యాగంటి .కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే ఈ యాగంటి.ఆహ్లాదకరమైన ప్రకృతితో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి.ఇక్కడ వున్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.
యాగంటి నంది విగ్రహం చరిత్ర
శ్రీ ఉమామహేశ్వరుని ఆలయం యాగంటి లో ప్రధాన అలయం.తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాలన
ి కట్టారని కాని కట్టడం పూర్తి అయిన తర్వాత విగ్రహంలో చిన్న లోపం ఉండటంతో వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్టించలేదు,స్వయంభువుగా ఆ చుట్టు పక్కల వెలసిన ఉమా మహేశ్వర స్వామి వారిని తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్టించారని ఒక కథ ప్రచారంలో వున్నది.శ్రీ వెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండపైన వున్న గుహలో ఇప్పటికి దర్శించుకోవచ్చు.ఇక్కడున్న పుష్కరిణి లోనికి నీరు నంది నోటి నుండి వస్తూ వుంటుంది.
అగస్త్య పుష్కరిణి :
ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు.ఏ కాలంలో నైనా పుష్కరణి లోని నీటి మట్టం ఒకేలా వుండడం విశేషం. ఇందులోని నీటికి ఔషద గుణాలున్నాయని,ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని భక్తుల నమ్మకం.
అగస్త్యముని గుహ :
యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు చాలానే ఉన్నాయి.ఒక గ్రుహలో బ్రహ్మం గారు కొంత కాలం నివసించారని,శిష్యులకు జ్జ్ఞానోపదేశం చేసాడని భక్తులు నమ్ముతారు.దీనిని శంకరగుహ,రోకళ్ళగుహ అనికూడా అంటారు.
ఇక ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది.ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ వుండటం.పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది.కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేసాడని బ్రహ్మంగారి కాలఙానం లో ప్రస్థావించబడి ఉంది.యుగాంతంతో ముడిపడిఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది.
కాకులకు శాపం :
ఇక యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో వుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ వుండగా చేతి బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పములో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతుంటారు.
No comments:
Post a Comment