గురువుని మించిన దైవం లేదు.
శివ - పార్వతులు, బ్రహ్మ- వాణి లు, విష్ణువు - లక్ష్మి లు, అరుంధతి - వశిష్టులు, దేహం ధరించి ప్రజలని అనుగ్రహించడం కోసం గురువుల రూపంలో మానవ శరీరాకృతి దాల్చి వస్తారు. అందుకే అన్నారు ''గురునింద మహాపాతకం'' అని. గురువుని దిక్కరించరాదు. ఏకవచనంతో సంభోదించరాదు. వాదమున జయించ రాదు. ఇలా చేసినవారు బ్రహ్మరాక్షస జన్మలని పొంది నరకం పాలౌతారు. అతని మాటను జవదాటరాదు. గురువుకి ఆధీనుడై నిత్యమూ చరించవలెను.
ఇటువంటి సంసారం తారకుడైన గురువు సామాన్యముగా లభించడని గుర్తించవలెను.గురువు ప్రసన్నుడైతే అతని రక్షణలో మోక్షలక్ష్మిని అనుగ్రహిస్తాడు.
'గు' కారమునకు అంటే అంధకారమని అర్ధము. 'రు' కారమునకు నిరోధకుడని అర్ధము. అంధకారమును నిరోధించువాడని అర్ధము. కావున గురువు అనబడుచున్నారు. ఇది కేవలం ఆధ్యాత్మిక గురువు కు మాత్రమే. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో ఉన్నవారు ఉపాద్యాయుడు మాత్రమే. గురువుని కఠిన వాక్కు ఆశీర్వదముగా భావించాలి. గురువునకు అభివాదము ఒనర్చి అతని దగ్గర నుండి లౌకికముగాని, వైదికముగాని, అధ్యత్మికముగాని యైన జ్ఞానమును పొందవలెను. గురుభక్తి సదాచారము. గురుద్రోహము పాతకము, ఆయన అడుగుజాడలు తరింపజేయునవి. ముక్తినిచ్చునవి. ఇది దేహమున్నంతవరకూ క్రమము. గురువు ఎదుట అసత్యమాడిన అది గోబ్రాహ్మణ వధకన్నా అధికమైనది. గురువు చెప్పిన వాక్కు శాసనముగా భావించువాడే శిష్యుడు అనబడును. గురువు చెప్పిన నిషిద్దమైన గురువాజ్ఞను చేయవలసిందే. గురువుతో ఏకత్వమును భావింపరాదు. (ఏకాంతంగా ఉండాలని కోరుకోకూడదు.), ప్రాణమున్నంత వరకు వర్ణాశ్రమ ధర్మాలు పాటించవలసిందే. ఉత్తమజాతిలో జన్మించినా, అత్యధిక విద్యావంతుడు అయినా, ధనవంతుడైనా(కోట్లకి పడగలెత్తినా) గురువునకు సాష్టాంగ నమస్కారం చేయవలసిందే. రాజును, దేవతను, గురువును ఒట్టి చేతులతో దర్శించరాదు. ఆగనమనాది, వేద శాస్త్రాలను, ఇతరుల సిద్దాంతాలను దూషించరాదు. గురువాజ్ఞను ఉల్లంగించరాధు.
శివ - పార్వతులు, బ్రహ్మ- వాణి లు, విష్ణువు - లక్ష్మి లు, అరుంధతి - వశిష్టులు, దేహం ధరించి ప్రజలని అనుగ్రహించడం కోసం గురువుల రూపంలో మానవ శరీరాకృతి దాల్చి వస్తారు. అందుకే అన్నారు ''గురునింద మహాపాతకం'' అని. గురువుని దిక్కరించరాదు. ఏకవచనంతో సంభోదించరాదు. వాదమున జయించ రాదు. ఇలా చేసినవారు బ్రహ్మరాక్షస జన్మలని పొంది నరకం పాలౌతారు. అతని మాటను జవదాటరాదు. గురువుకి ఆధీనుడై నిత్యమూ చరించవలెను.
ఇటువంటి సంసారం తారకుడైన గురువు సామాన్యముగా లభించడని గుర్తించవలెను.గురువు ప్రసన్నుడైతే అతని రక్షణలో మోక్షలక్ష్మిని అనుగ్రహిస్తాడు.
'గు' కారమునకు అంటే అంధకారమని అర్ధము. 'రు' కారమునకు నిరోధకుడని అర్ధము. అంధకారమును నిరోధించువాడని అర్ధము. కావున గురువు అనబడుచున్నారు. ఇది కేవలం ఆధ్యాత్మిక గురువు కు మాత్రమే. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో ఉన్నవారు ఉపాద్యాయుడు మాత్రమే. గురువుని కఠిన వాక్కు ఆశీర్వదముగా భావించాలి. గురువునకు అభివాదము ఒనర్చి అతని దగ్గర నుండి లౌకికముగాని, వైదికముగాని, అధ్యత్మికముగాని యైన జ్ఞానమును పొందవలెను. గురుభక్తి సదాచారము. గురుద్రోహము పాతకము, ఆయన అడుగుజాడలు తరింపజేయునవి. ముక్తినిచ్చునవి. ఇది దేహమున్నంతవరకూ క్రమము. గురువు ఎదుట అసత్యమాడిన అది గోబ్రాహ్మణ వధకన్నా అధికమైనది. గురువు చెప్పిన వాక్కు శాసనముగా భావించువాడే శిష్యుడు అనబడును. గురువు చెప్పిన నిషిద్దమైన గురువాజ్ఞను చేయవలసిందే. గురువుతో ఏకత్వమును భావింపరాదు. (ఏకాంతంగా ఉండాలని కోరుకోకూడదు.), ప్రాణమున్నంత వరకు వర్ణాశ్రమ ధర్మాలు పాటించవలసిందే. ఉత్తమజాతిలో జన్మించినా, అత్యధిక విద్యావంతుడు అయినా, ధనవంతుడైనా(కోట్లకి పడగలెత్తినా) గురువునకు సాష్టాంగ నమస్కారం చేయవలసిందే. రాజును, దేవతను, గురువును ఒట్టి చేతులతో దర్శించరాదు. ఆగనమనాది, వేద శాస్త్రాలను, ఇతరుల సిద్దాంతాలను దూషించరాదు. గురువాజ్ఞను ఉల్లంగించరాధు.
No comments:
Post a Comment