
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 7 January 2017
మహాస్వామి వాక్కు
మహాస్వామి వాక్కు
అది ఉషోదయ కాలం. అప్పట్లో పరమాచార్య స్వామివారు ఉదయం పూటలో పల్లకిలో ఒక పల్లెనుండి మరొక పల్లెకు సంచరించేవారు. అది కుంబకోణం దగగ్ర చిన్న పల్లెటూరు. మహాస్వామివారు ప్రయాణిస్తున్న మార్గంలో కొంతమంది ఆ పల్లెటూరి ప్రజలు కొద్దిగా త్వరపడుతూ వస్తున్నారు. మహాస్వామివారిని చూడగానే వారందరూ నేలపై పడి సాష్టాంగం చేశారు. విషయం ఏమిటని అడుగగా వాళ్లలో ఒకరి భార్య ప్రసవ వేదన పడుతున్నందున పక్క ఊర్లో ఉన్న మంత్రసానిని తీసుకుని రావడానికి వెళ్తున్నామని, ఇది ఆమెకి ఎనిమదవ కాన్పు అని నాగ దోషం వలల్ ఏడు కాన్పుల్లో పిల్లలు చనిపోయారని చెప్పారు.
మహాస్వామివారు ఇదంతా విని ఆ భర్త బాధను అర్థం చేసుకొని అతనితో, “అంతా ఆ భగవంతుని అనుగ్రహం. ఏమీ దిగులు పడాల్సిన పని లేదు. భయపడకు. మంత్రసాని వచ్చే లోపలే నీ భార్య బిడ్దని ప్రసవించి ఉంటుంది. తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమమే. కనుక ఇప్పుడు నువ్వు తండ్రివయ్యావు. తిన్నగా ఇంటికి వెళ్ళు. బిడ్డకే దోషమూ లేదు మరియు బిడ్డకు దీర్ఘాయుష్షు కలదు.” అని చెప్పారు.
అతను చాలా సంతోషపడి, మహాస్వామివారి అనుగ్రహానికి పాత్రుడైనందుకు ఎంతో గర్వంగా, ఉత్సాహంతో స్వామికి సాష్టాంగం చేశాడు. ఇంటికి వెళ్ళగా, స్వామివారు చెప్పినట్టుగానే అంతా జరిగింది. ఆ బిడ్డ తరువాతి కాలంలో గొప్ప విద్యావంతుడై, అపార జ్ఞానసంపన్నుడై సదరన్ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి అయ్యాడు.
అతనికి పరమాచార్య స్వామివారి పరిపూర్ణ కటాక్షం ఉంది అనడంలో ఏమి సందేహము లేదు.
--- శ్రీ సుదర్శనానంద గారి ‘జ్ఞాని’ నుండి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment