What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 24 January 2016

నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటే... గోమాత గురించి కొన్ని నిజాలు చెబుతా

''గోభిస్తుల్యం నపశ్యామి ధనంకించిదిహాచ్యుత''
- గోవుతో సమానమైన సంపద లేదు.
''కోడి,మేక,లాగా గోవు కూడా జంతువే కదా అలాంటప్పుడు దాన్ని కోసుకుని తింటే తప్పేంటి'' అని అడ్డంగా వాదిస్తున్న ఓ అజ్ఞానుల్లారా.....
గోవు కూడా జంతువే కానీ....
ప్రపంచంలో మరే జంతువుకూ లేని (చివరకు మనిషిగా పుట్టిన నీకూ,నాకూ కూడా లేని) చాలా ప్రత్యేకతలు గోవుకుంది.
అందుకే హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి ''గోమాత'' అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు.
నీ చదువు...
నీ సంస్కారం...
నీ విచక్షణ...
నీ విజ్ఞత...
నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటే...
గోమాత గురించి కొన్ని నిజాలు చెబుతా
* ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని..ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమో అని ..
ఒక ఆవుకు ప్రతిరోజూ ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తరువాత దాని రక్తాన్ని,పాలను,మూత్రాన్ని, పేడను ప్రయోగశాల(Lab )కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసుందో పరీక్షించారు.
అలా ఒకరోజు,రెండ్రోజులు కాదు...ఏకంగా తొంభై రోజులు(మూడు నెలలు) ఢిల్లీ లోని ఎయిమ్స్(All India Institute of Medical Science ) కు పంపి పరీక్షించారు.
ఆ ఆవు పాలలోగానీ,రక్తంలోగానీ,మూత్రంలోగానీ,పేడలోగానీ విషపు ఛాయలేవీ కనిపించలేదు వారికి.
మరి వీరు తొంభైరోజులు ఎక్కించిన విషమంతా ఏమయినట్టు?
గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత.
మరే జంతువుకూ లేని విశిష్టగుణం ఇది.
* ప్రాణవాయువు(Oxygen )ను పీల్చూకుని ప్రాణవాయువు(Oxygen )ను వదిలే ఏకైక ప్రాణి.
* విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది.
* వైద్యశాస్త్రానికే అర్థంకాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టగల శక్తి గోమాతది.
* ఆవునెయ్యి,బియ్యం రెండూ కలిపి వేడిచేస్తే ఇథలిన్ ఆక్సైడ్,ప్రోపలీస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి.
* కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలీస్ ఆక్సైడే శ్రేష్టమైనది.
* గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని.
* గోవుపేడ, మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు.
* ఇళ్ళను,వాకిళ్ళను ఆవుపేడతో అలికితే రేడియోధార్మిక కిరణాలనుండి మనల్ని కాపాడుకోవచ్చు.
* ఆవుపేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది.
* ఒక తులం నెయ్యిని అగ్ని(యజ్ఞం)లో వాడితే ఒక టన్ను ప్రాణవాయవు(Oxygen )ఉత్పత్తి అవుతుంది.
* గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది.
''గోరక్షణ వల్లనే మన జాతి,మన ధర్మము రక్షింపబడును.గోరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఏ మాత్రమూ తక్కువ కాదు''.
- గాంధీజీ.
''ఆవుపాలలో రసాయన్,ఆవునెయ్యిలో అమృతం ఉంది.దాని మాంసం తింటే రోగిస్టులు అవుతారు''.
- మహ్మద్ ప్రవక్త.
''ఒక గోవును చంపితే ఒక మనిషిని చంపినట్టే''.
- ఏసుక్రీస్తు.
''గో క్షీరము గొప్పమందు.దాని నెయ్యి గొప్ప ఆరోగ్యప్రదాయిని.దాని మాంసము రోగకారకము''.
- హజరత్ మహమ్మద్.
''గోవులు మానవ సమాజమునకు ఒక గొప్పవరము.ఎక్కడ గోవులు చక్కగా పోషించబడుచూ రక్షింపబడునో ఆ దేశపుభూములు గొప్పగానుండును.గృహములు ఉన్నతి చెందును.నాగరికత పురోగమించును''.
- బర్మార్డ్ మేక్ ఫెడన్.
''మహ్మదీయుల మత గ్రంధమైన ఖురాన్ లో ఎక్కడనూ గోవధ సమర్థింపబడలేదు''.
- హకీల హజ్మల్ ఖాన్.
''గో హత్య ఇస్లాం మత నియమములకు విరుద్ధం''.
- తోహస్-వి-హింద్ బిజహరు.
భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచంలో ఒక్క భారతదేశంలో తప్ప మరెక్కడైనా చూడగలవా?
నువ్వు హిందువైనా, మస్లీమువైనా,క్రిస్టియన్వైనా నాదేశంలో ఉన్నంతవరకూ భారతీయుడివి.
నా దేశ సంస్కృతి,సాంప్రదాయాలను గౌరవించడం నీ ధర్మం.
స్వేచ్ఛంటే....
''నీకు నచ్చినట్టు బ్రతకడం కాదు''
''నా(నీ,ఈ)దేశం మెచ్చేటట్టు బ్రతకడం''
''వందేగోమాతరం''
Read More

భగవంతుని అవతారములు:



భగవంతుని అవతారములు:

పరమాత్మ నీవు గుర్తుపడితే ఇరవైరెండు రూపములు ప్రధానమయినవిగా వచ్చాడు. ఆ ఇరవైరెండు రూపములు గురించి వింటే నీకు ఈశ్వరుడు ఎంత ఉపకారం చేశాడో అర్థం అయిపోతుంది.” అన్నాడు సూతుడు. అలా ఎక్కడ వచ్చాడో చెప్పమని శౌనకాది మహర్షులు పరమానందంతో అడిగారు.


అపుడు ఆయన అన్నారు – ’క్షీరసాగరమునందు శయనించి లోకుల అన్ని విషయములను యోగనిద్రలో తెలుసుకుంటున్న మూర్తిగా శంఖచక్రగదాధరుడై నాభికమలమునుండి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టగా, ’కదిలిన బాహుపదంబుల కంకణ రవముసూప’ అంటారు పోతనగారు – ఇలా చేతులు కదులుతుంటే ఆయన వేసుకున్న మణికంకణములు ధ్వనిచేస్తుంటే, ఆయన పాదమును లక్ష్మీదేవి ఒత్తుతున్నప్పుడు ఆ పాదములకు పెట్టుకున్న నూపురముల ధ్వని కలుగుతుంటే, పచ్చని పీతాంబరము కట్టుకొన్నవాడై, తెల్లటి శంఖమును చేతిలోపట్టుకొని, కుడిచేతిలో చక్రం పట్టుకొని, గద పట్టుకొని, పద్మం పట్టుకొని, శేషుని మీద పడుకున్న ఆ శ్రీమహావిష్ణువు వున్నాడే శ్రీమన్నారాయణుడు – ఆ శ్రీమన్నారాయణుడు ఈ లోకమంతటికీ ప్రధానమయిన స్వామి. అటువంటి స్వామి, ఆ నారాయణ తత్త్వము, ఆ నారాయణమూర్తి అందరికీ గోచరమయ్యేవాడు కాదు. ప్రతివాడి మాంసనేత్రమునకు కనపడడు. అది ఎవరో యోగులు – జీవితములలో మాకు సుఖములు అక్కర్లేదని తలచివవారైమ్ ఇంద్రియములను గెలిచినవారై తపస్సుచేసి కొన్నివేల జన్మలు భగవంతునికోసం పరితపించిపోయిన మహాపురుషులు, ఎక్కడో ధ్యానసమాధిలో ఈశ్వరదర్శనం చేస్తున్నారు. అది మొట్టమొదటి తత్త్వం. అది ఉన్నది. దానిలోంచి మిగిలినవి అన్నీ వచ్చాయి. అది అవతారము కాదు. అది ఉన్న పదార్థము. అది మైనము. ఇపుడు ముద్దకట్టి దాంట్లోంచి ఎన్ని బొమ్మలయినా చేయవచ్చు.

అసలు ఉన్నది ఏది? నారాయణుడు. ఈ సృష్టి జరగడానికి నారాయణుని నాభికమలంలోంచి మొదట వచ్చినది చతుర్ముఖ బ్రహ్మగారు. నాలుగు ముఖములతో వేదం చెపుతూ శ్రీమన్నారాయణుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం సృష్టిచేసిన వాడెవడో అది మొట్టమొదటి అవతారం. ఆయనే చతుర్ముఖ బ్రహ్మగారు.
ఆ చతుర్ముఖ బ్రహ్మగారి తరువాత వచ్చిన అవతారం ఈ భూమినంతటినీ తీసుకువెళ్ళి తనదిగా అనుభవించాలనే లోభబుద్ధితో ప్రవర్తించిన హిరణ్యాక్షుని వధించడానికి వచ్చిన యజ్ఞ వరాహమూర్తి రెండవ అవతారము.
మూడవ అవతారము – సంసారమునందు బద్ధులై, కర్మాచరణం ఎలా చెయ్యాలో తెలియక కామమునకు, అర్థమునకు వశులైపోయిన లోకులను ఉద్ధరించడం కోసమని చతుర్ముఖ బ్రహ్మగారిలోంచి పైకివచ్చిన మహానుభావుడైన నారదుడు.

బ్రహ్మగారితోపాటు వచ్చినవారు సనకసనందనాదులు. నారదుని అవతారం తరువాత వచ్చినది సాంఖ్యయోగం చెప్పినటువంటి కపిలుడు. విశేషంగా వేదాంతతత్త్వమునంతటిని చెప్పాడు. కపిలుని అవతారము తరువాత వచ్చిన అవతారము దత్తావతారము. దత్తాత్రేయుడై అనసూయ అత్రి – వారిద్దరికి జన్మించి మహాపురుషుడై, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయిన బ్రహ్మవిష్ణు మహేశ్వరుల తత్త్వముతో కూడినవాడై జ్ఞాన ప్రబోధంచేసి ప్రహ్లాదాదులను ఉద్ధరించిన అవతారము ఏది ఉన్నదో అది దత్తాత్రేయస్వామి వారి అవతారము. కపిలుడు దత్తుడు అయిపోయిన తరువాత వచ్చిన అవతారము యజ్ఞావతారము. యజ్ఞుడు అనే రూపంతో స్వామి ఆవిర్భవించాడు.

ఆ తరువాతి అవతారమునకు వచ్చేటప్పటికి ఋషభుడు అనే పేరుతో మేరుదేవి, నాభి అనబడే ఇద్దరి వ్యక్తులకు స్వామి ఆవిర్భవించారు.
తరువాత ఈ భూమండలమును ధర్మబద్ధంగా పరిపాలించడానికి చక్రవర్తి రూపంలో ఉద్భవించమని భక్తులు అందరు ప్రార్థనచేస్తే పృథుచక్రవర్తిగా ఆవిర్భవించాడు. ఆ రోజున భూమినంతటినీ గోవుగా మార్చి పృథుచక్రవర్తి ఓషధులను పిండాడు.

తరువాత వచ్చినది మత్స్యావతారము. మత్స్యావతారములో సత్యవ్రతుడు అనబడే రాజు రాబోయే కాలములో వైవస్వతమనువుగా రావాలి. ప్రళయం జరిగిపోతోంది. సముద్రములన్నీ పొంగిపోయి కలిసి పోయాయి. భూమి అంతా నీటితో నిండిపోయింది. ఇక ఉండడానికి ఎక్కడా భూమిలేదు. అప్పుడు ఈ భూమినంతటినీ కలిపి ఒక పడవగా చేసి తాను మత్స్యమూర్తిగా తయారయి పెద్దచేపగా మారి తనకు ఉండే ఆ మూపుకి ఈ పృథివిని పడవగా కట్టుకుని అందులో సత్యవ్రతుణ్ణి కుర్చోబెట్టి లోకములన్నీ ప్రళయంలో నీటితో నిండిపోతే ఆ పడవను లాగి, ప్రళయాన్ని దర్శనం చేయించి వైవస్వత మనువుని కాపాడిన అవతారము మత్స్యావతారము.

తదనంతరము క్షీరసాగరమథనం జరిగింది. అందులో లక్ష్మీదేవి పుడుతుంది. లక్ష్మీకళ్యాణం జరుగుతుంది. లక్ష్మీకళ్యాణఘట్టమును ఎవరు వింటారో వాళ్ళకి కొన్నికోట్ల జన్మలనుండి చేసిన పాపము వలన అనుభవిస్తున్న దరిద్రం ఆరోజుతో అంతమయిపోతుంది. లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. క్షీరసాగరమథన సమయంలో మందరపర్వతం క్షీరసాగరంలో మునిగిపోకుండా స్వామి కూర్మావతారం ఎత్తాడు.కూర్మావతారం వచ్చిన తరువాత వచ్చిన అవతారం మోహినీ అవతారం దేవతలకు, దానవులకు మోహినీ స్వరూపంతో అమృతమును పంచిపెట్టాడు. మోహినీ అవతారము తరువాత వచ్చినటువంటి అవతారము నరసింహావతారము. ఈ అవతారములో స్వామి హిరణ్యకశిపుడిని వధించాడు.

నరసింహావతారము తరువాత వచ్చిన అవతారము వామనావతారము. ఇప్పుడు చెప్పుకుంటున్న అవతారక్రమము మనువుల కాలగతిని బట్టి చెప్పుకుంటూ వెళ్ళడం జరుగుతోంది. ఆ రోజున స్వామి పొట్టివాడై బలిచక్రవర్తి దగ్గర అర్థించాడు. వామనమూర్తి కథ వింటే ఆ ఇళ్ళల్లో జరిగిన శుభకార్యములు వైదికంగా పరిపూర్తి చేయకపోయినా, తద్దినం సరిగా పెట్టకపోయినా, తద్దోషం నివారించి ఆ కార్యం పూర్ణం అయిపోయినట్లుగా అనుగ్రహించేస్తాడు. అంత గొప్పకథ వామనమూర్తి కథ.

వామనావతారము తరువాత వచ్చిన అవతారము పరశురామావతారము. గండ్రగొడ్డలి పట్టుకుని ఇరువతి ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి క్షత్రియులను సంహరించాడు. పరశురామావతారము తరువాత వచ్చిన అవతారము వ్యాసావతారము.
కలియుగంలో జనులు మందబుద్ధులై ఉంటారని వేదవిభాగం చేసి ఉదారముగా పదునెనిమిది పురాణములను వెలయించిన మహానుభావుడుగా వ్యాసుడై వచ్చాడు.
వ్యాసావతారము తరువాత వచ్చిన అవతారము రామావతారము. రామావతారములో సముద్రమునకు సేతువుకట్టి దశకంఠుడయిన రావణాసురుణ్ణి మర్దించి ధర్మసంస్థాపన చేసి లోకులు ధర్మముతో ఎలా ప్రవర్తించాలో నేర్పిన అవతారము రామావతారము.

రామావతారము తరువాత వచ్చిన అవతారము బలరామావతారము.
బలరామావతారము తరువాత వచ్చిన అవతారము కృష్ణావతారము.

కృష్ణావతారము తరువాత వచ్చిన అవతారము బుద్ధావతారము. దశావతారములలో బుద్ధావతారము కలియుగ ప్రారంభమునందు కీకటదేశము అనబడు మగధ సామ్రాజ్యమునందు దేవతలపట్ల విరోధభావనతో వున్న రాక్షసులను మోహింపచేయడానికి వచ్చిన అవతారము. మీరు అనుకుంటున్న వేరొక బుద్ధావతారము గురించి వ్యాసుడు ప్రస్తావన చేయలేదు.

బుద్ధావతారము తరువాత వచ్చే అవతారముగా వ్యాసుడు నిర్ధారించిన అవతారము కల్కిఅవతారము. కల్కిఅవతారము ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్లుగా కలియుగం ప్రథమపాదంలో వస్తోందని వ్యాసుడు చెప్పలేదు. కలియుగం అంతం అయిపోయేముందు యుగసంధిలో కాశ్మీరదేశంలో ఉన్న విష్ణుయశుడు అని పిలవబడే ఒక బ్రాహ్మణుడి కడుపున స్వామి ఆవిర్భవిస్తారు. ఆయన అవతారం రాగానే సవికల్పసమాధిలో ఉన్న యోగులందరూ పైకిలేస్తారు. అపుడు ఖడ్గమును చేతపట్టుకొని తెల్లటి గుర్రంమీద కూర్చుని ప్రజలను పీడించి ధనవంతులయ్యే పరిపాలకులనందరిని సంహరిస్తారు. యుగాంతం అయిపోతుంది. మరల క్రొత్త యుగం ప్రారంభమవుతుంది. కల్కి అవతరం యుగసంధిలో వస్తుంది.

ఇలా ఇరవై రెండు అవతారములను స్వామి స్వీకరించబోతున్నారు. దీనిని వ్యాసుడు ఎప్పుడు చెప్తున్నారు? కృష్ణావతార ప్రారంభమునందు భాగవతమును రచిస్తున్న సమయంలో భూతభవిష్యద్వర్తమాన కాలజ్ఞానము ఉన్నవాడు కాబట్టి వ్యాసుడు ఈ విషయములను చెప్పగలుగుతున్నాడు. వ్యాసుడు అంటే సాక్షాత్తు నారాయణుని అంశ. మహానుభావుడు. ఇలా స్వామి ఇరవై రెండు అవతారములలో విజయం చేస్తున్నారు. అయితే అవతారములు ఈ ఇరవై రెండేనని మీరు అనుకుంటే పొరపాటు పడినట్లే! కొన్ని ప్రధానమయిన విషయములు మాత్రమే ప్రస్తావన చేయబడ్డాయి.
’అజాయమానో బహుధావిజాయతే” ఆయనకు అసలు ఒక రూపమును తీసుకోవలసిన అవసరం లేదు. అటువంటి స్వామి ఈ కంటితో చూడడానికి వీలయిన రూపమును పొందాడు. దేనికోసం? ఆయనే చెప్పారు.

“పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే
Read More

పద్మాక్షి అమ్మవారు, వరంగల్ జిల్లా

ఇది "హన్మకొండ" పట్టణం "వరంగల్" జిల్లాలోని "పద్మాక్షి అమ్మవారు" ఈ అమ్మవారు చాల మహిమ గలది. ఇ అమ్మవారిని పూర్వం "కాకతీయులు" కూడా కొలిచె వారు అని శాసనం ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది.


Read More

అప్పుడే పుట్టిన బిడ్డ ఎందుకు ఏడుస్తుందో మీకు తెలుసా...????



అప్పుడే పుట్టిన బిడ్డ ఎందుకు
ఏడుస్తుందో మీకు తెలుసా...




అమ్మ కడుపులో ఉన్న ఆ 10 నెలలు
లయబద్ధకంగా వినపడే గుండె చప్పుడును
వింటూ తన్మయం చెందుతూ ఉంటుంది.....
ఆ చప్పుడులో తనను తాను మరచిపోయి ఆ
చప్పుడే తనకు రక్షణగా భావిస్తూ ఉంటుంది...
బయటి ప్రపంచంలోకి రాగానే ఆ చప్పుడు దూరమై
తనకు ఏదో అవుతోంది
అని భయంతో వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆ బిడ్డ ఆ
ఏడుపు ఆ తల్లి
ఒడిలోకి చేరగానే ఆపేస్తుంది గమనించండి.......
తల్లి తనను దగ్గరకు తీసుకోగానే మళ్ళి ఆ గుండె
చప్పుడు విని తనకు ఏమీ భయం లేదని ఆ
బిడ్డకు తెలిసిపోతుంది.......
నిజంగా తల్లిమీద ఆ పసికూనకు ఎంత నమ్మకమో
కదా...
అమ్మ ప్రేమకు అనురాగానికీ సాటి లేదు చివరికి తన
గుండె చప్పుడు కూడా ఆ బిడ్డకే...
Read More

’శివాలయ దర్శన విధానం”

’శివాలయ దర్శన విధానం”
సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చెసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందుకే,శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్సించినట్లే అని చెప్పబడింది.
శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు, నాలుగు దిక్కులని చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ద్వముఖమై (పైకి చూస్తు/ఆకాశం వైపు చూస్తూ) ఉంటుంది.
5 ముఖాలకి, 5 పేర్లు న ిర్దేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చొని అయినా,పూజ చేయోచ్చు అంటారు.
శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది, కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది, పశ్చిమాభి ముఖమైన శివాలయం. అంటే, మీరు,గుడిలోకి వెల్లగానే, శివలింగం పశ్చిమం వైపు చూస్థూ ఉంటుంది.. అలా శివలింగంకి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమం వైపు ఉన్నా, లేదా, శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా, దానిని, సద్యోజాతజాత శివలింగం అని అంటారు.
అప్పుడు మనం తప్పకుండా,అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, ఓం సద్యోజాత ముఖాయ నమః అని అనాలి.శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం, సద్యోజాత శివలింగం.
శివలింగం, తూర్పు వైపుకు చూస్తూ ఉంటే, అటువంటి శివలింగాన్ని, తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది.. తిరోదానము అంటే చీకటిలో ఉంచటం. అది, మనల్ని మాయ చేత కప్పబడిస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది..
ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాం.. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం.సద్యోజాత ముఖం పూజించ తగినదే,ఏ మాత్రం అనుమానం లేదు.. మనల్ని రక్షించినా,శిక్షించినా, అన్ని ఆ పరమేశ్వరుడేగా.
తూర్పుని చూస్తూ ఉండె శివలింగం, వాయువు (గాలి) మీద అదిష్టానం కలిగి ఉంటాడు.. ...
మనకు ప్రతీ శివాలయంలోనూ ఈ 5 ముఖాలు ఉంటాయి.. శైవాగమనంలో చెప్పినట్లుగా, మనం తప్పకుండా, శివాలయంలో, ఏ దిక్కు వైపు వెలితే,ఆ శివలింగం పేరుని స్మరించాలి.
5ముఖాలు, మనకు 5 ఫలితాలని కలుగచేస్తాయి. ఆ 5 ముఖాలలో నుండే, స్ర్రుష్టి, స్థితి, లయ,తిరోదానము,అనుగ్రహము(మొక్షము) ఇవ్వబడతాయి.. అన్ని ముఖాలు,పూజనీయమైనవే.. అన్ని ముఖాలని మనం పుజించి తీరాల్సిందే.శివలింగం, దక్షిణం వైపు చూస్తూ ఉంటే, అటువంటి ముఖం, దక్షిణామూర్తి స్వరూపం. మనకు, శివాలయంలో, దక్షిణం ని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉంది తీరాలి. అసలు, దక్షిణామూర్తి విగ్రహం లేకుండా, శివాలయాలు కట్టకూడదు.
శివలింగం, దక్షిణానికి చూసే ముఖాన్ని, దక్షిణామూర్తి స్వరూపంగా, చూడమని చెప్తారు. ఆ ముఖాన్నే, అఘోర ముఖం అంటారు. ఈ అఘోర ముఖం , అగ్నిహోత్రానికి అంతటికీ, అధిష్టానం అయ్యి ఉంటుందిఈ సమస్త ప్రపంచాన్ని,లయం చేసే స్వరూపమే,ఈ అఘోర ముఖం. ఈ అఘోర ముఖమే, సమస్త ప్రపంచాన్ని లయం చేసి,మళ్ళీ,మనకు జన్మను ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువు పట్ల,భయం పొగొట్టేది,మనకి ఙ్ఞానం ఇచ్చేది ఇదే.మీరు జాగ్రత్తగా గమనిస్తే, చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మొక్షముకి అదిష్టానం అయి ఉంటాడు.
ప్రతీరోజూ, ఒక్క 2 నిమిషాలు దక్షిణామూర్తిని ద్యానం చేస్తే, మొక్షము కరతళామలకము. వారి,అంత్యమునందు, సాక్షాత్తు, ఈశ్వరుడే, గుర్తుపెట్టుకొని, మొక్షముని ప్రసాదిస్తాడు.
ద్యానం చేయటానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం.
ఉత్తరం వైపు చూసే ముఖంని, "వామదేవ" ముఖం అని అంటారు.
ఇప్పటిదాక, 4 దిక్కులని చూస్తున్న, 4ముఖాల గురుంచి తెలుసుకోగలిగాం కదా!..
ఇక చివరి ముఖం, శివలింగం పైన (అంటే, ఆకాశం వైపు చూస్తూ ఉండే ముఖం) ఉండే ముఖం, ఆ ముఖంని "ఈశాన ముఖం" అంటారు. మనం, లింగం పైన చూసి, ఓం ఈశాన ముఖాయ నమః. అని అనాలి.
ఈశాన ముఖ దర్సనం, మనం మిగిలిన 4 ముఖాలని దర్సించిన తర్వతనే దర్సించాలి.. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది. మనకు కాశీలో ఉండే ముఖం, అఘోర ముఖం. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చొని, దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది.
ఉత్తరం వైపు చూసే "వామదేవ ముఖం" నీటి మీద అధిష్టానం అయి ఉంటుంది. ఈ వామదేవ ముఖమే మనకు సమస్త మంగళమును ఇచ్చే ముఖం.
వామదేవ ముఖం అంటే ఎమిటి అనేది మనకు శివపురణంలో చెప్పబడింది. యదార్ధమునకు అదే విష్ణు స్వరూపం. అందుకే, విష్ణువు శివుడు ఒకరే.. రెండు లేనే లేవు...
శివపురణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికి సంసయం ఉంటే, ఒకటి గమనించండి.
శివఫురణం ని రాసినది, వేదవ్యాసుడు.. వ్యాసుడే విష్ణువు. విష్ణువే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ,వ్యాస రూపాయ విష్ణవే, నమో వైబ్రహ్మ నిధయే వాశిష్టాయ నమో నమః ఉన్న పరమాత్మ ఒక్కడే.. రెండు కాదు.. చాలా మంది, వేరుగా చూస్తూ,పొరపడుతున్నారు..
క్రిష్ణ అని పిలిచినా నేనే పలుకుతాను. మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను.
ఈ వామదేవ ముఖం ని, ఓం వామదేవాయ నమః అని అంటే, మనకు అనారోగ్యం కలగకుండా,చూస్తాడు...
అంతే కాక, ఈ వామదేవ ముఖంని ఓం వామదేవాయ నమః అని అంటే,మనకు 3 ఫలితాలని కూడ ఇస్తుంది..అవి, 1) మీ దగ్గర ఏదైతో ఉందో, అది మీ చేయి జారి పోకుండ,మీతోనే ఉంచుతాడు. ఉదా: మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి (లేదా) ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు, ఎటువంటి కారణము చేతనూ,మీరు అవి కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు. 2) మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని అయనే ఇస్తారు. 3) మనకు ఉన్నదానిని అనుభవించే ఆరోగ్యమ్ని ప్రసాదిస్తాడు. ఉదా: ఇప్పుడు, తీపి పదార్దాలని కొనగలిగే శక్తి ఉండి, తినలేని స్దితిలో (షుగర్ ఉందనుకోండి.) ఉంటే, అప్పుడు, ఉన్న దానిని అనుభవించటం అని అనరు కదా. అటువంటి స్థితి కలుగకుండ కాపడతాడు.
తదుపరి,ఈశాన ముఖము. శివాలయలో లింగ దర్శనం అయ్యాక, ఒక్కసారి, పైకి చూసి, ఓం ఈశాన ముఖాయ నమః అని అనాలి. ఆ ఈశాన ముఖమే మనకు మొక్షాన్ని ప్రసాదించేది. ఈ ఈశాన ముఖం ఆకాశంకి అధిష్టానం అయ్యి ఉంటుంది.
శివలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది. అక్కడికి ప్రదక్షిణంగా వెల్లినప్పుడు, మనలో ఉండే, అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకోని ముందుకు సాగాలి.
శివాలయలో పురుషులకి, ప్రత్యేకమైన వస్త్రధారణ నిర్దేసించబడింది. పురుషులు కేవలం పంచ మాత్రమే ధరించి, పైన ఉండే ఉత్తర్యం ని, నడుముకు కట్టుకొని మాత్రమే ప్రదక్షిణలు చేయాలి. అలా ఎవరైతే చేస్తారో, వారి పట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నమవుతాడు. ముందుగా చెప్పినట్లు, పదఘట్టన వినపడకూడదు జాగ్రత్త.
మీరు శివాలయంలో, ఎట్టి పరిస్థితులలోను, విభూధిని కాని, బిల్వ పత్రాలనికాని, కుంకుమ కాని,ప్రసాదం కాని ఎట్టి పరిస్థితులలోను, నందీశ్వరుడి మీద పెట్టరాదు. సాధారణంగా, చాలా మంది, నంది మీద విభూధిని, బిల్వ ఆకులని వేస్తూ ఉంటారు. అది చాలా మహా పాపంగా పరిగణించబడింది. వీలైతే, అందరూ, శివరాత్రి రోజు, శివమహిమ్నా స్తోత్రం చదవండి.. శివస్తొత్రాలు అన్నింటిలోకి, చాలా ప్రాముఖ్యమైనది "శివమహిమ్నా స్తోత్రం"
హర హర మహా దేవ శంభో శంకర !
Read More

కార్తీకశుద్ద చతుర్దశి నాడు - దీపావళి వెళ్ళిన నాలుగో రోజున వస్తుంది. పుట్టిన బిడ్డలు బ్రతకక పోతేను , పిల్లలు కలుగక పోతేను, నాగ ప్రతిష్ట చేసి పూజించటం సాంప్రదాయం

కార్తీకశుద్ద చతుర్దశి నాడు - దీపావళి వెళ్ళిన నాలుగో రోజున వస్తుంది. పుట్టిన బిడ్డలు బ్రతకక పోతేను , పిల్లలు కలుగక పోతేను, నాగ ప్రతిష్ట చేసి పూజించటం సాంప్రదాయం . అలా నాగ మహిమతో పుటిన సంతానానికి, నాగలక్ష్మి, నాగేశ్వరరావు, నాగయ్య వగైరా పేర్లు పెట్టుకుంటారు. మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని నమ్మకం.
ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెనుబాము' అని అంటారు. అందులో కుండలినీ శక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారంలో వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు" కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు.
ఈ రోజున ఉదయమే ,తలస్నానము చేసి పుట్టదగ్గరికి వెళ్ళి, నాగరాజుకు పూజించి పాలు పోసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. ఆ పుట్ట మట్టిని పుట్టబంగారం అని, దానిని కొద్దిగా తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటారు . ముఖ్యముగా చెవి బాధలు వున్నవారికి ఈ పుట్టబంగారం పెడితే చెవి బాధ తగ్గుతుందంటారు. ఆ సందర్భంగా పుట్ట వద్ద " దీపావళి" నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు.
నాగులచవితి పాటలు కూడా మన తెలుగువారిలో ఎంతో ప్రసిద్ధం:
నన్నేలు నాగన్న , నాకులమునేలు ,
నాకన్నవారల నాఇంటివారల ఆప్తమిత్రులనందరిని ఏలు .
పడగ తొక్కిన పగవాడనుకోకు ,
నడుము తొక్కిన నావాడనుకొనుము .
తోక తొక్కిన తొలుగుచూ పొమ్ము .
ఇదిగో ! నూకనిచ్చెదను మూకనిమ్ము.పిల్లల మూకను నాకిమ్ము .
అని పుట్టలో పాలు పోస్తూ , నూక వేసి వేడుకుంటారు .అలాగే,
పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్యా!
గుమ్మపాలు త్రాగి వెళ్ళిపోవయ్యా!
చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా!
వెయ్యి దండాలయ్య, నీకు కోటి దండాలయ్యా!
పుట్టలోని నాగేంద్రస్వామి!! ....
అంటూ తాము పోసిన పాలు నాగేంద్రుడు తాగితే, తమ మనసులోని కోర్కెలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం.
ఆలయాలలో నాగదేవతలకు ఘనంగా పూజలు చేస్తారు. ప్రతి ఏటా నాగులచవితి రోజున తిరుమలలో కోనేటిరాయుడైన శ్రీవారిని పెద్దశేష వాహనంపై ఊరేగించడం ఆనవాయితీ. అలాగే గురువారం వాహన సేవకు ఆరోజంతా వుపవాసముండి మరునాడు పారాయణ చేసి భుజిస్తారు. పాముపడగ నీడ పడితే పశువులకాపరి కూడా ప్రభువు అవుతాడంటారు !
కాని పాములకు పుట్టలో పాలు పోయడం వల్ల వాటి ప్రాణాలకు హాని అని,అందుకని వాటి సహజ నివాసములలో పాలూ, గుడ్లూ వెయ్యొద్దని చెప్తున్నారు. దానికి బదులు ఇళ్ళలోనే బియ్యం పిండితో నాగ మూర్తులను చేసి, వాటికి శాస్త్రోక్తంగా అన్నీ సమర్పించవచ్చు.
ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూ వస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా రైతుకు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతిపరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. నాగుపాముల సహజ నివాసాలను ఉండనిచ్చి, ప్రకృతిని కాపాడుకుంటే అంతకన్నా గొప్ప పూజ ఇంకొకటి ఉంటుందా?
Read More

దేవాలయంను దర్శించుకునే పధ్ధతి

1) ప్రతి భక్తుడు ( స్త్రీ పురుషులు ) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, విధిగా నుదుట కుంకుమ ధరించాలి.
2) సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి-ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ ధరించాలి. ( చాలామంది ఆడపిల్లలు జీన్స్ టీ షర్టులు- మగపిల్లలు షార్టులు ధరించి వెళుతున్నారు.
ఇలా ధరించినవారిని ఆలయ ప్రవెశమునకు అనుమతిని ఇవ్వకుండా యాజమాన్యం చూసుకోవాలి. తల్లి తండ్రులు ప్రొత్సహించరాదు .)
3) కనీస పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఒట్టి చేతితో
వెల్లరాదు. గీతలో పరమాత్ముడు '' పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి" ...ఎవరైతే నాకు భక్తీతో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని ఉదకం కాని సమర్పిస్తారొ వాటిని ప్రీతితో స్వీకరిస్తాను'' అన్నాడు.
4) గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
5) ఆలయం ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి.
6) లోనికి ప్రవేశించినప్పటినుండి భగవంతుని నామం జపిస్తూ అన్యమస్కంగా కాకుండా ఏకాగ్రత
అంతా దేవుడిపైనే ఉంచాలి.
7) నామ జపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి పురుషులు స్వామికి కుడి వైపు, స్త్రీలు ఎడమ వైపు నిల్చోవాలి.
8) మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి అందులో లీనం కావాలి.తరువాత స్వామి కళ్ళలోకి చూస్తూ లీనం కావాలి.
9) అర్చన చేసుకునేవారు తమ గోత్రము ఇంటిపేరు నక్షత్రము చెప్పుకోవాలి. తీర్థం తీసుకునే సమయంలో అరచేయిని గొకర్నాక్రుతిలొ ఉంచి చేయి కింద ఏదైనా వస్త్రం ఉంచుకుని '' అకాల మృత్యు హరణం ...'' అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడురాకుండా తీస్కోవాలి.
10) దర్శనం అయిన తరువాత కాసేపు కూర్చొని నామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి.
11) ప్రసాదం భక్తులందరికీ పంచి తామూ భక్తితో తీస్కోవాలి.
12) తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ స్వామికి నమస్కరించుకుని బయటికి వచ్చిన తరువాత మళ్ళీ గోపురానికి నమస్కరించి వెళ్ళాలి.
13) ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.
14) అనవసరంగా మాట్లాడటం.. పరుషపదజాలం ఉపయోగించకూడదు
15) ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు.
16) జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు.
17) టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.
18) ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు.
19) ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు.
20) నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు.
21) దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి.
22) ఒక చేత్తో దర్శనం చేయకూడదు.
23) భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు.
24) ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు.
25) ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు.
26) బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు.
27) ఆలయ ఆస్తులను అపహరించకూడదు.
28) అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.
29) ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.
30) మూల విరాట్ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు.
31) ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ
చేయాలి.
32) ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు నిదానం ప్రదానంగా ఉండాలి.
33) గోపుర దర్శనం తప్పక చేయాలి.
34) ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు.
35) ఆలయంలోపల గట్టిగా మాట్లాడకూడదు.
36) మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు.
Read More

తిరుమలలో ప్రాచీన ముఖ్యతీర్థాలు ?

తిరుమలలో ప్రాచీన ముఖ్యతీర్థాలు ?
1. పాండవ తీర్థము : కురుక్షేత్ర సంగ్రామం సమాప్తం అయిన తరువాత పాండవులు బ్రహ్మహత్యా పాపాలు పోగొట్టుకోడానికి ఈ తీర్థంలో స్నానం చేసి క్షేత్రపాలకుని పూజించి శ్రీనివాసుని దర్శించుకున్నారు. పాండవులు ఈ తీర్థంలో స్నానం చేయడంవల్ల ఈ తీర్థానికి పాండవ తీర్థం అనే పేరు కలిగింది. ఈ తీర్థం దేవాలయానికి ఉత్తరదిశలో ఉంది.
2. సనకసనందన తీర్థము : సనకసనందనాదులు ఇక్కడ తపం ఆచరించి సిద్ధి పొందిన స్థలం. ఈ తీర్థంలో మార్గశిర శుక్లపక్ష ద్వాదశిరోజున స్నానం చేసినట్లయితే సిద్ధి పొందుతారు. ఈ తీర్థం పాపవినాశనం ఉత్తరభాగంలో ఒక మైలు దూరంలో ఉంది.
3. కుమారధారా తీర్థము : మాఘపౌర్ణమి రోజు ఇక్కడ స్నానం చేసినట్లయితే సంతానప్రాప్తి కలగటమే కాక సకల కార్యసిద్ధి కలుగుతుంది. ఈ తీర్థం దేవాలయానికి ఆరుమైల్ల దూరంలో ఉంది.
4. తుంబుర తీర్థము : ఈ తీర్థంలో తుంబుర నారదమహర్షి తపస్సు చేసి తరించిన స్థలం. కాబాట్టి ఈ తీర్థంలో ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిరోజు స్నానం చేసినట్లయితే భక్తి జ్ఞానాలు కలిగి సర్వపాపాలు నశిస్తాయి. ఈ తీర్థం ఆలయానికి ఆరుమైల్ల దూరంలో ఉంది. ఈ తీర్థానికి వెళ్ళే దారి మధ్యలో క్షేత్రపురోహితులు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు యాత్రికులకు చలిపందిళ్ళు వేయించి నీరు, మజ్జిగ, పానకాలు ఇస్తారు.
5. నాగతీర్థం : ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే కన్యలు ఉత్తమ పురుషుని పొందుతారు. శ్రీహరి ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో ఉంది.
6. చక్ర తీర్థం : భారత యుద్ధం ముగిసిన తరువాత శ్రీహరి చక్రం పంచ మహాపాతకాలకు గురి అవడం వలన ఈ తీర్థంలో తన సుదర్శన చక్రాన్ని స్నానం చేయించారు. ఇక్కడ స్నానం చేసినట్లయితే వారికి బ్రహ్మ హత్య, శిశు హత్య దోషాలు తొలగి పవిత్రులు అవుతారు. శ్రీహరి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.
7. జాబాలి తీర్థము : ఈ తీర్థంలో జాబాలి అనే మహర్షి తాపం ఆచరించి తరిచారు. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే భూతప్రేత పిశాచాలు తొలగటమే కాక మనోవాంఛ సిద్ధిస్తుంది. ఇక్కడ ఆంజనేయస్వామివారి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయానికి హథీరాంజీ మఠాధిపతులు నిత్య నైవేద్య ఆరాధనలు స్వామివారికి యిస్తారు. ఈ ఆలయం మఠాధిపతుల ఆధీనంలో ఉంది.
8. బాల తీర్థము : నాగతీర్థం నుండి రెండువందల గజాల దూరంలో ఉంది. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే వృద్ధులు సహితం బాలురు అవుతారు. సృష్టికి అవరోధం కలుగుతుందని ఈ తీర్థం శిలలతో మూసివేయబడింది. జలం కనిపించదు.
9. వైకుంఠ తీర్థము : ఈ తీర్థంలో స్నానం చేసినవారికీ వైకుంఠప్రాప్తి కలుగుతుంది. ఈ తీర్థం కోవెలకు తూర్పు దిశలో ఒక కిలోమీటరు దూరంలో ఉంది. పురజనులు ఇక్కడ వైకుంఠసమారాధన అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు.
10. శేష తీర్థము : ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే వారికి మరుజన్మ ఉండదు. ఈ తీర్థానికి వెళ్ళటం చాలా కష్టం. పర్వతాలను ఎక్కడం కష్టపడటమే కాక చిన్న ప్రవాహాలను దాటాలి. ఇక్కడ పాచి పట్టి ఉంటుంది. జాగ్రత్తగా దాటాలి. ఈ తీర్థం యొక్క విశేషం ఏమిటంటే ఆదిశేషుడు శిలారూపంలో ఉంటాడు. ఇదే కాక ప్రత్యేకంగా కొన్ని నాగుపాములు ఈ తీర్థంలో తిరుగుతూనే ఉంటాయి. దేవాలయానికి పదికిలోమీటర్ల దూరంలో ఉంది.
11. సీతమ్మ తీర్థము : ఈ తీర్థంలో సీతాదేవి కుశవులకు కరం నూరిపోసింది. బండ అరగటం నేటికీ చూడవచ్చు. ఇక్కడ ఒక బిలం ఉంది. జలం బయటికి కనిపించదు. పొడుగాటి వెదురుకు కొబ్బరి పీచుకట్టి బిలంలో ఉంచి తోడితే నీరు ప్రవహిస్తుంది. ఈ తీర్థంలో స్త్రీలు భక్తితో స్నానం చేసినట్లయితే ముక్తిని పొందుతారు.
12. యుద్ధగళ తీర్థము : ఈ తీర్థంలో రాముడు రావణుని సంహరించిన తరువాత బ్రహ్మహత్య మహాపాతకాన్ని పోగొట్టుకోవడానికి ఈ తీర్థంలో స్నానం చేశాడు.
13. విరజానది : ఈ నది శ్రీస్వామివారి పాదాల క్రింది భాగంలో ప్రవహిస్తున్నది. ఈ నది పైభాగంలో శ్రీవెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. స్వామివారి రెండవ ప్రాకారంలో పడమటి భాగంలో ఉగ్రాణము ముందున్న భూమికి సమంగా నీరు ఉంది. ఇది ఒక చిన్న బావిలా కనబడుతుంది. ఈ తీర్థాన్ని తలపై ప్రోక్షించుకుంటే మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది.
14. పద్మసరోవరము : ఈ సరోవరంలో స్నానం చేసినట్లయితే వారికి సకల భోగభాగ్యాలు కలగటమే కాకుండా భూతప్రేతపిశాచాలు వదిలిపోతాయి. ఈ సరోవరం పద్మావతి మందిరం దగ్గర ఉంది. తిరుపతి నుండి ఈ సరోవరం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరోవరంలోని జలం స్వర్ణముఖి నదిలో కలుస్తుంది.
ఇవే కాక కాయరసాయ తీర్థం, ఫల్గుణి తీర్థము, కటాహ తీర్థము, వరాహ తీర్థము, విష్వక్సేన తీర్థము, పంచాయుధ తీర్థము, బ్రహ్మతీర్థము, సప్తముని తీర్థము, దేవ తీర్థము వంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి.
Read More

మనకు తెలియని శ్రీశైల దివ్యక్షేత్ర మహిమలు:

మనకు తెలియని శ్రీశైల దివ్యక్షేత్ర మహిమలు:
ఆగమశాస్త్ర ప్రకారం కొన్ని దేవతామూర్తులకు పూజలు చేయరు..
అలా ఆగమంలో లేని అమ్మవారు ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైల క్షేత్రం.
పార్వతీ దేవి-అమ్మవారికి కామేశ్వరి అని పేరు ఉంది.
పరమశివుడు ఎలా ఉంటాడో అమ్మవారు అలాగే ఉంటుంది రూపంలో.
అలా ఉండే పార్వతీ పరమేశ్వరులలో ఉన్నటువంటి అమ్మవారి తత్త్వానికి కామేశ్వరి అని పేరు.
కానీ భారతదేశం మొత్తం మీద ఇష్ట కామేశ్వరి అన్న మాట లేదు. ఆ మాటతో మూర్తి లేదు. ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది.
ఆవిడను దర్శనం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఏ కారు వెళ్ళదు. శ్రీశైల క్షేత్రంలో వున్న కొన్ని జీపులు మాత్రం వెళ్తాయి. అది కూడా గుండె దిటవు వున్నవాళ్ళు అయితేనే వెళ్ళగలరు. ఎందుకంటే రోడ్డు చాలా అధ్వాన్నంగా ఉంటుంది.. అంతా డొంకరోడ్డు(అసలు దానిని రోడ్డు అనేదానికి వీలులేదు) ఆలయం దట్టమైన అడవి మధ్యలో ఉంటుంది.. ఆ ఆలయం ఈరోజు శిథిలమై పోయి చిన్న గుహ ఉన్నట్లుగా ఉంటుంది.
అందులోకి వెళ్ళి అమ్మవారిని చూస్తే చతుర్భుజి.
అమ్మ నాలుగు చేతులతో ఉంటుంది.
రెండు చేతులతో లక్ష్మీ దేవి ఎలా తామరమొగ్గలు పట్టుకుంటుందో అలా తామర మొగ్గలు పట్టుకొని ఉంటుంది.
ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకొని యోగినీ స్వరూపంలో ఉంటుంది.
సాధారణంగా కామేశ్వరీ తంత్రంలో అమ్మవారి స్వరూపం ఎలా చెప్తామో అలా లేదు కదా ఇక్కడ!
కామేశ్వరి ఎనిమిది చేతులతో ఉంటుంది. ఈవిడ అలా లేదు కదా! మరెందుకు వచ్చిందీవిడ?
అంటే ఒకానొకప్పుడు శ్రీశైలంలో ఒక రహస్యం ఉండేది.
ఎంత గొప్ప కోర్కె తీరాలన్న వాళ్ళైనా సరే తపస్సు భంగం అయిపోతోంది అనుకున్న వాళ్ళు కూడా ఎందుకంటే శ్రీశైలం ఒక్కదానికే ఒక లక్షణం ఉంది. ఉత్తరభారతదేశంలో ఉజ్జయినికి ఉంది. కాశీ పట్టణానికి ఉంది. దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒక్కటే. ఎందుకంటేఅక్కడ లేనటువంటి ఆరాధనా విధానం లేదు. అక్కడ కాపాలికుల దగ్గరనుంచి. ఇప్పటికీ శ్రీశైలం లోపల ఉన్న గుహలలోకి ధైర్యంగా వెళ్ళి దర్శనాలు చేయగలిగితే కాపాలికులు ఇక్కడ పూజలు చేసేవారనడానికి ప్రబల సాక్ష్యాలు దొరుకుతాయి. కాపాలికులు నరబలి కూడా ఇస్తారు. అటువంటి కాపాలిక స్పర్శ కూడా క్షేత్రనికి ఉంది. అంతే కాదు. అక్కడ స్పర్శవేది చేత ఒకప్పుడు సిద్ధ నాగార్జునుడు శ్రీశైలం కొండనంతటినీ కూడా బంగారం కొండగా మార్చే ప్రయత్నం చేశాడు. ఆయనే మూలికల మూట తెచ్చి త్రిఫల వృక్షం క్రింద పెట్టాడు. అటువంటి గొప్పగొప్ప ఓషధులన్నీ శ్రీశైల పర్వతం మీద ఉన్నాయి. అటువంటి శ్రీశైలంలో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ఆ తల్లి తీర్చని కోర్కె అన్నది లేదు. నీకు ఏది ఇష్టమో అది ఇస్తుంది. అందుకు ఇష్ట కామేశ్వరి. భారతదేశం మొత్తం మీద ఇక ఆ రూపం లేదు. ఒక్కశ్రీశైలంలోనే ఉంది. ఇంకొక పెద్ద రహస్యం ఏమిటంటే పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు వెళ్ళి అమ్మవారికి బొట్టు పెడితే మెత్తగా మనిషి నుదురు ఎలా తగులుతుందో అలా తగులుతుంది ఆవిడ నుదురు. విగ్రహమా? మానవకాంతా? అనిపిస్తుంది. ప్రక్కనే శివాలయం ఉండేది. కానీ గుప్తనిధుల ఆశలో ధూర్తులు శివలింగాన్ని కూడా పెళ్ళగించేశారు. ఆ ప్రదేశంలో ఇప్పటికీ పెద్ద గొయ్యి ఉంటుంది. అక్కడ ఉండేదంతా చెంచులే. అక్కడికి వెళ్ళి కాసేపు కళ్ళుమూసుకొని కూర్చుంటే సెలయేళ్ళ ప్రవాహం చేత ధ్యానమునకు అత్యంత యోగ్యమైనదిగా ఉంటుంది. కాపాలికుల దగ్గరినుంచి సాక్షాత్తు శ్రీ శంకరుల వరకు ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో శైవంలో అన్ని సంప్రదాయాలు శ్రీశైలానికి చేరి శ్రీశైల మల్లికార్జునుడిని పూజించినవే...
వెళ్ళాలనుకునే వారు సూర్యోదయమయిన తర్వాత జీపులు మాట్లాడుకుని వెళ్తే మంచిది.. స్వంత వాహనాలున్నా సరే .. స్వంత వాహనాలలో వెళ్ళే ధైర్యం అస్సలు చేయకండి..
అందరికీ ఇష్టకామేశ్వరీ మాత దర్శన ప్రాప్తిరస్తుః...
Read More

శ్రీరామ చంద్రుడికి అత్యంత సన్నిహితుడైన మిత్రుడు గుహుడు. గుహుడు పల్లెకారుడు.

శ్రీరామ చంద్రుడికి అత్యంత సన్నిహితుడైన మిత్రుడు గుహుడు. గుహుడు పల్లెకారుడు. ఆనాడు అంత తేడాలు ఉంటే మరి శ్రీరాముడికి పల్లెకారుడితో స్నేహం ఎలా ఉంటుంది. మహాభారతంలో దాసీ పుత్రుడైన విదురుడు మంత్రి. మన చరిత్ర తిరగేస్తే అనేకమంది శూద్రులు రాజ్యాలు పాలించినట్లు అర్థం అవుతుంది. మట్టిబొమ్మలను మహారణానికి జట్టునడిపిన శాలివాహనుడు కుమ్మరివాడు. మన తెలుగు భాషకు పట్టంగట్టిన శ్రీకృష్ణదేవరాయలు బలిజ, మన భారత జాతికి అధ్భుత ఆధ్యాత్మిక విద్యనందించిన శ్రకృష్ణుడు గొల్లవాడు, మౌర్యసామ్రాజ్యాన్ని నేలమట్టంచేసి గుప్తసామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్తుడు వైశ్యుడు. చాణుక్యుడుగా ప్రసిద్దిగాంచిన అర్థశాస్త్ర ప్రవర్తకుడు విష్ణుగుప్తుడు వైశ్యుడు. ఇలా చెప్పుకుంటూపోతే భారతదేశాన్ని నేడు శూద్రులనేవారే పరిపాలించారు. శూద్రశబ్దాన్ని చాలా నీచంగా చిత్రీకరించారు నేటి మహానుభావులు. విశ్వకర్మలలో 6 తెగలు ఉన్నాయి. వడ్రంగి, కంసాలి మొదలైనవి వారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. మంగలులను నాఈబ్రాహ్మలు అంటారు, వారిలో కూడా యజ్ఞోపవీతాన్ని ధరించేవారు ఉన్నారు. ఇక కుమ్మరులు వీరిలో యజ్ఞోపవీతాన్ని ధరించే సంప్రదాయం ఉంది. ఇక మాదిగలలో వారికి ప్రత్యేక పురోహిత వర్గం ఉంది. వారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు.
Read More

వైద్యశాస్త్రంలో భారతీయుల ప్రతిభ వేల ఏళ్ల నాటిది. ప్రపంచంలోనే మొట్టమొదటి శస్త్రచికిత్స (Surgery) చేసినది సుశ్రుతులే.......



వైద్యశాస్త్రంలో భారతీయుల ప్రతిభ వేల ఏళ్ల నాటిది.

ప్రపంచంలోనే మొట్టమొదటి శస్త్రచికిత్స (Surgery) చేసినది సుశ్రుతులే.......

సుశ్రుతుల్ని క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందిన వారిగా ఆధునిక చరిత్రకారులు భావిస్తున్నప్పటికీ,మన పురాణేతిహాసాల ప్రకారం ఆయన దాదాపుగా 5000 ఏళ్ల పూర్వం వారు. మనకు చరిత్రను రాసింది పాశ్చాత్యులు కావడం వలన, వాళ్లు బైబిలులో ఉన్నట్లుగా సృష్టి ఆవిర్భవించి ఆరు వేల ఏళ్లకంటే ఎక్కువ కాలేదని తీవ్రంగా నమ్మడం వలన, ఎవరినీ 3000 ఏళ్ల పూర్వం వాళ్లుగా అంగీకరించలేకపోయారు.


సుశ్రుతులు వేల ఏళ్ల క్రితమే వారణాసిలో జన్మించారు. ఆయుర్వేద వైద్య పితామహులుగా ఖ్యాతి గడించిన ధన్వంతరి వద్ద విద్యనభ్యసించారు. పాశ్చాత్య ప్రపంచం విజ్ఞాన పరంగా కళ్లు తెరవక ముందే ఆయన సర్జరీ చేసి చూపించారు.

1) పక్షుల ముక్కుల రూపురేఖలను అనుసరించి, దృఢమైన పట్టు ఉండే విధంగా, సుశ్రుతులు సర్జరీ పరికరాలను తయారు చేసి, వినియోగించినట్లుగా తెలుస్తోంది.

2) వైద్య నియమ సూత్రాలూ, శస్త్రచికిత్స, పురిటి విధులు, మందులు, ఔషధజ్ఞానం మానవశరీర నిర్మాణాన్ని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.

3) కొన్ని ఉత్పాదకాలు, వనమూలికల మొక్కలు, పుష్ప, ఫలాల ఔషధ మొక్కల గుర్తింపు, లాంటి వృక్షాల్లో ఔషధగుణాల్ని ఆయన కనిపెట్టారు.

4) శస్త్రచికిత్సా నైపుణ్యాన్ని విశదీకరించే సుశ్రుత సంహిత అనే అద్భుత గ్రంథాన్ని ఆయన సంస్కృతంలో రచించారు.

5) మెడ నుంచి ముఖం వైపు చర్మపు పొరల ప్రతిరూప చికిత్స, ప్రస్తుత అధునాతన ప్లాస్టిక్ సర్జరీ కి సుశ్రుతులు నాందీ పలకడంతోనే ఆయన ప్రజ్ఞ అర్థమవుతోంది.

6) తెగిపోయిన, మరియు కోతకు గురైన ముక్కుకు, ప్లాస్టిక్ సర్జరీని చేసి చూపించారు.

7) సుశ్రుతులు సర్జరీ సందర్భంలో రక్తస్రావాన్ని అరికట్టే విధానంలో చీమతలను బంధన సూత్రంగా వినియోగించే కొత్త పద్ధతి కనిపెట్టారు.

8) సుశ్రుత సంహిత ప్రకారం, సర్జన్ కు ఉండవలసిన లక్షణాలు, ధైర్యం, చురుకుదనం, తక్షణచర్య, పరికరాల పదును, చెమట వణుకు లేకపోవడం..

9) ప్రొస్టేట్ గ్రంధిని ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా తొలగించాలి? ఎముకలు చిట్లడం ఎన్ని రకాలుగా ఉంటుంది? దానికి శస్త్రచికిత్స చేయడానికి సూత్రాలు ఏవి? యిలాంటి ఎన్నో శాస్త్రీయ పద్దతులను సుశ్రుతులు వేల సంవత్సరాల క్రితమే శోధించి, మానవజాతికి అందించారు.

10) ఎముకలు విరగడం అనేది 12 రకాలుగా ఉంటుందని కనుగొన్నారు.

11) మూత్రనాళం లో పేరుకొనే రాళ్ళను తొలగించడం ఎలాగో, సశాస్త్రీయంగా నిర్వహించి నిరూపించారు. అతి సున్నితమైన కంటిలో ఏర్పడే శుక్లాలను, వారి శస్త్రచికిత్సా విధానం ద్వారా విజయవంతంగా తొలగించారు. పొట్టభాగాన్ని, జీర్ణాశయ పొరలను, చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు చేసి అతికించి ప్రపంచాన్ని నివ్వెరపరిచారు.

12) పోస్ట్‌మార్టం (శవ పరీక్ష) వేల ఏళ్ళ క్రితమే నిర్వహించి మార్గదర్శకత్వం వహించిన తొలి శాస్త్రవేత్త సుశ్రుతులు.శరీర నిర్మాణ శాస్త్రం పట్ల గాఢమైన అవగాహన ఉండాలని చెప్పారు. స్వయంగా వివిధ ప్రయోగాలు చేశారు. ఆరోగ్యంగా ఉండి, పిన్న వయసులో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గడ్డిలో చుట్టి, నిరంతరం ప్రవహించే నీటిలో కొద్దికాలం ఉంచి తీసిన తర్వాత, శిష్యులందరి సమక్షంలో ఆ దేహాన్ని కోసి, అవయవాలకు సంబంధించిన జ్ఞానాన్ని వివరించేవారు.

13) గర్భిణీ స్త్రీ ఉదరంలో శిశువు క్రమ వికాసం, ఫలదీకరణ దశలు, తొమ్మిది నెలల్లో గర్భాశయంలో చోటుచేసుకునే క్రమపరిమాణాలు, శిశువు పెరుగుదలలోని దశలను గురించి ఎంతో విజ్ఞానాన్ని అందించారు సుశ్రుతులు.

14) నూతన మిలీనియం సందర్భంగా, 2000 సంవత్సరంలో బ్రిటన్ లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ, ఒక జాబితాను వెలువరించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్ర చికిత్స వైద్యుల ఫోటోలతో పాటుగా వారి వివరాలు పేర్కొన్నారు. ఆ జాబితాలో తొలి చిత్రం ఆచార్య సుశ్రుతులది. ఈయన ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రవైద్య శిఖామణిగా పేర్కొనడం జరిగింది

15) ఇలా చెప్పుకుంటూ పోతే సుశ్రుతుల ప్రతిభ అనంతమని తెలుస్తుంది.

16) అన్నీ పాశ్చాత్యులే కనిపెట్టారనీ, భారతీయులకు ఏమీ చేతకాదనీ, అన్నీ పాశ్చాత్యులు పెట్టిన భిక్షే అనీ, మనం ఆత్మన్యూనతకు లోను కాకుండా, వారిని ఆదర్శపురుషులుగా తీసుకుని, వారి మార్గంలో నడవడానికి సంకల్పిస్తే రేపటి రోజు మనదే కావచ్చు.

సుశ్రుతాయ నమః
Read More

ఏయే మాసాల్లో శుభకార్యాలు చేయకూడదు..?

ఏయే మాసాల్లో శుభకార్యాలు చేయకూడదు..?
సాధారణంగా చాలామంది ఏ మాసంలో వివాహాలు చేసుకుంటే మంచిదనే సందేహాల్లో పడిపోతారు. అటువంటి సమయాల్లో జ్యోతిష్య నిపుణుల దగ్గర సలహాలు తీసుకోవడం చాలా మంచిది! వారి సలహాలమేరకే ఇక్కడ కొన్ని సులభమైన మార్గాల ద్వారా మీకు కొంచెం సమాచారాన్ని అందిస్తున్నాం. అందులో ముఖ్యంగా జ్యేష్ఠమాసంలో ఎవరు వివాహం చేసుకోవాలి..? ఎవరు చేసుకోకూడదనే విషయాల గురించి ఇక్కడ చర్చిద్దాం!
* జ్యేష్ఠమాసం
హిందూ సంస్కృతీ - సంప్రదాయం ప్రకారం... జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ సంతానం వివాహం చేయకూడదని పూర్వకాలం నుంచి మన ఆచారులు చెబుతున్నారు. అయితే మొదట ఇక్కడ జ్యేష్ఠ సంతానం గురించి తెలుసుకోవాల్సి వుంది. జ్యేష్ఠ సంతానం అంటే.. దంపతులకు మొదటిసారిగా పుట్టిన పుత్రుడుకానీ, పుత్రికకానీ జ్యేష్ఠ సంతానాలు పరిగణించబడతారు. ఇందులో జ్యేష్ఠం అనే పదం గర్భానికి సంబంధించింది. ఒకవేళ గర్భస్రావమయి కూడా ప్రథమ సంతానం జీవించి వుండకపోతే.. ఆ తరువాత జన్మించే సంతానం జ్యేష్ఠ సంతానం కిందకే వస్తారు.
ఇక వివాహ విషయానికి వస్తే... మన పురాణగ్రంథాల ప్రకారం... జ్యేష్ఠమాసంలో ఎటువంటి పరిస్థితులోనైనా జ్యేష్ఠ సంతానానికి వివాహ కార్యక్రమాలను నిర్వహించకూడదు. కేవలం వివాహ కార్యక్రమాలనే కాదు.. ఏ శుభకార్యాలలోనూ కూడా వాళ్లను ఆహ్వానించడకూడదు. అలాగే మార్గశిర మాసం కూడా జ్యేష్ఠ సంతానికి అంత శ్రేయస్కరం కాదు. యజ్ఞోపవీతం, వివాహం, కేశఖండన వంటి శుభకార్యాలు జ్యేష్ఠ సంతానానికి చెందిన వ్యక్తులు.... వారు జన్మించిన మాసంలో అస్సలు జరపకూడదు. అలా కాని ఎడలా వారికి అరిష్టాలే ఎదురవుతాయి.
భరద్వాజ మహర్షి సూచనల ప్రకారం... జ్యేష్ఠ మాసంలో కృతికా నక్షత్రంలో సూర్యుడు వుండే పదిరోజులు మినహాయించి... మిగతారోజుల్లో శుభకార్యాలు చేసుకోవచ్చు. వరుడు, వధువు ఇద్దరూ జ్యేష్ఠ సంతానమే అయితే వారికి జ్యేష్ఠ మాసంలో వివాహం ఎన్నటికీ చేయకూడదు. ఒకవేళ వధూవరులలో ఒకరే జ్యేష్ఠులు అయితే.. అటువంటివారు వివాహం చేసుకోవచ్చు.
* ఆషాడమాసం
హిందువుల సంస్కృతి సంప్రదాయాలు ప్రకారం... ఆషాఢమాసంలో వివాహాలుగానీ, ఇతర శుభకార్యాలుగానీ నిర్వహించుకోకూడదు. ఎందుకంటే.. ఈ ఆషాఢమాసాన్ని శూన్యమాసం అని మన పూర్వీకులు పేర్కొన్నారు. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి ఆషాఢ శుద్ధ ఏకాదశి. దీనినే తొలిఏకాదశి అని అంటారు. ముఖ్యంగా ఇది విష్ణువు ఆరాధులకు ఎంతో ప్రముఖమైన రోజు. ఈ తొలిఏకాదశి నుంచే చాతుర్మాస్యవ్రతం ప్రారంభం అవుతుంది. అలాగే పండుగలు కూడా మొదలవుతాయి.
బోనాల పండుగ, పూరిజగన్నాథుడి రథయాత్రం వంటి పండగలు ఈ మాసంలోనే జరుగుతాయి. అలాగే సకల జీవులకు ఆహారం అందించే ‘‘ఆదిశక్తి’’ని శాకంబరీదేవిగా కొలుస్తారు. ఈ మాసంలో కొత్తగా పెళ్లయిన అమ్మాయిలను తమ పుట్టింటికి తీసుకునివెళ్తారు. అంటే ఈ మాసం మొత్తం భార్యాభర్తలు దూరంగా వుండాల్సిందే! పురాతనకాలం నుంచి ఈ మాసంలో ఆడవాళ్లు తమ చేతులకు గోరింటాకు వేసుకోవడం ఒక ఆచారంగా వస్తోంది.
Read More

ద్వాదశ జోతిర్లింగాలు ఎవరిపేర్లపై ఏర్పడ్డాయి ?



ద్వాదశ జోతిర్లింగాలు ఎవరిపేర్లపై ఏర్పడ్డాయి ?
శ్రీ సోమనాధేశ్వర జ్యోతిర్లింగం….
లభ్యమైన ఆధారాలను బట్టి ఈ జ్యోతిర్లింగాలయం క్రీపూ. 200 సం.రాల నాటిది. 20వ శాతాబ్దం వరకు ఎన్నో యుద్ధబీభత్సాలకు గురైనా 1957లో పున:ప్రాణ ప్రతిష్ఠను పొందింది.


శ్రీశైలమల్లిఖార్జున జ్యోతిర్లింగం ….
ఏ శిఖర రూపంలో పర్వతుడు అవతరించాడో ఆ శిఖరం మీదే తపస్సు చేస్తున ఒకానొక భక్తురాలుకు శివసాక్షాత్కరం కలిగిన ఆచోటు తన పేరుతో నిలవాలని కోరడం వల్లన ఆ శిఖరం శ్రీశైలంగా పేరొందింది. మూడో శతాబ్దం నుండి ఈ క్షేత్రం ఉనికి కనిపిస్తుంది.

శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ….
ఉజ్జయినిలో ఈ లింగంవుంది. చైనా యాత్రికుడయిన హ్యుయాన్‌ త్సాంగ్‌ తన పర్యటన గ్రంధంలో ఈ క్షేత్రం గూర్చి చక్కగా వర్ణించారు.

శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం …..
చారిత్రక ఆధారమంటూ ఈక్షేత్రం గూర్చి ఏమీ లేదు. ‘మాంధాత’ చేసిన తపస్సు ఫలి తంగా ఓంకారేశ్వడు అవిర్భవించాడు.

శ్రీ వైద్యనాథేశ్వరలింగం ….
మహా బలేశ్వరలింగమే వైద్యనాధేశ్వర లింగంగా ప్రసిద్ది చెందింది లంకేశ్వరుడైన రావణునికోరిక మేరకు సాంబ శివుడు ఈ ఆత్మలింగంను ప్రసాదించాడు.

శ్రీ భీమ శంకర జ్యోతిర్లింగం ….
భీముడు వల్ల వివత్తును తొలిగించి నందువల్ల ఆ జ్యోతిర్లింగం ప్రసిద్ధిచెందింది. దీనికి ఉపలింగం భీమేశ్వరలింగం.

శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం ….
తనని ఆరాధించిన వారికి సర్వ కష్టాలను నివారించి ప్రతిజ్ఞా పూర్వకంగా చెప్పి శివుడు జ్యోతిర్లింగంలోకి నాగేశ్వరుడుగా కలిసి పోతాడు. ఆ జ్యోతిర్లింగమే నాగేశ్వర జ్యోతిర్లింగము.

శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ….
వైశ్రమణుని ఘోర తపస్సు వల్ల శివుడు లింగరూపంలో వెలసి ముక్తిని ప్రసాదిస్తాడు. ఆలింగమే విశ్వేశ్వర లింగం.

శ్రీ త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం ….
శివుడు మూర్తిమంతమై విష్ణువు, బ్రహ్మలకు జ్ఞాన బోధచేయగా త్రిమూర్తులు ఏకమైన లింగంగా శ్రీత్రియంబకేశ్వర జ్యోతిర్లింగం వెలసింది.

శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం …
ధర్ముడనే మునికి నరనారాయణలనే పేరిట విష్ణూవు ఇద్దరు పుత్రులుగా జన్మిస్తాడు. ఆ ఇద్దరి కోరిక మేరకు శివుడు బదరీ వనంలో ఈ లింగరూపంలో వెలిసాడు.

శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం ….
శ్రీరామాధిత దైవతలింగం గనుక ఆ జ్యోతిర్లింగమే శ్రీరామేశ్వర లింగంగా పేరు పొందింది.

శ్రీ ఘృశ్నేశ్వర జ్యోతిర్లింగం …
ఘ్నశ్నే అనే భక్తురాలు కోరిక మేరకు శివుడు ఈ జ్యోతిర్లింగంగా వెలిసాడు. సంతాన నష్టం, అకాల మరణం నుండి ఈ లింగం తప్పిస్తుందని చెపుతారు.
Read More

BBC చేసిన ఒక సర్వేలో(2004 లోనిది)ప్రకారం దాదాపు మాములుగా తాగే దానికన్నా 41% ఎక్కువ క్రిస్టమస్ కి తాగుతారు అని తేల్చింది ! చారిత్రకంగా కాని , బైబిల్ పరంగా కాని పుట్టిన రోజు ఎప్పుడో తెలియని వ్యక్తి పుట్టిన రోజు అని చెప్పి తాగి తందనాలు ఆడే బదులు అదే డబ్బుని పేదల అబ్యున్నతికి ప్రతిఫలం ఆశించకుండా(మతం మార్చకుండా) కర్చు చేయవచ్చు కదా?



25 డిసెంబర్ ఒక్క రోజే 15 లక్షల కోట్లు మూలధనం వృధా చేయటానికి సిద్దపడ్డారు !
దేశంలో అభాగ్యులు, అనాథలు, పేదలు ఆకలితో అల్లాడుతుంటే వీరు ఏమో 15 లక్షల కోట్ల మూలధనాన్ని క్రిస్మస్ పండుగ అనే పేరుతో వ్యర్థం చెయ్యటానికి తహతహలాడుతున్నాము
క్రైస్తవులు 25 తేదిన వృధా చేస్తున్న ధనం నిరుపేదలకి పంచి పెడితే ప్రపంచంలో 62 శాతం పేదరికాన్ని40 శాతానికి తీసుకు రావొచ్చు

ప్రపంచ మంత కలిపి లాంచనంగా 98 వేల చర్చలు ఉంటె అనైతికంగా 72 లక్షలకు పైమాటే చర్చిలు ఉన్నట్టు గుర్తించాము ఒక విధముగా తీసుకుంటే మన భారతదేశంలో లాంచనంగా 12 వేలు చర్చిలు ఉంటె 20 లక్షకు పైగా చర్చిలో అనైతికంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు! మన దేశంలో లంఛనంగ ఉన్న చర్చిలు కేవలం 25 డిసెంబర్ నాడు ఒక్కో చర్చి 7 నుండి 8 లక్షలు కేవలం
సంటా(యెర్రని వస్త్రాలు) కోసం, బెలూన్స్ , విద్యుత్ అలంకరణలు ,పటాసులు మరియు వాళ్ళ చర్చికి సంబంధించిన ప్రవక్తలకు భోజనం కోసం ఖర్చు చేస్తున్నారు అంటే మనం ఆలోచించుకోవచ్చు దేశంలో ఆ రోజు ఎంత దానం వృధా అవ్తుందో ఉదాహరణకు
1 చర్చి 8 లక్షలు వేసుకున్న, x 12 వేల చర్చిలకు = 960 కోట్లు వృధా
అనైతికంగా వెలసిన చర్చిలు 10 లక్ష x 1లక్ష తక్కువ కాకుండా ఉంటుంది = 10 వేల కోట్లు వృధా అంటే ఇంచు మించు దేశంలో 25 డిసెంబర్ ఒక్క రోజే 11 వేల కోట్లు రూపాయలు వృధా , ఆ లెక్క ప్రకారంగా దాదాపు ప్రపంచం లో 15 లక్షల కోట్లు రూపాయలు క్రిస్మస్ పేరుమీద వృధా చేస్తున్నారు ఆ డబ్బంతా పేదలకు పంచి పెడితే ఒక సంవత్సరానికే ప్రపంచం మొత్తం లో ఉన్న 62 శాతం పేదరికం 40 శాతానికి తీసుకు రావచ్చు
మనం హిందు పండుగల గురించి మాటాడితే హిందు పండుగలకు అన్నదానం చేస్తారు , ఉన్నవారు వస్త్రదానం కూడా చేస్తారు. ఆ అన్నదానికి కులమతాలకు అతీతంగా అందరికి స్వాగతం కానీ క్రిస్మస్ క్రిస్టియన్ చర్చిలకు సంగాలు ఉంటాయి ఎవరి చర్చి సంగం వాసులు ఆ చర్చికే పోవాల్సి ఉంటుంది! అందుకు కారణం “నేను వాళ్ళ మనసును ప్రభువు వైపు తిప్పాను కానీ ఆ సంగం వాసులు తనకు మోసం కుట్రతో వాళ్ళ చర్చిలో చేర్చు కున్నరు” అంటూ వాళ్ళలో వాళ్ళకు ఐక్యత లేకపోవటం
సంతక్లాజ్ వేసుకుంటున్న యెర్రని వస్త్రాలు ఒక్కరోజేకే ఉపయోగపడుతాయి కానీ ఆ డబ్బుతోనే పేదవారికి బట్టలు కొని పెడుతే వాళ్ళు చాల కాలం వరకు ఆ బట్టల్ని ధరించగలరు ఎదావిధిగా హిందువులు పూజకు ఉపయోగిస్తున్న పటాసులు,పళ్ళు, పూలు ప్రతి ఒక్కటి కూడా మన దేశం లో ఇతర పేదలకి జీవోనోపాది కల్పించేవిగా ఉంటాయి! ఇక మట్టి ప్రతిమల విషయానికి వస్తే మట్టిని తిరిగి నదుల్లో , చెరువుల్లో తిరిగి కలపటం వల్ల మృత్తికక్షయం (వరద నీరు వచ్చినపుడు నదుల్లో చెరువుల్లో మట్టి కొట్టుకొని పోయి నీటిని పీల్చి ఉంచే శక్తీ తగ్గిపోతుంది)ని నివారించగలుగుతున్నాము , అంతే కాకా నిరుపేదలు ఆ మట్టి విగ్రహాల ద్వార వచ్చిన ఆదాయం తో సంవత్సరం పొడుగునా జీవనం సాగిస్తున్నారు అన్నది జగమెరిగిన సత్యం!


కాబట్టి హిందువుల ప్రతి పండుగకి డబ్బు వృధాని , లేని పర్యావరణ కాలుష్యాన్ని కల్పించి ప్రచారం చేసే మేధావులు కాస్త దీని మీద కూడా మనసు పెడితే ప్రపంచ దిశని మార్చవచ్చు కదా BBC చేసిన ఒక సర్వేలో(2004 లోనిది)ప్రకారం దాదాపు మాములుగా తాగే దానికన్నా 41% ఎక్కువ క్రిస్టమస్ కి తాగుతారు అని తేల్చింది ! చారిత్రకంగా కాని , బైబిల్ పరంగా కాని పుట్టిన రోజు ఎప్పుడో తెలియని వ్యక్తి పుట్టిన రోజు అని చెప్పి తాగి తందనాలు ఆడే బదులు అదే డబ్బుని పేదల అబ్యున్నతికి ప్రతిఫలం ఆశించకుండా(మతం మార్చకుండా) కర్చు చేయవచ్చు కదా?
Read More

వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం..ఎందులోనో మీకు తెలుసా?

వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం..ఎందులోనో మీకు తెలుసా?
ఇది వరకు తిరుమలలో “తొండమాన్ చక్రవర్తి” స్వామి వారికి రోజూ బంగారు తులసి దళాలు సమర్పించేవాడట. అప్పట్లో స్వామి వారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా. ఈ తొండమాన్ చక్రవర్తి రోజూ స్వామి వారి దగ్గరికి వెళ్లి చెబుతూ ఉండేవాడుట – "స్వామి నేను మీకు రోజూ బంగారు తులసీదళాలతో పూజ చేస్తున్నాను. పైగా, నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి?'' అన్నాడుట. స్వామి తొండమానుడుకి ఒక పాఠం చెప్పాలని, నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గ లోనే భీముడు అని ఒక కుమ్మరివాడు ఉంటాడు. వాడిని వెళ్లి చూడు అన్నారుట స్వామి. మరుసటి రోజు వెళదాం అని అనుకుని, స్వామి వారి పాదాల క్రింద ఉన్న తులసి దళాలని శుభ్రం చేస్తున్నాడుట. అప్పుడు, తను చేయించిన బంగారు తులసి దళాల క్రింద, మట్టి తులసిదళాలు కనిపించాయుట. స్వామి వారు చెప్పారుట ఈ మట్టి దళాలు, ఆ భీముడే సమర్పించాడు నాకు అని. అప్పుడు మనసులో అనుకున్నాడుట, మట్టి తులసి దళాలు స్వామికి నచ్చాయా, వీడు ఎవరో కాని వెంటనే వెళ్లి కలవాలని బయలుదేరాడుట. ఆ రోజు చాల ఎండగా ఉంది, అప్పటికే నడిచి నడిచి, భీముడి ఇంటి దగ్గరలో స్పృహ తప్పి పడిపోయాడుట. అప్పుడు ఆ భీముడే, తొండమాన్ చక్రవర్తిని లేవదీసి తన ఇంటికి తీసుకువెళ్ళాడుట. తొండమాన్ చక్రవర్తి అడిగాడుట, "ఒరేయ్ నువ్వు ఏమి చేస్తూ ఉంటావు? వేంకటేశ్వర స్వామి వారికి నువ్వంటే చాల ఇష్టం'' అని.
భీముడు అన్నాడు, నేనేం చేస్తాను స్వామి
- కుండ చేసేముందు ఈశ్వరా నన్ను అనుగ్రహించావు.
- కుండలు చేసుకునే శక్తి ని ఇచ్చావు.
- అవి అమ్మితే నాలుగు రూపాయలు వచ్చేట్టు చేసావు
- వాటి వల్ల నా సంసారం సాగుతోంది.
- నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ పాదాల యందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూర్తికి సమర్పించేవాడుట. ఏ పని మొదలుపెట్టినా “గోవింద” నేను చేయడమేమిటి? నీవే నాతో చేయించు కుంటున్నావు స్వామి'' అనేవాడుట?
అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనుకున్నారుట,
వీడేమో – అంతా స్వామి వారే చేయిస్తున్నారు అని అనుకుంటున్నాడు,
నేనేమో – నేను చేస్తున్నాను అని సమర్పిస్తున్నాను.
ఇదే మనమందరము చేసే పెద్ద తప్పిదం.
భీముడు అన్నం తినే ముందు మట్టితో చిన్న మూకుడు చేసి, అందులో అన్నం ముద్ద పెట్టి, స్వామి వారికి సమర్పించి తను తినేవాడుట. స్వామి వారు భీముడి భక్తికి పొంగిపోయి శ్రీదేవి, భూదేవి సహితుడై, దివ్య విమానంలోంచి దిగి, భీముడి పాక ముందు ప్రత్యక్షమయ్యారుట. వెంటనే స్వామి వారు భీముడిని కౌగలించుకుని, భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి, తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్ని భీముడి మెడలో వేసారట. అలాగే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, వారి ఆభరణాలన్ని భీముడి భార్యకి తొడిగారుట. స్వామి వారు గరుత్మంతుడిని పిలిచి ఈ జీవుడిని సశరీరంగా, వైకుంఠానికి తీసుకువెళ్ళమని ఆదేశించారు. ఇప్పటికీ స్వామివారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగు అన్నం. ప్రతి రోజూ ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు. అదొక్కటే తింటారు స్వామి వారు.
సారాంశం:
ఎక్కడ భక్తి ఉందో అక్కడ వశుడై పోతాడు స్వామి.
ఎక్కడ గర్వం/అహంకారం ఉన్నాయో అక్కడ ఆయన ఉండరు.
Read More

రాగిపాత్ర విశిష్టత



రాగిపాత్ర విశిష్టత

ప్రపంచంలో మనకు కనిపిస్తున్న లోహాలలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అవి దైవానికి ప్రతిరూపాలుగా కూడా చెబుతారు. సువర్ణం ఈశ్వర సంబంధమైనది. తామ్రం విష్ణు సంబంధమైనది. తామ్రం (రాగి) విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. బంగారము, వెండి, కంచు లాంటి ఇతర లోహాలు ఎన్ని ఉన్నా రాగి అన్నా, రాగితో చేసిన పాత్రలన్నా శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనవి అనే విషయాన్ని రుజువు చేస్తోంది వరాహపురాణం. ఈ పురాణంలోని నూట అరవై ఎనిమిదో అధ్యాయంలో సాక్షాత్తూ వరాహ రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువే భూదేవికి ఈ విషయాన్ని వివరించాడు.


భూదేవి ఓ రోజున శ్రీమహావిష్ణువును ఏ పాత్రలో నైవేద్యం పెడితే ఆయనకు ఇష్టమో చెప్పమని కోరింది. అప్పుడు ఆయన చాలామంది తనకు బంగారు, వెండి, కంచు పాత్రలలో నైవేద్యం పెడుతుంటారని, కానీ తనకు రాగి పాత్ర అంటేనే ఎంతో ఇష్టమని చెప్పాడు. దానికి ఓ కారణం ఉందని కూడా వివరించాడు.

పూర్వం రాక్షసులలో గూడాకేశుడు అనే ఓ రాక్షసుడుండేవాడు. అతడు రాక్షసుడైనా దుర్మార్గపు బుద్ధి లేకుండా దైవచింతనతో ప్రవర్తిస్తూ శ్రీమహావిష్ణువునే నిరంతరం ఆరాధిస్తూ ఉండేవాడు. అలా ధర్మకాముడై నిశ్చలబుద్ధితో పదహారు వేల సంవత్సరాలపాటు గూడాకేశుడు విష్ణువు గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఏమికావాలో కోరుకోమన్నాడు. అప్పుడా అసురుడు తనకు వేరే ఏమీ అక్కరలేదని వేల జన్మల పాటు విష్ణుభక్తి తనకు ఉండేలా అనుగ్రహించమన్నాడు. అంతేకాక శ్రీమహావిష్ణువు విడిచిన చక్రం వల్ల తనకు మరణం కలగాలని అప్పుడు తన శరీరమంతా రాగి లోహంగా మారిపోవాలని కోరుకున్నాడు. ఆ పరిశుద్ధమైన లోహంతో తయారైన పాత్రలో ప్రతినిత్యం శ్రీమహావిష్ణువుకు నైవేద్యం అందేలా వరమివ్వమని గూడాకేశుడు విష్ణువును ప్రార్థించాడు. గూడాకేశుడిని విష్ణువు అలాగేనని అనుగ్రహించి అంతర్థానమయ్యాడు. ఆ తరువాత కూడా ఆ రాక్షసుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు.

వైశాఖశుద్ధ ద్వాదశినాడు శ్రీమహావిష్ణువు ఆ అసురుడి కోరిక తీర్చాలనుకున్నాడు. గూడాకేశుడు కూడా తనకు అంతటి భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని ఎదురుచూస్తూనే ఉన్నాడు. అతడిలోని నిర్మలభక్తికి మెచ్చిన విష్ణువు వైశాఖ శుద్ధ ద్వాదశినాడు సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తున్న సమయంలో విష్ణువు తన చక్రాన్ని ప్రయోగించాడు. వెంటనే అది అతడిని ఖండించింది. అతడి మాంసమంతా తామ్రం అయింది. అతడి శరీరంలోని అస్థులు వెండి అయ్యాయి. మలినాలు కంచులోహంగా అయ్యాయి. తనను జీవితాంతం అలా స్మరిస్తూ ఉన్న భక్తుడి కోరికను తీర్చాడు విష్ణువు. గూడాకేశుడి శరీరంనుంచి ఏర్పడిన తామ్ర లోహంతో ఒక పాత్ర తయారయింది. ఆ పాత్రలో పెట్టిన నైవేద్యమంటే విష్ణువుకు మహా ప్రీతికరమైంది. ఆ తరువాత తరువాత భక్తులెవరైనా రాగిపాత్రలో పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే విష్ణువు ఆనందంతో స్వీకరించసాగాడు.

రాగి పాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలపాటు ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు తన లోకంలో ఉండగలడని శ్రీమహావిష్ణువు భూదేవితో చెప్పాడు. రాగి లోహాన్ని గురించి విశేషంగా చెప్పిన కథ ఇది. ఆరోగ్య శాస్త్ర రిత్యా పరిశీలించి చూసినా రాత్రి పూట రాగిపాత్రలో పోసివుంచిన నీటిని ఉదయాన్నే లేవగానే తాగిన వారికి రక్తశుద్ధి జరుగుతుందని, ఆరోగ్యకరంగా ఉంటుందని ఈనాడు కూడా అనుభవజ్ఞులెందరెందరో చెబుతున్నారు.

మూలశంక, జ్వరము, రక్తపిత్తము, శోధ (వాపులు), కుష్టము, శరీరము లావెక్కుట మొదలగు రోగాలు రావు. వార్ధక్య లక్షణములు లేక మానవుడు 100 సంవత్సరములు ఆరోగ్యముగా జీవించును. అటులే ముక్కు రంధ్రములను 300 మీ.లీ. నీటిని పీల్చి శుభ్రము చెసుకొన వలయును. ఈ విధముగా చేయుట వలన పడిశం, తుమ్ములు, దగ్గు, ముక్కులో వచ్చే వ్యాధులు తగ్గును. ఈ క్రియను యోగ, ప్రకృతి చికిత్సల్లో నేటికినీ చేయుచున్నారు వారమునకు ఒకసారి నువ్వుల నూనెతో తైలమర్దన చేయుటవలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా తామ్రలోహం ఇతర లోహాల కన్నా ఎంతో విశిష్టమైనదని పురాణ వాజ్ఞ్మయం పేర్కొంటోంది.
Read More

జీసస్ పుట్టిన తేదీ డిసెంబర్ 25- కాదా ?? ఏసు జననం మీద కానీ తేదీ మీద కానీ కనీసం బైబిల్ కూడా స్పష్టత ఇవ్వకున్నా క్రైస్తవ సోదరులు డిసెంబరు 25 న ఆయన జన్మదినోత్సవం గా యే లెక్కన జరుపుతున్నారో ??



లూకా సువార్త 1 వ అధ్యాయం 5 వ వాక్యం నుంచి హేరోదు అనే రాజు జూదా ని పాలించే రోజుల్లో జేకర్య భార్య అయిన ఎలిజబెత్ 6వ నెల గర్భం తో ఉన్నపుడు గాబ్రియల్ అనే దేవదూత మేరీ కి దర్శనం ఇచ్చి గర్బవతిని అయ్యేలా చేసింది(luke1.26-27)! అనగా ఎలిజబెత్ ప్రసవించిన 6 నెలలకి మేరీ కూడా ప్రసవించాలి !

ఇక లూకా 2వ అధ్యాయం లో 2వ వాక్యం నుంచి Cyrenius (సిరేనస్) సిరియా దేశానికి ఆదిపతిగా ఉన్నపుడు ప్రజల లెక్కింపు జరిగినట్టు ఆ కార్యక్రమానికి జోసెఫ్ గర్భవతి అయిన తన భార్యను తీసుకొని బెత్లహేమూకీ వెళ్ళినట్టు అక్కడ ఉండగానే ప్రసవ దినములు నిండినట్టు లూకా2.1-6 వరకు స్పష్టం అవుతోంది !


ఇప్పుడు వాస్తవికత లోకి వస్తే చరిత్ర ప్రకారం హేరోదు అనే రాజు CE(Common Era) 4 న మరణించాడు ! ఆయన మరణించిన దాదాపు సంవత్సరం తర్వాత అనగా దాదాపు CE(Common Era) 6 వ సంవత్సరం లో Cyrenius (సిరేనస్) సిరియా దేశానికి ఆదిపతిగా ఎన్నిక అయ్యాడు అన్నది చరిత్ర చెప్తున్న నగ్న సత్యం ! కానీ బైబిల్ లో మాత్రం వీరు ఇరువురు పాలనలో ఉండగానే ఏసు జననం అన్నది శుద్ద అపద్ధం ! ఏసు జననం మీద కానీ తేదీ మీద కానీ కనీసం బైబిల్ కూడా స్పష్టత ఇవ్వకున్నా క్రైస్తవ సోదరులు డిసెంబరు 25 న ఆయన జన్మదినోత్సవం గా యే లెక్కన జరుపుతున్నారో ఇప్పటికీ అంతుపట్టనిదే ! ఏసు జననం లో వాస్తవికత
Read More

బైబిల్ లో జీసస్ అసలు పేరు జీసస్ (JESUS) కాదా?

బైబిల్ లో జీసస్ అసలు పేరు జీసస్ (JESUS) కాదా? అవును బైబిల్ లో జీసస్ అసలు పేరు ఏషు(YESHUA), ZEUS అన్న గ్రీకు దేశపు దేవుడి పేరు నుంచి అరువు తెచ్చుకున్నదే జీసస్! బైబిల్ కొత్తనిభందన అన్నది గ్రీకు బాష లో రాయటం వల్ల ఏషు(YESHUA) అన్నది యూదుల పేరు కావటము వల్ల ఆ పేరు తొలగించి గ్రీకులు దేవుడిగా కొలిచే ZEUS పేరుతో కలిపి జీసస్(JESUS) అనే పేరు పెట్టి అప్పటికే గ్రీకులు,రోమన్ల కు సంప్రదాయా దేవుడైన ZEUS మరియు JESUS ఒక్కరే అని చెప్పి వారిని మార్చటం జరిగింది! ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే వీరు జరుపుకునే క్రిస్టమస్ డిసెంబర్ 25 వ తేది నాడే గ్రీకులు,రోమన్ల దేవుడు ZEUS పుట్టడం గమనార్హం! వీటన్నిటికన్నా ముఖ్యంగా "J" అన్న ఆంగ్ల అక్షరం కేవలం 500 సంవత్సరాల నుంచి మాత్రమే వాడుకలో ఉంది అంతకు పూర్వం లేదు! "J" అక్షరాన్ని ప్రదమంగా 1524AD లో గుర్తిస్తే దాన్ని ఆంగ్లం లో వాడింది మాత్రం 1633AD వ సంవత్సరమున! కావున వీరు అనుకుంటున్నా జీసస్ అన్న పదం ZEUS నుంచి కల్పితమే కానీ అయన నిజమైన పేరు మాత్రం కాదు!ప్రస్తుతం అయన ఆకారం కూడా ఆయనదే కావటం గమనార్హం !
Read More

1500 Year Old Bible Confirms That Jesus Christ Was Not Crucified



1500 Year Old Bible Confirms That Jesus Christ Was Not Crucified – Vatican In Awe
Discovered and kept secret in the year 2000, the book contains the Gospel of Barnabas – a disciple of Christ – which shows that Jesus was not crucified, nor was he the son of God, but a Prophet. The book also calls Apostle Paul “The Impostor”. The book also claims that Jesus ascended to heaven alive, and that Judas Iscariot was crucified in his place.
A report by The National Turk says that the Bible was seized from a gang of smugglers in a Mediterranean-area operation. The report states the gang was charged with smuggling antiquities, illegal excavations, and the possession of explosives. The books itself is valued as high as 40 Million Turkish Liras (approx. 28 mil. Dollars). Man, where is the Thieves Guild, when you need them?

According to reports, experts and religious authorities in Tehram insist that the book is original. The book itself is written with gold lettering, onto loosely-tied leather in Aramaic, the language of Jesus Christ.The text maintains a vision similar to Islam, contradicting the New Testament’s teachings of Christianity. Jesus also foresees the coming of the Prophet Muhammad, who would found Islam 700 years later.
It is believed that, during the Council of Nicea, the Catholic Church hand-picked the gospels that form the Bible as we know it today; omitting the Gospel of Barnabas (among many others) in favor of the four canonical gospels of Matthew, Mark, Luke and John. Many biblical texts have begun to surface over time, including those of the Dead Sea and Gnostic Gospels; but this book especially, seems to worry the Vatican.
The Catholic Church wants in

What does this mean to Christian-derived religions and their followers? Quite a tight spot. The Vatican has asked Turkish authorities to let them examine the contents of the bookwithin the Church. Now that the book has been found, will they come to accept the it and its evidence? Will they deny it altogether? Call it a “Muslim lie”, as did the “Truth” Magazine, in 2000?
To many, this book is a beacon of hope, that believers soon realize that the object of their adoration is arbitrary; and that all text, especially religious text, is subject to interpretation.
What does this mean to atheists/agnostics/secular thinkers? Is the text real? Fake? Does it matter? Hopefully, this news inspires the religious to ask questions, instead of pointing fingers or believing anything blindly.
Please, don’t go poking fun or tossing around the “I told you so!”s. The biggest danger of faith is when people believe what they want to believe, defending against any and all evidence; especially when that evidence revolutionizes their foundation from the ground up. And the biggest culprit to that danger is the ego trap: rejecting/criticizing others, for being unlike you.
For centuries, the “defense” of blind faith has driven nations to war, violence, discrimination, slavery and to become the society of automatons that we are today; and for just as long, it has been justified with lies. If you know better, act like it.
Read More

భారత జ్యోతిష్య/ఖగోళ శాస్త్ర పితామహుడు:: వరహ మిహిరుడు:: మనకు తెలియని ఎన్నో శాస్త్రాలను పరిచయం చేసారు.. ఆరోజుల్లో వారు చేసిన శాస్త్ర పరిశోధనలు ప్రస్తుతం ఎన్ని వందల డాక్టరేట్ లు ఇచ్చినా సరిపోవు.. వాటిలో మచ్చుకు కొన్నిటి పరిచయం.. ఈ టపాలో...



భారత జ్యోతిష్య/ఖగోళ శాస్త్ర పితామహుడు:: వరహ మిహిరుడు::
మనకు తెలియని ఎన్నో శాస్త్రాలను పరిచయం చేసారు.. ఆరోజుల్లో వారు చేసిన శాస్త్ర పరిశోధనలు ప్రస్తుతం ఎన్ని వందల డాక్టరేట్ లు ఇచ్చినా సరిపోవు.. వాటిలో మచ్చుకు కొన్నిటి పరిచయం.. ఈ టపాలో...
ఉజ్జయిని నగరానికి సమీపంలో క్రీ.శ 4 వ శతాబ్దంలో ఆదిత్యదాసుడనే జ్యోతిశ్శాస్త్ర పండితునకు జన్మించాడు మిహిరుడు. తండ్రి వద్ద గణిత జ్యోతిశ్శాస్త్రములు నేర్చుకున్న మిహిరుడు పాట్నా లో నాటి సుప్రసిద్ధ గణీత శాస్త్రవేత్త ఆర్యభట్టు ను కలుసుకొని ఆయనతో శాస్త్ర చర్చ జేశాడు. అనంతరము ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలను అధ్యయనం జేయాలని నిర్ణయించుకొని అసాధారణ కృషి సలిపారు. ఆయన నిరంతర అధ్యయన ఫలితాలు అతని గ్రంధాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
జలార్గళ శాస్త్రమంటే తెలుసా?? భూమ్మీద ఎక్కడెక్కడ నీరు దొరుతుందో తెలిపే శాస్త్రం. ఆయన రాసిన ‘బృహత్సంహిత’ లో ఈ జలార్గళ శాస్త్రం కేవలం ఒక అధ్యాయమట. అసలు గ్రంథం బృహత్సంహిత ఇంకెంత గొప్పగా ఉండేదో...
ఈ శాస్త్రంలో మనకు తటాకాలు/బావులు వగైరాలు ఎన్ని రకాలు? ఎలాంటి ‘లక్షణాలు’ ఉంటే తటాకం అంటారు? ఎలాంటి లక్షణాలు ఉంటే ‘పుష్కరిణి’ అంటారు? ‘కూపం’ అని ఎప్పుడంటారు? ఇలాంటివి చెప్పాక, నీరు ఎలా ఉన్నా కూడా ‘వంకమద్ది చెట్టు పట్టతుంగగడ్డలు, వట్టివేళ్ళు ఎండబెట్టి చూర్ణము చేసి అట్టి జలాశయములలో వైచిన అవి మధురజలంబులగును’ అనే పద్యం చూస్తే ఎలాంటి నీటినైనా సరే మధుర జలాలుగా మార్చవచ్చని తెలుస్తుంది.. నేటి మినరల్ వాటర్ సంస్కృతి ఏనాటి నుండో ఉండేదన్నమాట....!!
మానవుల శరీరంలో రక్త ప్రసరణకు రక్తనాడులు ఉన్నట్లే భూగర్భంలో నీటి ప్రవహం కోసం జలనాడులుంటాయనీ, అవి గుర్తించడానికి మామూలు మనుషులకి ఉపయుక్తమౌతుందని ఈ పుస్తకం రాసానని వరహమిహురుడు చెప్పాడు ఒక శ్లోకంలో. భూమ్మీదకి పడే నీరు ఒకే రంగు, రుచి కలదైనా, ఎక్కడ పడింది? అన్నదాన్ని బట్టి దాని రంగూ,రుచీ మారతాయి. కనుక, భూవిశేషముల గురించిన ఎరుకతో బావులు తవ్వాలి అని మిహిరుడి అభిప్రాయం. ఇక, జలనాడులు ఏవో, వాటిలో ప్రధానమైనవి, అధిక జలాలు కలిగేవీ ఏవో చెప్పారు.
తరువాత నుండి, ఎక్కువ నీరు ఉండే ప్రాంతాన్ని గుర్తించే సూచనలతో నిండింది పుస్తకం. ఉదాహరణకు:
శ్లో: “జంబూవృక్షస్య ప్రాగల్మీకో యధి భవేత్సమీవస్థః,
త్స్మాద్ధక్షిణపార్శ్వే సలిలం పురుష్వయే సాధు” (తొమ్మిదో శ్లోకం)
-అంటే నిర్జల ప్రదేశంలో ఉన్న నేరేడు చెట్టుకు తూర్పు దిక్కులో పుట్ట ఉంటే, దానికి దగ్గర్లో దక్షిణాన రెండు పురుష ప్రమాణములలోతు తవ్వితే అక్కడ అతి మధురమైన జలనాడి ఉంటుందట. (పురుష ప్రమాణము అంటే దాదాపు పది అడుగులంట)
ఇలా ఇతర చెట్ల కింద, లేదంటే ఇతర సందర్భాల్లో, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో వివిధ శ్లోకాల్లో చెప్పారు. సగం పైగా ముగిశాక, ‘ఇప్పటి దాకా సారస్వత మహాముని చే చెప్పబడిన జలార్గళ శాస్త్రమును చెప్పితిని. ఇప్పుడు మనువుచే చెప్పబడిన జలార్గళ శాస్త్రమును చెప్తాను అని చెప్పి, మరి కొన్ని సూచనలు ఇచ్చారు. అలాగే, బావులు గట్రా తవ్వుతున్నప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు అడ్డం పడొచ్చు. వాటిని ఎలా పగులగొట్టాలో కూడా ఈ పుస్తకంలో చెప్పారు. అలాగే, చివరగా, చెరువులు ఎలా నిర్మిస్తే ఎక్కువ కాలం మన్నుతాయో, చెరువుల చుట్టూ ఎలాంటి వృక్షాలు పెంచాలో కూడా చెప్పారు. బావి తవ్వడానికి ఏ నక్షత్రాలు అనుకూలమో, ఏ దిక్కుల్లో తవ్వాలో కూడా చెప్పి ముగించారు. చివర్లో తవ్వడానికి ఉపయోగించవలసిన ‘జువ్వి పంగల పుల్ల’ ఎలాంటిది ఉండాలో చెప్పారు
ఈ అధ్యాయములోని విషయాలు అధారముగా ప్రస్తుతం వేగంగా పరిశోధనలు చేయుట జరుగుతుంది. భూగర్భ లోహం కనుక్కునేందుకు వరాహమిహిరుని సిద్ధాంతాలు ఉపయోగిస్తున్నారు. చెట్లు,ఆకులు పరిశీలించి వీటి అంచనాయే గాక, ఖనిజ సంపత్తిని అంచనా వేసే క్రొత్త శాస్త్రము ఈ అధ్యాయం ఆధారంగా ఉధ్బవించింది...
Read More

సంప్రదాయాన్ని ఎందుకు అనుసరించాలి? అది ఏవిధంగా శాస్త్రీయమైనది-

సంప్రదాయాన్ని ఎందుకు అనుసరించాలి?
అది ఏవిధంగా శాస్త్రీయమైనది- అని ఒకరు నన్ను ప్రశ్నించారు. మొదటగా సంప్రదాయం అనే మాటకు అర్ధం ఏమని చెప్పారో తెలుసుకుందాం.
‘సమ్యక్ ప్రకర్షణే దీయతే ఇతి సంప్రదాయః’
సమ్యక్ అంటే క్షుణ్ణంగా ఆలోచించినది. ప్రకర్షేణ అంటే అర్థవంతమైనదిగా నిగ్గు తేల్చినది. దీయతే అంటే అందివ్వబడినది.
క్షుణ్ణంగా ఆలోచించి, అర్థవంతమైనదిగా నిర్థారించుకుని అందించేదే సంప్రదాయం అని భావం. సంప్రదాయాలను గౌరవించడం అంటే పూర్వీకుల అనుభవసారాన్ని ఉపయోగించుకుని జ్ఞానమార్గంలో కొత్తపుంతలు తొక్కడం. ఇది శాస్త్రీయమా? లేక ప్లగ్గులో ఎందుకు వేలు పెట్టకూడదు? మేం వేలు పెట్టుకుని చూసి, ప్రమాదమనిపిస్తేనే దానికి దూరంగా ఉంటామని అనడం శాస్త్రీయమా? మద్యపానానికి దూరంగా ఉండాలన్నది సంప్రదాయం. మద్యపానం చేసి, దాని వల్ల కలిగే కష్టనష్టాలన్నీ ప్రయోగాత్మకంగా రుజువు చేసుకుని, అప్పుడు దానికి దూరంగా ఉండడం శాస్త్రీయమైన మార్గమని అనుకుంటే, మనుషులుగా కాక, మనని మనమే గినీపిగ్స్ గా చేసుకున్నట్లవుతుంది.
ప్రతిదీ పరీక్షించుకోవలసి వస్తే ఇలా ఒకటా, రెండా? జీవితం చాలదు. దంతధావనానికి పందుంపుల్లను ఉపయోగించేవారు. ఎనభై ఏళ్ల వయసు వచ్చినా పన్ను కదిలేది కాదు. నేడు నైలాన్ బ్రష్షులు, పేస్టులు వాడుతున్నారు. దంత వైద్యులకు గిరాకీ పెరిగిపోయింది. తులసి చెట్టు చూట్టూ చేసే ప్రదక్షిణలు ఆరోగ్యాన్ని సూచించే తేజస్సును పెంచుతున్నాయని సశాస్త్రీయంగా కనుగొన్నారు. ఇటువంటి వన్నీ గమనిస్తే సంప్రదాయం విలువను ఇంతింతని అనగలమా? సంప్రదాయాన్ని నెలకొల్పే ముందు మన పూర్వీకులు వ్యాపార దృష్టికి తావ్వివ్వకుండా ప్రకృతికి, మానవ శ్రేయస్సుకు పెద్దపీట వేయడం దీనికి మూలకారణం.
వారు అందించిన పద్దతిలో పరంపరగా విజ్ఞాన వివేకాలను ప్రసారం చేసుకునే సంప్రదాయమే
మన భారతీయత



Read More

నీ తాత ముత్తాతలు మహా మేధావులు అని నీకు తెలుసా ?? తెలియక పొతే తెలుసుకో రా చవట, దద్దమ్మ ............etc (వాళ్ళు మేధావులు కాబట్టే దశ అవతారాలను పూజించారు )

మన పురాణాలు పుక్కిటి పురాణాలు కావు... డార్విన్ ప్రతిపాదించకముందే శ్రీ మహావిష్ణుఅవతార పరిక్రమ మనకు ఇదే విషయాన్ని తెలిపింది...(అస్సలు మన పురాణాలు వచ్చిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత డార్విన్ పుట్టి ఉండవచ్చు కానీ మనకు తెలిసిన సారూప్యతను ఇక్కడ ఉంచాను...) ప్రపంచంలో జరుగుతున్న / జరిగిన ప్రతి అద్భుతం గురించిన వివరణ మన పురాణాలలో ఉంది..దానిని తెలుసుకోవడమే ఆధునిక విజ్ఞానం.  నీ  తాత  ముత్తాతలు  మహా మేధావులు   కాబట్టే,  కొన్ని వేల  సంవచ్చరముల   క్రితమే దశ  అవతారాలను పూజించారు )





Read More

ఇంతకీ మనం మన దేశంలోనే ఉన్నామా? -ఎం.వి.ఆర్. శాస్త్రి23/01/2016



ఇంతకీ మనం మన దేశంలోనే ఉన్నామా? -ఎం.వి.ఆర్. శాస్త్రి23/01/2016

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన పరిణామాలపై ఎంవీఆర్ శాస్త్రి గారి ఉన్నమాట.. ప్రతి ఒక్కరు తప్పకుండా చదవాలి.

ఆవేశకావేషాల ఉద్ధతిలో అసలు విషయం మరపున పడింది.
పాకిస్తాన్ తన తైనాతీలను ఉసిగొలిపి ముంబయిలో వరసగా పేలుళ్లు జరిపించి 300 మందిని నిష్కారణంగా, క్రూరాతిక్రూరంగా పొట్టన పెట్టుకుంది. ఆ పాపంలో పెద్ద్భాగం ఉన్న యాకుబ్ మెమెన్ అనే వాడిని రెండు దశాబ్దాలు లేటుగా నిరుడు ఉరి తీశారు. ఆలస్యంగానైనా న్యాయం అమలయిందని భారతీయులు సంతోషించారు. కాని మన దేశంలోని పాకిస్తాన్ తొత్తులు, మెదళ్లు పుచ్చిన మేధావులు, కుటిల రాజకీయులు దేశద్రోహిని ఉరి తీసినందుకు పెంకులెగిరేలా రంకెలేశారు.
ఆ సందర్భంలో అందరి దృష్టిని ఆకట్టుకుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యాకుబ్ మెమెన్ వీరాభిమానుల వీరంగం. వందల ప్రాణాలు బలిగొన్న పాపాత్ముడి ఉరిని వ్యతిరేకిస్తూ చదువుల తల్లి నెలవైన ఉన్నత విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పెడబొబ్బలు, చచ్చినవాడి ఆత్మశాంతికి సామూహిక ప్రార్థనలు, ‘ఒక యాకూబ్‌ను ఉరి తీస్తే ఇంటింటా ఒక యాకుబ్ పుట్టుకొస్తాడంటూ’ ప్లకార్డుల ప్రదర్శనలు తిలకించిన ప్రజలు విస్తుపోయారు.
అదే యూనివర్సిటీలో ఒక విద్యార్థి కూడా అక్కడ జరిగిన దానిని తీవ్రంగా గర్హించాడు. యాకుబ్ మెమెన్ అభిమాన సంఘం కార్యకలాపాలను అతడు అడ్డగించలేదు. ఎవరిమీదా దాడి చేయలేదు. ఎవరినీ పేరుపెట్టి దూషించలేదు. యూనివర్సిటీలో ముష్కరులు చెలరేగటం తప్పంటూ తన ఫేస్‌బుక్ ‘గోడ’మీద తనకొచ్చిన భాషలో రాసుకున్నాడు. అందులో అభ్యంతరకరమైనదేదీ లేదు. దేశద్రోహిని బాహాటంగా సమర్థించి, అమరవీరుడిగా కీర్తించే హక్కు అవతలవారికి ఉన్నప్పుడు, అది తగదంటూ వ్యతిరేకించే భావస్వేచ్ఛ ఆ విద్యార్థికి మాత్రం ఎందుకు ఉండదు?
యాకుబ్ మెమెన్ అభిమానగణం అలా అనుకోలేదు. మమ్మల్నే తప్పు పట్టేంత మొనగాడివా అంటూ అర్ధరాత్రి హాస్టల్ గదిలో అతడి మీదికి పాతిక ముప్ఫైమంది దండెత్తారు. ఆ విద్యార్థిని ఎంతలా కొట్టారు అన్నది ఇక్కడ అప్రస్తుతం. నిరసన తెలిపిన విద్యార్థి గదికి ఆగ్రహించిన గుంపు అర్ధరాత్రి వెళ్లినట్టు, బయటి గేటు దగ్గరి సెక్యూరిటీ గదికి లాక్కువెళ్లి క్షమాపణ లేఖ రాయించినట్టు అతడిని వ్యతిరేకించే విద్యార్థి నాయకులు సైతం అంగీకరించారు. ఫేస్‌బుక్‌లో అతడు పెట్టిన పోస్టును అతడిచేతే బలవంతంగా తీయంచారు.
అది దౌర్జన్యం కాదా? సెంట్రల్ యూనివర్సిటీ మన హైదరాబాద్‌లో కాక పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో ఉండివుంటే... పాకిస్తాన్ వాడిని ఇండియా ఉరి తీయటాన్ని అక్కడి ఒక భారతీయ విద్యార్థి సమర్థించగా మిగతా పాకిస్తానీలంతా కలిసి అతడిని చితకబాదారంటే - అక్కడి పరిస్థితి అది, ఆ దేశస్థుల జాతీయ సెంటిమెంటు తీవ్రత అలాంటిది అని అర్థం చేసుకోవచ్చు. కాని భారతదేశంలో భారతీయ విశ్వవిద్యాలయంలో కూడా జాతీయ భావాన్ని ప్రకటించి, జాతి వ్యతిరేక ధోరణిని గర్హించే భారతీయ విద్యార్థికి రక్షణ లేదా? జాతి వ్యతిరేకులకే తప్ప జాతీయ వాదులకు మానవ హక్కులు, రాజ్యాంగ హక్కులు ఉండవా?
దాడికి లోనైన విద్యార్థి తెలంగాణలో సామాన్య కుటుంబానికి చెందిన బి.సి. కులస్థుడు. మన మహా మేధావులు పొద్దస్తమానం ఉచ్చరించే ‘సామాజిక న్యాయా’నికి అన్ని విధాల అర్హతగల బడుగు వర్గానికి చెందినవాడు. అతడికి న్యాయం కోరుతూ అతడి తల్లి యూనివర్సిటీ గడప ఎక్కింది. దౌర్జన్య శక్తులు ఆమెను అడ్డుకున్నాయి. దిక్కుతోచక ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు యూనివర్సిటీని వివరణ కోరింది. యూనివర్సిటీ ఐదుగురు విద్యార్థులను హాస్టలునుంచి సస్పెండ్ చేసింది. దానిని నిరసిస్తూ ఆందోళన సాగుతూండగా దురదృష్టవశాత్తూ ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
అది మొదలుకుని కొద్దిరోజులుగా దేశం మొత్తం సెంట్రల్ వర్సిటీ మీద దృష్టి నిలిపింది. అక్కడి పరిణామాలు, ఆత్మహత్య పూర్వాపరాల గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఎవరి అభిప్రాయం వారు చెబుతున్నారు. తప్పులేదు. ఎవరు చెప్పేదానినీ కొట్టి పారేయడానికి వీల్లేదు. ఎవరి సెంటిమెంటునూ, ఎవరి భావావేశాన్నీ కించపరచవలసిన పనిలేదు. ఆయా వాద ప్రతివాదాల మంచిచెడ్డలు ఇక్కడ చర్చనీయాంశం కానేకాదు.
మరణించిన విద్యార్థి తల్లీ తండ్రీ వడ్డెర కులస్థులని ఆ తండ్రిని కన్న తల్లే స్వయంగా చెప్పింది. ఆ కులం బి.సి. జాబితాలోకి వస్తుంది. తమది బి.సి. వర్గమని ఆ విద్యార్థి తండ్రి చెబుతున్నాడు. అదే నిజమైతే ఆ విద్యార్థి దళితుడు కాడు. అతడు దళిత స్కాలర్ అని మీడియాలో జరుగుతున్నది ముమ్మాటికీ అసత్య ప్రచారం.
చనిపోయన రోహిత్ దళితుడు కానంతమాత్రాన ఇప్పుడు యూనివర్సిటీలో దళితులకు అన్యాయం గురించి రగులుతున్న ఆందోళన అంతా అసంబద్ధమని చెప్పటం సరికాదు. తాము సామాజికంగా ఇప్పటికీ తగని వివక్ష ఎదుర్కొనవలసి వస్తున్నదన్న ఆవేదన, అసంతృప్తి దేశం మొత్తంలోని దళితుల్లో ఉన్నట్టే ఈ వర్సిటీలోని దళిత విద్యార్థి, ఉపాధ్యాయ వర్గాల్లోనూ బలంగా ఉన్నమాట యథార్థం. దానిని సానుభూతితో అర్థం చేసుకుని, సంఘీభావం తెలిపి, దళితుల చిత్తక్షోభను తొలగించేందుకు సర్వ విధాలా సహకరించాల్సిన బాధ్యత సమాజ శ్రేయస్సును కోరే ప్రతి ఒక్కరి మీద ఉందన్నది నిర్వివాదం. దళిత వర్గాల్లో అసహనం, అసంతృప్తి ఇంతలా పేరుకు పోవడానికి కారణాలు అనేకం ఉన్నాయ. యూనివర్సిటీ నిర్వాహకులు చేసిన తప్పులు, అవకతవక నిర్ణయాలు చాలానే ఉండి ఉండొచ్చు. దళిత రిసెర్చిస్కాలర్లను సస్పెండ్ చేసిన తీరూ అనుమానాస్పదమే. వాటన్నిటినీ కూలంకషంగా విచారించాల్సిందే. దోషులు ఎవరైనా, ఎంతటివారైనా శిక్షించవలసిందే. చాలా కాలంగా యూనివర్సిటీలో తాండవిస్తున్న అశాంతిని అంతమొందించి, అవాంఛనీయ ధోరణులను అవశ్యం అరికట్టవలసిందే.
ఇందులో మరోమాటకు తావులేదు. ఎటొచ్చీ కొద్ది రోజులుగా హెచ్‌సియు వేదికగా మారుమోగుతున్న రాజకీయ కాహళిని గమనిస్తున్న సామాన్యులకు సందేహమల్లా ఒక్కటే. ఇప్పటి గొడవ మొత్తానికీ మూలం నిరుడు యాకుబ్ మెమెన్ సమర్థకుల అగడాలు కదా? దాని గురించి ఎవరూ మాట్లాడరేం? పవిత్ర విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని అలాంటి పాడు పనికి దుర్వినియోగం చేసిన వారిని శిక్షించాలా వద్దా? ఆ అకృత్యాన్ని అధిక్షేపించిన విద్యార్థిపై జరిగిన దౌర్జన్యాన్ని- దాని తీవ్రత ఎంతయినా- ఖండించాలా వద్దా? ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ టెర్రరిజం విజృంభించి, ‘ఐసిస్’ ఏజంట్లు హైదరాబాద్ సహా పలుచోట్ల పట్టుబడుతూ, పఠాన్‌కోటపై పాక్ ప్రచ్ఛన్న దాడి దేశమంతటినీ నిర్ఘాంత పరిచిన స్థితిగతుల్లో ఉన్నత విశ్వవిద్యాలయాలు టెర్రరిస్టుల సమర్థకులకు ఆటపట్టు కావటాన్ని జాతిభద్రతకు తీవ్ర సమస్యగా పరిగణించాలా వదా ద?
యూనివర్సిటీ అధికారుల దుర్విధానాలవల్ల విద్యార్థులకు కష్టం కలిగితే వారూ వారూ తేల్చుకోవచ్చు. తమకు అన్యాయం చేసిన అధికారులపై కఠిన చర్య తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు ఎంతైనా పోరాడవచ్చు. తమ హద్దులను గుర్తెరిగి ఎంత దూరమైనా వెళ్లవచ్చు. కాని ఈ పోరులోకి కేంద్రమంత్రులను లాగడమెందుకు? మధ్యలో వారేమి చేశారు? మెమెన్ వత్తాసుదారుల విజృంభణను, విద్యార్థిపై మూకుమ్మడి దాడిని ఒక విద్యార్థి సంఘం తన దృష్టికి తెస్తే ఆ సంగతేదో కనుక్కొనమని, వర్సిటీలో జాతి వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టాలని కేంద్రమంత్రి దత్తాత్రేయ సంబంధిత మంత్రిత్వ శాఖకు లేఖ రాయటం తప్పా? స్థానిక ప్రజాప్రతినిధిగా అది ఆయన బాధ్యత కాదా? యూనివర్సిటీలో దళిత విద్యార్థులు, దళిత అధ్యాపకులకు జరుగుతున్న అన్యాయాలకూ, వాటిపై దళిత వర్గాలు సాగిస్తున్న న్యాయమైన పోరాటాలకూ - దీనికీ సంబంధమేమిటి? వందలమంది ప్రాణాలు హరించిన పాకిస్తానీ విద్రోహిని అమరవీరుడిగా, మహాపురుషుడిగా చిత్రిస్తూ సంస్మరణ సభలు, ప్రదర్శనలు జరపటం జాతి వ్యతిరేక చర్య కాదా? సాటి కేంద్రమంత్రి పంపిన మహజరును విచారించి, తగిన చర్యలు తీసుకోవాలంటూ యూనివర్సిటీ అధికారులను ఆదేశించటం మానవ వనరుల మంత్రిణి విధ్యుక్త ధర్మం కాదా? విషయ ప్రాధాన్యం దృష్ట్యా దాని సంగతి ఏమైందని ఆర్నెల్ల తరవాత ఒకటికి రెండుమార్లు మంత్రిత్వ శాఖ వర్సిటీ వారిని కనుక్కోవటం తప్పా? అది వారి మీద ఒత్తడి పెట్టి, అనుచిత నిర్ణయానికి ప్రేరేపించటం ఎలా అవుతుంది? ఫలానా వారి మీద ఫలానా ఫలానా చర్యలు తీసుకొని తీరాలని మంత్రి నిర్బంధించిన దాఖలాలున్నాయా? లేనప్పుడు కేంద్రమంత్రిని ఆడిపోసుకోవటం ఎందుకు? మొత్తం వ్యవహారాన్ని దళితులకు జరిగిన అన్యాయంగా వ్యతిరేకులు చిత్రిస్తున్నప్పుడు దాన్ని ఖండించటం కోసం కేంద్రమంత్రిణి అది దళిత - దళితేతర వివాదం కానే కాదంటూ తన వాదం వినిపించటం, ఆ సందర్భాన అనివార్యంగా సామాజిక వర్గాలను ప్రస్తావించవలసి రావటం ఏ రకంగా నేరం?
మరణించిన విద్యార్థే తన చావుకు ఎవరూ కారణం కాదని, ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని రాసిపెట్టినప్పుడు అతడి మరణానికి ఇద్దరు కేంద్రమంత్రులు కారకులని, వారిని ఎఫ్.ఐ.ఆర్.లో చేర్చి, మంత్రి పదవులు ఊడగొడితేగానీ కుదరదని పంతం పట్టటం ఎటువంటి తర్కం?
ఆత్మహత్య చేసుకున్న రోహిత్ పిరికివాడు కాదు. కాషాయం కనిపిస్తే చింపుతానని, ఎ.బి.వి.పి., ఆరెస్సెస్, హిందూమతం అంటే తనకు అసహ్యమని నిర్భయంగా చాటగలిగిన ధీరుడు. స్వామి వివేకానంద నకిలీ మేధావి అని కనిపెట్టగలిగిన జ్ఞాని. అలాంటివాడు కేవలం దత్తాత్రేయ కేంద్రానికి రాసిన ఉత్తరానికే, ఢిల్లీ నుంచి వర్సిటీకి వచ్చిన రిమైండర్లకే బెదిరి, జీవితమంటే విరక్తి చెంది న్యాయపోరాటాన్ని బహిరంగ ఉద్యమాన్ని అర్ధాంతరంగా చాలించి ఆత్మహత్య చేసుకుంటాడంటే నమ్మడం కష్టం. బండారు దత్తాత్రేయో, స్మృతి ఇరానో అదృశ్యరూపంలో వచ్చి అతడి మెడకు ఉరివేశారని అనుకోలేము కాబట్టి అతడి చావు తెగింపుకు బలమైన కారణమే ఏదో ఉండాలి. అదేమిటి?
ASA, SFI anything and everything exist for their own sake. Seldom the interest of a person and these organisations match ఎస్.ఎఫ్.ఐ. (స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఏదైనా, ఏవైనా తమకోసమే ఉన్నాయి. ఒక వ్యక్తి ప్రయోజనాలు, ఈ సంస్థల ప్రయోజనాలు ఎప్పుడూ కలవవు అని రోహిత్ ప్రాణం తీసుకునే ముంథు నోట్‌లో రాసి, కొట్టేశాడట. విద్యార్థి సంఘాల మీద భ్రమలు తొలిగి, వాటికి దూరమయ్యానన్న భావనవల్లే అతడు అఘాయిత్యానికి పాల్పడ్డాడా అని టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక శుక్రవారం అనుమానం వ్యక్తం చేసింది.
సూసైడ్ నోట్‌లో పేర్కొనక పోయినా సరే ఇద్దరు కేంద్రమంత్రులను ఆత్మహత్యకు కారకులుగా ఎఫ్.ఐ.ఆర్.లో చేర్చాల్సిందేనంటూ విద్యార్థి సంఘాలు పంతం పట్టగలుగుతున్నప్పుడు ఆ విద్యార్థి సంఘాల గురించి మృతుడే స్వయంగా పేర్కొన్న దాని కోణంనుంచి మాత్రం దర్యాఫ్తు జరగవద్దా?
రోహిత్ వాడిన సెల్‌ఫోన్ కనపడటం లేదని, దొరికిన ఫోన్‌లో సిమ్‌కార్డు లేదని ‘హిందూ’ పత్రిక రిపోర్టు చేసింది. ఆ సిమ్‌కార్డును కూడా స్మృతి ఇరానీయే ఆకాశమార్గాన వచ్చి ఎత్తుకుపోయిందా? ఆత్మహత్యపై పొడసూపిన అనుమానాలన్నిటి మీదా సమగ్ర దర్యాప్తు జరగవద్దా? విచారణ కాకుండానే విద్యార్థి సంఘాలు కోరిన ప్రకారం శిక్షలు వేసెయ్యాలా?
ఢిల్లీ రాష్ట్ర రాజకీయాలలో క్రేజీవాల్‌కూ, స్మృతి ఇరానీకి మధ్య ఎన్నో గొడవలు, రాజకీయ కక్షలు ఉండవచ్చు. ఆమె మీద అక్కసు తీర్చుకోవడానికి, తనకు విరోధి అయిన మోదీ సర్కారును మోదడానికి ‘క్రేజీ’కంటికి హెచ్‌సియు రచ్చ లడ్డూ ముక్కలా కనపడి ఉండొచ్చు. అలాగే పార్ట్‌టైం పొలిటీషియను రాహుల్ బాబుకు నేషనల్ హెరాల్డ్ కేసులో జైలుకెళ్ళేలోగా మోదీని పడగొట్టి అర్జంటుగా మళ్లీ రాజ్యాధికారం కొల్లగొట్టాలన్న ఆబ చాలానే ఉంది. బిహార్ ఎన్నికల ముందు ‘అసహనం’ లొల్లి పెట్టి, ఆ ఎన్నికలు కాగానే ఠక్కున ఆపేసిన కుటిల రాజకీయ శక్తులు అనేక రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో బిజెపిని బొందపెట్టాలనే హెచ్‌సియులో విద్యార్థి కాష్ఠం మీద పేలాలు ఏరుకోవడానికి వెంపర్లాడుతున్నాయని ఊహించటంలో తప్పులేదు. నరేంద్రమోదీని, అతని ప్రభుత్వాన్ని నిర్ణీతకాలం కూడా పనిచేయనివ్వకుండా వెంటనే పడగొట్టాలని కాచుకుకూచున్న వారి లెక్కలు ఎలా ఉన్నా, ఆ రాజకీయ గద్దల మాయాజూదానికి వర్సిటీ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పాచికల్లా ఎందుకు ఉపయోగపడాలి? విద్యార్థులపై సస్పెన్షన్లను ఎత్తివేసి, న్యాయ విచారణను ప్రకటించాక కూడా ఫలానా కేంద్రమంత్రులను తక్షణం తొలగించాల్సిందేనంటూ విద్యార్థి సంఘాలు పట్టుబట్టటం సమంజసమేనా? కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఎవరు ఉండాలో, ఎవరిని తొలగించాలో ఒక యూనివర్సిటీలోని ఆందోళనకారులు నిర్ణయిస్తారా?
హెచ్.సి.యు. అలజడి కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎలా ముగుస్తుందో తెలియదు. కాని - జాతి వ్యతిరేక కార్యకలాపాలను యూనివర్సిటీలో అరికట్టాలంటూ ఒక కేంద్రమంత్రికి ఇంకో కేంద్రమంత్రి లేఖ రాయటమే ఎస్.సి., ఎస్.టి. ఎట్రాసిటీ చట్టం కింద శిక్షించవలసిన నేరమైతే... పాకిస్తానీ విద్రోహిని కీర్తించటమే రైటు, ఆ పని తప్పు అనటమే దారుణమైన తప్పు అని అనుకోవలసివస్తే... ఈ ఆలోచనా ధోరణి ఎక్కడికి దారి తీస్తుంది? ఇంతకీ మనం మన దేశంలోనే ఉన్నామా



Read More

అఖండ భారతం.. అనాది వాస్తవం!



అఖండ భారతం.. అనాది వాస్తవం!

నాటకీయతవల్ల సంచలనాలు సంభవించవచ్చు.. కేవలం నాటకీయతవల్ల సమస్యలు పరిష్కారం కావు! ప్రధానమంత్రి హఠాత్తుగా పాకిస్తాన్‌కు వెళ్లడం అందువల్ల గొప్ప సంచలనం.. మతోన్మాది అయిన, ‘వెన్నుపోటు’ పొడవడం స్వభావమైన పాకిస్తాన్ పౌర ప్రభుత్వ అధినేత నవాజ్ షరీఫ్‌కు మోదీ పర్యటనవల్ల అంతర్జాతీయ సమాజంలో గొప్ప గౌరవం లభించింది! ఇదీ సంచలనం.. కానీ నాటకంలో అంతర్నాటకంవలె ప్రచార మాధ్యమాలవారు మరో సంచలనాన్ని సృష్టించారు!! అఖండ భారతదేశం గురించి మాట్లాడటం తెలియనివారికి వివరించడం మహాపరాధమైన భ్రాంతిని కల్పించడానికి మాధ్యమంలో జరిగిన ప్రయత్నం ఈ రెండవ సంచలనం! ‘అఖండ భారతదేశం’ ప్రముఖుల ఆలోచనలపై, రాజకీయ పక్షాల అభిప్రాయాలపై, నిరసనలపై, నిరాకరణలపై ఆధారపడి లేదు. ‘అఖండ భారతం’ సహజమైన చారిత్రక సాంస్కృతిక భౌగోళిక సనాతన వాస్తవం! రాజకీయ హరిహద్దులు తాత్కాలికమైనవి.. సంస్కృతి, జాతీయత సనాతనమైనవి, అంటే శాశ్వతమైనవి! సమాన జాతీయతగల ప్రజలను రాజకీయమైన సరిహద్దులు ఎక్కువకాలం విభజించి ఉంచలేవని అనేక అంతర్జాతీయ ఘటనలు నిరూపించాయి! క్రీస్తుశకం 1945లో రెండు దేశాలుగా ‘విభజన’కు గురైన జర్మనీ ప్రజలు 1989లో మళ్లీ ఒకటిగా ఏర్పడడం ఒక ఉదాహరణ మాత్రమే!! సమాన సంస్కృతికల ప్రజలను విడదీయడానికై బెర్లిన్ నగరంలో ఏర్పడిన రాజకీయపు ‘గోడ’ను ప్రజలే కూల్చివేశారు! రెండుగా చీలిన ‘వియత్నాం’ మళ్లీ ఏకీకృతమైంది!
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘానికి చెందిన వరిష్ఠ ప్రచారక్ రామ్‌మాధవ్ ‘అఖండ భారత’ ఆకాంక్షను వ్యక్తం చేయడం, అందువల్ల ఈ సాంస్కృతిక వాస్తవానికి అనుగుణమైన వ్యవహారం! ఆయన భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో కాక రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సభ్యుని హోదాలో ‘‘ఖండిత భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లు మళ్లీ ఏకమై అఖండ భారత్ ఏదో ఒక రోజున మళ్లీ ఏర్పడుతుందని ‘సంఘం’ విశ్వసిస్తున్నట్టు’’ మాధ్యమాలవారికి చెప్పాడట! అందువల్ల ఆయన చెప్పినది ‘తప్పు’ అయితే నిరాకరించవలసింది ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ’ ప్రతినిధులు మాత్రమే, ‘ఒప్పు’ అయితే సమర్థించవలసిందీ వారే! కానీ అనవసరంగా ముందుగానే అందుకున్న భారతీయ జనతాపార్టీ ప్రతినిధులు ‘అఖండ భారత్’ స్ఫూర్తిని నిరసించడం విచిత్రమైన పరిణామం! ‘అఖండ భారత్’ పునరుద్ధరణను ఆకాక్షించడం భారత్ పాకిస్తాన్ మైత్రికి కానీ భారత బంగ్లాదేశ్ మైత్రికి కాని ఎలా భంగకరం? ‘అఖండ భారత్’ మళ్లీ ఏర్పడాలంటున్న ‘సాంస్కృంతిక జాతీయవాదులు’ పాకిస్తాన్‌లో కూడా ఉన్నారు. ‘అఖండ భారత్’ను ‘రాష్ట్రీయ స్వయం సేవక సంఘం’ కొత్తగా కనిపెట్టలేదు. ‘అఖండ భారత్’ యుగాలుగా కొనసాగుతున్న వాస్తవం! సూర్యుని వెలుగు వంటి ఈ వాస్తవాన్ని ఈ దేశంలోని అధికాధికులు గుర్తించారు... రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం కూడా ఈ చారిత్రక వాస్తవాన్ని గుర్తించింది, అంగీకరించింది!! ‘వెలుగు’ను, వాస్తవాల వెలుగును చూడబోమని కళ్లు మూసుకునే ‘గుడ్లగూబలు’ సహజమైన పరిణామక్రమాన్ని నిరోధించలేవు! ఒకప్పటి ‘అఖండ భారత్’ మళ్లీ వాస్తవం కావడం, వైకల్యగ్రస్త అయిన భారత మాత మళ్లీ సర్వసమగ్ర స్వరూపాన్ని సంతరించుకొనడం ఈ ‘పరిణామక్రమం’! ‘అఖండ భారత్’ పునర్‌ఘటితం కావడానికి యుద్ధాలు చేయవలసిన పనిలేదు, ‘అఖండ భారత్’ ద్వారా యుద్ధాలను నిరోధించవచ్చు! స్వతంత్ర దేశాలుగా ఉన్నంతవరకు ఒకప్పటి ‘అఖండ భారత’ ప్రాంతాలు పరస్పరం కలహించడం సంభవించవచ్చు. అన్ని దేశాలూ ఒక్క దేశం అయినపుడు యుద్ధాలు ఉండవు, సైనిక వ్యయ రక్షణ వ్యయం బాగా తగ్గిపోయి లక్షలాది కోట్ల రూపాయలను ప్రగతి కలాపాలకు ఖర్చుపెట్టవచ్చు!! ‘అఖండ భారత్’ ఇలా ప్రస్తుతం స్వతంత్రంగా ఉన్న ఒకప్పటి ‘ప్రాంతాల’ సాంస్కృతిక సుగతికి మాత్రమే కాదు, ఆర్థిక ప్రగతికి కూడా దోహదకరం!!
ప్రస్తుత ‘ఖండిత భారత్’, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు మళ్లీ ఏకీకృతం కావడం ‘అఖండ భారత్’లో సగం మాత్రమే! మరో సగం నేపాల్, భూటాన్, బర్మా, శ్రీలంక, మాల్‌దీవులు, అప్ఘానిస్తాన్‌లుగా ఏర్పడి ఉన్న అఖండ భారత ప్రాంతాలు.. క్రీస్తుశకం 1947 ఆగస్టు 14న మన దేశం నుండి పాకిస్తాన్ విడిపోవడం గురించి మనకు ధ్యాస ఉంది. కానీ అంతకుపూర్వం శతాబ్దులపాటు మిగిలిన ప్రాంతాలు అఖండ భారత్‌నుండి విడిపోవడం గురించి మనకు ధ్యాస లేదు! మహాభారత యుద్ధం ముగిసిన తరువాత కలియుగం ఆరంభమయ్యేనాటికి ‘జంబూద్వీపం’ తొమ్మిది ‘వర్షా’లు- కాంటినెంట్స్‌గా ఏర్పడి ఉంది. పాశ్చాత్యులు ‘కనిపెట్టి’ భూగోళాన్ని ఖండాలుగా విభజించడానికి వేల ఏళ్ళ పూర్వం నుండి భారతీయులు ధరాతలాన్ని ద్వీపాలుగా వర్షాలుగా, ఖండాలుగా గుర్తించారు. ఎటొచ్చీ ఈ పేర్లు ఆంగ్ల భాషలో లేవు కనుక, ప్రాచీన కాలంలో ఆంగ్ల భాష లేదు కనుక భారతీయుల ‘గుర్తింపు’ను పాశ్చాత్యులు గుర్తించలేదు, మన దేశంలోని పాశ్చాత్య భావదాస్యగ్రస్తులు గుర్తించడం లేదు! కానీ జంబూద్వీపంలోని తొమ్మిది ‘వర్షాల’లో భారత వర్షం నేటి పశ్చిమాసియా మొదలు తూర్పున ఫిలిప్పీన్స్ వరకూ, ఇండోనేసియా వరకూ జపాన్ వరకూ విస్తరించి ఉండేది. ఈ భారత వర్షమంతటా సనాతన వైదిక సంస్కృతి వ్యాపించి ఉండేది! ఐరోపా వారు రచించిన చరిత్ర కూడా ఈ వాస్తవాన్ని ధ్రువీకరించింది! ఈ ‘్భరత వర్షం’లో ‘సమీకృత రా జ్యాం గ’ వ్యవస్థ ఏర్పడి ఉండిన ప్రాంతం ‘్భరత ఖండం’! భారత వర్షాన్ని పాశ్చాత్యులు ‘గ్రేటర్ ఇండియా’ అని పిలిచారు, ఇది కేవలం హిందూ సంస్కృతికి ఆలవాలమైన ప్రాంతం! సాంస్కృతిక అద్వితీయతతోపాటు సమీకృత రాజ్యాంగ వ్యవస్థ నెలకొని ఉండిన ప్రాంతం భారత ఖండం! ఈ ‘్భరత ఖండమే’ అఖండ భారత్! ఈ అఖండ భారత్ కైలాసం నుండి కొలంబో వరకూ విస్తరించింది. కైలాసం ఇపుడు టిబెట్‌లో ఉంది, కొలంబో శ్రీలంకలో వుంది! అలాగే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ నుండి బర్మా వరకూ ‘అఖండ భారత్’ వ్యాపించి ఉండేది! కలియుగం ఆరంభమై ఇప్పటికి 5116 ఏళ్లు గడిచాయి. ప్రస్తుతం 5117వ సంవత్సరం నడుస్తోంది! కానీ ‘కలి’లో 2600 ఏళ్లు గడిచిన తరువాత అంటే ‘పారశీక రాజు’ సైరస్ మన దేశాన్ని ఆక్రమించడానికి యత్నించిన నాటినుండి ‘అఖండ భారత్’ విచ్ఛిన్నం కావడం ఆరంభమైంది. ఈ సైరస్ క్రీస్తునకు పూర్వం ఆరవ శతాబ్దినాటివాడు! అఖండ భారతీయుల దృష్టి ఇలా పడమటి దురాక్రమణను నిరోధించేందుకు కేంద్రీకృతమయింది. అందువల్ల తూర్పున ఉన్న టిబెట్, బర్మాలు ‘అఖండ భారత్’ రాజ్యాంగ వ్యవస్థ నుండి దూరమయ్యాయి! ఆ తరువాత క్రీస్తుశకం 1959 వరకూ దాదాపు రెండు వేల ఐదు వందల ఏళ్లపాటు టిబెట్ స్వతంత్రదేశమైంది! బర్మా అర్థస్వతంత్ర దేశమైంది. 1959లో చైనావారు టిబెట్‌ను దురాక్రమించారు!
రెండు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వం నాటి అఖండ భారత్ అప్పటి ‘చైనా’తో సమాన వైశాల్యం కలిగిన దేశం. కానీ ‘అఖండ భారత్’ క్రమంగా ముక్కలైంది, ‘చైనా’ క్రమంగా ఇరుగు పొరుగు దేశాలను కబళించింది. చైనా ఇలా టిబెట్‌ను, ‘సింకియాంగ్’ అన్న మధ్య ఆసియా దేశాలను, మంగోలియాలో కొంత భాగాన్ని మంచూరియాను ఆక్రమించి కలుపుకొంది. ఫలితంగా ప్రస్తుత ‘ఖండిత’ భారత్ కంటే చైనా వైశాల్యం చాలా ఎక్కువగా ఉంది! అఖండ భారత విచ్ఛిత్తివల్ల ఏర్పడిన భౌగోళిక విపరిణామం ఇది! చైనాకు మనకూ మధ్య అతి పెద్ద సరిహద్దు ఏర్పడటానికి ఏకైక కారణం టిబెట్‌ను చైనా దురాక్రమించడం. టిబెట్ స్వతంత్ర దేశంగా ఉండిన సమయంలో రెండు వేల ఐదు వందల ఏళ్లపాటు చైనాతో మన దేశానికి సరిహద్దు లేదు. అంతకుపూర్వం టిబెట్ ‘అఖండ భారత్’లో భాగం! ‘సింకియాంగ్’ లేదా ‘జింఝియాంగ్’గా మారిన తూర్పు తుర్కీస్థాన్‌లో ‘ఇస్లాం’కు పూర్వం వైదిక మతాలు, బౌద్ధమతం విలసిల్లాయి. క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్దులో సింకియాంగ్ చైనాలో కలిసిపోయిన తరువాత మాత్రమే చైనాకూ మనకూ మరో సరిహద్దు ఏర్పడింది! ఇలా సహస్రాబ్దులపాటు బర్మాకు ఉత్తరంగా ఈశాన్యంగా మాత్రమే చైనాతో మనకు కొద్దిపాటు సరిహద్దు ఉండేది! అఖండ భారత విచ్ఛిత్తివల్ల చైనా దురాక్రమణ మన సరిహద్దులకు చేరింది!! చైనా ‘విస్తరణ’ ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో అఖండ భారత్ మళ్లీ ఏర్పడడం ఒక్కటే దురాక్రమణ నిరోధానికి మార్గం...
బర్మా ప్రాంతాన్ని బ్రిటీష్ వారు 1885 వరకూ దురాక్రమించలేకపోయారు. మిగిలిన భారతదేశం క్రీస్తుశకం పంతొమ్మిదవ శతాబ్ది ఆరంభం నాటికే బ్రిటీష్ వారికి స్వాధీనం అయింది. అలా 1885వరకూ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకున్న అఖండ భారత ప్రాంతం బర్మా! 1885లో బర్మా-మ్యాన్‌మార్- బ్రిటీష్ దురాక్రమిత ‘్భరత్’లో కలిసిపోయింది! ఈ కథ అలాగే కొనసాగి ఉండినట్టయితే 1947 ఆగస్టు 15 తరువాత ‘బర్మా’ స్వతంత్ర భారత్‌లో కొనసాగి ఉండేది! బ్రిటీష్ వారు కొనసాగనివ్వలేదు, 1937లోనే బర్మాను భారత్ నుంచి విడగొట్టారు!!
సింహళం అఖండ భారత అంతర్భాగమన్నది చరిత్ర నిరూపించిన వాస్తవం. సింహళ ద్వీపవాసులు తమిళనాడు దక్షిణ ప్రాంతాలను పాలించడం, తమిళ రాజులు సింహళాన్ని పాలించడం అఖండ భారత సమీకృత రాజ్యాంగ వ్యవస్థలో భాగం. మాలా ద్వీపాలను మహిళా ద్వీపాలని కూడా ఐరోపా చరిత్రకారులు అభివర్ణించారు!! భారతీయుల సాంస్కృతిక ధార్మిక కేంద్రాలు భారతదేశం వెలుపల లేవు.. ‘సింహళం’- శ్రీలంకలో శక్తిపీఠం ఉంది. ‘‘లంకాయాం శాంకరీ దేవీ..’’! అలాగే మాలా ద్వీపాలలో వైదిక బౌద్ధమతాలు నెలకొని ఉండేవి. ఇస్లాం ‘జిహాదీ’ల దండయాత్రల ఫలితంగా ‘మాలా ద్వీపాలు’ అఖండ భారత్‌కు దూరమయ్యాయి. సింహళ, ‘్ధనేహీ’ భాషలు సంస్కృత భాషా రూపాంతాలు! మాల్‌దీవుల ప్రజల భాష ‘్ధనేహీ’!
నేటి ఆఫ్ఘనిస్తాన్ గాంధార, యోన, రామఠ, జ్యోతిష, దరద, ఉరగ వంటి అనేక ప్రాచీన భారతీయ రాజ్యాల సమూహం! జిహాదీల దాడుల ఫలితంగా ఈ మొత్తం ప్రాంతం ‘అఖండ భారత్’ నుండి విడిపోయింది. యావత్ భారతదేశాన్ని ఆంగ్లేయులు దురాక్రమించినప్పటికీ చివరివరకూ అంటే 1947లో ఆంగ్లేయులు నిష్క్రమించేవరకూ స్వతంత్రంగా మనగలిగిన భారత ప్రాంతాలు నేపాల్, భూటాన్!! ఇలా ‘అఖండ భారతం’ ప్రస్తుత భారత్, బంగ్లా, బర్మా, సింహళ, మాలాద్వీప, పాకిస్తాన్, ఆఫ్ఘన్, నేపాల్, భూటాన్, త్రివిష్టప- టిబెట్ దేశాల సమాహారం! ఇదీ అనాది వాస్తవం!!

-హెబ్బార్ నాగేశ్వరరావు31/12/2015
Read More

తిరుమల గురించి 11 నిజాలు....



తిరుమల గురించి 11 నిజాలు....

1. గుడి ఎంట్రన్స్‌లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది.

2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అస్సలు చిక్కు పడదని అంటారు.


3. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత పద్దతిగా ఉంటారు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భ గుడిలో ఉండే ప్రతీది ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితర అన్నీ.

4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు. బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది.

5. స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50 వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. చాలా తక్కువ టిక్కెట్స్ అమ్ముతారు ఇవి.

6. గర్భగుడిలో నుండి తీసి వేసిన పూలు అవీ అన్నీ అసలు బయటికి తీసుకు రారు. స్వామి వెనకాల జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరి వేస్తారు.

7. స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.

8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతీ గురువారం నిజరూప దర్శనం టైమ్‌లో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. దాన్ని అమ్ముతారు.

9. చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో, అలాగే స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలూ అదే విధంగా పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు. ఆ రోజంతా స్వామి వెనక చూడరు అని అంటారు. ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (కాలహస్తికి వెళ్ళేదారిలో) దగ్గర పైకి వస్తాయి.

10. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు.

11. క్రీ.శ.1800 సం.లో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉండింది అంట. ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గానూ హతమార్చి గోడకు వేలాడదీశాడంటా. ఆ టైమ్‌లోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసింది అంటారు.

మీరు కూడా చదివి 18 మందికి పంపండి, త్వరలో మంచివార్త వింటారు.
🙏
🙏
గోవిందా గోవిందా
🙏
Read More

ధర్మ సూక్ష్మాలు



ధర్మ సూక్ష్మాలు

84 లక్షల జీవరాసులలో మనవ జన్మ చాలా ఉత్కృష్టమైనది.ఎన్నో జన్మల పుణ్య ఫలం వలన ఈ జన్మ లభించినది.దీన్ని సార్ధకం చేసుకోండి.

ఉదయంనిద్రలేవగానే కుడి అరచేతిని చూసి నమస్కారం చేసుకోండి.


ఏ మానవుడు కూడా జనసంచారం లేని పాడుపడ్డ ఇళ్ళలో, స్మశానానికి దగ్గరలో, నాలుగువీధుల నడుమ, చీకటి ప్రదేశంలో ,పాముపుట్టల దగ్గర , తల్లిదగ్గర,అక్క చెల్లల దగ్గర ,పరస్త్రీల దగ్గర నిద్రించకూడదు.

ఇద్దరు బ్రాహ్మణుల మధ్య ,బ్రాహ్మణునికి అగ్నికి మధ్య ,భార్య భర్తల మధ్య, గురుశిష్యుల మధ్య , నందిశంకరుల మధ్య, ఆవు దూడ ల మధ్య దాటుట వలన,నడవడం వలన పూర్వపుణ్యం నశించును.

సహపంక్తి భోజనం చేయుచుండగా మధ్యలో లేచి వెళ్ళినచో బ్రహ్మ హత్యాపాతకం సంభవించును.

భోజనం చేయుటకు ముందుగా, భోజనం అయిన తర్వాత పాదప్రక్షాళన చేయనిచో దరిద్రం సంభవించును.

దీపం లేకుండా రాత్రిపూట భుజిన్చరాదు.

సంధ్యాకాలంలో భోజనం, నిద్ర, చదువు ,దానము, భార్యా సంగమము ,ప్రయాణం చేయరాదు.ఒకవేళ చేసినచో దరిద్రం, వ్యాధి, మరణం సంభవిస్తాయి.

భోజనమునకు తూర్పు , పశ్చిమ , దక్షిణ దిక్కులు ఉత్తమమైనవి.భోజనము చేయునపుడు నేయి అభిఘారించకుండా భుజించరాదు.

భోజనమునకు ముందు ఉప్పు వడ్డిమ్చినచో కీర్తి ,తేజస్సు హరించును.

ప్రతి మానవుడు త్రిపుండములు(విభూతి) ధరించవలెను.దానివలన భూత ,ప్రేత,పిశాచ భాదలు వుండవు.

దేవాలయాలలో , పడవలలో , తీర్ధములలో, పెళ్ళిళ్ళలో , సభలలో , యగ్జ్న యాగాదులలో ఇతరులును తగిలినా దోషములేదు,.

భార్య గర్భవతి అయినపుడు భర్త సముద్ర స్నానము , క్షవరము, పర్వతారోహణము , కుమారునికి ఉపనయనము , చావులుకు వెళ్ళుట, నూతులు తవ్వుట, చెట్లు కొట్టుట , ఇల్లు కట్టుట , కొబ్బరికాయ కొట్టుట పనికిరాదు.

సూర్యోదయమునకు ఏ తిధి వుండునో ఆ రోజు చేయు స్నాన , దాన, జప, వ్రత , పూజా కార్యక్రమములన్నిటికి సంకల్పములో ఆ తిధే చెప్పవలెను.

సంక్రమణ కాలమందు , శ్రాద్ధదినములందు , జన్మదినములందు, అశ్ర్పుస్య స్పర్స లందు , వేడినీటి స్నానం చేయరాదు.

భోజనము చేయు కంచము పట్టుకుని ,ఒళ్ళోపెట్టుకుని , కంచము పట్టుకుని తిరుగుతూ, మంచములమీద కూర్చుని భుజించరాదు.

నీటిని త్రాగునప్పుడు చిన్న పాత్రలోనికి తీసుకుని కూర్చుని మాత్రమే త్రాగవలెను.

జపము పూజాది కార్యక్రమములలో నోటిలో ఏ పదార్దములునములుతూ క్రతువు చేయరాదు.అలా చేసినచో అది ఉచ్చిస్టము అగును.

అనుస్టానపరులు మంచినీరు నోటిలో ఎత్తి పోసుకుని తాగరాదు, పెదవులకి తగిలించుకొని (కరుచుకుని) తాగవలెను.
Read More

విల్లు ధరించిన హనుమ దేవాలయం –ఇంఫాల్



విల్లు ధరించిన హనుమ దేవాలయం –ఇంఫాల్
మణిపుర రాష్ట్ర రాజధాని ఇంఫాల్ సముద్ర మట్టానికి 790 మీటర్ల ఎత్తులో ఉంది .ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం లో స్వామి విల్లు ధరించి ఉండటం ప్రత్యేకం గా ఉంటుంది . .
he temple is situated in Imphal on the bank of the Imphal river amongst the groves, Mahabali forest. It was built by king Garib Niwaj in the year of 1725 AD.


The temple was built in bricks and later a cement coating was given to the entire structure. In front of the temple the Mandapa has been constructed which has shadowed the structure of the main temple. The pedestal of the temple is not visible from outside.

The sanctum cube and the porch walls are raised as a rectangular structure up to the roof. The eastern and western walls have got a triangular window having nine slits. The sanctum cube hall is covered with a dome shaped hemispherical roof.

The arches converge at the base of the crown; they are distinctively visible through their raised ridges on the surface of the roof from above. The top of the roof carries a double lotus crown in a criss-cross pattern. The Kalasas are rested over the crown; the uppermost vase carries the pinnacle with Nilchakra.

The roof of the porch hall is not dome-shaped but barrel vaulted type. The temple is a hut -type of Bengal style. The stone icon of Hanumanjee is raised on the pedestal wall. It is carved out on a big slab of stone. Hanumanjee is shown in Human form.

The temple reminds us of the spread of Ramanandi cult of Hinduism in Manipur. It is the only temple which was built during the period of Garib Niwaj. After his death the Ramnandi cult also vanished from Manipur. The temple in thus important and monumental evidence in the religious history of Manipur.
Read More

ఉపనయనము హిందువులలో అబ్బాయిల వేదాభ్యాసానికి ముందుగా చేసే ప్రక్రియ.

యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్సహజం పురస్తాత్
ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవితం బలమస్తు తేజః

మను స్మృతి ప్రకారం ఉపనయనం (ఒడుగు) జరిగి యజ్ఞోపవీత ధారణ చేస్తే తప్ప వేదాలను అభ్యసించే అధికారం కాని, నిత్య కర్మలు (పితృ సంస్కారాలతో సహా) అనుష్ఠానం చేసే అవకాశం గాని లేదు. బ్రాహ్మణులకు తల్లి గర్భంతో కూడి 8వ ఏట, క్షత్రియులకు గర్భధారణతో కలిపి 11 ఏట, వైశ్యులకు గర్భధారణ సంవత్సరంతో కలిపి 12వ ఏట ఉపనయనం చేయాలని వేదం చెబుతోంది. యజ్ఞోపవీతాన్ని వాడుకలో జందెం, జందియం, జంద్యంఅని కూడా అంటారు.
యజ్ఞోపవీతం బ్రాహ్మణకన్య చేత భమిడి ప్రత్తితో వడక బడి బ్రాహ్మణుడి చేత మెలికలు వేయబడుతుంది. జంద్యం యొక్క ప్రతి విషయానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. జంద్యం పొడవు నాలుగు వ్రేళ్ళ వెడల్పుకి 24 రెట్లు అంటే సుమారుగా సాధారణ వ్యక్తి ఎత్తుకు సమానంగా ఉంటుంది (ఆరు అడుగులు). నాలుగు వ్రేళ్ళు మనిషి యొక్క జాగరణ, స్వప్న, నిస్వపన, బ్రాహ్మ(తురీయ ) స్థితులు అనే నాలుగు ఆత్మ స్థితులను తెలియజేస్తాయి. ప్రతి జంద్యానికి మూడు పోగులు ఒక ముడి చేత కట్టబడి ఉంటాయి ఈ ముడినే బ్రహ్మ గ్రంధి అని అంటారు. ఈ మూడు పోగులు సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలను తెలియ జేస్తాయి. ఈ మూడు పోగులను ధరించినప్పుడు అవి మనకు ఋషి ఋణం, పితృ ఋణం, దేవ ఋణాలను గుర్తు చేస్తాయి. ఆ మూడు పోగులను కలిపి ముడి వేయబడిన బ్రహ్మ గ్రంథి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు లను కలిసి ఏకంగా ఉండడాన్ని సూచిస్తుంది.
మామూలు సమయములోను, శుభ కార్యాలలోను యజ్ఞోపవీతాన్ని ఎడమ భుజం మీద నుండి వ్రేలాడుతూ కుడి వైపు నడుము చేరేటట్లు (సవ్యంగా) వేసుకుంటారు. అశుభ కర్మలప్పుడు కుడి భుజం మీదుగా ఎడమ వైపు నడుమును తగిలేటట్లు (ప్రాచీనావీతిగా) వేసుకుంటారు. మూత్ర, మల విసర్జన సమయాలలో మెడలో దండ లేదా తావళం (నివీతం) లాగా ఉండేటట్లు వేసుకుంటారు. సంవత్సరానికి ఒక సారైనా, శ్రావణ పూర్ణిమ నాడు తప్పకుండా నూతన యజ్ఞోపవీతధారణ చేస్తుంటారు. అందుకే ఆ రోజుకు జంద్యాల పూర్ణిమ అని పేరుకూడా వచ్చింది. పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్రలో జంద్యాల పూర్ణిమ గురించి సవివరంగా వర్ణించాడు.[1]
“యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్సహజం పురస్తాత్
ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవితం బలమస్తు తేజః

ఈ విధంగా జపిస్తూ క్రొత్త జంద్యం వేసుకోవాలి. ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణం కశ్మలదూషితం విసృజామి యశోబ్రహ్మవర్భో దీర్ఘాయురస్తుమే ఈ విధంగా జపిస్తూ పాత జంద్యం తీసి వేయాలి.

ఉపనయనము హిందువులలో అబ్బాయిల వేదాభ్యాసానికి ముందుగా చేసే ప్రక్రియ. ఉపనయనాన్ని ఒడుగు అని కూడా అంటారు. ఇది అధికంగా పురుషులకు చేస్తారు. బాల్యావస్థ నుండి బ్రహ్మచర్యావస్థకు మారే సమయాన ఇది చేయడం ఆనవాయితీ. అప్పటి వరకు నియమ నిష్ఠ లతో పనిలేకుండా సంచరించే బాలుడు నియమ నిష్ఠలతోకూడిన జీవితంలో ప్రవేశించడానికి చేసే శాస్త్రీయమైన ప్రక్రియ ఇది. ఉపనయనానికి ముందు ఒక జన్మ తరువాత ఒక జన్మగా కూడా వ్యవహరించడం వలన ఉపనయనానికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చే బ్రాహ్మణుని సమాజంలో ద్విజుడు అని నామాంతరంతో వ్యవహరిస్తుంటారు.
క్షత్రియులు, వైశ్యులు ఇప్పటికీ దీనిని ఆచరిస్తున్నా, అధిక ప్రాముఖ్యతతో నిర్దిష్ట విధులతో బ్రాహ్మణులు దీనిని అధికంగా ఆచరిస్తున్నారు. మిగిలినవారిలో ఇది ఒక ఆనవాయితీగా మారింది. వివాహపూర్వం ఒక తంతుగా మాత్రం దీనిని ఇప్పుడు ఆచరిస్తున్నారు. పూర్వకాలం గురుకులాభ్యాసం చేసే అలవాటు ఉన్న కారణంగా ఉపనయనం చేసి గురుకులానికి బాలురను పంపేవారు. అక్కడవారు విద్యను నేర్చుకుని తిరిగి స్వగృహానికి వచ్చి గృహస్థాశ్రమంలో ప్రవేశించేవారు.
ఉపనయనము అయ్యేవరకు పురుషుడు స్వయంగా ఎటువంటి ధర్మకార్యం నెరవేర్చటానికి అర్హుడుకాడు. యజ్ఞయాగాది క్రతువులు నెరవేర్చటానికి ఉపనయనము చేసుకున్న తరువాతే అర్హత వస్తుంది. క్షత్రియులకు ధర్మశాస్త్రాలభ్యసించడం అత్యవసరం కనుక ఉపనయన క్రతువు జరిపించి, విద్యాభ్యాసం ఆరంభించేవారు. పితరులకు కర్మకాండ, తర్పణం లాంటి కార్యాలు చేయడానికి ఉపనయనం అత్యవసరం. కొన్ని సందర్భాలాలో తల్లి తండ్రులు మరణావస్థలో ఉన్న సమయాలలో అత్యవసరంగా ఉపనయనం జరిపించి, కర్మకాండ జరిపించే అర్హతనిస్తారు. సన్యసించడానికి ఉపనయనం ప్రధానమే. కనుక హిందూ ధర్మంలో ఉపనయనం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఒక ప్రక్రియ. హిందూ ధర్మంలో ఇది బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు తప్పక నిర్వహించవలసిన బాధ్యత.


ఉపనయనము హిందువులలో కొన్ని కులాలలో మాత్రమే జరిగే ప్రక్రియ. ఇది సాధారణంగా బ్రాహ్మణులకు, వైశ్యులకు మరియు క్షత్రియులకు జరుగుతుంది. ఉపనయనం జరిగిన రోజున బాలుని తండ్రి బాలునికి చెవిలో గాయత్రీ మంత్రం ఉపదేశిస్తాడు. ఉపనయనం జరిగిన నాటి నుండి వటువు ప్రతి నిత్యం గాయత్రిని పూజిస్తూ బ్రహ్మచర్యం పాటించాలి. వేదాభ్యాసానికి ముందు తప్పనిసరిగా ఉపనయనం చేయవలెను. వివాహానికి ముందు బ్రహ్మచర్యాన్ని స్నాతక ప్రక్రియ ద్వారా వదిలి, గృహస్థాశ్రమంలోనికి ప్రవేశిస్తాడు వరుడు.
శ్లోకముఉపనయమనం విద్యార్థస్యశ్రుతిత్ స్సగ్గ్ స్కారః అప. ధర్మసూత్రం.
అనగా వేదాధ్యాయనౌ కొరకు శ్రుతి మంత్రములచేత చేయబడు సంస్కారమే ఉపనయనము. అనబడును.
శ్లోఅగ్ని కార్య త్పరిభ్రష్టాః తే సార్వే వృషలాస్మృతాః.||. పరాశర స్మృతి వేదాద్యయనము చేయై బ్రాహ్మణునకు 'వృష్లుడు.' అని పేరు. కనుక బ్రాహ్మణ బ్రాహ్మచారులకు వేదాధ్యయనము నిత్యమైనది.,. అవశ్యకమైనదీ కూడాను.

"ఉపనయనము అంటే కేవలము మూడు వరుసల జంధ్యము వేసుకోవటం కాదు. దాని అర్థం మనకు రెండే కాదు మూడు కన్నులు ఉండాలి. ఆ మూడవ నేత్రం జ్ఞాననేత్రం. ఆ నేత్రాన్ని తెరచి నీ యొక్క నిజమైన స్వరూపాన్ని గుర్తించాలి. ఉపనయనం అంటే మరొక నయనం(కన్ను,నేత్రం) అని అర్థం. ఆ మూడవ నేత్రం(జ్ఞాననేత్రం) తెరచి ఉంచాలి, అందుకొరకు ప్రాణాయామము నేర్పబడుతుంది. బ్రహ్మోపదేశం చేసిన తర్వాత ఆ పిల్లవాడిని భిక్షాటనకు పంపుతారు. మొదటి భిక్ష తల్లి నుంచి తీసుకొనబడుతుంది. తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే, తల్లి మూడు గుప్పెళ్ళు భిక్ష ఇచ్చి, ఆ బాలకుడు తండ్రి చెప్పిన బ్రహ్మోపదేశం మననం చేసుకోవటానికి శక్తిని ప్రసాదిస్తుంది. ఇక ఆ బాలుడు భిక్షాటన చేస్తూ, గురువు గారి వద్దనే ఉండి విద్యాభ్యాసం చేస్తూ, మూడవ నేత్రంతో ఆత్మజ్ఞానాన్ని సాధించవలెను. ఇదియే ఉపనయనము యొక్క ప్రాముఖ్యత. అది మరచి ఇప్పటి కాలంలో ప్రాణాయామం అంటే ముక్కుని వేలితో మూస్తూ ఏదో శ్వాస నియంత్రణ చేస్తున్నట్టు నటిచడం, బ్రహ్మోపదేశం అంటే ఒక ముసుగుతో తండ్రి, పిల్లవాడిని కప్పి ఉంచటం, ఆ పిల్లవాడి చెవిలో తండ్రి ఏదో గుసగుసలాడడం వలె మారిపోయింది. భిక్ష అంటే అందరూ ఆ పిల్లవాడి భిక్ష పాత్రను డబ్బులతో నింపడంగా మారిపోయింది. బ్రహ్మోపదేశం ఇచ్చు తండ్రికి, ఈ కార్యక్రమము నడిపించు పురోహితునకు ఉపనయనము యొక్క ప్రాముఖ్యత తెలియనప్పుడు, వారు పిల్లవాడికి ఏమి బోధిస్తారు?"

"అంతే కాదు అలా గురువు వద్ద ఉండి జ్ఞానము సంపాదించిన తర్వాత గురువుగారు వారి మనస్సు తాత్కాలిక విషయాలపై ఆకర్షితమవుతుందో, లేక సన్యాసం వైపు ఆకర్షితమవుతుందో తెలుసుకోవటానికి ఆ శిష్యులను తమ తల్లిదండ్రుల వద్దకు పంపేవారు. కొంత కాలం అలా తల్లిదండ్రుల వద్ద ఉన్న తర్వాత పిల్లలు సంసారిక సుఖాలను విడిచిపెట్టి కాశీకి బయలదేరేవాళ్ళు. కొంత కాలానికి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల ఆ పిల్లలను కాశీకి వెళ్ళకుండా ఆపి వారి కుమార్తెలను వివాహం చేసుకోమని అడిగేవారు. సన్యాసం తీసుకోవాలని ధృఢ సంకల్పం ఉన్న వారు, అవి పట్టించుకోక ముందుకు సాగేవారు,మరికొంత మంది పెళ్ళిచేసుకుని ఇంటికి వచ్చేవారు. ఇది అంతా మరచి, కాశీ యాత్ర అంతే ఇప్పుడు, పిల్లవాడు పట్టుబట్టలు కట్టుకుని, కంటికి కాటుక పెట్టుకుని, కాళ్ళకు పారాణి పెట్టుకుని, మెడలో ఒక పూలమాల ధరించి, చేతిలో గొడుగు, కళ్ళకు చెక్క పాదుకలు ధరించి నడుస్తున్నట్టు నటిస్తాడు. పెండ్లికుమార్తె అన్న వచ్చి తన చెల్లెలిని పెళ్లి చేసుకోమని కోరగా, అప్పుడు నాకు వాచీ కావాలి, బండి కావాలి అని పెడ్లికొడుకు అలక పాన్పు ఎక్కుతాడు. ఇక అన్ని ఒప్పుకున్న తర్వాత ఫోటోలు తీసుకోవటం, ఒకరికొకరు బట్టలు పెట్టుకోవటం అలా కార్యక్రమం సాగుతుంది. ఇప్పటి కాలంలో భిక్ష అంటే డబ్బులతో భిక్షపాత్ర నింపటం, కాశీయాత్ర అంటే కట్నం, లాంఛనాలు తీసుకోవటానికి ఉపయోగపడేదిగా మారిపోయింది."

కుమారునికి తండ్రి ఉపనయనం చేస్తాడు. తండ్రి దేశాంతరమందుంటే తాత (తండ్రి యొక్క తండ్రి), అతను లేకుంటే తండ్రి సోదరులు వారుకూడా లేకపోతే వటుడి అన్న దానికి అధికారి అవుతాడు. ఒకవేళ అతను కూడా లేకపోతే సగోత్రమునందు పుట్టినవారు చేయాల్సిఉంటుంది. ఏ వయసులో చెయ్యాలి? బ్రాహ్మణ కులంలో 8వ సంవత్సరాన, క్షత్రియులకు 11వ ఏడున, వైశ్యులకు 12వ ఏడున ఉపనయనం చేయాలి. బ్రాహ్మణులకు చైత్ర మరియు వైశాఖ మాసాలు, క్షత్రియులకు జ్యేష్ట, ఆషాఢ మాసాలూ, వైశ్యులకు ఆశ్వయుజ కార్తీక మాసాలు మంచిది. అందరికీ పనికివచ్చే మాసాలు మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలు. బ్రహ్మచారులలో బ్రాహ్మణులు జింక తోలుని, క్షత్రియులు కురుమృగ చర్మమును, వైశ్యులు గొర్రె తోలును, ఉత్తరీయంగా ధరించాలి. బ్రాహ్మణుడు నార బట్టలు, క్షత్రియుడు వెల్వెట్టు బట్టలు, వైశ్యుడు ఉన్ని బట్టలు ధరించాలి. బ్రాహ్మణుడైన బ్రహ్మచారి ముంజకసువుతో పేనిన సమానమైన మూడు పేటలుగల మొలత్రాడు కట్టాలి. క్షత్రియ బ్రహ్మచారి ముర్వ అని కసుపుతో చేయబడిన మొలత్రాడు కట్టాలి. వైశ్యుడు జనపనారతో చేసిన ముప్పేట గల మొలత్రాడు కట్టాలి. ముంజకసుపు దొరకనప్పుడు దర్భ, రెల్లు, తుంగ నీటితో ముప్పెరిగా చేసిన ఒక ముడి, బూడు ముళ్ళు, ఐదు ముళ్ళుగల మొలత్రాళ్ళను వరసగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య బ్రహ్మచారులు ధరించవలెను. బ్రాహ్మణుడు ప్రత్తి నూలుతోను, క్షత్రియులు జనపనారతోను, వైశ్యులు తెల్ల మేక బొచ్చుతోను పేని కుడివైపుగా చుట్టిన తొమ్మిది పోగులుగల యజ్ఞోపవీతమును భుజమునందు ధరించాలి బ్రాహ్మణుడు బిల్వముగానీ, మోదుగగానీ దండముగా ధరించాలి. క్షత్రియ బ్రహ్మచారి మర్రి కొమ్మగానీ, చండ్ర కొమ్మగానీ దండముగ ధరించాలి. వైశ్య బ్రహ్మచారి జివి కొమ్మనుగానీ, మేడికొమ్మనుగానీ దండముగా ధరించాలి. ఆ ముగ్గురు బ్రహ్మచారులు వరసగా కేశము వరకుని, నొసటి వరకును, ముక్కు వరకును ఉండునట్లు దండమును ధరించాలి. ఆ దండములు వంకర లేనివియు, గంట్లు గలిగింపనివియు, పై పట్టతో కూడినవియు, అగ్నిలో కాలనివై ఉండవలెను. వారు దండమును గైకొని సూర్యోపస్థానము చేసి, అగ్నికి ప్రదక్షిణము చేసి యధావిధిగా భిక్షాటనము గావించాలి.

ఉపవీతుడైన బ్రాహ్మణుడు 'భవతీ భిక్షాందేహీ అని భవ శబ్దాన్ని మొదట చెప్పి భిక్షాటన చేయాలి. ఉపవీతుడైన క్షత్రియుడు 'భిక్షాం భవతీ దేహీ అని భవ శబ్దాన్ని మధ్యన చెబుతూ భిక్షాటన చేయాలి. వైశ్య బ్రహ్మచారి 'భిక్షాం దేహి భవతీ అని భవతి శబ్దం చివరనుంచి భిక్షాటన చేయాలి. తల్లినిగాని, తోడబుట్టినదానినిగాని, తల్లితోడవుట్టినదానిని గాని ఎవరు తనను అవమానింపదో అట్టివానిని యాచించాలి. ఈవిధంగా మధూకరము తెచ్చి వలసినంతవరకు గురువునకు మంచి అన్నమును నివేదించి, ఆతని అనుజ్ఞను పొంది యాచమించి తూర్పు ముఖంగా కూర్చుండి పరిశుద్ధుడై యవశిష్టాన్ని భుజించాలి. వేరు చింత లేకుండా భుజించి భోజనమైన పిమ్మట చేతులు, కాళ్ళు కడిక్కొని శాస్త్రరీతిని ఆచమనం కావించి నీటితో అన్ని ఇంద్రియాలు తుడుచుకోవాలి. చౌలము (పంచ శిఖలు పెట్టుట) ఉపనయన సమయంలో జాతకర్మ, నామకరణం, అన్నప్రాశన, చౌలము విధిగా మంత్రయుక్తంగా చేయాలి. చౌలము వలన అందం, ఆయుష్షు, తేజస్సు అభివృద్ధి అవుతాయి. ఈ చౌలములో పంచ శిఖలు పెడతారు. శాస్త్ర ప్రకారం వటుని ప్రవరలో ఎంత మంది ఋషులు ఉంటారో అన్ని శిఖలు శిరముపై ఉంచి మిగిలిన జుట్టు తీయించాలి. కాని అయిదు శిఖలు ఉంచుట శిష్టాచారంగా ఉంది. వటుని తండ్రి లేక ఉపనయనం చేసె వ్యక్తిని ఆచార్యుడు అంటారు. ఆచార్యుడు మూడు దర్భలను వేడి నీటిలో చన్నీటిని పోసి ఆ నీటిని తూర్పు దిక్కున ఉంచి ఉత్తర దిక్కు వరకు సవ్యంగా వటుని జుట్టును మంత్రయుక్తంగా తడపాలి. తరువాత కత్తిని వటుని శిరమునందుంచి సవ్యంగా నాలుగు దిక్కులనుంచి శిరస్సు మధ్యనుంచి కేశాలు తుంచాలి. ఎద్దు పేడను ప్రమిదగా చేసి దానియందు యవధాన్యమునుంచి ఆ ప్రమిదలో ఐదువైపులా వపనము చేసిన కేశాలనుంచి 'ఉప్త్వాకేశాన్ ' అను మంత్రోచ్చారణతో మేడిచెట్టుయొక్క మూలమందుగాని, దర్భలను స్తంభంగా చేసి దానియందుగాని ఉంచాలి. ఎద్దుపేడ బదులు నేడు వరి పిండితో ప్రమిద చేస్తున్నరు.లోకాచారం ప్రకారం ధాన్యముపై పీటవేసి వటుని కూర్చుండబెట్టి క్షురకునిచే ఆచార్యుడు చేసిన విధంగానే వపనము చేయించి పంచశిఖలు ఉంచాలి. ఆ కత్తిని మూడు రోజులవరకు దేనికీ వాడరాదు. ఉపనయనం వలన ఆశ్రమాధికారం సిద్ధిన్స్తుంది. వేదాధ్యయనము, ధర్మ శాస్త్రాధ్యయనము చేయడానికి ఆయువు, తేజస్సు, యశస్సు, సిరి, పుష్టికామ్యాల అభివృద్ధిని కలగజేసే 24 అక్షరాలుగల గాయత్రి మంత్రోపాసనకు వీలవుతుంది. యజ్ఞోపవీత మంత్రార్ధము: యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం పురస్తాత్| ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః తా|| వేదోక్త కర్మలు చేయు అధికారము పొందుటకు తయారుచేయబడిన, పరమ పవిత్రమయినది, బ్రహ్మ దేవునికి సహజముగా సిద్ధించినదియు, మొదట పుట్టినదియునగు ఈ యజ్ఞోపవీతము నేను ధరించుచున్నాను. యజ్ఞోపవీతము నాకు ఆయుర్వృద్ధి, నిర్మలత్వము, బలమును, పుష్టి, తేజస్సును ఇచ్చుగాక. నందీసమారాధన : శోభన దేవత స్వరూపులైన ఐదుగురు బ్రహ్మచారులను పూజించి పసుపు బట్టలనిచ్చుట ఆచారము. శ్లో|| వటురక్షార లవణం సప్రాణాహుతి ముత్తమమ్| ఏక ఏవమి భుంజీత వ్రతే క్రమ పీడయన్|| తా|| బ్రహ్మచారి కారము, ఉప్పు విడిచి ప్రాణాహుతులతో పాత్రకమైన, ఉత్తమైన ఆహారమును ఈ వ్రతమందు వ్రతభంగము కాకుండా భుజించవలెను. అనగా బ్రహ్మచారి తన బ్రహ్మచర్య దీక్షా వ్రతము పూర్తి అగువరకు ఉప్పు, కారంలేని భోజనం చేయవలెను. శ్లో|| మాత్రసహకుమారం భోజయేత్ తా|| గాయత్రీమంత్ర ప్రోక్షణతో సహా సహపంక్తి లో వటుడు భోజనము చేయవలెను. మాత్రాసహ అంటే తల్లితో కలిసి అని భావించి మధ్వులు ఆవిధంగా ఆచరిస్తున్నారు. కాని మాత్రాసహా అంటే గాయత్రీ మంత్రముతో సహా అని అర్ధము.ఆ సమయమున ఆచార్యుడు గాయత్రీ మంత్రము చెప్పగా వటుడు అన్నముపై ఉదకము ప్రోక్షించును. అమృతో పస్తరణమసి అనుచోట ఉదకము బదులు నేయి వేయవలెను.

అశ్వారోహణము: అగ్నిహోత్రమునకు ఉత్తరపువైపున ఆచార్యుని వలే తూర్పు తిరిగి కూర్చొనవలెను. దక్షిణ దిశగా శానము (సన్నికల్లు లేక రాయి) ఉంచి, ఉపనయనము చేయుచున్న వ్యక్తి (ఆచార్యుడు)"అతిష్టేమ" అను మంత్రమును చెప్పి, సన్నికల్లును త్రొక్కించవలెను. ఈ రాయివలె చాలాకాలము బ్రహ్మచర్య నిష్ఠలో స్థిరుడవై యుండుమని దీని యర్ధము. వస్త్రధారణ: పంచల చాపు ఉత్తరించి ఆచార్యుడు వాటిని అభిమంత్రణచేసి రాతిమీదనే మంత్రయుక్తముగా వటువనకు కట్టవలెను. ఈ వస్త్రములు దేవతలు తయారుచేసినవి. నీవు నిండు నూరేళ్ళు సుఖముగాయుండుటకు ధనము సంపాదించి ఆప్తులకు, అర్ధులకు యివ్వవలెను అని మంత్రార్ధము. మౌంజీ మేఖల ధారణ: ఆచార్యుడు "ఇయందురుక్తా....సుభగామేఖలేయం" అను మంత్రమును జెప్పి ముంజగడ్డితో పేని ముప్పిరవేసిన త్రాడును వటువు మొలకు ప్రదక్షిణముగా మూడు చుట్లు త్రిప్పి కట్టవలెను. వటువుచే కూడ ఈ పైమంత్రము చెప్పించవలెను. ఈ మంత్రార్ధమేమనగా ఈ మౌంజీ దేవతలకు ప్రియమైనది. ఉఛ్ఛ్వాసనిశ్శ్వాసములచేత ఆత్మ బలమును శరీర బలమును కూడా కలిగించునది. దీనిని ధరించుటచే ఆపదలు రావు. మిత్రస్య అను మంత్రముచే కృష్ణాజినమును ఆచార్యుడు వటుడు మెడలో ఉపవస్త్రముగా వేయవలెను.ఈ కృష్ణాజినము విశేష తేజస్సు, కీర్తి, వృద్ధిగలది. ధూర్తులకు ఉపయోగపడనిది. అన్నమును యిచ్చునది. స్తోత్ర పాత్రమైనది. సూర్యుని నేత్రమయినది. దీనిని వస్త్రముగా ధరించుచున్నాను అని మంత్రార్ధము. గమనిక: మౌంజీ, మేఖలలు క్షత్రియ వైశ్య ులకు వేరువేరుగాయున్నవి.ఆచార్యుడు వటువును దగ్గరకు తీసుకొని పంచల చావు (నూతన వస్త్రము) యిద్దరిపై కప్పి"సుప్రజ" అను మంత్రమును వటుని చెవిలో చెప్పవలెను. సుప్రజాః ప్రజయా భూయాస్సువీరో వీరై సువర్చా వర్చసా సుపోషః పోషైః| తా|| మంచి సంతానము గలవాడవై పుత్ర పౌత్రాదులచే మంచి వర్చస్సు గలవాడవై పోషకులగు పుత్రులచే వృద్ది చెందుము. వటువు చెప్పవలసిన మంత్రము: మం|| బ్రహ్మచర్య మాగా ముపమానయస్య దేవేన సనితా ప్రసూతః తా|| నేను బ్రహ్మ చర్యవ్రతమును వేదాధ్యయనము కొరకు స్వీకరించితిని. ఓ ఆచార్యా! మీరు సూర్యుని అనుమతితో వేదోపదేశము చేయుటకై మీ దగ్గర ఉంచుకొనుమని వటువు చెప్పును. బ్రహ్మోపదేశం: తూర్పు దిక్కుగా ఆచార్యుడు కూర్చుండగా కుమారుడు అభిముఖముగా ఆచార్యుని కుడిపాదమును కుడిచేతితో పట్టుకొని అయ్యా! గాయత్రీ మంత్రోపదేశమును ఆచార్యుడు వటువు కుడి చెవిలో చేయవలెను. ఉపదేశ విధానము: మం|| ఓం భూః తత్సవితురువరేణ్యం | ఓం భువః భర్గోదేవస్య ధీమహి ఓ గుం సువః ధీయోయోనః ప్రచోదయాత్|| ఓం భూః తత్స వితురువరేణ్యం భర్గోదేవస్య ధీమహి | ఓం భువ: ధీయోయోనః ప్రచోదయాత్| గోదానము: ఓ ఆచార్యుడా నీకు వరమును (వరమనగా గోవు అని వేదమున గలదు) ఇచ్చుచున్నానని గురువునకు వటువు శేష్ఠమైన గోవు నీయవలెను. గురువు 17సార్లు ప్రణవము చేయవలెను. లేచి "దేవస్యత్వా" అను మంత్రమును చదివి గోవును స్వీకరించవలెను.పిమ్మట ఆచార్యుడు పడమట దిక్కుగా కూర్చొన్న వటుని 'ఉదాయుషా' అను మంత్రము చదువుచు లేవదీసి వానిచే చెప్పించవలెను. ఉదాయుషా మంత్ర భావము: నూరు వత్సరముల ఆయువుతో బలకరమైన ఔషధముల రసముతో మేధుని యొక్క బలముతో దేవతలను ధ్యానము చేయుటకులేచి నిలబడుచున్నాను. సూర్యుని దర్శించుట: "తచ్చక్షుః" అను మంత్రము మొదలుకొని - సూర్యం దృశే అని ఆచార్యునిచే చెప్పబడిన పదిమంత్రములతో వటుకు సూర్యుని సేవించవలెను. అవి: 1. తచ్చక్షుర్దే వహితం పురస్తాచ్ఛు క్రముచ్చరత్ తా|| నేత్రములయందు ఇంద్రునిచే యుంచబడినదియు తూర్పుదిక్కున బయలుదేరి వెళ్ళునదియు శుభ్రమైనదియునగు ఆ ప్రసిద్ధమైన సూర్య తేజస్సును. 2. పశ్యేమ శరదశ్శతమ్| తా|| నూరు సంవత్సరములు చూచెదను(జీవింతును). 3. మం||జీవమ శరదశ్శతమ్|| తా|| నూరు సంవత్సరములు జీవించగలను. 4. మం|| నందామ శరదశ్శతమ్ తా|| నూరు సంవత్సరములు ఆనందంగా ఉండగలము. 5. మం|| మోదామ శరదశ్శతమ్ తా||నూరు సంవత్సరములకు బ్రహ్మానందమును పొందుచుందుము. 6. మం|| భవామ శరదశ్శతమ్ తా|| నూరు సంవత్సరములు సంపదగలవారమై యుందుము. 7. శృణవామ శరదశ్శతమ్|| తా|| నూరు సంవత్సరముల వరకు వేద శాస్త్రములలు వినుచుందుము. 8. మం|| ప్రబ్రవామ శరదశ్శతమ్ తా|| నూరు సంవత్సరములు చక్కగా మాట్లాడు చుండగలము. 9. మం|| అజీతాశ్యామ శరదశ్శతం తా|| నూరు సంవత్సరముల వరకు హింసలేని వారమై యుందుము. 10. మం|| జ్యోక్చసూర్యం దృశే|| తా|| జీవించినంతకాలము అంధత్వము లేక మంచి దృష్టిగలవారమై యుందుము. సూ|| యంకామయేత............... విధిమాహ|| స్నాతకవ్రత పర్యంతము ఈ వటువు నన్ను విడువకుండ నుండవలెనని ఆచార్యుడు కోరుచు క్రింది యస్మిన్ భూతంచ అను మంత్రమును చెప్పి అతని కుడిచేతితో వటువు కుడిచేయి పట్టుకొనవలెను. మం|| యస్మిన్ భూతంచ-------- గృహ్ణామి నారాయణశర్మన్|| తా|| జరిగినదియు, జరుగుచున్నదియు, జరుగబోవుచున్నదియునగు ప్రపంచమునకు సృష్టికర్తయగుయే బ్రహ్మయందు సమస్తలోకములు నిలిచియున్నవో ఆ బ్రహ్మయొక్క అనుమతిచే నిన్ను నామనసునందెపుడును ధ్యానము చేయచుండెదను.వటువు మూడు అహోరాత్రములు ఈ అగ్ని అవిచ్ఛన్నముగా నిలుపుకొనవలెను. ఈ అగ్నిలోనే ఉదయము, సాయంకాలము హోమము చేయవలెను. మూడు రోజుల తరువాత నుండి సమావర్తనము వరకు రెండుపూటల లౌకికాగ్నిలో సమిధలు హోమము చేయవలెను. భిక్షా కార్యము: ఆచార్యుడు వటువునకు ఏదైనా ఒక వస్తువుతో కూడిన పాత్రను యిచ్చి ముందుగా తల్లిని యాచించమని చెప్పవలెను. కుడి చెవిని ఎడమ చేతితోను ఎడమ చెవిని కుడి చేతితోను పట్టుకోని ఈ క్రింది మంత్రమును చెప్పవలెను.చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు-----------ఋషులపేర్లు సంఖ్య చెప్పి-- గోత్రస్య (గోత్రం పేరు చెప్పాలి) ---- శర్మ (తనపేరు చెప్పాలి) అహంభో అభివాదయే అని చెప్పి పాదములకు నమస్కరించి స్త్రీలనయితే భవతి భిక్షాందేహి అని పురుషులనైతే భవాన్ భిక్షాందదాతు అని భిక్ష అడిగి నడుముకు కట్టుకున్న వస్త్రము కొనను రెండు చేతులతోను పట్టుకొని అందులో భిక్ష స్వీకరించాలి.మొదట తల్లి పళ్ళెములో బియ్యము తెచ్చివెండి గిన్నెతో రెండు సార్లు బియ్యం వటువు యొక్క వస్త్రములో వేసి మూడవసారి గిన్నెతోసహా బియ్యమును వేయవలెను. ఈ వెండిగిన్నె బ్రహ్మగారు తీసుకొనుచున్నారు. ఉంగరము(భటువు)వేలికి తొడుగుట కొందరి ఆచారముగా యున్నది. వస్త్రమునిచ్చుట: సూ|| వానశ్చరుర్ధీ ముత్తరయా దత్తే దతృదావ్యః | గురోవానస్తేదదామీతి దద్యాత్||వటువు ఉపనయనమునాడు తనకు గట్టిన వస్త్రమును ఓ గురువర్యా ఈ వస్త్రమును నీకు యిచ్చుచున్నాను అనుచు ఈయవలెను. ఉపాకర్మ: ఉపనయనమైన తర్వాత వచ్చు మొదటి శ్రావణ పూర్ణిమరోజున గ్రహణం సంభవించిన భాద్రపద పూర్ణిమనాడు ఉపాకర్మ చేయాలి. కాని ఉపాకర్మయిపుడు ఎవరు చేయటంలేదు. బ్రహ్మచర్య ధర్మములు: బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ఉపనయనము అయినది మొదలు బ్రహ్మచర్య వ్రతము ప్రాంభమగును. ఉపనయనమైన తర్వాత గురుకులమున 12 సంవత్సరములు బ్రహ్మచర్యమును పాటించుచు ఒక వేదమునైనను పూర్తి చేయవలయును. సూ|| ద్వాదశ వర్షాణ్యేకవేదే బ్రహ్మచర్యం చరేత్| ఒక్కొక్క వేదమునకు, 12 సంవత్సరములు చొప్పున బ్రహ్మచర్యము జరుపవచ్చును. కానియది విధికాదు. మరియు ఋషుల మతమున కలియుగములో దీర్ఘబ్రహ్మచర్యము పనికిరాదు. కాబట్టి 12 సంవత్సరములే బ్రహ్మచర్యము చాలును, దీనిని బట్టి బ్రాహ్మణుడు కనీసము 20 సంవత్సరములవయస్సులోను, క్షత్రియుడు 23 సంవత్సరముల వయస్సులోను, వైశ్యుడు 24 సంవత్సరముల వయస్సులోను వివాహము చేసికొనుట శాస్త్రసమ్మతమని తెలియును. శూద్రుడు గురుకులమున కేగనక్కరలేదు. కావున ఆయుర్దాయములో నాల్గవవంతు అనగా 25 ఏండ్లు వయస్సు వరకు ఆతడు అవివాహితుడుగానుండి పిమ్మట వివాహమాడవలయును. బ్రహ్మచర్యాశ్రమములో బహు ప్రయోజనములు సాధింపవలసియున్నవి. ద్విజులు వేదమునభ్యసించుట, ఇతరులు పురాణేతిహాసముల పఠించుట. ఇంద్రియముల నిగ్రహించుట నలవఱచుకొని మనస్సును పరమార్థ జీవితమున కనుకూలముగా చేసికొనుట. శరీరరము భోగపరము కాకుండ శ్రద్ధ వహించుట. శారీరక తేజస్సును వృద్ధినొందించుకొనుట. దీర్ఘాయుష్యమునకు తగినరీతిగా వ్యవహరించుట. మానవుడు గృహస్ధాశ్రమములో భోగములను తగినరీతిననుభవించుటకును, భోగములకు లోబడి ధర్మమును విస్మరింపకుండుటకు, వివేకియై లౌకిక, వైదిక ధర్మములను నిర్వర్తించుటకును బ్రహ్మచర్యాశ్రమము యొక్క శిక్షణ సహకరించును. బ్రహ్మచర్యాశ్రమములో ఉపర్యుక్తమైన శారీరక మానసిక సాధన కంగములుగ నియమములనేకములు గలవు. బ్రహ్మచారి వాక్ నియమము గల్గియుండవలెను. బ్రహ్మచారి చేష్టానియయము గల్గియుండవలెను. బ్రహ్మచారి ఉదర నియమము గల్గియుండవలెను. బ్రహ్మచారి మితభాషియై సత్యవాక్యమునే పల్కవలెను. బ్రహ్మచారి తనకర్తవ్యమునకు మించిన యేపనిలోను జోక్యము కల్గించుకొనరాదు. బ్రహ్మచారి సత్వగుణ వర్థకమగు నాహారమునే మితముగ తినవలయును. బ్రహ్మచారి భిక్షచేసి యాహారము తెచ్చుకొని దానిని గురువునకు చూపి యాతని అనుమతిగైకొని భుజింపవలయును. ఉప్పు, కారము, మాంసము, మధువు మున్నగు రజోగుణ ప్రకోపకములైన పదార్ధములను తినరాదు. బ్రహ్మచారి ఆచరించవలసిన ఇతర ధర్మములు: గంధేత్యాది సుగంధ వస్తువులను ధరింపరాదు. పగలు నిద్రపోరాదు. కాటుక పెట్టుకొనుట మొదలగు శృంగార విషయములను వీడవలయును. తైలాభ్యంగనము చేయరాదు. విలాసార్థమై బండి మొదలగు వాహనముల ఎక్కరాదు. చెప్పులను తొడగరాదు. కామమును దరిచేరనీయరాదు. క్రోధము పనికిరాదు. దేనియందును లోభము తగదు. వివేకమును వీడరాదు. వదరుబోతుగా నుండరాదు. వీణా వాదనాదుల యందనురక్తుడు కారాదు. వేడినీటి స్నావము చేయరాదు. సుంగంధాదులచే విలాసముగా దంతధావనాదులు చేయరాదు. దేనిని చూచినను సంతోషముతో పొంగిపోరాదు. నృత్యగానములందు ఆసక్తుడు కారాదు. పరుల దోషములనెంచరాదు. ప్రమాదముల చెంతకుపోరాదు. బ్రహ్మచారి యిట్టి నియమములు గలవాడై, భిక్షచే జీవించుచుసాయం ప్రాతఃకాలములందగ్ని కార్యము చేసికొనుచుండవలయును. సూ||బహిః సంధ్యత్వంచ|- సంధ్యా వందనమును గ్రామముయొక్క బయటకుపోయి చేసికొనవలయును. బ్రహ్మచారి ప్రధానముగ చేయవలసిన ధర్మము రేతస్సంరక్షణము. ఆ ధర్మముచెడినచో బ్రహ్మచర్య వ్రతము చెడినట్లే. అట్లు బ్రహ్మచర్యము పోగొట్టుకొన్నవారికి అవకీర్ణియని పేరు. అవకీర్ణికి ఘోరములైన ప్రాయశ్చిత్తములు విధింపబడినవి. కాబట్టి బ్రహ్మచర్యమునకు భంగము కల్గించు ప్రసక్తులన్నియు బ్రహ్మచారికి నిషేధింపబడినవి. శృంగార విషయమునకు సంబంధించినవన్నియు విడిచి విడిచి పెట్టవలసినదే. ఇతర నియమములు: చివరకు వటువు అద్దములో తన ముఖమును చూచుకొనుట కూడ నిషిద్ధమైయున్నది. బ్రహ్మచారి స్త్రీలముఖమును చూడరాదు; వారితో సంభాషింపరాదు. బ్రహ్మచారి అధ్యయనము చేయునపుడు గురుదక్షిణనేమియు నీయనక్కరలేదు. ఏ పరిస్థితిలో ఉపనయనం చెయ్యకూడదు? వటువు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు సంవత్సరంపాటు ఈ ఉపనయన కార్యం చేయకూడదు. ముహూర్త నిర్ణయము ఇది తండ్రి, వటువు జాతకాలనుబట్టి నిర్ణయించాలి. వారిద్దరి తారాబలం, చంద్రబలం కుదరాలి. తిధులు అధ్యయనరహితమైన విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి. వారములు సోమ, బుధ, గురు మరియు శుక్ర వారాలు. నక్షత్రములు అశ్వని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి. లగ్నములు వృషభ, కర్కాటక, కన్య, తుల, ధను, మకర, కుంభ, మీనములు. లగ్నానికి కేంద్రంలో పాపులుగాని, చతుర్ధమందు రవిగానీ ఉండరాదు. అష్టమశుద్ధి అత్యంత ముఖ్యం మూఢమి, దక్షిణాయనములలో ఉపనయనము చేయరాదు. గురుబల నిర్ణయము కర్కాటక, ధనుర్మీన రాశులయందైనను, వటుని జన్మ రాశియందైనను, ఉపనయన లగ్నమునకు 12వ యింటనైననూ గురుడుండిన వటువు సంపూర్ణ విద్యాంతుడు, భాగ్యవంతుడు అగును. వృషభ, మిధున, కన్య, తుల, మకర, రాశులయందైనను, ఈ అంశలందు ఎక్కడైననూ గురుడుండిన విద్య, ఆచార, సుఖ, ఆయుర్దాయములలో ఒకటైననూ పొందును. గ్రహబలము చంద్రుడు మాతృ కారకుడు, రవి పితృకారకుడు, గురుడు ప్రాణకారకుడు అగుటవలన ఉపనయన లగ్నమందైనను, గ్రహచారమందైనను చంద్ర, రవి, గురు బలములు చూడవలెను.గురు బలము ఆచార్య, వటువులకు అవశ్యంగా ఉండవలెను. గురుడు వటుని నక్షత్ర రాశికి 2, 5, 7, 9 స్థానములందుండగాను, అష్టమ శుద్ధి లగ్నములో ఉపనయనము చేయవలెను. చంద్రరాశి స్థితి ఫలము ఉపనయన ముహూర్తమున చంద్రుదు సిమ్హరాశియందున్న వటువు పాపవందుడును, కర్కాటకమందున్న దరిద్రుడుని, మేష మరియు వృశ్చీక రాశులయందున్న ఆయుధధరుడును, కన్య, మిధున రాశులయందున్న పండితుడును, ధనుర్మీన రాశులందున్న సోమయాజియు, తుల, వృభషమందున్న సత్వర వివాహితుడు, చందాల సేవకుడును అగును. త్రిస్రోష్టకములు మార్గశిర, పుష్య,మాఘ, ఫాల్గుణ మాసాలలో బహుళ్ సప్తమి, అష్టమి, నవమి తిధులను త్రిస్రోష్టకాలంటారు. ఇవి ఉపనయానైకి పనికిరావు. ఉపనయన ముహూర్త దోషములు చంద్రుడు ఉపనయన లగ్నమందున్న స్వకీయుడగు తన ఉచ్చ రాశి అయినను వటుని క్షయ రోగవంతునిజేయును. లగ్నమునకు 12వ ఇంట రవికి కుజ వీక్షణయున్న తండ్రికి నేత్ర హాని, వర్ణాధిపతులును, గురుశుక్రులుని, వేదాఢిపతులుని, వీరు నీచ రాశులయందుండగను, నీచ గ్రహములు అస్తమించియుండగాను ఉపనయనము చేసిన దోషము. లగ్నమునకు కేంద్ర స్థానములందు అనగా 1, 4, 7, 10 స్థానములందు ఎక్కడైననూ రవియున్న స్పృజితమను దోషము, కుజుడున్న కుజితము దోషము, శనియున్న రుధిరమను దోషము కలుగును. దోషభంగము లగ్నమునకు 1, 4, 7, 10 స్థానములలో బుధ, గురు, శుక్రలలో ఎవరైన ఉన్న సమస్త దోషములు నశించును.లగ్నమునకు 11వ యింట సూర్య, చంద్రులలో ఎవరైనయున్న సమస్త దోషములు హరించును. లగ్నమునకు 3, 6, 11 స్థానములలో కవి, కుజ, శనిలలో ఎవరైనయున్న సర్వ దోషములు నశించును. లగ్నమునకు కేంద్ర త్రికోణములందు శుభ గ్రహములైన గురు, చంద్ర, బుధులలో ఒకరైన యున్న సృజితమను దోషము పోవును. చంద్రుడు స్వక్షేత్రమైన కర్కాటమందుండి కర్కాటకమునుంచి బుధ, గురు, శుక్ర అంశపొందియుండగాను, శ్రవణ, పునర్వసులు నాలుగవ పాదమందుండగాను, చంద్రుడు లనై లగ్నములందును 8వ యింట ఏ గ్రహము లేకుండగను ఉండుట ఉపనయనమునకు యోగ్య కాలము. ఉపనయన ముహూర్తము రోజునకు పూర్వ రోజున 4వ రోజున వీనిలో ఒక రోజుయైన అనధ్వయ దినమైయుండగాను, వటుని తల్లి నాందీముఖమునకు పూర్వమే రజస్వల అయినను, 6 మాసములు గర్భిణి అయినను వటును తల్లితండ్రులు, తాత నాయనమ్మ చనిపోయిన సంవతరమందును, రవియున్న రాశియందును, అభిజిత్ రాశియందును, వటునికి చెవులు కుట్టకుండగను ఉపనయనము చేయరాదు. భార్య 6 మాసములు పైబడిన గర్భముతో యుండగా భర్త గృహ నిర్మాణ, గృహ ఆరంభ, ఉపనయనములను చేయరాదు. అంతకు పూర్వమందు చేయవచ్చును లేదా నెల పురుడు వెళ్ళిన తరువాత చేయవచ్చును. నిశ్చయించుకొన్న మంచి ముహూర్తమునకు వటుని తల్లి రజస్వల అయిన వేరే ముహూర్తము దొరకకుండిన ఒక సువాసినిని వస్త్ర మాల్యాదులచే పూజించి ఆ ముహూర్తమునకుఉపనయమును చేయవచ్చును. వటుని తల్లి ఉపనయనము జరుగుచుండగా నాందీ ముఖమునకు పూర్వము రజస్వల అయినచో ఉపనయనము చేయరాదు. ఒకే తల్లికి జలిగిన కవలలు కాని మగపిల్లలకు ఒకే సంవత్సరంలో ఉపనయనము చేయరాదు. సంవత్సరమనగా 12 నెలలు కాదు. సంవత్సర నామభేదమని గ్రహించవలెను. కవలలకు ఒకేసారి ఒకే ముహూర్తమునకు ఉపనయనము చేయవలెను.

Upanayana

In Hinduism, Upanayana is the initiation ritual by which initiates are invested with a sacred thread, to symbolize the transference of spiritual knowledge.

In Hinduism, the "sacred thread" (Sanskrit: यज्ञोपवीतम् yajñopavītam or upavīta) is a thin, consecrated cord, composed of distinct cotton strands, worn to symbolize the permission given to the wearer to perform sandhyavandanam and recite the Gayatri Mantra.[1][2] The sacred Yajñopavītam is known by many names (varying by region and community), such as Bratabandha, Janivaara, Jandhyam, Poita, Pūṇūl, Janeu, Lagun, Yajnopavita, Yagyopavit, Yonya and Zunnar.[3][4] The other Sanskrit term for it is Avyanga.
The ceremony that invests the wearer with the sacred thread is often considered a socially and spiritually significant rite (or samskara). It has varying formats across Hindu communities and is also called by varying names, including brahmopadesham, munji, munj, janeu rasm and bratabandha.[5][6] Among Hindus, the ceremony is associated with the higher varṇas.[7]
Though far less common, it is sometimes conducted for girls.[7] At a village in Bihar, girls, irrespective of caste, undergo upanayana and wear the sacred thread.[8]
In some regions of modern North India and also among a few South Indian castes, the ceremony is often conducted as an immediate precursor to wedding ceremonies instead of during adolescence. In other regions it is almost always associated with adolescence;[9] with regards to this, it is very important.

The strands of the sacred thread have symbolic meaning that varies by community and region. The sacred thread has three strands. A bachelor wears only one sacred thread; a married man wears two of them making it six strands. If the man has married and has fathered a child, he wears three, which makes nine strands.
The three strands sometimes symbolize three debts (ऋण, rin) that must never be forgotten:
the debt to one's teachers (गुरु ऋण, guru rin), i.e., those who have taught the wearer;
the debt to one's parents and ancestors (पितृ ऋण, pitr rin), i.e., those who have nurtured the wearer and made possible his existence;
the debt to the sages/scholars (ऋषि ऋण, rishi rin), i.e., those who discovered knowledge, both spiritual and secular, over the ages, which now enriches the wearer's life.
In some versions, the debt to the sages is replaced with debt to God (देव ऋण, dev rin). Upon marriage, sometimes the number of strands increases to six, because the man is expected to assume the debts of his wife as well.[10][11][12]
The three strands does symbolize:
Maa Parvati ( Goddess of strength )
Maa Lakshmi ( Goddess of wealth )
Maa Saraswati ( Goddess of knowledge )[13]

The strands could represent purity in thought, word and deed expected from the wearer.

A Tulu Madhwa Brahmin boy during his upanayana ritual. The thin, yellowed, Yajnopavita thread runs from left shoulder to waist. Note the munja grass girdle around the waist. The peepal tree twig in his right hand marks his entry into the Brahmacharya stage of life.
Upanayana (lit. "leading closer" to the Brahma) is a version of the sacred thread ceremony which initiates the boy into the study of brahman or the Vedas. The word brahman is the ancient word for Vedas or, specifically, Vedic hymns and shall not be confused with the later philosophical concept of Brahman. Traditionally, the ceremony was performed to mark the point at which boys began their formal education. The ceremony is performed when the boy is seven years old (Gharbheshu ashtame varshe) in the Brahmin varna, at least 13 years in the Kshatriya varna. The youngster is taught during the ceremony the secret of life through Brahmopadesam (revealing the nature of Brahman, the Ultimate Reality) or the Gayatri mantra. The child then becomes qualified for life as a student or Brahmachari, as prescribed in the Manusmriti. According to an appendix of the Manusmriti,[citation needed] girls were allowed to study the Vedas in the previous kalpa (Creation). Orthodox Hindus, however, do not accept this reference, because no Hindu canonical text allows this ceremony for a girl in the present kalpa. However, some sects, especially Arya Samaj, perform this ceremony for girls as well on the basis of this statement.
Brahmins, vaishya and Kshatriyas are called dvijas meaning "twice born". A man of these castes is born once in the womb of his mother and again during the Upanayana when he learns the Gayatri Mantra. The Upnayanam is practiced by the three higher castes in India[brahmin,vaishya,kshatriyas].
The main point of having gone through the Upanayana ceremony is the wearing of the Yajñopavītam on the body. The Yajñopavītam is circular, being tied end-to-end (only one knot is permissible); it is normally supported on the left shoulder (savya) and wrapped around the body, falling underneath the right arm. The length of the Yajñopavītam is generally 96 times the breadth of four fingers of a man, which is believed to be equal to his height. Each of the fingers represents one of the four states that the soul of a man experiences: waking, dreaming, dreamless sleep and knowledge of the absolute.
It denotes that one who wears the sacred Yajñopavītam should be pure in his thought, word and deed. The sacred Yajñopavītam reminds a Brahmachari to lead a regulated life with purity in his thought, word and deed. This Yajñopavītam also represents the debt that is owed to the guru, parents and society.
The knot in the middle represent the formless Brahman, the pure form of energy which pervades all. The three strands of Yajñopavītam again represent the manifestation of Brahman as Srishti, Sthithi and Vinasa. The sacred strands of Yajñopavītam illustrates the fact that everything in the universe emerge from and then merge with Brahman.
Ancient texts refer to the wearing of the Yajñopavītam in three forms:
Upavītam, where the Yajñopavītam is worn over the left shoulder and under the right arm. This is for Gods. Upavītam is also called savya (Katyayana Shrauta Sutra, etc.).
Nivītam, where the Yajñopavītam is worn around the neck and over the chest. Nivīta form is to be used during Rishi Tharpana, sexual intercourse, answering the calls of nature, etc., and during ancestor worship/funeral rites (Shadvimsha Brahmana, Latyayana, etc.).
Prachīnavītam is where the Yajñopavītam is worn above the right shoulder and under the left arm. This is for Spirits and is used by men when performing the death ceremonies of an elder. Prachīnavītam is also called apsavya (Katyayana Shrauta Sutra, Manusmriti, etc.).
In some communities, later, at the occasion of wedding, a further three strands of Yajñopavītam are added to make for a six-strand bunch. In some communities, the custom is of one thread more being added at the birth of every child. In some interpretations, these strands of Yajñopavītam are intended to constantly remind the man of his worldly responsibilities. Three original strands of Yajñopavītam (each consisting of three) make up nine strands of Yajñopavītam, to which three are added for wife and one for children, making a total of 13 individual strands of Yajñopavītam in some communities.
Ancient Hindu texts specify an age for the Upanayana ceremony based on the caste (8 for Brahmins, 11 for Kshathriyas, 12 for Vaishyas (Manu Smriti sloka 2:36)). Upanayanam marks the start of learning of "Brahman" and Vedic texts. The age for Upanayanam supports this as Brahmins devote their life in pursuing the knowledge of "Brahman" and hence makes sense to start early and continue for a longer time. Kshathriyas, on the other hand, study additional skills and go through the brahmin stage of life, studying. In the communities where three strands of Yajñopavītam are added at the time of wedding, there is another interpretation.
Once a student achieves a certain level of Brahma knowledge ("Brahma Vidya"), the guru adds three more strings signifying "graduation" and the student goes on to study. In South Indian wedding ceremonies, the addition of the three more strings is followed by "Kashi Yatra". This signifies the Yatra student intends for advanced study. At this point, the father of the bride convinces the youth to get married and then go to Kashi (Varanasi) with his new bride. In modern days, the ceremony is packaged in the wedding ceremony.
The sacred Yajñopavītam is supposed to be worn for the rest of one's life after the ceremony has been performed. A new Yajñopavītam is worn and the old Yajñopavītam discarded every year; the change-over ceremony is held on a specific date calculated as per the Hindu lunar calendar. Among Brahmins, this date varies depending on which of four Vedic Shakhas one belongs to.
The sacred Yajñopavītam has close and essential connection with the concept of pravaras related to brahmin gotra system, which reflects the number of most excellent Vedic rishis belonging to the particular gotra to which the wearer of sacred Yajñopavītam belongs.
Generally, there are either three or five pravaras. While tying the knots of sacred strands of Yajñopavītam, an oath is taken in the name of these excellent sages. The full affiliation of a Vedic brāhamana consists of
gotra
sutra (of Kalpa)
shakha
pravaras.
For example, a brahmana named 'X' introduces himself as follows: I am 'X', of Shrivatsa gotra, of Āpastamba sutra, of Taittiriya shākha of Yajurveda, of five pravaras named Bhārgava, Chyāvana, Āpnavan, Aurva and Jāmdagnya (This example is based upon the example given by Pattābhirām Shastri in the introduction to Vedārtha-Pārijata, cf. ref.)[citation needed]

The ceremony is called Munja or Mounji-Bandhana (lit. Tying of munja) in the state of Maharashtra. This name finds its origin in the name of a grass variety called Saccharum munja (Bengal cane[14]). This grass is used to make a girdle that is tied around the waist of the child.[15] In Gujarat, the sacred thread is known as the "janoi."
# Language Name of the ceremony Word for "Sacred Thread"
1 Sanskrit Upanayanam
उपनयनम् Yajñopavītam
यज्ञोपवीतम्
(also Braḥma sūtram
ब्रह्मसूत्रम्)
2 Malayalam Upanayanam
ഉപനയനം Poonool (IAST: Pūnūl)
പൂണൂല്‍
3 Tamil pūṇūl/Upanayanam
பூணூல்/உபநயனம் Pūnūl(IAST: Pūnūl)
பூணூல்
4 Telugu Odugu,Upanayanamu
ఒడుగు,ఉపనయనము Jandhyamu
జంధ్యము
5 Kannada Upanayana, Munji
ಉಪನಯನ,ಮುಂಜಿ Janivaara
ಜನಿವಾರ
6 Hindi Janeu
जनेऊ Janeu
जनेऊ
7 Marathi Munja
मुंज Zaanaway
जानवे
8 Konkani Munji
मुंज,मुंजि,ಮುಂಜಿ Jannuvey
जानवें,जानुवें
9 Assamese Lagundeoni
লগুণদিয়নি Lagun
লগুন
10 Bengali Uponayon
উপনয়ন Upabeet, Poité
উপবীত, পৈতে
11 Oriya Bratopanayan,Brata Ghara
ବ୍ରତୋପନୟନ, ବ୍ରତଘର Poitaa
ପଇତା
12 Nepali Bratabandha
ब्रतबंध Janai
जनई, जनै
13 Kashmiri Mekhal
معخل,मेखल Yonya
يoنيآ,योनया
14 Tulu Brahmopadesha, Upanayana, Noola Madimme
ಮುಂಜಿ,ನೂಲ ಮದಿಮ್ಮೆ Yagnopaveeta
ನಿವಾ
15 Gujarati Janoi
જનોઈ Yagnopavit
યજ્ઞોપવીત
16 Pahari Janeyu
जनेयु Janeyu
जनेयु
17 Sindhi Janya
जानया Janya
जानया
18 Punjabi Janju
जनजू Janju
जनजू
19 Sourashtra Oduvam
Jenjam
20 Maithili Upanayana
Janeu

A ceremony which combines chudakarma and upanayana is called Bratabandha (Sanskrit brata = promise, bandhan = to be bound) among the hill communities in Nepal.
Bratabandha is a Hindu ceremony held for boys from 8 to 12 years old. It is the beginning of learning the traditional laws, ceremonial roles and rituals of their caste. It is considered as the beginning of their manhood. Boys who have not performed their Bratabandha cannot marry.[16] It is a symbolic representation that a boy is mature enough to perform his duties as a brahmachari (i.e., to learn)
Red, white, yellow patterns, and Swasti are made around a fire for protection. They indicate where each god should sit as they join the ceremony.[16] Offerings of fruit, money, cloth, and rice are made. At least two Bhramin priests are required to perform the complex rituals.
The boy's head is shaved by his mother's brother for purification. All of his hair is collected to protect the boys from anyone who might use them for harm. These hair will be later disposed of. After a boy's head is shaved completely, his mother, aunts, and sisters come to him to rinse any hair from their necks.Mothers never consider their boys to be men.
Boys who belong to the Brahmin caste were dressed in orange and given a deer skin bag to signify the traditional roles of Brahmins as priests. Boys of other castes use different objects instead.
Much of the ceremony is done under the cover of a shawl. This is secret only to the boy and his new Guru. Occasionally one of the boys comes out from the cover to add elements to the fire.The Guru later gives his students a sacred string to wear and a secret mantra, which they are not to share with anyone. This mantra comes from the holy Hindu book, Ved. It is said that if a boy repeats this mantra every day, he will be protected from misfortune and his matra will promote prosperity.[16] Also, the mantra is seen as the only companion in the metaphysical journey towards becoming a Bramhan.[17]
The ceremony ends as the boys ask their relatives for rice and receive Tika from their aunts. This practice is done to signify the traditional life of a monk and give the boys a spiritual grounding for their first life lesson.[16] At this point, the boys who want to renounce family life and get to the gurus by running (they only pretend to run) are stopped by the maternal uncle who lures them to the material world or grihastha by offering his daughter's hand in marriage. In that process the boy tries to run away by running towards the other side of the road. The boy promises to stay home and at the same time perform the karmas of a brahmachari (studying, earning a living, and performing religious rites).
Traditionally these boys were sent to ashrams of gurus to learn in a Gurukul system of education.
After the ceremony the boys are considered men (though not physically). They are given the Janai, a sash made of strings, and are expected to keep with the rules and norms of full-age men. This promise, taken by wearing the Janai, holds them in a bond. This gives its name Bratabhandha. From this point onward they are permitted to take an active part in religious ceremonies (pujas, last rituals, marriages, etc.). Non-veg is not allowed to the boy for a week or so who has just gone through his Bratabandha. Brahmins are given six strings and are taught the secret gayatri mantra which is not to be repeated aloud. Chettris are also given six strings. Some other castes, like giri and puri, are given three strings.
The Bratahbanda, like other Nepali festivals, is about a family recognizing an important day in someone's life.
Upanayana also means taking somebody near (upain) knowledge. In ancient times, after the ceremony was performed, the child was sent to the guru's house (gurukul) for education, where the child remained until completion of education. Even today, there are many Vedic gurukulas (traditional Vedic schools) which follow this practice with and without government help, without taking any fees from students (who must be brahmacharis).
Read More

Powered By Blogger | Template Created By Lord HTML