
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 7 January 2017
భక్త హాథిరాం బావాజీ
భక్త హాథిరాం బావాజీ
పర్ణ అంటే ఆకులు అని అర్థం. తిరుమల దేవాలయం నుంచి పాపనాశిని ఆకాశగంగకు వెళ్లే
మార్గంలో పరమ భక్త హాథిరాం బావాజీ సమాధి వుంది. దీన్ని హథీరాం మఠం అని అంటారు. ఈ
దేవాలయానికి వచ్చే భక్తులకు ప్రసాదాన్నిఅందిస్తారు. ప్రసాదాన్ని ఆకు రూపంలో ఇస్తారు.
ఆకు అంటే సామాన్యమైన ఆకు అని అనుకోవద్దు. ఆ ఆకు సామాన్యమైంది కాదు. ఆ
ఆకు సంజీవని చెట్టుది (సంజీవని ఆకు) ఈ సంజీవిని ఆకును తింటే దేహంలోని అన్ని
రోగాలు నయమవుతాయి. వీటిలో రెండు రకాల ఆకులు ఉన్నాయి.
1. సంజీవిని
2. అమృత సంజీవని
సంజీవిని చెట్టు పేరు విన్నంతలోనే మీకు రామాయణంలోని యుద్ధకాండ ప్రకరణంలో
హనుమంతుడు సంజీవని అనే పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుడిని బతికించిన
వైనం గుర్తుకు వైనం వచ్చి తీరుతుంది. ఈ సంజీవని చెట్టు ఆకులను తిని
హాథీరాం మహరాజు (బావాజీ) జీవితం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నందున ఈ క్షేత్రానికి వచ్చే
భక్తులు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరికి సంజీవని ఆకును ఇస్తారు.
అందుకే ఈ ప్రసాదానికి పర్ణ ప్రసాదమని పేరు ఈ సంజీవని ఆకును ఎవరు తింటారో వారి
రోగాలన్నీ తొలగిపోతాయి. సంజీవని ఆకుకు, అమృత సంజీవని ఆకుకు ఉన్న తేడా ఏమిటి?
సంజీవని ఆకులానే అమృత సంజీవని ఆకు కూడా ఉంటుంది. అమృత సంజీవని ఆకును నోటిలో
ఉంచుకుని పీల్చుకుంటే నోట్లో నీటి అంశం ఎక్కువ ఉంటుంది. ఈ నీరు అమృత సమానమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. అమృత సంజీవని ఆకును ఒక గుప్పిట అంత నీటితో శుభ్రపరిచి
ప్రతిరోజు ఉదయం ఆరు గంటల్లోపు తింటే అసాధ్యమనుకున్న రోగాలైన క్యాన్సర్, గుండె నొప్పులు, ఆస్తమా, మధుమేహం తదితర వ్యాధులు నయం అయిన ఘటనలు చాలా ఉన్నాయి
ఈ చెట్టు బెంగళూరులోని లాల్బాగ్, కబ్బన్ పార్క్ మల్లేశ్వరంలోని అటవీ విభాగం నర్సరీలో
లభిస్తుంది. పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో
మాలను చేసి ఆంజనేయస్వామికి వేస్తారు. అనంతరం తమలపాకు భక్తులకు ప్రసాదం ఇస్తారు.
దీనికి కూడా పర్ణ ప్రసాదమనే పేరు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment