What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 7 May 2015

ఘనంగా శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆఖండ జోతి "నిర్వికల్ప జీవ సమాధి"



ఘనంగా శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆఖండ జోతి "నిర్వికల్ప జీవ సమాధి" ఆరాధనోత్సవం 2015...
.
భోలోకము యందు మానవులు అధర్మ ప్రవర్తులై , పాపభీతి లేని వారై కడు మాయలతో మోసాలతో పలు పాపకార్యములు చేయుచుండగా భూదేవికి పాపభారము పెరిగి శ్రీ మహావిష్ణువుని మొరపెత్తుకొనెను. అప్పుడు శ్రీ మహావిష్ణువు, బ్రహ్మా విష్ణు మహేశ్వరులతో సమయాలోచించి బ్రహ్మదేవుడు అన్నజయ్యగా, మహేశ్వరుడు సిద్దయ్యగా, శ్రీ మహావిష్ణువు వీరబ్రహ్మెంద్రస్వామిగా జన్మించి ప్రజాకోటి యందలి అజ్ఞ్యానoధకారములను పారాద్రోలుచూ కాలజ్ఞ్యానము వివరించుచూ శ్రీ మహావిష్ణువు వీరబ్రహ్మెంద్రస్వామిగా భవిష్యత్తు కాలజ్ఞ్యానమును ప్రజలకు అందజేసి, వారి సకలాభీష్టములను నెరవేరు విధముగా పంచాక్షరి మహామంత్రమును ఉపదేశించి మాతా శ్రీగోవిందమాంబ సమేత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు గా వేలుగొందేను.

ఈ కలియుగమున ఎవరైతే ఈ పంచాక్షరి మహామంత్రమును జపిస్తారో వారు ఈ కలియుగమున కలుగు ఘోర విపత్తుల నుండి రక్షింపబడతారు

"ఓం హ్రీం క్లీం శివాయ వీరబ్రహ్మణీ నమః "
శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన కలిమాయ నుండి మనల్ని కాపాడును. శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానమును వినినవారికి సర్వపాపహరణం. శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర పారాయణము అష్టైశ్వర్య ప్రదాయిని.

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 17వ శతాబ్దము లో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది , సంఘ సంస్కర్త. సాక్షాత్ దైవ స్వరూపుడు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి.

కర్ణాటక రాష్ట్రంలోని బ్రహ్మాండపురంలో క్రీస్తు శకం 1608న కాలజ్ఞానంలోని మరుగు వ్యాఖ్యల ఆధారంగా కార్తీక శుద్ధ ద్వాదశినాడు పరిపూర్ణాచార్యులు, ప్రకృతాంబలకు వీరప్ప శ్హయ్య జన్మించారు. ఆయన జన్మించగానే తండ్రిని కోల్పో య్యారు. తల్లి ప్రకృతాంబ తన కుమారుడ్ని సమీపంలో ఉన్న అత్రి మహామునికి అప్పజెప్పి ప్రాణాలు వది లింది. పాపాగ్ని పీఠానికి చెందిన యనమదల వీరభోజయ్యస్వామి ఆయన భార్య వీరపాపమాం బలకు సంతానం లేకపోవడంతో అత్రి మహాము నిని వేడుకోగా తన వద్ద వున్న బాలుడిని తీసుకొని పోయి పెంచుకోమని చెప్పాడట. వీరప్పయ్యకు 5వ ఏట విద్యాభ్యాసం జరిగింది. 14వ యేట వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ కర్నూలు జిల్లా, బనగానపల్లె(హరిహరపురం)కు చేరి తపస్సు చేయడం ప్రారంభించారు. బనగానపల్లెలో మోతూబరి అయినటువంటి గరిమిరెడ్డి అచ్చమ్మగారింట గోవుల కాపరిగా చేరాడు. అక్కడే ఆవులను కాస్తూ సమీపంలోనే రవల కొండలో వున్న గుహలో కూర్చొని తాటాకుల మీద భవిష్యత్తులో ఏమి జరుగుతుందో కాలజ్ఞానం గ్రంధంగా రాశారని తెలుస్తోంది.

ఈ ప్రపంచంలో కలియుగంలో 5 వేల ఎళ్లు దాటిన తర్వాత జరగబోయే వింతలను గురించి వీరబ్రహ్మంగారు తెలిపారు. అప్పటిలో బనగానపల్లె నవాబుకు తన మహిమలను చూపారు. అనంతరం కడప జిల్లా, బద్వేలు తాలూకలోని మైదుకూరు నియోజకవర్గంలో వున్న కందిమల్లాయపల్లెకు(ప్రస్తుతం బ్రహ్మంగారిమఠం) చేరి అక్కడి గ్రామ పెద్దల సహకారంతో ఒక కుటీరాన్ని నిర్మించుకొని గ్రామ రైతాంగానికి నాగలి, కర్రు, మొదలైన వస్తువులు చేసి ఆదర్శ కార్మికుడైయ్యారు. రాత్రి వేళ్లల్లో స్ధానిక సమీప గ్రామాల ప్రజలకు వేదాంతం భోదిస్తూ భవిష్యత్తు కాలజ్ఞానం వినిపించేవాడు. శిశ్యులు దూదేకుల కులానికి చెందిన వారు దళితులు వున్నారు. దళితులు, దూదేకుల కులాలకు చెందిన వారు కూడా ఆయన శిశ్యులుగా చేర్చుకోవడం చెప్పుకోదగ్గ విషయం.

కడప జిల్లా, జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్ద కొమ్మెర్ల గ్రామానికి చెందిన శివకోటయ్య ఆచారి కుమార్తె గోవింద మాంబను వివాహమాడారు. మైదుకూరు నియోజకవర్గం ముడుమాల(సిద్దయ్య గారిమఠం)కు చెందిన దూదేకుల సిద్దయ్యను శిశ్యునిగా చేసుకొని పర్యటన కొనసాగించారు. కడప నవాబుకు తన మహిమలను చూపించి హిందూ, మహమ్మదీయుల ఐక్యతకు కృషి చేశారు. కంది మల్లాయపల్లెకు చెందిన దళితులు కక్కయ్యను తన శిశ్యునిగా చేర్చుకున్నారు. అనంతరం కాలజ్ఞానాన్ని దేశం నలుమూలల ప్రచారం చేసి సంఘ సంస్కర్తగా ఖ్యాతిని పొందారు. 16వ శతాబ్దంలో వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధి నిష్ట వహించి కలియుగ దైవంగా వెలుగొందారు. 1993లో కందిమల్లాయపల్లెలో సజీవ సమాధి అయ్యారు. భౌతికంగా మన మధ్య లేనప్పటికీ సజీవ సమాధి అయిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధి అయిన స్థలం నేడు బ్రహ్మంగారిమఠంగా ఒక పుణ్యక్షేత్రంగా వెలుగుతోంది.

బ్రహ్మంగారు వ్రాసిన కాలజ్ఞానంలోని కొన్ని ముఖ్యమైన సంఘటనలు ..........

1) శ్రీ వీరభోగవసంతరాయల వారు 'విశ్వావసు' నామ సంవత్సరం (1965-1966) లో జన్మించి అశ్వత్ధామ, దత్తాత్రేయుల వారు, శ్రీ సనారీ విశ్వేశ్వర స్వామివారు,శ్రీ ఆచార్య నాగార్జునుల వారు, శ్రీ స్వర్ణ అమరలింగేశ్వర స్వామివారు, తదితర సిథ్థపురుషుల వద్ద సమస్త విద్యలు నేర్చి ఆ తరువాత పరమశివుడిని ప్రార్ధించి వారిచే 'దేవదత్త' మనే గుఱ్ఱమును, 'శుక' మనే చిలుకను, 'రత్నసారు' అనే ఖడ్గమును, కార్ముకము అనే విల్లును, అక్షయ తూణీరములును, పాశుపత అస్త్రమును (22-11-2007 నాడు), ఆశీస్సులను పొంది, తేది.09-09-2009 నాటినుండి బహిరంగంగా దుష్టశిక్షణ శిష్టరక్షణ ప్రారంభించుటకు నిర్ణయించుకున్నారు. ఈ తేది నుండి గ్రహముల ఆగ్రహానుగ్రహములు సమస్తం శ్రీ వీరభోగ వసంతరాయలవారి అధీనంలో ఉంటాయి. బ్రహ్మ వ్రాసిన వ్రాత అంతమై, ప్రజలు వారు చేసే పాప పుణ్యాలనుబట్టి పూర్వజన్మ ఫలితాలతో సహా ఈ జన్మఫలితాలు ఎప్పటికప్పుడు అనుభవంలోకి వస్తాయి.

2.ప్రమాధి నామ సం||(1999-2000) నుండి కరువుకాటకాలు, అతివృష్టి, అనావృష్టి, వ్యాధులు విజృంభిస్తాయి.

3.తేది 13.04.2000 నాడు శ్రీ వీరభోగ వసంతరాయలు వారు విజయవాడలో ఇన్ద్రకీలాద్రిపై యున్న కనకదుర్గ దేవాలయాన్ని దర్శించారు. (బహుశా ఆ సం.లోనే వివాహము అయివుంటుంది).

4. అంతర్గత విస్ఫోటనములవల్లగానీ, తీవ్రవాదుల దాడులవల్లగానీ హైదరాబాదుకు, అణుసంస్ధలకు/రక్షణ సంస్ధలకు ప్రమాదము. ఏ అణుదాడి/అణుప్రేలుడు (అంతర్గత) ఐనా కర్కాటక మకర సంక్రమణముల మధ్య జరుగుతుంది. (2002 నుండి జరిగిన సంఘటనలు గమనార్హం). చావగా మిగిలిన వాళ్ళు రేగడి మట్టిలో చింతపండు కలుపుకుని బ్రతుక వలసి వస్తుంది, ఆచార్యా నాగార్జునుల వారు, ఆయన శిష్యుడు మందులు ఇచ్చి కాపాడుతారు.

5.సం.1987 నుండీ ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి. రాబోయే సునామీ వల్ల దక్షిణేశ్వరమునుండి (కలకత్తా) శ్రీలంక దాకా సముద్రము 80 మైళ్ళు వెనుకకు వెళ్ళుతుంది. తద్వారా, కోణార్క వద్ద సూర్యుని రధసారధి అయిన అనూరుని దేవాలయం, విశాఖపట్నం వద్ద వైశాఖేశ్వరుని దేవాలయం, మోటుపల్లి వద్ద భద్రకాళీ సమేత వీరభద్ర దేవాలయం, శ్రీహరికోట వద్ద విగ్రహరూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల దేవాలయం, మొదలగు ఎన్నో దేవాలయాలు బైటపడతాయి.

6. తేది 09-04-2005 నుండే శ్రీ వీరభోగవసంతరాయలవారు సశరీరంగా దర్శనమిస్తున్నారు. తేది.04/10/2006 న మరియూ 04/09/2009 న శ్రీ స్వామివారు మహానంది సందర్శించారు. 09-09-09 కి ముందు శ్రీ వీరభోగవసంతరాయలవారు మాచర్లలోని చెన్నకేశవస్వామి దేవాలయము, యాగంటి, శ్రీకాళహస్తి, కుంభకోణం దేవాలయములు రోజుకు మూడుసార్లు దర్శించారు. ఇప్పుడు రోజుకు ఒక్కసారి మాత్రమే దర్శిస్తున్నారు. ఏ రోజున వారి సందర్శన ఆగుతుందో ఆ రోజున ఆయా దేవాలయములు దెబ్బతింటాయి లేదా కూలిపోతాయి.

7.కృష్ణా గోదావరి నదులమధ్య రక్తం ఏఱులై పారుతుంది (ప్రత్యేక రాష్ట్రం కోసం, నీటికోసం, మతకల్లోలాలవల్ల).

8.తేది.26-12-2011 న శ్రీ వీరభోగవసంతరాయలవారు సాధారణ పరిపాలకులుగా పట్టాభిషిక్తులౌతారు.

9.మూడవ ప్రపంచ యుధ్ధం 2046లో గాని, ఆ తర్వాత వచ్చే మకర సంక్రాంతి రోజు (గురు గ్రహము కుంభరాశిలో ఉండగా) అంతమవుతుంది కాబట్టి 2012లో కలియుగాంతం అవుతుందని అనుకోవటం అర్ధరహితం. 'నందన' నామ సంవత్సరం(2012-13)లో భయంకర ఉత్పాతములవల్ల లక్షలాది జనం నశిస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తెలిపారు. భగవంతుని రాక ఊహించి, గ్రహములు, ఋతువులు గతి తప్పబోతుండటం గమనించి, మాయన్ కేలండర్ వ్రాసినవారు పంచాంగ గణితమును అక్కడితో ఆపివుంటారు.(మాయన్ కేలండర్ వ్రాసినవారు మయబ్రహ్మ వారసులని ప్రతీతి).

10)హస్త(12/09 నుండి 09/11 వరకు), చిత్త(09/11 నుండి 05/12 వరకు), స్వాతి నక్షత్ర 'శని' సంచారంవల్ల అతివృష్టి, అనావృష్టి సంభవిస్తుంది. ప్రళయాలవల్ల కోట్లాది మంది మరణిస్తారు.

11) కంచి, శృంగేరి, పుష్పగిరిలలో అనేక వింతలు పుట్టును. ఆ పీఠములకు గడ్డు కాలం. పీఠాధిపత్యములు విశ్వబ్రాహ్మణులకు తిరిగి చేరును.

12. శ్రీశైలములో పరుసువేధి (ఇనుము మొదలగువాటిని బంగారంగా మార్చునది) దొరికి బ్రహ్మంగారి మఠం చేరుతుంది.

13. ఉదయగిరి పర్వతము మీద సంజీవని దొరుకుతుంది.

14) నందన(2012-2013)లో శ్రీశైల మల్లిఖార్జునుని గుడిలో పొగ, మంటలు వచ్చును. శ్రీశైల మల్లిఖార్జునుడు సాక్షాత్కారముగా ప్రజలతో మాట్లాడును. శ్రీశైల భ్రమరాంబ గుడిలోకి ఒక మొసలి వచ్చి 8 దినములుండి మేకపోతువలె అరచి మాయమగును. శివుని కంట నీరు కారును. బసవేశ్వరుడు ఱంకెవేసి కాలుదువ్వును. పుట్లకంబము మీద ప్రతిమ మాట్లాడును. కాలభైరవుడు మంత్రములు చదువును.

15) విజయ నామ సంవత్సరము(2013-14)లో కోట్లమంది మరణిస్తారు.

16. శ్రీస్వామివారి సైన్యంకోసం లక్షలాది గుఱ్ఱాలు యాగంటి గుహలనుండి వస్తాయి.

17. కంచి కామాక్షమ్మ ఉగ్రము వల్ల దక్షిణదేశము దొరలు, ప్రజలు నష్టమౌదురు. రామేశ్వరము వద్ద భయంకరమైన యుధ్ధం.

18.గుళ్ళలో దేవుళ్ళకు మూర్తిమంతములు వచ్చి ఊరూరా నాట్యమాడును. కంచి కామాక్షి గిఱ్ఱున తిరుగును. బిళం కామాక్షమ్మ కండలు కక్కును. గండకీ నదిలో సాలగ్రామములు నాట్యమాడును. వినాయకుడు వలవలా ఏడ్చును. దేవతలు సాక్షాత్కారముగ ప్రజలతో మాట్లాడెదరు.

19. వినాయకుడు ఊరూరా తిరిగి వేదమంత్రములు చదువును.

20) తామే వీరభోగవసంతరాయలమని చాలామంది దొంగ సాధువులు వస్తారు.

21.సూర్యనంది భూకంపంలో నేలమట్టమౌతుంది.

22) యాగంటి, శ్రీశైలం, కుంభకోణంలలో గోవధ, మతకలహాలు, వేలాదిమంది బలి.

23) క్రోధి నామ సం.(2024-25)లో భారతదేశానికి యుధ్ధం. ఢిల్లీ పై బాంబుల వర్షం. దేశ రాజథాని ఢిల్లీనుండి ఆనెగొందికి మారుతుంది. అదే సంవత్సరం లో నెల్లూరు నీటమయమౌతుంది.

24) కాశీ విశ్వనాథుని దేవాలయము 40 రోజులు మూతపడుతుంది. శ్రీ కాళహస్తి, కుమారస్వామి, తిరుమల దేవాలయములు వారం రోజులు మూతపడుతయి. 120 దివ్య దేవాలయములు హిందూయేతర శక్తులచే ధ్వంసము చేయబడుతాయి. ఆ తర్వాత తిరుమల వన్యమృగములకు ఆలవాలమౌతుంది. తిరుమల వేంకటేశ్వర, కాళహస్తి, విజయవాడ కనకదుర్గ మూలవిరాట్ విగ్రహాలు కందిమల్లాయపల్లె చేరుతాయి.
25) కృష్ణానది వరదలతో అనకట్టలు, 14 నగరాలు కొట్టుకుపోతాయి. కృష్ణ నీరు కనకదుర్గ ముక్కుపోగు అంటుతుంది.

26) భారతదేశ ఆర్ధిక రాజధానిగా కందిమల్లాయపల్లె విలసిల్లుతుంది.

27. కంచికి పడమట కామధేనువు జన్మిస్తుంది.

28. నవనారసింహ క్షేత్రాలు, యాగంటి, ఆలంపూర్, బెల్లంకొండ, శ్రీశైలంలలో ఉన్న మహానిధులను తీస్తారు.

29. బాపల పంచాంగములు తలక్రిందులవును. వారు చెప్పే భవిష్యత్తు జరుగక పోవును.

30. ఆఱు విచిత్ర వ్యాధులు లక్షలాది మందిని కబళిస్తాయి.

31. కావేరీ తీరం వెంబడి కలహాలతో లక్షలాదిమంది మరణం.

32. భయంకరమైన తుఫానులు, వరదలవల్ల పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లలో కోట్లాదిమంది దుర్మరణం. భూకంపంవల్ల కలకత్తా నగరం దెబ్బతింటుంది.

33. ఒక వైశాఖ అమావాస్య నాడు విచిత్ర వ్యాదులతో అనేకమంది హతమౌతారు (బహుశా జీవ, రసాయన ఆయుధముల వల్ల కావచ్చు)

34. మక్కా మసీదు లో ఒక పంది ఉద్భవమై, ముస్లిములచే తరుమబడుచూ చివరికి విజయవాడ చేరుతుంది. అప్పుడు జరిగే కలహాలవల్ల లక్షలాది మంది మరణిస్తారు.

35.'శని' సంచారం - మీనరాశిలో ఉండగా మ్లేఛ్ఛులకు హాని, వృషభరాశిలొ ఉండగా ఈశాన్య దిశ నుండి వచ్చే విషపుగాలి వల్ల మరణాలు, మిధున రాశిలొ ఉండగా పాపులలో ఎక్కువమంది మరణిస్తారు (తేది.29-03-2025 నుండి 10 సంవత్సరములు పైబడి).

36. ఒక తోక చుక్క వల్ల భూభ్రమణములో మార్పువస్తుంది. సూర్యుడు వణుకుతున్నట్టు కన్పిస్తాడు. తేది.02-08-2027 (సూర్యగ్రహణం) నాడు, సూర్యునిలో సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తాడు. ఇంకో సందర్భంలో సూర్యునిలో విష్ణు మూర్తి దర్శనమిస్తాడు. ఇంకో తోక చుక్క 33 రోజులు కన్పిస్తుంది.

37) తేది.15-03-2035 నాడు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయలవారు తమ విశ్వరూపం చూపిస్తారు. తేది.30/03/2035 నాడు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయలవారు తన సైన్యంతొ మహాసంగ్రామానికి బయలుదేరుతారు. ఆనంద(2034-35), రాక్షస(2035-36) నామ సంవత్సరములలో పశ్చిమ దేశాలలో కోట్లాదిమంది హతమౌతారు, ఈ సమయంలోనే కలియుగధర్మం నాశనమౌతుంది.

38. దాదాపు 400 సంవత్సరముల క్రితం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారిచే బనగానపల్లెలో చింతచెట్టు క్రింద భద్రపరచబడ్డ కాలజ్ఞాన తాళప్రతులు తేది.7/8-06-2036 నాడు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయలవారిచే తీయబడి బహిరంగపరచ బడతాయి. ఆనాటి నుండి, వ్యక్తిగత, ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి సవరణలు లేకుండా కాలజ్ఞానములో వ్రాయబడినట్లు యధాతధంగా జరుగుతాయి.

39) ప్రపంచవ్యాప్తంగా రెండు మతాల మధ్య యుద్దంవలన పింగళ (2037-2038), కాళయుక్తి (2038-39) మరియు రౌద్రి(2040-41) లలో కోట్లాదిమంది హతమౌతారు.

40) కులాంతర, మతాంతర వివాహాలు సర్వసామాన్యం అవుతాయి.

41) ఉత్తరాయణమందు ఉత్తరభారత దేశస్తులు దక్షిణ భారతావనికి తరలివస్తారు. అప్పుడు జరిగే కలహాలవల్ల కోట్లాదిమంది హతం.

42) తేది.24-05-2039 నుండి 21-06-2039 మధ్యలో వచ్చే భయంకర భూకంపంవల్ల అద్దంకి నేల మట్టమౌతుంది.

43) క్రీ.శ.2040లో 40 రోజులపాటు కాశీ వద్ద గంగానదిలో నీరు ఉండదు.

44) పండ్రెండు రోజులు గోదావరిలో చుక్కనీరు ఉండదు. 13వరోజున భయంకరమైన వరదలు వస్తాయి.

45) తేది.15/16-02-2041(రౌద్రి,మాఘ పౌర్ణమి)నాడు ఒక్కసారిగా ఏడు కోట్లమంది దుర్మరణం పాలౌతారు.

46) తేది 26/27-11-2044(రక్తాక్షి,మార్గశిర శుధ్ధ సప్తమి)నాడు, చెన్నపట్నం (మద్రాసు) లో, ఏడేండ్ల బ్రాహ్మణ బాలికకు నాలుగు చేతులు, మూడు కాళ్ళు, నెత్తిన కొమ్ము గల ఒక మగ శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు 22 రోజులు జీవించి 23వ రోజున మరణించబోయేముందు, శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయల వారికి కలి పురుషుడికి మధ్య జరగబోయే మహాయుధ్ధం (ది ఆర్మగెడ్డాన్) గురించి ప్రకటన చేసి మరణిస్తాడు. ఈ యుధ్ధం 19-01-2045 నుండి 16-02-2045 మధ్య మొదలౌతుంది. యుధ్ధాలు పరిసమాప్తి క్రీ.శ. 2060 తో అవుతాయి. ప్రళయాలు క్రీ.శ.2066 దాక కొనసాగుతాయి.

47. అమెరికాలో ఒక నగరం భూకంపంతో నేలమట్టమౌతుంది. ఆ విపత్తునుండి ఐదు కుటుంబాలు మాత్రమే బ్రతికి బట్టకడతాయి. ఇండో-మయా సంస్కృతి తిరిగి పునరుజ్జీవనమౌతుంది.

48. గోపురము కూలి కుంభుని (కుంభకోణం) రూపు మారుతుంది.

49. శైవులు వైష్ణవుల మధ్య కలహాలు. బ్రతుకు దుర్భరమై 1,11,000 మంది బ్రహ్మంగారి జీవ సమాధి వద్ద గండకత్తెరలతో తలలు తెగకోసుకుని ఆత్మాహుతి చేసుకుంటారు. ఏఱులై పాఱిన ఆ రక్తం బ్రహ్మంగారి జీవసమాధిని తాకుతుంది. జీవసమాధిని పగులగొట్టుకుని బైటకు వచ్చిన బ్రహ్మంగారు వారిని కాపాడుతారు.

50) అమావాస్యనాడు, ఉదయగిరి పర్వతముమీద, చక్రాంకితుడైన శ్రీమహావిష్ణువు దర్శనమిస్తాడు. సుదర్శన చక్రమును చూసి ప్రజలు ఆ రోజు చంద్రగ్రహణమని భ్రమపడతారు.

51) క్షిపణి, అణుదాడిలో హంపి (కర్నాటక) దెబ్బతింటుంది.

52) మాయాజంగాలు (రోబోట్ సైనికులు) వస్తారు.

53) వెంపలి చెట్లకు నిచ్చెనలు వేసుకుని ఎక్కే ప్రమాణముగల మనుషులు పుడతారు.

54)ఊరూర పొలిమేర్ల వద్ద తెల్ల కాకులు చేరి ఏడుస్తాయి.

55) వాలి,సుగ్రీవుల ఖజానా వెలికి తీస్తారు. హనుమద్రామాయణము వెలుగులోకి వస్తుంది.

56) నాస్తికత్వము ప్రబలుతుంది. వావివరుసలు మరచి ప్రవర్తిస్తారు. ఒకరియాలు మరొకరి పాలగును.

57) ఐదేండ్ల నాగయ్య వేదాలు చదువుతాడు. ఇంకొక బాలుడు ప్రజలకు భవిష్యత్తు చెబుతాడు.

58) భారతదేశం ముక్కలౌతుంది. వింధ్య పర్వతముల నుండి సేతువు (రామేశ్వరము) మధ్య ప్రదేశము, శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయల వారి సహాధ్యాయి మరియు దళపతియైన ఒక వీరుని పరిపాలనలో ఉంటుంది (సామంత రాజ్యముగా).
59) వేంకటేశ్వరుని కుడిభుజము అదురును, విగ్రహము పగుళ్ళిస్తుంది, తిరుమలలో భూకంపము వస్తుంది. తిరుమలకు వెళ్ళే రహదారులన్నీ మూసుకు పోతాయి.

60) పుష్యమాసములో మ్లేఛ్ఛదేశాలకు హాని.

61) తేది.26-08-2054(భావ,శ్రావణ,బహుళ అష్టమి) నాడు, నదీనదములు పొంగి పల్లెలు, పట్నాలు దెబ్బతింటాయి.

62) జులై-ఆగష్టు,2055 మధ్య ఒక ఆదివారమునాడు, తిరునల్వేలి వద్ద పండుగ జరుగుతూండగా, అకస్మాత్తుగ వరదలొచ్చి వేలకొద్దీ జనం దుర్మరణం పాలౌతారు.

63) ధాత(2056-57)నామ సంవత్సరము వచ్చేప్పటికి వైశ్యులలో 25 గోత్రాలవారు మాత్రమే మిగులుతారు.

64) తేది.03-02-2058(ఈశ్వర,మాఘ,శు.దశమి) నాటికి అన్ని దేశాలు శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంత రాయలవారి వశమౌతాయి. ఆ తేది నుండి సమస్త భూమండలాన్నీ శ్రీశ్రీశ్రీ స్వామివారు 108 సంవత్సరములు పరిపాలిస్తారు. శ్రీవారి వారసులు వెయ్యి ఏండ్లు పరిపాలిస్తారు.

65) బహుధాన్య(2058-59)లో 25 పట్టణాలలో రక్తపాతం. అంతర్గత కలహాలు, విపత్తులు.

66) పార్ధివ(2065-66)లో కర్నూలుకు ఉత్తరాన ఒక దేవాలయములో వున్న వేపచెట్టుకు నెల రోజులు పూజ చేస్తారు. ఆ తర్వాత ఆ చెట్టునుండి వచ్చే విషపు గాలివల్ల వేలాదిమంది మరణిస్తారు.

67) నైతిక విలువలు మృగ్యమౌతాయి. విశృంఖలత పెరుగుతుంది.

68.)గోల్కొండ వద్ద గోవిందాపురములో ఒక ఆవు మనిషికి జన్మనిస్తుంది.

69) బ్రాహ్మణులు సేవకా వృత్తితో జీవిస్తారు.

70) విశ్వబ్రాహ్మణులతో వచ్చిన ఒక వ్యాజ్యములో బ్రాహ్మణులు ఓడిపోతారు.

71) వన్యజీవులు ఊళ్ళ మీద పడి భీభత్సం సృష్టిస్తాయి.

72) రెండు బంగారు హంసలు ఊరూరా తిరుగుతాయి. వాటిని పట్టుకోవాలని చూసిన వారు అంధులౌతారు.

73) ఏనుగంత సైజులో ఉన్న ఎఱ్ఱ చీమలు భూమిమీద తిరుగుతాయి.

74) పంది కడుపున ఏనుగు జన్మిస్తుంది.

75) కొండపగిలి నిలువ నీడ లేక కనకదుర్గ కందిమల్లాయపల్లె చేరుతుంది.

76) అంగడిలో సరస్వతిని అమ్ముతారు.

77) సముద్రములు కలుషితమై జలచరములు చాలామటుకు నశిస్తాయి.

78) అహోబిళములోనున్న ఉక్కు స్తంభమునకు సన్నజాజులు పూస్తాయి.

79) పరుశురాములవారి లేక ఆచార్య నాగార్జునులవారి లేక సనారీవారి లేక సిధ్ధపురుషుల లేక పై అందరి శిష్యుడైన వ్యక్తి ఈ దేశ అప్పులు తీర్చి, నదీనదములను అనుసంధానము చేసి సస్యశ్యామలము చేస్తాడు.

80) మూడవ ప్రపంచయుధ్ధం ముగిసేనాటికి ఏడు ఊర్లకు ఒక ఊరు మిగులుతుంది.

81) తేది.09-04-2005(ఉగాది,పార్ధివ)నుండే శ్రీశ్రీశ్రీ వీరభోగ వసంతరాయల వారు తుది తీర్పులు ఇవ్వడం మొదలుబెట్టినారు. అవశ్య మనుభోక్తవ్యమ్ కృతంకర్మశుభాశుభం.

82) కాలజ్ఞాన గోవిందవాక్యము 19 ప్రకారము శ్రీ ఆల్లూరి సీతారామరాజు (శ్రీ అల్లూరి శ్రీరామ రాజు)బ్రిటీషువారిచే చంపబడలేదు. అదృశ్యుడైనట్లు మాత్రమే వుంది.

















































No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML