నెల్లూరుజిల్లా ,ఆత్మకూరు పట్టణంలో సద్గురు కాశినాయన ఆశ్రమంలో నవరాత్రులలో భాగంగా మూడవ రోజు ధనలక్ష్మి దేవి అలంకారం లో దర్శనమిచ్చిన జ్ఞాన సరస్వతి దేవి మరియు కనకదుర్గ దేవి అమ్మ వార్లు.
-------------------------------------------------------------
.ఆత్మకూరు సద్గురు కాశినాయన ఆశ్రమం యొక్క విశిష్టత.
-------------------------------------------------------------
ఈ ఆశ్రమ నిర్వాహకులు సద్గురువు పట్ల గల నిరంతర ప్రేమ, భక్తి, విశ్వాసాలుతో అన్నివేళలా సర్వజీవుల పై ప్రేమ,దయ చూపగలుగుతున్నారు.
'అన్నాద్ధ్యేవా ఖల్విమానాని భూతాని జాయంతే, అన్నేన జాతాని జీవన్తి' అని వేదము చెప్పు చున్నది.
సృష్టిలోని సర్వప్రాణులు అన్నము నుండే పుట్టుచున్నవి.పుట్టినవన్నీ అన్నము వలననే జీవించుచున్నవి. అన్నము లేకుండా జీవనం సాగదు, అందుకే జగము అన్నమయము అని చెప్పబడును.అందుచేత అన్నము పెట్టడము వలన జీవికి ప్రాణం పోసినట్లగును.
ఈ ఆశ్రమములో నిరతాన్నదానము జరుగుతుంటుంది. అర్ధరాత్రి వచ్చినా ఇక్కడ ఎంతో భక్తితో అన్నదానం చేస్తారు. సర్వరోగాలను నయము చేసే 'సర్వరోగ నివారిణి' అనే 'కషాయము' తయారుచేసి వచ్చిన వారికి ఉచితంగా అందచేస్తారు. పేద విద్యార్థుల కోసం 'కాశినాయన పాఠశాల'ను స్థాపించి పిల్లలకు అన్నదానంతో పాటు,పుస్తకాలను కూడా ఉచితంగా అందిస్తున్నారు.
జై సద్గురు కాశినాయన..జై సద్గురు రామచంద్ర నాయన....

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment