మన జాతీయ పతాకం మద్యలో నీలం రంగు లోవున్న " అశోక చక్రం " గురించి..
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అశోకచక్రం, ధర్మచక్రం ఇందులో 24 ఆకులు (స్పోక్స్) గలవు. ఈ చక్రం గురించి, మౌర్య సామ్రాజ్యం లో అనేక కథనాలున్నవి. అశోక చక్రవర్తి (273 - 232 క్రీ.పూ.) పరిపాలనా కాలంలో తన రాజధానియగు సారనాథ్ లోని అశోక స్తంభం యందు ఉపయోగించాడు. నవీన కాలంలో ఈ అశోకచక్రం, మన జాతీయ పతాకంలో చోటుచేసుకున్నది. దీనిని 1947 జూలై 22 న, పొందుపరచారు. ఈ అశోకచక్రం, తెల్లని బ్యాక్-గ్రౌండ్ లో 'నీలి ఊదా' రంగులో గలదు.
*ప్రఖ్యాత 'సాండ్-స్టోన్' (ఇసుకరాయి) లో చెక్కబడిన 'నాలుగు సింహాల' చిహ్నం. సారనాథ్ *సంగ్రహాలయంలో గలదు. ఇది అశోక స్తంభం పైభాగాన గలదు. దీని నిర్మాణ క్రీ.పూ. 250 లో జరిగినది. *భారత ప్రభుత్వము, దీనిని తన అధికారిక చిహ్నంగా గుర్తించింది.
డిజైను వెనుక గల చరిత్ర మరియు కారణాలు
ఈ అశోకచక్రం, అశోకుడి కాలంలో నిర్మింపబడినది. 'చక్ర' అనేది సంస్కృత పదము, దీనికి ఇంకో అర్థం, స్వయంగా తిరుగుతూ, కాలచక్రంలా తన చలనాన్ని పూర్తిచేసి మళ్ళీ తన గమనాన్ని ప్రారంభించేది. 'గుర్రం' ఖచ్చితత్వానికీ మరియు 'ఎద్దు' కృషి కి చిహ్నాలు.ఈ చక్రంలో గల 24 ఆకులు (స్పోక్స్), 24 భావాలను సూచిస్తాయి.
No comments:
Post a Comment