What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 16 April 2015

ధ్వజ దత్తుడు


ధ్వజ దత్తుడు 

కృతయుగం లో పుష్కరుడు అనే మహా మహర్షి వుండే వాడు .అన్ని వేదాలను శాస్త్రాలను చదివి సర్వ విద్యా పరిపూర్ణుడు అయాడు .సూక్ష్మార్ధాన్ని వివ రింప గల నేర్పున్న వాడు .స్వధర్మా చరణం లో గొప్ప వాడు .అన్ని మంత్రాల సారాన్ని తెలుసుకొన్న వాడు .ఆ మంత్రాది దేవతలను ప్రసన్నం చేసుకొన్న పుణ్యాత్ముడు .ఆయన శ్రీ ఆంజనేయ మహా మంత్రం లో ఒక దాన్ని జపించాలను కొని నైమిశారణ్యం చేరాడు .సిద్దాశ్రమానికి దగ్గర ,ఒక ఆశ్రమం నిర్మించుకొని ,హనుమంతుని మంత్రం తో తపస్సు చేశాడు .పవన సుతుడు ప్రత్యక్ష మై ,దివ్యాను గ్రహాన్ని ఇచ్చాడు .మానసిక ఆనందాన్ని పొంది ,ఏ కోరికా లేకుండా అక్కడే జప తపాలతో జీవిస్తున్నాడు .
ఆ కాలమ్ లోనే ధ్వజదత్తుడు అనే వేద వేదంగాఅధ్యనుడు ,సర్వ శాస్త్ర పారంగతుడు నిష్టా గరిస్తుడు వుండే వాడు .గర్వం లేని వాడు .నిష్కామి .అయితె కటిక దరిద్రుడు .గృహస్తుల ఇళ్ళలో భిక్షాటనం చేస్తూ ,ఆ ద్రవ్యం తో పెళ్ళామ్ పిల్లల్ని పోషించు కొనే వాడు .ఇలా ఉపాదానం తో జీవిస్తూ కూడా విద్యార్ధులకు ఉచితం గా వేద శాస్త్రాలను బోధిస్తుండే వాడు .మధ్యాహ్న భోజనం తరువాత ,శిష్యుల చదువును పరీక్షించే వాడు .
ఒక రోజూ మధ్యాహ్నం శిష్యులతో పాటు తన కుమారుడిని కూడా పరీక్షించటానికి పిలిచాడు .అతడు రాలేదు .పుత్రుడిని ఎన్ని సార్లు పిలిచినా రాక పోవటం తో ఇల్లంతా గాలించాడు .చివరికి వంట గది లోకూరలనుమాత్రమే తింటున్న భార్యను ,పిల్లాడిని చూశాడు .అన్నం లేకుండా వాటిని ఎందుకు తింటున్నారని అడి గాడు .వారిద్దరూ వంట పాత్ర ను చూపించారు .అందులో ఒక్క మెతు కైనా అన్నం లేదు .గుండె చెరువైంది ధ్వజ దాత్తుడికి .దీనికి కారణం ఏమిటి అని భార్యను అడి గాడు .రోజూ వారిద్దరూ అన్నం లేకుండా నే గడుపుతున్నారని తెలుసుకొన్నాడు . .ఈ దరిద్రానికి తానె కారణం అని తెలుసుకొన్నాడు .
ఇంతటి దారిద్ర్యం లో కూడా భార్య నవ్వు మొఖం తో బయటి నుంచి వచ్చే తన్ను ఆప్యాయం గా ఆదరిస్తూ పిలుస్తున్నందుకు ఆశ్చర్య పోయాడు .తన మీద ఆమెకున్న ప్రేమను ,అనురాగాన్ని అర్ధం చేసుకొన్నాడు .తాను వారికి అన్నం కూడా పెట్ట లేని స్థితి లో వున్నందుకు విచార పడి కన్నీరు కార్చాడు .భార్య సౌశీల్యాన్నీఅభినందించాడు . తన లాంటి ధన్యుడు వేరెవరు ఉండరని ఇప్పటి దాకా గర్విన్చానని ,ఇప్పుడు తన అసమర్ధత తెలుసు కొన్నానని అన్నాడు .భార్యా ,పిల్లలను పోషించలేని వాడు పరమ పాతకుడని ఆమె తో అన్నాడు .
అతని భార్య, భర్త దుఖాన్ని చూడ లేక ”నాధా !ఈ దరిద్రం ఇవాల్టిది కాదు .ఎన్నో జన్మల నుంచి వచ్చిందే .పూర్వ జన్మ లో మనం ఎవ్వరికీ అన్నం పెట్టి వుండి ఉండం .అందుకే ఇప్పుడు ఆ బాధ మనం అనుభవిస్తున్నాం .సకల విద్యలు నేర్చి ఉచితం గా విద్యా దానం చేస్తూ ఉపాదానం తోజీవించే మీరు ధన్యులు. దుఃఖ పడే పురుషుడిని ”కాపురుషుడు ”అంటారు .మీ పాద సేవా భాగ్యమే మాకు భాగ్యం ”అని భర్తకు ధైర్యం చెప్పింది
భార్య మాటలకు తృప్తి చెందిన అతడు ఉపాదానానికి ప్రత్యక్ష దేవత అయిన ”భిక్షా పాత్రా దేవి ”ని తీసుకొని ,సంసారం గడ పటానికి మార్గం కోసం ఉత్తర దిశ వైపు వెళ్ళాడు .ఆ రాత్రి ఒక చోట విశ్ర మించాడు .మర్నాటి ఉదయం స్నాన సంధ్యాదికాలు పూర్తి చేసుకొని ,నడిచి, నైమిశారన్యానికి వెళ్ళాడు .అక్కడ కశ్యపుడు మొదలైన నిష్టా గరిష్టు లైన మునులను దర్శించాడు .ఆ తర్వాత పుష్కర మహర్షి వున్న సిద్ధాశ్రమం చేరాడు .పుష్కర మహర్షి శాంత గంభీర వదనం తో నిశ్చల ధ్యానం లో వున్నాడు .నమస్కరించి దగ్గర నిల బడ్డాడు .ముని కళ్ళు తెరిచి వాశ్చల్య ద్రుష్టి తో చూశాడు .ఆయనకు తాను తెచ్చిన సమిధలను ఫలా పుష్పాలను సమర్పించాడు .
”బ్రాహ్మణో త్తమా !ఎందుకు ఇక్కడికి వచ్చారు ?మీ కుటుంబ విషయాలేమిటో నాకు తెలియ జెప్పండి .”అని ప్రేమ పూర్వకం గా అడిగాడు పుష్కర మౌని .దానికి అంజలి ఘటించిన ధ్వజ దత్తుడు ”మునీంద్రా !నేను గార్గేయస గోత్రికుడను.కుండిన నగరం నా నివాసం .బ్రాహ్మణ శ్రేష్టుడైన ధజ శర్మ నా తండ్రి.నాకు భద్రకుడు ,భద్ర బాహుడు అనే సోదరులు .మేమందరం పండితులమే అయినా ఉపాదానం తోనే జీవిక గడు పు తున్నాం .అది చాలటం లేదు .భార్యా బిడ్డలను పోషించ లేక పోతున్నాను .నా దీనత్వం పోయే మార్గం సెలవియ్యండి .నన్ను కాపాడండి ”అని మొర పెట్టాడు .
ఇదంతా విన్న పుష్కర ముని దయా సముద్రుడై అభయం ఇచ్చాడు .హనుమంతుని భక్తిగా ప్రార్ధించాడు .ధ్వజ దత్తుడిని తనతో ఒక నదీ తీరాన్ని చేరి అతనితో కలిసి స్నానం చేశాడు .ఆ నది ఒడ్డున కోర్చోబెట్టి ”హనుమంమంత్రమైన ద్వాదశాక్షరీ మహా మంత్రాన్ని ”ఉపదేశించి దాన్ని శ్రద్ధాసక్తులతో నియమం గా జపించమని దానివల్ల అతని కోరిక సఫలం అవుతుందని ధైర్యం చెప్పి తన ఆశ్రమానికి పుష్కర మహర్షి వెళ్లి పోయాడు
ధ్వజ దత్తుడు చాలా నియమ నిష్టలతో హనుమంమంత్రాన్ని జపించాడు .ఎన్ని సార్లు జపించినా మారుతి దర్శనం కావటం లేదు .విసుగు పుట్టింది .హనుమను తిట్టు కొన్నాడు .గురువు తనను మోసం చేశాడని మరీ గురువునూ తిట్టటం ప్రారంభించాడు .మంత్రం కంటే గురు నింద ఎక్కు వై పోయింది .మనస్సు అశాంతి తో నిండి పోయింది .జపం ఫలించ నందుకు ఆవేశమూ కల్గింది .అప్పుడు ఒక రోజూ ”కాలుడు ”అనే కిరాతుడు అక్కడికి వచ్చాడు .వాడికి తన గోడు వెళ్ళ బోసుకొన్నాడు .తన దుస్తితికి కారణం ఏమిటో తెలియ జేయ మని కోరాడు అప్పుడు ఆ కాలుడు ”గురు దూష చేస్తున్నావు .నీకు ఉపదేహించిన మంత్రం పని చేయదు .గురువును కాదని అంటే ,దేవుడు కూడా కాపాడ లేదు .ఇప్పటి కైనా మించి పోయింది లేదు .గురువును చేరి నిండు మనసు తో మళ్ళీ ప్రార్ధించి ,ఆయన అనుగ్రహం పొంది ,మళ్ళీ సాధన చెయ్యి .అప్పుడే నీకు ఫలితం లభిస్తుంది ”అని చెప్పి తన దారిన తాను పోయాడు .ధ్వజ దత్తుడు గురువు అను గ్రహం ఎలా సంపాదించాడో ,హనుమ అతడిని ఎలా అనుగ్రహించాడో వచ్చే కధ లో తెలుసు కొందాం .
సశేషం.

ధ్వజ దత్తుడు

– పుష్కర ముని ,ధ్వజ దత్తుడి పై కరుణ చూపాడు . .మంత్రజలాన్ని శిరసు పై జల్లాడు .శుచి అయి స్నానం చేసి రమ్మన్నాడు . .వెంటనే ధ్వజ దత్తుని అశాంతి అంతా త్రుటి లో మాయ మై పోయింది .అక్కడే కూర్చుని ,హనుమ ద్వాదశాక్షరీ మహా మంత్రాన్ని శ్రద్ధ తో జపించాడు .ఎదుట దేదీప్య మాన మైన వెలుగు ప్రకాశించింది .వెంటనే సువర్చలా సహితుడైన ఆంజనేయ స్వామి అతని ఎదుట ప్రత్యక్ష మైనాడు .వెంటనే వారిద్దరి పాదముల పై పడి స్తోత్రం చేశాడు.
”వేద వేద్య మహా భాగ పురాణ పురుషోత్తమ -తవ సందర్శనైవ దురితం మే నివర్తితం
తవ సందర్శనా దేవ ,యోగినామపి దుర్లభం -బహుజన్మార్జితాత్ పుణ్యాత్ లబ్ధవా నస్మి సాంప్రతం .
అద్యమే సఫలం జన్మ జీవితం చ సుజీవితం -గతాన్యహాని సర్వాణి దుర్దినా నితి మే మథిహ్
యస్త్వం సాక్షాత్క్రుతో దేవో బ్రహ్మా దైరపి దుర్లభం -దేవత్వం ప్రాణి తస్య నమ్ర శిరసా యాచే వరం సాం వ్రతం .
భావస్తే పద పంకజే ,భవతు మే భక్థిహ్ పరా శాశ్వతీ –త్వద్భావ స్తవ భక్త జాల విషయే భూయాత్త దేవాశ్రాయే
స్వాన్తే కాంక్షిత మేవ దేవ హనుమన్నత్వాం పదం ప్రార్ధయే ”


అంటూ మనసు దీరా స్తుతించాడు .హనుమ ధ్వజదత్తుని ఆప్యాయం గా లేవ దీసి సువర్చలా దేవిని చూసి ”సూర్య నందినీ !ఇతడు నా ప్రియ భక్తుడు .గురువు గారి అనుగ్రహం తో నేడు మన దర్శనాన్ని పొంద గలిగాడు .ఇతనికి వచ్చిన కష్టాలన్నీ గురు దూషణ వల్లనే వచ్చాయి .ఇప్పుడు ఇతని పూర్వ జన్మ వృత్తాంతాన్ని చెబుతాను విను .పూర్వ జనం లో ఇతని పేరు ధర్మ సారుడు .అన్ని శాస్త్రాలు చదివి ఉత్తమ పురుషుడు గా వుండే వాడు .ఎంతో మందికి వేద విద్య నేర్పాడు .ఒక సారి శిష్యులను వెంట తీసుకొని అడవికి పుష్పాలు ఫలాలు దర్భలు తీసుకు రావ టానికి వెళ్ళాడు .కొంత దూరం వెళ్ళ గానే అక్కడ ”భరతుడు ”అనే రాజు ,నిశ్చల చిత్తం తో జితెన్ద్రియుడై ,”హనుమ సప్తాక్షరి ”మంత్రాన్ని బిగ్గరగా ,అతి వేగం గా జపిస్తుండడం గమనించాడు .రాజు దగరకు వెళ్లి ”మంత్రాన్ని అంత అ గట్టి గా జపిస్తావేం ?”అని కోప పడ్డాడు .రాజుకు బాహ్య స్మ్రుతి లేదు .తదేక ధ్యానం లో వున్నాడు .ఇలాంటి మూడ్హుడు కి ఏమి చెప్పినా నిష్ఫలం అనుకొంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళాడు .
కొంత దూరం లో శిష్యులతో వస్తున్న ”మృకండ మహర్షి ”దర్శనమిచ్చాడు .ఋషిని ప్రసన్నం చేస్సుకొని ,ఆయన అనుగ్రహం తో హస్తన్యాస కరన్యాసాలు తో ”సప్తాక్షరి ”ని ఉపదేశం గా పొంది ,జపించాడు .యెంత కాల మైనా మంత్ర సిద్ధి కలుగ లేదు .మంత్రం మీద ,గురువు మీద కోపం వచ్చి దూషించాడు .మంత్రోపాసన మానేశాడు .గురుదూషణ,మంత్ర త్యాగం చేసిన ఈ ధ్వజ దత్తుడే ఆ నాటి ధర్మ సారుడు .ఈ జన్మ లో గురువు అనుగ్రహం పొంది ,మన దర్శనం తోపాపాలన్నీ పోగొట్టుకొని,కోర్కెలను జయించిన వాడు అయ్యాడు .యితడు తన దరిద్రాన్ని దూరం చేసుకోవా టానికే తపస్సు చేశాడు .కనుక అనుగ్రహించి ఇతడిని భాగ్య వంతుడిని చేయాలి .ఈ నీ పుత్రు డికి ఐశ్వర్యం ప్రసాదించు ”అని కోరాడు
సువర్చలాదేవి సరే నని అనుగ్రహించింది .మళ్ళీ గురువును దర్శించి ,అనుమతితీసుకొని ఇంటికి వెళ్ళ మని ద్ధ్వజ దత్తుడికి చెప్పి సువర్చ లాంజనేయులు అడ్రుష్యమైనారు . అతడు పుష్కర గురువును దర్శించి ,అనుగ్రహం కోసం పాదాల పై పడ్డాడు .ఆయన ఆప్యాయం గా లేవ నెత్తి ”దత్తా ! జరిగినది అంతా నాకు తెలిసింది .ఇంటికి వెళ్లి సుఖం గా వుండు ”అని దీవించి పంపించాడు
ధ్వజ దత్తుడు గురువుకు మాటి మాటికీ నమస్కారం చేస్తూ వెళ్ళ లేక , వెళ్ళ లేక ఇంటి ముఖం పట్టాడు .ఇంటి దగ్గర కు రాగానే తానుండే ఇల్లు మారి పోయి ,అక్కడ దివ్య సౌధం కనిపించింది .బంగారపు కాంతి తో అది ధగ ధగ లాడు తోంది .మేడ మీద వున్న అతని భార్య ”శీలా దేవి ‘ సంతానం తో సహా ‘కిందికి దిగి వచ్చి ,భర్త కు స్వాగతం చెప్పి ,ఆయన పాదాలకు నమస్కరించి ,పాదోదకాన్ని శిరసున చల్లు కొన్నది .బంధుగణం అంతా వచ్చి చేరి ,అపూర్వ స్వా గతం పలికారు .ద్వజ దత్తుడు తమకు ఈ సంపద లభించ టానికి గురువు అనుగ్రహం ,శ్రీ సువర్చలా సమేత ఆంజనేయ స్వామి అనుగ్రహం కారణం అని అతి వినయం గా వివ రించాడు .ఇక నుండి తమ వారందరికీ సిద్ధాశ్రమం లో వున్న పుష్కర మునియే గురువు అని నిర్ద్వంద్వం గా తెలియ జేశాడు .తమ కందరకు రక్ష, హనుమంతుడే నని చెప్పాడు .అంతా చాలా సంతోషించారు .అందరు ”ఆంజనేయ పాహిమాం ,ఆంజనేయ రక్షమాం ”అంటూ ,అక్కడి నుంచి వెళ్లి పోయారు .ధ్వజ దత్తుడు మానసిక ప్రశాంతితో సుఖ సంతోషాలతో కల కాలమ్ జీవించి దాన ధర్మాలు చేస్తూ ,చివరికి శ్రీ హరి లో ఐక్యమయాడు .ధ్వజ దత్తుడి కధ సమాప్తం .తరువాత ”కపిలుని కధ ”ఇంకోసారి తెలుసు కొందాం......................

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML