భారతదేశానికి హిందూ ధర్మానికి తేడా లేదు. భారతదేశనికి ఏదైనా గర్వకారణంగా చెప్పుకుంటే, దాని మూలం హిందూసంస్కృతిలోనే ఉంటుంది. హిందూ సంస్కృతిని పక్కనపెట్టి భారతదేశ గొప్పతనాన్ని గురించి చెప్పమంటే ఒక్క విషయం కూడా చెప్పలేరు. సున్నాను కనుక్కుని ఆర్యబట్టుడైనా, ఆయుర్వేద వైద్యశాస్త్రజ్ఞుడు శుశ్రుతుడైనా, మనం గొప్పగా చెప్పుకుంటున్న వారంతా హిందు విద్యావిధానంలో విద్యాభ్యాసం చేయడం వల్లనే, వేదవేదాంగాలను చదవడం వల్లనే అన్ని గొప్ప విషయాలను కనుగొన్నారు. భారతదేశ వైభవమంతా హిందూ ధర్మంలోనే ఉంది.
హిందూధర్మాన్ని, తమ మాతృభూమి భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం 800 ఏళ్ళుగా పొరాటం చేసిన ఘనత హిందువులకే దక్కుతుంది. మనం దేశం మీద పడ్డ అరబ్బులు ఎన్నో గ్రంధాలు తగలబెట్టినా, ఆంగ్లేయులు ఎన్ని ఆరచకాలకు పాల్పడినా హిందూ సమాజం తన అస్థిత్వాన్ని నిలబెట్టుకుంది. ఎంత మంది ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా, భారతదేశం ఏనాడు సంపూర్ణంగా విదేశియుల చేతిలోకి వెళ్ళలేదు. క్రైస్తవులైన ఆంగ్లేయులు అమెరికా వెళ్ళారు, అక్కడ ఉన్న రెడ్ ఇండియన్లను ఊచకోత కోసి, దోపిడికి పాల్పడ్డారు, తమ మతప్రచారం చేసుకున్నారు. ఆప్రికా వెళ్ళారు, అక్కడ కూడా అదే పరిస్థితి. 'మొదటవారు వచ్చినప్పుడు మా చేతుల్లో భూములు ఉన్నాయి, వారి చేతిలో బైబిలు ఉంది, రండి! కలిసి ప్రార్ధన చేద్దాం అన్నారు, అందరం కలిసి ప్రార్ధన చేశాం, కళ్ళు తెరిచి చూసేసరికి భూములు వాళ్ళ చేతిల్లోకి వెళ్ళాయి, బైబులు మా చేతిలోకి వచ్చింది' అని ఆప్రికా వాళ్ళే చెప్పుకున్నారు. మన దేశంలోనూ అదే జరిగింది. అంగ్లేయులు వచ్చేసరికి మన దేశంలో దళితుల వద్ద కూడా వందల ఎకరాల భూమి ఉండేవి, వాటిని లాక్కుని, వారిని పీడించి, పేదలను చేసి, స్కాటిష్ మిషనరీ దళిత అన్ని పదాన్ని ప్రయోగించి, తమ చేత మోసగింపబడ్డవారిని దళితులనీ, వారి పేదరికానికి, దరిద్రానికి కారణం వారి మస్థులైన అగ్రవర్ణ హిందివులేననీ, హిందువుల్లో భేదాభిప్రాయాలను సృష్టించే ప్రయత్నం చేశారు. బూటకపు ఆర్య-ద్రావిడ సిద్ధాంతాన్ని లేవదీసి, భారతీయుల్ని ఆత్మనూన్యతకు గురిచేసి, మతమార్పిడి చేసేందుకు కుట్రపన్నారు. అయినా అన్నిటిని తట్టుకుని భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.
కానీ అప్పటికి సంతృపి చెందని విదేశీశక్తులు, దేశాలు భారతదేశాన్ని ముక్కలు చేయడానికి, హిందు ధర్మాన్ని నాశనం చేయడానికి, తమ మత ప్రాబల్యాన్ని పెంచుకోడానికి, రాజ్యాధికారం పొంది భారతదేశాన్ని ఇతర దేశాలకు తాకట్టు పెట్టేందుకు ఎత్తులు వేస్తూనే ఉన్నాయి. దానికి ప్రధాన ఊతం మత మార్పిడిలే. ప్రతి ఏటా కొన్ని లక్షల మందిని మతమార్పిడి చేయాలని మిషనరీలు బహిరంగంగా టార్గెట్ పెట్టుకున్నాయి.
భారతీయులు, హిందువులు ఇప్పటికైనా మేల్కోవాలి. దేశంలో జరుగుతున్న అక్రమ మతమార్పిడులను అడ్డుకోవాలి. ఇతర మతస్థుల మతాచరణను గౌరవిస్తూనే, వారినే ఆదరిస్తూనే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. తోటి హిందువులను రక్షించాలి. హిందువులు, జైనులు, సిక్కులు ఐక్యమవ్వాలి. భారతీయులైన మన ముస్లింలను, మన క్రైస్తవులను విదేశీ కుట్రల్లో పావులు కాకుండా కాపాడుకోవాలి. మత మార్పిడిలను అరికట్టాలంటే ప్రతి హిందువు హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలి, అన్ని కులాల వారిని ఆదరించాలి. హిందూ ధర్మం శాశ్వతంగా వర్ధిల్లాలి.
జై శ్రీ రాం

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment