కార్తీకమాసంలో పుణ్యతిధులు :
కార్తీకశుద్ద పాడ్యమి, విదియ, తదియ , కార్తీకశుద్దచవితి,పంచమిమంచివి , పౌర్నమి, ఏకాదశి,దశమి.
కార్తీకమాసములోచేయకూడనిపనులు :
ఉల్లి, వెల్లుల్లి, మద్యం,మాంసం, వంటివి భుజించరాదు. దైవదూషణ, అవహేళణ చేయరాదు.దీపారాదనకు తప్ప, నువ్వులనూనెను, వేరొక కార్యక్రమాలలకు వాడకూడదు .మినుములు తినకూడదు.నలుగు పెట్టుకుని స్నానంచేయవలెను.కార్తీకవ్రతం చేయువారు, వారిచేతితో ఇంట్లోవడ్డన చేయటంమంచిది .
కార్తీకమాసంలో చేయవలసిన పనులు :
ఉపవాసం, జాగరణ, తలస్నానం( ఆరోగ్యంసహకరించినవారుమాత్రమే )
దానం( మాములుగా చేసినప్పటి కంటే ఇప్పుడు చేయు దానంచాలామంచిది ), శ్రీమహావిష్ణువును(వేంకటేశ్వరుని)- లక్ష్మిదేవిని,తులసిమాలతోకాని, తులసిఆకులతో కాని ప్రార్దించండి. కుదిరితేకమలం ,జాజి, అవిసేపువ్వు, గారిక , దర్భాలతోప్రార్దించండి.
మహాశివునిపూజించు వారు ప్రతిరోజు 11 దొసెడలతొ(రెండుచేతులు కలిపినా దొసెడలతొ ) గుడిలో, గుడిచుట్టుపక్కల ఉండేచిన్న, పెద్దశివలింగాములపై పోయండి, ఇలాపోయునపుడు " ఓంనమఃశివాయః " అని మనసు లో ప్రార్దించండి. పరమేస్వరునికి బిల్వపత్రాలు సమర్పించండి.
ప్రతిరోజు జపంచేసే అలవాటు కలిగినవారు, మరొకగంట తీరికచేసుకుని ఈ మాసం మొత్తం, ఎక్కువజపం చేయండి .
ఈ మాసంలోపైన చెప్పిన పుణ్యతిదులలో ( ఉదా : ఏకాదశి, దశమి, పౌర్నమి , సోమవారం, .. మొ॥ ) భక్తితో , నియమనిష్టలతో , ఏదయినాగుడికి వెళ్లి దీపమును వెలిగించండి
కార్తీకపౌర్నమినాడు ఉపవాసం ఉంది, శివునికి రుద్రాభిషేకం చేయించండి, మరియుశివాలయంలోకాని , ఇంటిలోకాని దేవుడినిప్రార్ధించి, 365- వత్తులతోదీపం వెలిగించి దేవునికి సమర్పించండి .
కార్తీకమాసం ఒక్కనెలా, స్తొమత కలిగినవారు ఆవునేయ్యతో, దేవునిబిడ్డలు( పేదవారు ) నువ్వులనూనెతొదీపంవెలిగించవచ్చు .
ఈ క్రిందచెప్పినవి పాటించుటవలన, మీపాపములుపోవును, మీతరువాతితరములు సుఖశాంతులతో వర్దిల్లకలరు.
కార్తీకమాసంశివునికి, శ్రీమహావిష్ణువుకు ఇరువురికి ఇష్టమయినమాసము .
No comments:
Post a Comment