
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 16 February 2016
సుబ్రమణ్య స్వామి ఆలయం:
సుబ్రమణ్య స్వామి ఆలయం:
===================
. ప్రముఖమైన ఈ ఆలయాలలో ఒకటిగా వెలుగొందుతున్నది కుక్కి" లోని సుబ్రమణ్య స్వామి ఆలయం. ఇది కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్ల స్యళ్యా తాలుక లోని మలెల నాడులో వున్నది. ఇది ఆద్యాత్మిక కేంద్రమే కాదు అందమైన ప్రకృతి లో ఒలలాడు తున్నది. పురాణ ప్రస్థానం: తారకాసుర సంహారం తార్వాత సుబ్రమణ్య స్వామి తన కత్తిని ఒక నదిలో కడగడం వల్ల ఈ నదికి కుమార ధార అనే పేరు వచ్చిందట. సుబ్రమణ్యా స్వామికే కుమార స్వామి అని కూడ పేరు వున్నది. ఆ తర్వాత కుమారస్వామి ఇక్కడున్న పర్వతంపై ఒక గుహలో నివసించినందున ఆ పర్వతానికి కుమార పర్వతం గా పేరు వచ్చింది. సర్ప రాజు వాసుకికి పక్షిరాజు గరుడికి జరిగిన యుద్దంలో గరుడి ప్రతాపానికి తట్టుకోలేని సర్ప రాజు ఈశ్వరున్ని గురించి ఈ పర్వతంపై తపస్సు చేశాడు. వాసుకి తపస్సు కు మెచ్చి వాసుకిని ఈ క్షేత్రంలో వెలసిన కుమారస్వామిలో ఐక్యం కమ్మని ఆదేశించాడు. కుక్షి అంటే గుహ అంతర్బాగం అనే ఆర్థం వున్నది. కాలక్రమాన అదె కుక్కి గా రూపాంచరం చెందింది.
స్వామి వారిని దర్శించు కునే ముందు భక్తులు తప్పని సరిగా కుమార నదిలో స్నానం చేయాలి. మయూరి వాహనుడైన కుమారస్వామి వాసుకు తలపై వున్నట్టు దర్శన మిస్తాడు. ఈ షణ్ముకుణ్ణి నిత్యం అభిషేకాలతో, మహా మంగళ హారతులతో సేవిస్తారు. ఒక ఏనుగు మంగళ హారతి సమయంలో గంట వాయించి మహాద్వారం ముందు మోకరిల్లి తొండం పైకెత్తి అభివాదం సేస్తుంది. ఈ దృశ్యాన్ని చూడడానికే వేలాది మంది భక్తులు వస్తుంటారు. జాతక రీత్యా కాల సర్ప దోషం వున్నవారు,, పిల్లలు లేని వారు, పెళ్లి కాని వారు, కుజ దోషం వున్న వారు ఇలాంటి సమస్యలున్నవారు ఈ ఆలయానికి వచ్చి పూజలు చేస్తుంటారు. ఇంకా ఇక్కడ శివాలయం, భైరవ, ఉమా మహేశ్వర, దుర్గాదేవి, గణపతి దేవుళ్ల ఆలయాలు కూడ వున్నాయి. ఇక్కడ నిత్యాన్నదాన జరుగు తుంది. ఈ ఆలయ ఆదర్యంలో చాల సామాజిక కార్య క్రమాలు కూడ జరుగు తున్నాయి భక్తుల వసతి కొరకు ఇక్కడ అనేక వసతి గృహాలు, కాటేజీలు మరియు ప్రైవేటు వసతి గృహాలు, భోజన శాలలు చాలనె వున్నాయి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment