
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 14 August 2015
అరుదైన పాదరస శివలింగం
ఎంతో ప్రాచీనమైన బ్రహ్మాండమైన విశిష్ఠత కల్గిన శైవ దర్మంలో శివలింగంకు ఉన్న ప్రాధాన్యత ఎంత విశేషమైనది. అనేక ప్రాంతాల్లో వివిధ రూపాల్లో కనిపించే శివలింగాలలో పాదరస లింగం చాలా అరుదైనదని మన ఆర్యులు చెబుతుంటారు. అలాంటి పాదరస శివలింగం అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో నెలకొని ఉండటం విశేషం. శాంతినగర్ సమీపంలో బళ్లారి రోడ్డు ప్రధాన రహదారి వైపు శ్రీ రాజవిద్యాశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి పాదరస శివలింగాన్ని ప్రతిష్టించారు. కేవలం రస విద్య నిశ్నాతులు మాత్రమే ఇలాంటి పాదరస లింగాన్ని తయారు చేయడానికి అవకాశముందని తెలుస్తుంది. పాదరస లింగ 14 సెం.మీ ఎత్తు, 25 సెం.మీ. చుట్టు కొలత కలిగి ఉన్నది. శ్రీ రాజవిద్యాశ్రమ అధ్యక్షులు కె. జీవన్ముక్తస్వాముల వారి సమాధి స్థానంలో లింగప్రతిష్టాపన చేయాలని 1974వ సంవత్సరంలో నిశ్చయించుకున్నారు. ఈ పాదరస లింగాన్ని 1984 సంవత్సరం ఫిబ్రవరి నెల ఆరవ తేదీన ప్రతిష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టలో ఇదొక్కటే పాదరస లింగమని తెలిసింది. రాయదుర్గం.నెట్ వీక్షకులు మరి విచ్చేయండి పాదరస లింగాన్ని దర్శించుకునేందుకు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment