
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 7 January 2017
తిరుమలనంబి నిత్యం పాపనాశనానికి వెళ్తారు , వారికి శ్రమ. అనిపించదు ,
తిరుమలనంబి నిత్యం పాపనాశనానికి వెళ్తారు ,
వారికి శ్రమ. అనిపించదు ,
స్వామి కైంకర్యమే మహాదానందం ,
నీటికుండ. నెత్తికి ఎత్తుకొని కోవెలకు చేర్చేవాడు ,
పరమభాగవతోత్తముడైన. తిరుమలనంబి శ్రమకు
స్వామికి అలసట. ! స్వామి నంబి శ్రమను
తీరదలిచాడు , వేటబాలుడైనవాడు
ధనుర్బాణాలు ధరించాడు , నంబి తీర్థం తెచ్చే
దారిలో చెట్టునీడన. కూర్చున్నాడు ....
స్వామివారికి నంబి తీర్థం తెస్తున్నది చూచాడు ,
స్వామి నంబిని దాహంగా ఉంది గుక్కెడు నీళ్ళు
" పోయండి స్వామి " అన్నాడు ,..
" బాలకా ! ఇది దివ్యజలం
స్వామి అభిషేకపు జలమిది నీవు అడగరాదు
నేనివ్వరాదు , అన్నాడు నంబి ,..
తాతా ! నీరు పోసి ప్రాణం రక్షించవా ? అన్నాడు ,
నీ దాహం తీర్చాల్సినవాడు భగవంతుడు బాలకా !
ప్రార్థించు అతడే రక్షకుడు , ప్రాణరక్షకుడు ,
నాకు సమయాతీతం అవుతున్నదని
వేగంగా అడుగుసాగించాడు స్వామి ,
కుండకు బాణం కొట్టాడు దానికి చిల్లు పడింది
నీటి ధార. సాగింది ,
స్వామి దోసిటితో నీరు త్రాగసాగాడు .
కుఖడ. తేలిక అయింది తిరుమల నంబి తిరిగి చూచాడు
బాలుడు చేత. బాణం ! కుండకు రంధ్రం !
చిల్లికుండనుంచి చివరి నీటిబొట్టు !
నంబి హతాశుడైనాడు కూలబడ్డాడు ,
శ్రీస్వామికి అపచారం అని గొల్లుమన్నాడు ,
కన్నీరు కాలువ. కట్టింది ,
స్వామి నివ్వెరపోయాడు ! ఎంతటి భక్తి !
భగవంతుని కన్నీరు భగవంతుని బాష్బమైంది ,
" తాతా ! లే ! నీకు పవిత్రజలం చూపుతాను "
అన్నాడు , నంబి చేయిపట్టుకొని లేపి
రెండేరెండు అడుగుల్లో కొండచరియకు చేరాడు ,
స్వామి బాణం ఎక్కుపెట్టాడు , కొండకు కొట్టాడు ,
మిరమిట్లు మెరుపు ! కొండనుంచి జలధార. !
ఆకాశగంగ. ! ....
తిరుమలనంబికి తెలివి వచ్చింది , జలధార. !
బంగారుబిందె మరొకరు వినలేదు కనలేదు ,
కాలాతీతం కాకూడదు , తీర్థంతో ఆలయానికి
చేరుకున్నాడు , అంతా చకితులయ్యారు ,
నంబి గమనించలేదు .
నాటి నుంచి ఆకాశగంగ. తీర్థంతోనే
శ్రీవేంకటేశ్వరస్వామికి అభిషేకం జరుగుతుంది ,
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment