అలంపురం అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అలంపురం క్షే త్రంలో నవ బ్రహ్మల ఆలయాలున్నాయి. ప్రపంచ చరిత్రలోనే నవ బ్రహ్మల దివ్యధామం గా ఈ క్షేత్రం వెలుగొందుతోంది. అష్టాదశ శక్తి పీఠాల్లో అలంపూరంలో వెలసిన జోగుళాంబా దేవీ 5వ శక్తి పీఠంగా విరాజిల్లుతుంది. క్షేత్రంలో ఈ రోజు నుంచి ఈ నెల 13వ తేదీ వరకు జోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ రోజు ఉదయం యాగశాల ప్రవేశం, పుణ్యాహవచనం, మహాగణపతి పూజ, ఋ త్విక్వరణం, మహా కలశ స్థాపన, ఆవాహిత దేవతా హోమం, బలిహరణ, నీరాజ మంత్ర పుష్పములు మొదలగునవి నిర్వహిస్తారు. శనివారం శ్రీపంచమి రోజు అమ్మ వారికి నిత్యహోమములు, మహా పూర్ణహుతి, కలశ ఉద్వాసన, అనంతరం అవబృత స్నానం, పంచామృతాబిషేకములు, సహస్ర ఘటాభిషేకం, నిజరూప దర్శనం ఉంటుంది. సాయంత్రం స్వామి అమ్మ వార్ల శాంతి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించున్నట్లు ఆలయ ఈఓ గురురాజా, పాలక మండలి అధ్యక్షురాలు లక్ష్మీనారాయణరెడ్డి చెప్పారు.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment