What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 10 April 2015

నా విశ్లేషణ : ఇది నిజమేనా

మెస్సయ్య అంటే రక్షకుడు అని అర్ధం.
యెషయ-7;14 కన్యక గర్బవతియై కుమారుని కనును.అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు.
యెషయ-11;9మనకు కుమారుడు అనుగ్రహించబడెను.అతడు దావీదు సింహాసనాదీశుడై రాజ్య పరిపాలన చేయును..యెహోవా దీనిని నేరవేర్చును...
కన్యకకి పుట్టిన కుమారుడు దావీదు సింహాసనాన్ని అదిష్టించి రాజ్యపరిపాలన చేస్తాడని పాత నిబందనలో ఉంది కాని కన్యకకి పుట్టిన కుమారుడు మరణిస్తాడు అని లేదు..
ఇశ్రాయేలీయులు తమని రోమన్స్ నియంత పాలన నుంచి రక్షించడానికి మెస్సయ్య వస్తాడని యూదులరాజు అవుతాడని వారి దైవగ్రందాల్లో రాసుకున్నారు..యేసు శిష్యులు రాసిన కొత్త నిబందనలో మాత్రం పాపుల్ని రక్షించడానికే యేసు చనిపోయాడు అని
ఉంటుంది..
నిజంగా పాపుల కోసం మెస్సయ్య చనిపోతాడు అని పాత నిబందనలో ఉంటే....
1)పిలాతు యేసుని నీవు యూదుల రాజువా?అని అడగడు.నీవు పాపుల కోసం చనిపోవడానికి వచ్చావా?అని అడిగి ఉండేవాడు.
2)సైనికులు యేసు సిలువ మీద ఇతను యుదులరాజు అని రాస్తారు.అంతేకాని పాపుల కోసం చనిపోతున్నాడు అని రాయలేదు.
3)యేసుని బందించడానికి అధికారులు వస్తున్నప్పుడు నన్ను ప్రమాదం నుంచి కాపాడమని యేసు ప్రార్దన చేయడు.
4)సిలువపై యేసు ఓదేవా! ఓదేవా! నన్నెందుకు చేయి విడిచావు అని మొర పెట్టుకోడు..
.అందుకే ఇప్పటికి యూదులు యేసుని మెస్సయ్యగా అంగీకరించరు. కొత్త నిబందన గ్రందాన్ని దైవగ్రంధంగా ఒప్పుకోరు

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML