30 డిసెంబర్ (1943) అండమాన్లో తిరంగానెగురవేసిన నేతాజీ
భారత ప్రధాన భూభాగానికి సుమారు 700 కి మీ దూరంలో బంగాళాఖాతం మధ్యనగల అండమాన్, నికోబార్ ద్వీపాల సమూహం ఆగస్టు 15 (1947)కంటే పూర్వమే బ్రిటిష్ నుంది స్వేచ్చ పొంది జాతిపతాకం రెపరెపలాడుతూ ఎగిరిందనీ, భారత స్వాతంత్ర్య సమర పోరాటానికి కీలకంగా నిలిచిందనే విషయం తగినంతగా ప్రాచుర్యం పొందలేదు. ప్రధాన ద్వీపాలైన అండమాని,నికోబార్లకు నేతాజీ సుభాష చంద్ర బోస్ షాహీద్, స్వరాజ్లు గా నామకరణం చేశాడనే విషయం కూడా చాలామందికి తెల్యదు.
రెండవ ప్రపంచ యుధ్ధం 1942లో ఉధృతంగా జరుగుతూంది. ఆక్సిస్ కూటమిలో భాగస్వామియైన జపాన్ ఆసియాలో యూరప్ వలసవాదుల ప్రాంతాలనన్నింటినీ దునిమేస్తూ అప్రతిహతంగా విజయపధంలో దూసుకుపోతున్నది. జపాన్ నౌకాదళాలు తూర్పు హిందూమహాసముద్రంలొని సింగాపూర్, బర్మా వంటి పలుప్రాంతాలను అదుపులోకి తీసుకున్నది. ఇక బ్రిటిష్ ఆధీనంలోని భారత భూభాగంపై దాడిచేయడమే తరువాయిగా మిగిలింది.
ఈ ఉద్విగ్న దశలో నేతాజీ తన ప్రఖ్యాత జర్మనీ- సింగపూర్ జలాంతర్గామి ప్రయాణాన్ని చేశాడు. సింగాపూర్లో అకుంఠిత దేశభక్తులతో ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పర్చడంతొపాటు ప్రవాస ‘ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని’ కూడా ప్రకటించాడు. భారతభూభాగంపై 1943లోనే జాతీయపతాకం ఎగురవేధ్ధామని అప్పుడే ప్రకటించాడు.
జపాన నౌకాదళం 23 మార్చ్ (1942)న అండమాన్ నికోబార్ ద్వీపాలను బ్రిటిష్ సైనికులనుండి ఎటువంటి ప్రతిఘటనలేకుండా స్వాధీనం చేసుకుంది. సెల్యూలర్ జైలులో ఖైదీలుగానున్న భారత సైనికులకు ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరడానికి అవకాశమివ్వగా పలువురు చేరిపోయారు. రాజకీయ ఖైదీలు విడుదలయ్యారు. అక్కడి బ్రిటిష అధికారులు సైనికులను ఖైదీలుగా బర్మా పంపించారు.
ఈ ద్వీపసముదాయాన్ని జపాన్ తమాఅధీనంలోకి తీసుకోవడం రెండవ ప్రపంచ యుధ్ధంలో ప్రత్యేకించి ఆక్సిస్ శక్తులకు ఒక కీలక ఘట్టం. ప్రవాస భారత ప్రభుత్వాధికారులు నేతాజీ ఆక్సిస్ కూటమితో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. అండమాన్ నికోబార్ దీవులు ఆక్సిస్ కూటమి చేజిక్కించుకున్న మొదటి భారత భూభాగం. ఈప్రాంతాన్ని డిసెంబర్ 30 (1943) న సందర్శించిన నేతాజీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అండమాన్కు షాహీద్గానూ, నికోబార్కు స్వరాజ్ గానూ నామకరణం చేశారు. ఇండియ్యన్ నేషనల్ ఆర్మీ జనరల్ లోకనాధాన్ని గవర్నర్గా నియమించాడు. బ్రిటిషనుండి విముక్తమైన తొలి భూభాగంగా అండామాన్ నికోబార్ దీవులు చరిత్రకెక్కాయి.
దేశ ప్రజలకు తానిచ్చిన హామీ మ్మేరకు 1943 సం.లోనే జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు.
కానీ ఆగస్టు 18 1945 న నేతాజీ అనుమానాస్పద అదృశ్యం తర్వాత అక్టోబర్ (1945)లో బ్రిటిష్ తెరిగి ఆదీవులను అదుపులోకి తెచ్చుకున్నది. న్
దేశవిముక్తికోసం నేతాజీ కృషిని స్మరింఛుకొని ఈ సమాచారాన్ని మనమిత్రులతో పంచుకోవడం మనందరి కనీస బాధ్యత.
No comments:
Post a Comment