What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 5 June 2015

భీష్మ పితామహుడు

భీష్మ పితామహుడు

భీష్మ పితామహునకు సంతానం లేకపొయినా రణించాక ఈనాటికి పితృతర్పణాలు అందుతూఉన్నాయి. అంతటి మహత్తరమైన వ్యక్తిగా భారతకధలో నిలిచిపోయిన మహొన్నతుడు భీష్మపితామహుడు. ఈయనకు ఇంతమహత్యం సిద్ధించడానికి ఆయన గుణశీలాలే ప్రధానకారణం.మహాతపస్వి అయిన భీష్ముడు పితృభక్తికి , ఇచ్చీనమాట నిలబెట్టుకోవడానికి ,శౌరసంపదకు ఓ గొప్ప ఉదాహరణ. అంతేకాదు ఈయన అపారమైన శాస్త్రవిజ్ఞానాన్ని , ధర్మతత్వాన్ని ,పరమాత్మతత్వాన్ని కూడా చక్కగా అవగతం చేసుకున్నాడు. భీష్మునిలోని భగవతత్వాన్ని గ్రహించిన కృష్ణుడుఈయననెంతగానో ప్రశంసించాడు. అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడి ప్రోత్సాహంతోనే సాక్షాత్తూ ధర్మదేవత తనయుడే అయిన ధర్మరాజుకు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు.

వర్ణాశ్రమ ధర్మాలు , రాజ ధర్మాలు ,ఆపద్ధర్మాలు ,మోక్ష ధర్మాలు ,శ్రాద్ధ ధర్మాలు , స్త్రీ ధర్మాలు , దాన ధర్మాలు,ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకు ఉన్న ధర్మసందేహాలన్నింటినీ తీర్చి చక్కటి సమాధానాలిచ్చాడు భీష్ముడు . చక్కటి కధల పూపం లో వినగానే ఎవరైనా అర్ధం చేసుకోగల తీరులోఅవన్నీ మహాభారతం శాంతి , అనుశాసనిక పర్వాలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ కధలను ధర్మ రాజుకు చెబుతున్న సమయంలోవ్యాసుడు లాంటి గొప్ప గొప్ప ఋషులు కూడా మంత్రముగ్ధులైనట్లు వింటూఉండేవారు . కృష్ణతత్వాన్నీ బాగా అవగతం చేసుకున్నవాడుకనుకనే కృష్ణుని గొప్పతనాన్ని గురించి దుర్యోధనుడికి సైతం చెప్పగలిగాడు .రాజ సూయయాగ సమయంలో అగ్రతాంబూలం ఎవరికివ్వాలా అని సందేహం కలిగినప్పుడు అక్కడున్నవారిలో దీనికి అర్హుడు ఒక్క కృష్ణుడే అనినిర్ద్వంద్వంగా అందరికీ తెలియజేశాడు భీష్ముడు . కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని రక్షించేందుకు చక్రాయుధంతొతన మీదకు కృష్ణుడు పరిగెత్తుకొస్తున్నా ఆయనను ఎదిరించక ఆయన చెతిలో మరణించేభాగ్యం కోసం ఎదురుచూశాడు భీష్ముడు . అన్నిటినీ మించి భీష్మాచార్యుడు ఆనాడు ధర్మరాజుకు ఉపదేసించింన విష్ణు సహస్రనామాలు ఈనాటికీ ప్రజల నాల్కుల మీద నానుతూనే ఉన్నయి. ఆదిశంకరాచార్యులు భగవద్గీత , ఉపనిషత్తులు , బ్రహ్మ సూత్రాలకు భాష్యాన్ని రాసినట్టుగానే ఈవిష్ణు సహస్రనామాలకు కూడా విశేష భాష్యం చెప్పారు . అంతటి మహత్తరమైన భగవత్ శక్తి దాగిఉన్న విష్ణు సహస్రనామాలను చెప్పడం ఒక్కటి చాలు భీష్ముడిమహత్యాన్ని గురించి తెలుసుకోవటానికి భీష్మ పితామహుడుఇలా భక్తి , జ్ఞాన తదితరాలలో గొప్ప కృషి చేసినందువల్లనే ఈనాటికీఅందరికీ ఆయన మార్గ దర్సకుడుగా నిలిస్తున్నాడు .

అన్నిటికంటే మించిన విశేషమేమిటంటే ఆయన వివాహం చేసుకోలేదు. పిల్లలూ లేరు.కానీ ఇలా అపుత్రకుడిగా మరణించినప్పటికీ సంప్రదాయాన్ని పాటించే వారంతా తమ పితరులకు పితృతర్పణాలనుఇచ్చేటప్పుడు భీష్మపితామహుడికి కూడా తర్పణాలు అర్పిస్తుంటారు. అందరికీ అలా ఆయనపితామహుడు (తాతా) లాంటి వాడయ్యాడు . ఇంతటి గొప్పతనం కేవలం ఆయన ప్రతిజ్ఞా పాలన , పితృ భక్తి ,సత్ శీల సంపద వలనే లభించాయి. భీష్మాచార్యుడు అందరికీ ఆదర్సప్రాయుడిగా , మార్గదర్సకుడిగా నిలుస్తున్నాడు .

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML