్రభుపాదులు రచించిన భగవద్గీతను చదివారు. శ్రీ కృష్ణునితో ఆయనకు ఏదో అనుబంధం ఉన్నట్టు అనిపించింది. అంతే 1975 లో ప్రభుపాదులను సందర్శించి హిందు ధర్మాన్ని స్వీకరించారు. అల్ఫ్రెడ్ ఫోర్డ్ కాస్త అంబరీష్ దాస్ గా అయ్యారు ! శాఖాహారి అయ్యారు, మధ్యం మానేశారు, ఏమి వండినా ముందు శ్రీకృష్ణునికి సమర్పించడం మొదలుపెట్టారు.

తరువాత ప్రభుపాదుల ఆజ్ఞతో కలకత్తాలోని మాయపూర్ లో పెద్ద ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. దానికి 400 కోట్ల ఖర్చు అవ్తుందని అంచనా వేశారు. 300 కోట్లు ఈయనే అందిస్తునారు, మిగిలినది దాతల నుంచి విరాళంగా వచ్చినది తీసుకున్నారు. ఈ ఆలయం నిర్మాణం 2010 లో మొదలైంది. 2016 లో చంద్రోదయ ఆలయ నిర్మాణం పూర్తి అవ్తుంది. 300 మంది కూర్చోవడానికి ప్లానెటోరియం కూడా నిర్మిస్తున్నారు.

Source: http://alturl.com/d76xu


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML