గాయత్రీమాతజయంతి..🙏
హిందూ పురాణాల ప్రకారం.. 'గాయత్రి మాత' జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షం ఏకాదశి రోజున జన్మించింది. గాయత్రీ జయంతిని ప్రతి ఏడాది జ్యేష్ట మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. ఈ ఏకాదశిని 'నిర్జల ఏకాదశి' అని కూడా అంటారు. నిర్జల ఏకాదశి అన్ని ఏకాదశులలో ఉత్తమమైనది. గాయంత్రీ జయంతి రోజున.. గాయత్రి మాతను పూజిస్తే అంతా మంచి జరుగుతుందని విశ్వసిస్తారు.
#గాయత్రీ జయంతి పూజ విధానం:
గాయత్రీ జయంతి రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేయాలి. అనంతరం ఇంట్లో దీపం వెలిగించి.. గంగాజలంతో అన్ని దేవతలకు అభిషేకం చేయాలి. ఆపై గాయత్రి మాతని ధ్యానిస్తూ.. గాయత్రీ మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి పూలు సమర్పిస్తూ గాయత్రీ తల్లిని ఆరాధించాలి. అమ్మకు సాత్విక వస్తువులు మాత్రమే సమర్పించాలి.
#గాయత్రీ మంత్రం:
ఓం భూర్భువ: స్వ: తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ధ్యో యో న: ప్రచోదయాత్
గొప్ప మంత్రం #గాయత్రీ మంత్రం:
హిందూ మతం ప్రకారం.. అన్ని మంత్రాలలో గొప్ప మంత్రం గాయత్రీ మంత్రం. గాయత్రీ మంత్రాన్ని పఠించే వ్యక్తి జీవితంలో సంతోషంగా ఉంటాడు. 24 అక్షరాలతో కూడిన గాయత్రీ మంత్రంలోని ప్రతి పదానికి ప్రత్యేక అర్థం ఉంది
No comments:
Post a Comment