What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 28 January 2015

కర్ణుడు.. కుంతీదేవికి పుట్టలేదు. కుంతీదేవి కూడా నవమాసాలు మోసి ‘కర్ణుని’ కనలేదు.



కర్ణుడు.. కుంతీదేవికి పుట్టలేదు. కుంతీదేవి కూడా నవమాసాలు మోసి ‘కర్ణుని’ కనలేదు. కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడు... అంతే. కన్యగా ఉన్న కుంతికి., దూర్వాసమహర్షి ఇచ్చిన మంత్రం ‘సంతాన సాఫల్య మంత్రం’. ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే, ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారు తప్ప మరే వరాలు అనుగ్రహించరు. ఆ మంత్ర ప్రభావం అలాంటిది. ఈ విషయాన్ని పాఠకులు ముందు అర్థంచేసుకుంటే..కర్ణుడు, కుంతికి ఎలా ఇవ్వబడ్డాడో బాగా అర్థం అవుతుంది. ఇక విషయంలోకి వెడితే.... పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన వెయ్యి కవచాలు వరంగా పొందాడు. అప్పటినుంచి వాడికి ‘సహస్రకవచుడు’ అనే పేరు స్థిరపడిపోయింది. ఆ వరగర్వంతో వాడు సర్వలోకాలనూ నానా హింసలకు గురిచేసి ఆనందిస్తూండేవాడు. వాడి బాధలు పడలేక సకల ప్రాణికోటి శ్రీ మహావిష్ణువును శరణు కోరగా ‘భయపడకండి..నేను నర, నారాయణ రూపాలలో బదరికావనంలో తపస్సు చేస్తున్నాను. వాడికి అంత్యకాలం సమీపించినప్పుడు వాడే నా దగ్గరకు వస్తాడు. అప్పుడు నేనే వాడిని సంహరిస్తాను’ అని వారికి ధైర్యం చెప్పి పంపాడు.


హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి రెండురూపాలుగా విడిపోయాడు. నర రూపం ‘నరుని’గానూ., ‘సింహ’ రూపం ‘నారాయణుని’గా ‘ధర్ముని’ కుమారులుగా జన్మించాడు. వారే నర, నారాయణులు. వారిరువురూ పుట్టుకతోనే పరాక్రమవంతులు, విరాగులు. అందుకే వారిరువురూ ఆయుధధారులై బదరికావనంలో ఏకాగ్రచిత్తులై తపోదీక్ష వహించారు. ఏ ఆటంకం లేకుండా వారి తపస్సు కొనసాగుతోంది. ఒకసారి ప్రహ్లాదుడు బదరికావనం సందర్శించి వెడుతూ.. నర, నారాయణులను చూసి, వారి ప్రక్కన ఆయుధాలు ఉండుట గమనించి..‘తాపసులైన వీరికి ఆయుధాలతో పనేమి? వీరెవరో కపట తాపసులైయుండవచ్చు’ అని భావించి వారికి తపోభంగం గావించి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. వారిమద్య భీకరయుద్ధం జరిగింది. ఎంతకాలమైనా ప్రహ్లాదుడు వారిని జయించ లేకపోవడం చూసి, ఆశ్చర్యపడి శ్రీ మహావిష్ణువును ధ్యానించాడు. శ్రీహరి ప్రత్యక్షమై ‘ప్రహ్లాదా.. నర నారాయణులు నా అంశతో జన్మించినవారు. వారిని నీవు గెలవలేవు’ అని చెప్పాడు. ప్రహ్లాదుడు తన తప్పు తెలుపుకుని నర,నారాయణులను క్షమించమని వేడుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

నర,నారాయణుల తపస్సు కొనసాగుతోంది. వారి తపస్సుకి ఇంద్రుడు భయపడి., వారికి తపోభంగం చేసిరమ్మని అప్సరసలను పంపాడు. వారు తమ రూప, వయో, నృత్య, గానాలతో నర,నారాయణుల తపస్సుకు భంగం కలిగించాలని ఎంతో ప్రయత్నించారు.. కానీ, ఫలితం శూన్యం. అప్పుడు నారాయణుడు వారిని దగ్గరకు పిలిచి, ‘మీ అందాలు మమ్ములను ఆకర్షించలేవు. ఇంద్రపదవి ఆశించి మేము ఈ తపస్సు చేయడంలేదు అని మా మాటగా మహేంద్రునకు తెలియజెప్పండి’ అని తన తొడమీద చరిచాడు. ఆ శబ్దం నుంచి ఓ అసాధారణ, అద్భుత సౌందర్యరాశి జన్మించింది. తన ఊరువుల(తొడల) నుంచి పుట్టిన ఆ సుందరికి ‘ఊర్వసి’ అని పేరు పెట్టి, ఆమెను ఆ అప్సరసలకు ఇస్తూ, ‘ఈమెను మా బహుమతిగా మహేంద్రునకు ఇవ్వండి’ అని చెప్పి వారిని పంపాడు. మహేంద్రుడు తన తప్పు తెలుసుకుని నర,నారాయణులను క్షమించమని వేడుకున్నాడు. నర,నారాయణుల తపస్సు కొనసాగతోంది. ఆ సమయంలో వరగర్వాంధుడైన ‘సహస్రకవచుడు’ వారిదగ్గరకు వచ్చి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు నారాయణుడు అతనితో ‘రాక్షసేశ్వరా..నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది. కానీ, మేమిద్దరం కలిసి నీ ఒక్కనితో యుద్ధం చెయ్యడం ధర్మం కాదు. కనుక, మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తూంటే మరొకడు తపస్సు చేసుకుంటాడు. అతని తపస్సుకు ఎలాంటి అంతరాయం కలుగకూడదు. ఇందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను’ అన్నాడు.

సహస్రకవచుడు ఈ ఒప్పందానికి సమ్మతించాడు. నరుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు యుద్ధానికి దిగాడు. యుద్ధం భీకరంగా సాగుతోంది. అలా వేయి సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుడు సహస్రకవచుని వేయి కవచాలలో ఒక కవచాన్ని భేదించగలిగాడు. అప్పటికి అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా, నరుడు సహస్రకవచునితో యుద్ధానికి దిగాడు. మరో వేయి సంవత్సరాలు గతించిన అనంతరం నరుడు సహస్రకవచుని మరో కవచాన్ని భేదించాడు. ఇలా నర,నారాయణులిరువురూ కలిసి ఆ సహస్రకవచుని తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు భేదించారు. ఇక సహస్రకవచునికి ఉన్నది ఒకేఒక కవచం. అది గమనించిన సహస్రకవచునికి భయం పుట్టి, యుద్దరంగం వదిలి, పరుగు పరుగున సూర్యుని దగ్గరకు వెళ్లి అభయం ఇమ్మని వేడుకున్నాడు. అప్పుడు సూర్యుడు ‘కలకాలం నేను నీకు అభయం ఇవ్వలేను., నర,నారాయణుల అనంతరం నీకు నానుంచి విడుదల కలిగిస్తాను’ అన్నాడు. సహస్రకవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉండిపోయాడు. కుంతి మంత్రబలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు., ఆ సహస్రకవచునే.., పసిబిడ్డగా మార్చి, కుంతి చేతికి అందించాడు. అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు. ఆ కర్ణుని సంహరించడానికే నర,నారాయణులిరువురూ.. కృష్ణార్జునులుగా జన్మించి, కురుక్షేత్ర రణభూమిలో కర్ణుని సంహరించారు.



Read More

"గీత జ్ఞానం - జీవన సారం" సాంఖ్యయోగం



"గీత జ్ఞానం - జీవన సారం" సాంఖ్యయోగం

నీవు ఏది ధర్మం అని నమ్ముతావో అది కార్య రూపంలో పెట్టు.నీ సమస్త సైన్యం నీకు వ్యతిరేకంగా ఉన్నా సరే, నీ చేతిలో కత్తి లేకపోయినా,నీ వైపు కొద్ది మంది ఉన్నా మరేదైనా కానీ…రథ సారధివై మధ్యలో ఉండు, నీ శక్తి సామర్ధ్యాలను నమ్ముకో. ముందు కీడెంచి మేలెంచు…
ఒక్క సారి కార్య క్షేత్రంలో దిగిన తరువాత మానసిక వికల్పాలతో పని లేదు. అక్కడ గెలుపు ఓటములను ఎదుర్కోవడమే మంచిది. రెండూ సమానమే. ఇటువంటి గుణగణాలతో పని చేస్తే తప్పక విజయం సాధిస్తాం.


అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ |
తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి || 26

అర్జునా ! శరీరంతోపాటు ఆత్మకు కూడా సదా చావు పుట్టుకలుంటాయని భావిస్తున్నప్పటికీ నీవిలా శోకించవలసిన పనిలేదు.

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యే௨ర్థే న త్వం శోచితుమర్హసి || 27

పుట్టిన వాడికి చావు తప్పదు. చచ్చిన వాడికి పుట్టుక తప్పదు. తప్పించరాని ఈ విషయంలో తపించనవసరం లేదు.

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత |
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా || 28

జీవులు పుట్టుకకు పూర్వం కాని, మరణానంతరం కాని ఏ రూపంలో వుంటాయో తెలియదు. మధ్యకాలంలో మాత్రమే కనబడుతాయి. అర్జునా !అలాంటప్పుడు విచారమెందుకు?

ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం
ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః |
ఆశ్చర్య వచ్చైనమన్యః శృణోతి
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ || 29

ఒకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇంకొకడు దీన్ని గురించి విచిత్రంగా మాట్లాడుతున్నాడు. మరొకడు వింతగా వింటున్నాడు. అయితే ఈ ఆత్మ స్వరూపస్వభావాలు తెలుసుకున్న వాడు ఒక్కడూ లేడు.

దేహీ నిత్యమవధ్యో௨యం దేహే సర్వస్య భారత |
తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి || 30

అన్ని దేహాలలోనూ వుండే ఆత్మకు చావు అనేది లేదు. అందువల్ల ఈ ప్రాణుల గురించి నీవు దుఃఖించనక్కరలేదు.
Read More

నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు

నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు

చెబుతున్నాయి. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు.
జనన వృత్తాంతము :
అదితి , కస్యపు ముని కుమారుడైన సుర్యభావానునికి ముగ్గురు భార్యలు -- ఉషా(సంజ్ఞా) , చాయ , పద్మిని .
లోకాలన్నితికి వెలుగునిచ్చే సుర్యాడు త్వష్ట ప్రజాపతి "విశ్వకర్మ" కూతురు సంజ్ఞా(ఉమా) దేవిని పెళ్ళిచేసుకున్నాడు . పెళ్ళైన నుండే సూర్యకాంతిని , తేజస్సును భారిచలేక , చూడలేక విచారము తో ఉన్న ఉమాదేవి ని నారదుడు చూసి , విషయము తలుసుకొని ... ఈశ్వరుని తపస్సు చేసి శక్తిని పొందమని ఉపాయమార్గము జప్పెను . అప్పటికే తనకి ముగ్గురు పిల్లలు -మొదటివాడు వైవాస్తవ . రెండేవ వాడు యముడు . మూడవది కూతురు యమున. నారద సలహా మేరకు ఉమాదేవి తన నీడకు ప్రాణము పోసి "చాయాదేవి" గా సూర్యుని వద్ద పెట్టి పుట్టింటికి వెళ్ళిపోయెను, కూతురు భర్తకి చెప్పకుండా పుట్టింటికి వచ్చినందున అనరాని మాటలతో నిందించి తిరిగి సుర్యునివద్దకే వెళ్ళిపొమ్మని చెప్పగా .. గోప్యం గా ఉన్న ఛాయా రహస్యము బయట పడ కూడదనే సదుద్దేశముతో అడవికి పోయి తపస్సు చేయసాగెను . తన అందము , యవ్వనము చూసి ఇతరులబారినుంది తప్పించుకొనుటకు గుఱ్ఱము రూపములో మారిపోయి ఈశ్వరునికి తప్పస్సు చేయసాగెను . సూర్యునికి .. ఛాయాదేవికి "మను (సావర్ణుడు) , శని , తపతి (కూతురు) జన్మిచారు . శని గర్భము లో ఉండగా చాయ ఈశ్వరునికి ఘోర తపస్సు చేసెను . ఉపవాసదీక్ష చేయడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ నల్లగా మారిపోయాడని , తల్లి తపోశక్తి వల్ల అనేక ఈశ్వర శక్తులు గ్రహించాడని , శని చూపే వినాశకరం గా మారినదని పండితులు అంటారు . సూర్య తేజస్సు లేని ఈబిడ్డ తనబిడ్డ కాదని చాయని సూర్యుడు అనుమానించి అవమానిస్తాడు . అది విన్న శని తండ్రి అయిన సూర్యున్నే నల్లగా మారిపోవాలని , సూర్యగమనం ఆగిపోవాలని , సూర్య రధం నల్ల రంగు గా అయిపోవాలని శపిస్తాడు . అప్పుడు తన తప్పును తెలుసు కున్న సూర్యుడు ఈశ్వరుని వేడగా ... జరిగిన విషయమంతా సూర్యునకు తెలిజేయగా ఈశ్వరుని కోరిక మేరకు శని తన శాపాన్ని వెనక్కి తీసుకొని సూర్యున్ని శాపవిముక్తి గావించెను . అంతా సుఖము గా ఉన్నా ... శని సూర్యుని పై పగబూని ఈశ్వరుని తపస్సు జేసి ఎన్నో వరాలు పొందెను .
శని జన్మ నక్షత్రము : శని విభావనామ సంవత్సరము , మాఘమాసము ,కృష్ణపక్షము ,చతుర్దశి నాడు , ధనిష్టా నక్షము న జన్మించాడని కొందరంటే .. మార్గశిర మాసము -బహుళ నవమి ,రోహిణీ నక్షత్రాన శివుని ఆశీస్సులతో జన్మించాడని కొందరు అంటారు . . శనీశ్వరుడు కుడి చేతిలో దండము , ఎడమ చేతిలో కమండలము , sword (ఖడ్గము) arrows and two daggers దరించి ఉంటాడు .
శని పెళ్ళి : లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవి(ఈమెనే దరిద్రదేవత అంటారు) శనైశ్చరుడి భార్య. అంటే శనిభగవానుడు విష్ణుమూర్తికి తోడల్లుడు అన్నమాట., యమధర్మరాజు కి సోదరుడు , గ్రహాలకు యువరాజు .
హరిచ్శంద్రుడు , నలుడు , పురుకుత్సుడు , పురూరవుడు , సగరుడు , కార్తవీర్యార్జునుడు , శని మహిమ వల్ల అనేక కస్టాలు పొంది చివరకి శని కృప వల్లే సర్వ సుఖాలు పొందేరు .
శనిదూషణ సర్వదేవతలనూ తిట్టినదాంతో సమానం అని పెద్దలు చెబుతారు. ఆయనను పూజిస్తే దేవతలందరినీ పూజించినంత ఫలితం లభిస్తుందంటారు. త్రేతాయుగంలో లంకలో రావణాసురుని చెరలో ఉన్న శనైశ్చరుని ఆంజనేయుడు విడిపించాడని ఒక కథనం. అందుకే హనుమత్‌దీక్షలో ఉన్నవారినీ అలాగే మందుడికి ఇష్టమైన నల్లటి వస్త్రాలు ధరించే అయ్యప్ప దీక్షాపరులనూ ఆయన బాధించడని నమ్మిక.
శనీశ్వరుడు మరియు హనుమంతుడు
హనుమంతుడుని పూజించుట వలన శని భగవానుడి యొక్క ఉనికిచే ఏర్పడే 'ప్రతికూల' ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని విశ్వసిస్తారు. రామాయణంలో హనుమంతుడు రావణుని బారి నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా, ఎవరైనా హనుమంతుని ప్రార్ధించినచో, ముఖ్యముగా శనివారాలలో, వారు శనిగ్రహం యొక్క "దుష్ప్రభావాల" నుండి విముక్తులగుదురు, లేదా కనీసం వాటి ప్రభావము తగ్గుతుందని శని హనుమంతునికి ప్రమాణం చేశాడు.
శని భగవానుడు మరియు హనుమంతుని మధ్య జరిగిన ఇంకొక సంఘర్షణను గూర్చిన కథనం ప్రకారం శని ప్రభావము హనుమంతునిపై మొదలవుతున్న సూచికగా, ఒకసారి శని హనుమంతుని భుజాలపై ఎక్కాడు. అప్పుడు హనుమంతుడు భారీ కాయునిగా అవతరించగా, శని హనుమంతుడు భుజాలు మరియు వారు ఉన్న గది యొక్క పైకప్పు మధ్య బంధింపబడ్డాడు. ఆ నొప్పిని భరించలేక శని భగవానుడు హనుమంతుడును తనను విడిచిపెట్టమని వేడుకుంటూ, ఎవరైనా హనుమంతుడిని ప్రార్థించినచో ఆ వ్యక్తిపై తన(శని) యొక్క దుష్ప్రభావాలు తగ్గుట లేదా పూర్తిగా నిర్ములింపబడునట్లుగా చేసెదెనని శనిభగవానుడు మాట యిచ్చాడు. ఆ తరువాత హనుమంతుడు శనిని విడిచిపెట్టెను.
శనీశ్వరుడు - శివుడు :
పూర్వము కృతయుగములో కైలాసము లోని పరమశివుని దర్శించవచ్చిన నారదుడు ... ప్రమేశ్వరునికి నవగ్రహాలలో శనిగ్రహ ఆధిక్యతను బహువిధాల చెప్పాడు . నారదుడు చెప్పిన శనిగ్రహం పొగడ్తలు శివునికి నచ్చలేదు . ఆ కారణము గా .. ' శని అంతటి శక్తిమంతుదైతే తన ప్రభావాన్ని తనపై (శివునిపై) చూపి , తనను పీడించి శని శక్తిసామర్ధ్యాలను నిరూపించుకోమను ' అని శివుడు అనగా నారదుడు ఆవిషయము శని తో చెప్పెను . పరమశివుని మాటలకు శనికి అవేశము , పట్టుదల ప్రేరేపించాయి . తను శివుని ఒక క్షణము పట్టి పీడిస్తానని ... ఆ విషయము తెలియజేయమని నారదునిచే వార్త పంపెను . ఈ విధముగా నారదుడు శివ , శని ల మద్య తగాదా సృష్టించాడు .
నారదుడు తక్షణం శని చెప్పిన మాటలు శివునికి తెలియజేసి శనిప్రభావాన పడకుండా జాగ్రత్తపడమని చెప్పి వెళ్ళిపోయెను . " శని తనను ఎలా పీడించగలడో చూస్తాను ' అనుకుంటూ కైలాసము నుంచి మాయమై దండకారణ్యము దారిపట్టాడు శివుడు . ఎవరి ద్రుష్టికీ ఊహకు రాని చోటుకోసం అలోచించాడు . ఆ ఆడవిలోతూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వద్ద మందపల్లి గ్రామం నందు ఒక పెద్ద రావిచెట్టు తొర్ర లొ ఈశ్వరుడు దాక్కున్నాడని, తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి. మరునాడు ఉదయం ఈశ్వరుడు కళ్లు తెరిచేటప్పటికి శని ఎదురుగా నిలబడి ఈశ్వరునికి నమస్కరించాడు. అప్పుడు " ఏ మయింది నీ శపథం " అని ప్రశ్నించాడు ఈశ్వరుడు . ఆయన మాటలకు శని పరిహాసం చేస్తూ " పరమశివుదంతటివాడు దేవతలకు , ఋషులకు , మరి ఎందరికో ఆరాధ్యదైవం , చల్ల్ని ప్రశాంతమైన కైలాసము నుంచి పారిపోయి దండకారణ్యములో పరుగులు పెట్టి దిక్కులేని వాడివలె చెట్టు తొర్రలో దాగుకోవడమంటే ... ఆ క్షణము శని పట్టినట్లు కాదా ! "అని అడిగాడు శని నెమ్మదిగా వినయం గా . శని సమయస్పూర్తికి , వినయానికి ఆయన ప్రభావానికి , పట్టుదలకు మెచ్చుకున్నాడు శివుడు . . తనను మెప్పించిన శనికి ఆనాటినుండి ఈశ్వర అనేశబ్దము సార్ధకం కాగలదని మానవులు తనను(శనిని) శనీశ్వరా అని పూజిస్తే .. శని తరపున పరమశివుడు ఆశీస్సులు ఇస్తానని వరము ఇచ్చెను . అలా శనిగ్రహం శనీశ్వరడు అయ్యాడు .
శని త్రయోదశి ఎలా వాడుకలోనికి వచ్చినది :
సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడునే ఆహా! శని ప్రభావమునకు లోనయ్యాను. సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు , శని... " నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకుని శనేశ్వరుడని పేరు పొందగలవు. ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీ కిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంఖు పుష్పములు, నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్పించి ఆరాధిస్తారో .. వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరము ఇస్తునానని తెలిపాడు. ఆ తదుపరి త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా ఈశ్వరునికి అర్చించి తమ దోషాలు పోగొట్టుకున్నారు. శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.
"శని" భగవానునికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం న త్రయోదశి రోజు .
శనీశ్వరుడు మరియు రోమపాద మహారాజు
తన రాజ్యములో నెలకొన్న కరువు మరియు పేదరికానికి శని భగవానుడే కారణమని గుర్తించి ఆయనతో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడ్డ ఏకైక వ్యక్తి దశరథ మహారాజు. దశరథ మహారాజు యొక్క సుగుణాలను మెచ్చుకుంటూ శనీశ్వరుడు "నేను నా భాద్యతలనుండి తప్పించుకోలేను, కాని నీ ధైర్యానికి ముగ్ధుడనయ్యాను". ఋష్యశృంగ మహర్షి నీకు సాయం చేయగలడు. ఎక్కడైతే ఋష్యశృంగుడు నివశిస్తాడో ఆ దేశములో కరువుకాటకాలు ఉండవు" అని చెప్పెను. శని భగవానుని దీవెనలు అందుకున్న తరువాత దశరథ మహారాజు, ఋష్యశృంగుని తన అల్లునిగా చేసుకొని తన సమస్యను తెలివిగా పరిష్కరించుకున్నాడు. ఋష్యశృంగుడు ఎల్లప్పుడూ అయోధ్యలో ఉండేవిధంగా, దశరథుడు కుమార్తెగా చెప్పబడే 'శాంత'ను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించారు.
శనిత్రయోదశి పూజ కోసము వారు కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది.
1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగినవారు ఆరోజు పగలు ఉపవాసము ఉండి సాయంత్రము 8గంటలతరువాత భోజనాదులను చేయటము.
2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు.
3. వీలైన వారుశివార్చన స్వయముగా చేయటము.
4. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు [నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం] అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.
5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.{జపంచేయటానికి కూడా సమయము వెచ్చించలేనివారి కోసము మేమేమీ చేయలేము}
6. ఆరోజు [కుంటివాళ్ళు,వికలాంగులకు] ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం
7. ఎవరివద్దనుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలి.
ఏలినాటి శని గ్రహ దోష శాంతి విదానం :-
1 మయూరి నీఎలం ధరించుట
2 శని జపం ప్రతి రోజు జపించుట
3 శని కి తిలభిషేకం చేఇంచుట
4 శివ దేవునకు అభిషేకం ,ప్రతి సనివారం రోజు ఎనిమిది రూపాయలు లేదా ఎనిమిది సంక్య వచ్చే లాగా బ్రహంనుకి దానం చేయుట
5 శని వారం రోజు నవగ్రహాల ఆలయం లో లేదా శివాలయం లో ప్రసాదం పంచుట
6 ప్రతి రోజు నువుండలు కాకులకు పెట్టుట వలన
7 శని వారం రోజు రొట్టి పై నువుల నూనే వేసి కుక్కలకు పెట్టుట వలన
8 హనుమంతుని పూజ వలన
9 సుందరకాండ లేదా నల చరిత్ర చదువత వలన
10 కాలవలో కానీ నది లో కానీ బొగ్గులు నల్ల నువులు మేకు కలపటం వలన
11 శని ఎకదాస నామాలు చదువత వలన ( సనేస్వర ,కోన, పింగల , బబ్రు, కృష్ణ , రౌద్ర ,అంతక , యమ, సౌరి, మంద ,చాయపుత్ర ) ప్రతి రోజు చడువటం వలన
12 బియపు రవ్వ మరియు పంచదార కలిపి చిమలకు పెట్టుట వలన
13 ఆవుకు నల్ల చెక్క ప్రతి రోజు పెట్టుట వలన
14 ప్రతిహి శని వారం రాగి చెట్టుకు ప్రదషణం మరిఉ నల్ల నువులు మినుములు కలిపినా నీటిని రాగి చెట్టు కు పోయటం వలన
15 ఇనుము తో చేసిన ఉంగరం ధరించుట వలన
16 చేపలు పట్టే పడవ ముందు బాగం లోని మేకు తో ఉంగరం చేసి ధరించుట వలన
17 బ్ర్హమనకు నల్ల వంకాయ, నల్ల నువులు, మేకు , నల్లని దుప్పటి దానం
18 ప్రతి శని వారం శివాలయం లేదా నవగ్రహలయం ముందు బిచ్చగాలకు ఆహరం పెట్టుట వలన నల్లని దుప్పటి దానం చేయటం వలన
19 అయ్యప్ప మాలా ధరించుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి కి తల నీలాలు ఇచ్చుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలా ధరించుట వలన 20 ప్రతి శని వారం వెంకటేశ్వర స్వామి దరసనం శివాలయం లో శివుని దర్సనం హనుమంతుని దర్సనం kala bhirava puja దరసనం వలన శని గ్రహ దోషం సాన్తిచ్చును
న్యాయాధికారి
మానవులు పూర్వజన్మలో చేసుకున్న పాప, పుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనైశ్చరుడు నియంత్రిస్తాడంటారు. అలా ఈ జన్మలో ఆ మానవుడు చేసే పాపపుణ్యాల ఆధారంగా మరణానంతరం స్వర్గనరకాలను నిర్ణయిస్తాడు యమధర్మరాజు. సూర్యుని కుమారులైన శని, యమధర్మరాజు ఇలా న్యాయాధికారులుగా వ్యవహరించడం విశేషం. శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడని నమ్మిక. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సద్వర్తన కలిగినవారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడని పెద్దలు చెబుతారు. శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.
మందపల్లి మందుడు
తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలో శనీశ్వరాలయం ప్రసిద్ధిగాంచింది. పూర్వం అశ్వత్ధ´, పిప్పలాదులనే రాక్షసులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే మునులను సంహరించి వారిని భక్షించేవారట. అప్పుడు వారంతా వెళ్లి అక్కడే పరమేశ్వరుని తపస్సులో ఉన్న శనీశ్వరునితో వెురపెట్టుకున్నారట. వారి వెురను ఆలకించిన మందుడు ఆ రాక్షసులను హతమార్చాడట. అసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని నివారించుకునేందుకు మందపల్లిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడట. అప్పట్నుంచి ఆ ఆలయం శనైశ్చర క్షేత్రంగా పేరుపొందింది. శత్రుబాధ, రుణబాధ, రోగపీడతోనూ... ఏలినాటిశని, అర్ధాష్టమశనితోనూ బాధపడేవారు ఈ స్వామికి తైలాభిషేకం జరిపిస్తే అవన్నీ తొలగిపోతాయని ప్రతీతి. ఏటా శ్రావణమాసంలోనూ శనిత్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు.
ఇంకా... మహారాష్ట్రలోని శనిసింగణాపూర్‌ ప్రపంచ ప్రసిద్ధ శనైశ్చరాలయం. ఇటీవలే కర్ణాటకలోని ఉడుపిలో దేశంలోనే అతిపెద్దదైన శనీశ్వరుడి విగ్రహాన్ని (23 అడుగులు) ఆవిష్కరించారు.


Read More

భగవద్గీతలోని కర్మషట్కమును సరళంగా తెలిసికొనే ప్రయత్నంచేద్దామా

భగవద్గీతలోని కర్మషట్కమును సరళంగా తెలిసికొనే ప్రయత్నంచేద్దామా
1. అర్జున విషాదయోగము: అర్జునుడు అంటే సాధకుడు అని మనమందఱం సాధకులమే కదా ! విషాదము అంటే ఏడుపు అని అర్థం. యోగము అంటే మనం భగవద్గీత ను అనుసరించి పొందేస్థితి అని చెప్పవచ్చు అంటే ఉదాహరణకు కర్మయోగం అంటే కర్మని పొందేస్థితి, జ్ఞానయోగం అంటే జ్ఞానమును పొందేస్థితి, ధ్యానయోగం అంటే ధ్యానమును పొందేస్థితి అన్నమాట. మనకిప్పుడు ఒక సందేహం వస్తుంది అర్జునవిషాదయోగమంటే విషాదమును పొందే స్థితి అని కదా విషాదమును పొందడమేమిటి అని అంతేకదా ! విషాదము కి ఏడుపుకి గల తేడా తెలిస్తే ఈ సందేహం మనకి కలగదు. ఏడుపు అంటే ఏడుస్తూ ఉండే స్థితి దీని ఫలితం ఏడుపే కానీ , విషాదం అంటే ఏడుపుని తొలగించుకోవడం కోసం ఏడ్చే ఏడుపనమాట. ఆ ఏడుపుకి ఫలితం ముక్తి కాబట్టే అర్జునునివిషాదం యోగమయ్యింది. మనకి మన ఏడుపు రోగమయ్యింది.
2. సాంఖ్యయోగము: కిందపడి ఏడుస్తూ వచ్చిన బిడ్డని చూసి తల్లి ఏమంటుంది ప్రేమ అనే బంధంతో లేదులే లేదులే అంటుంది. వాడు అది నిజమే అనుకొని ఏడుపాపేస్తాడు. ఆ తల్లి లేదులే లేదులే అని దేనిగురించి అన్నదో, ఆ బిడ్డ లేదులే అంటే ఏమి లేదని అనుకున్నాడో మొత్తానికి ఏడుపైతే ఆపేస్తాడు. కానీ ఇక్కడ అదే ప్రక్రియ జరిగింది కానీ తల్లి లాగా స్వామి కి బంధంలేదు, బిడ్డ లాగా అర్జునునికి అజ్ఞానంలేదు. ఏది ఎందుకు లేదో, ఉన్నది అంటే ఎలా ఉంటుందో కార్యకారణాలతో చెప్పగలిగినది కాబట్టే ఇది సాంఖ్యయోగమయినది. నువ్వు బాధపడుతున్నావని నిన్ను ఓదార్చటానికి చెప్పే మాటలుకావు. నీ ఏడుపుతో సంభంధంలేకుండా ఉన్న నిజం సాంఖ్యం.
3. కర్మయోగం: పదోతరగతి తప్పిన విద్యార్థి తప్పాను అని ఏడుస్తున్నాడు. అది చూసిన మాష్టారు వాడి దెగ్గరకూర్చొని ఏవేవో చెప్పాడు. విద్యార్థి ఏడుపాపేశాడు. ఇప్పుడు మొదలయ్యేది ఏమిటి? ఆలోచించండి మిత్రులారా ఏముంది సెప్టెంబర్ లో పరిక్షకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే కదా . ఇలా తన ఏడుపుని అధిగమించి నిజం తెలిసికొన్న సాధకుడు చెయ్యవలసిన సాధనగురించి తెలియజేస్తుంది కాబట్టి ఇది కర్మయోగమయ్యింది.
4. జ్ఞానయోగం: నేను ఎందుకు తప్పాను? తప్పడానికి నేను చేసిన పొరపాట్లు ఏమిటి? నేను పాస్ అవ్వాలంటే నేను ఎలా ఆ పొరపాట్లని తీసెయ్యాలి అన్న విచారణనే సాధకుడు ఇక్కడా చేస్తాడు అది తనకు జ్ఞానమవుతుంది కాబట్టి ఇది జ్ఞానయోగమయ్యింది.
5. సన్న్యాసయోగం: నేను విద్యార్థిని. నాకు చదువుకోవడం అనే నియమం ఉంది. నేను ఆనియమంతో ప్రవర్తించాలి. నేను ఆనియమం తప్పాను. కాబట్టే పదో తరగతి తప్పాను. ఇప్పుడు అన్ని విషయాలని ఒదిలి ఈ నియమంతో ఉంటాను అని అన్ని విషయాలని ఒదిలి ఎలా ఆ విద్యార్థి ప్రవర్తిస్తాడో అదే సాధకుడు ఏ నియమాన్ని వదిలి అంతకుముందు ప్రవర్తించాడో ఆనియమాన్ని తెలిసికొని ఆనియమంతో ఉంటాడు అది తనకు సన్న్యాసమవుతుంది కాబట్టి సన్న్యాసయోగం.
6. ధ్యానయోగం: చివరికి ఆ విద్యార్థి తన పూర్వపుస్థితి ని మరచి ఆటలు, తిరుగుళ్ళు కట్టిపెట్టి కనీసం గుర్తుకుకూడా రాకుండా ఆ నియమాన్ని నిలుపుకుంటాడు. అట్లాగు సాధకుడు కూడా తన పూర్వ వాసనలను సైతం అధిగమించి తనని తాను నిలుపుకుంటాడు అది తనకు ధ్యానయోగమవుతుంది కాబట్టి ఇది ధ్యానయోగం. ఇది కర్మషట్కం. తదుపరి జ్ఞానషట్కంగురించి తెలిసికొందాం.
Read More

అంబేద్కర్ ఆత్మ కనుమరుగు : అంబేద్కర్ కు వెన్నుపోటు పొడుస్తున్న కొంతమంది ఆయన అనుచరులు . స్వార్దాలకు ఉపయోగపడుతున్న అంబేద్కర్ ఆశయములు

మన తెలంగాణా రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి గారు తను యేసు భక్తుడిని అని చెప్పుకుంటున్నారు మరి SC రిజర్వేషన్ మాత్రం కావాలి క్రీస్తు ని నమ్మే వారిని క్రిష్టియనులు అంటారు అన్నది పసి పిల్లవాడిని అడిగిన చెప్తారు! ఇంత పెద్ద పదవిలో ఉన్న వ్యక్తే బాహాటంగా తను క్రీస్తు ని అనుసరించే వాడు అని చెప్తూ హిందూ కులాల రిజర్వేషన్స్ మాత్రం అనుబవిస్తున్నాడు!!! ఈయన పదవికి కారణం ఈయన రిజర్వేషన్, అన్నది మరచి పోయాడు!! ఇంకా ఎలా దొంగగా రిజర్వేషన్స్ అనుబవిస్తున్నవారు ఎంతమంది ఉన్నారో లెక్క లేదు!! నిజంగా వారు యేసు ని నమ్మితే సంతోషం నమ్మండి, మరి హిందూ రిజర్వేషన్స్ ని వాటి సౌకర్యాలను వదిలేస్తే, హిందూ మతం లో ఉన్న నిజమైన వెనుకబడిన వర్గాల వారికీ న్యాయం జరుగుతుంది కదా?? CREDIT:


Read More

తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని కాలేజీ ల్లో, క్రైస్తవ మత ప్రచారాలు, కన్వర్తేడ్ క్రిస్టియన్ ను ప్రిన్సిపాల్ చేసిన ప్రభుత్వం. కాలేజీల్లో వందల మంది విద్యార్దులకు పేరు పేరున, క్రైస్తవ మత ప్రచార పుస్తకాలు. ఇందులో తప్పేముంది ??? ఈ పనులను నీను ఆపను అని మీడియా ముందర చెప్పిన కాలేజీ ప్రిన్సిపాల్ .

తిరుమల తిరుపతి  వేంకటేశ్వరుని కాలేజీ ల్లో, క్రైస్తవ మత ప్రచారాలు,  కన్వర్తేడ్ క్రిస్టియన్ ను ప్రిన్సిపాల్ చేసిన  ప్రభుత్వం. కాలేజీల్లో వందల మంది విద్యార్దులకు పేరు పేరున, క్రైస్తవ మత ప్రచార పుస్తకాలు. ఇందులో తప్పేముంది ??? ఈ పనులను నీను ఆపను అని మీడియా ముందర చెప్పిన  కాలేజీ  ప్రిన్సిపాల్ . 

ఎస్ వి ఆర్ట్స్ కాలేజీ హాస్టల్లో క్రైస్తవ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో మత మార్పిడులు
హిందువులకు అరాధ్యదైవమైన బాలాజీ భక్తుల సమర్పణలతో నడిచే కాలేజీలో జీవన భృతి పొందుతూ ఏ హిందువైతే వానికి జీవనాధారాన్ని ఇచ్చాడో వానికే వెన్నుపోటు మత మార్పిడులకు పాల్పడుతున్న ఒక క్రైస్తవ ధూర్తుని కధనమే ఇది..... ఏమి చెయ్యాలో మీరే నిర్ణయించండి మిత్రులారా ...
ఇదే విశ్వవాణి అడ్రస్ చూసుకోండి
Vishwa Vani
1-10-28/247, Anandapuram, Kushaiguda,
E.C.I.L. Post, Hyderabad-500062
Off : 040-27125557, Fax : 040-27126004






Read More

‪#‎నీకిది‬ తెలుసా...? భారతదేశం మన మాతుృభూమి.మనకే కాదండోయ్ ఈ భూమి సాక్షాత్తు భూమిని పుట్టించిన భగవంతుడికి కూడా మాతుృభూమి అయ్యింది,ఈ దేశమంటే భారతీయులకే కాదు భగవంతునికి కూడా ఇష్టమే.

‪#‎నీకిది‬ తెలుసా...?
భారతదేశం మన మాతుృభూమి.మనకే కాదండోయ్ ఈ భూమి సాక్షాత్తు భూమిని పుట్టించిన భగవంతుడికి కూడా మాతుృభూమి అయ్యింది,ఈ దేశమంటే భారతీయులకే కాదు భగవంతునికి కూడా ఇష్టమే. అందుకే ఆయన ఈ భూమి పైనే జన్మ తీసుకున్నాడు. అంతేనా, కొన్ని లక్షలమంది మహానుభావుల్ని, మేధావుల్ని ఈ దేశంలో పుట్టించాడు.
మరి అందరూ మహానుభావులు ఈ దేశంలో పుడితే భగవంతుడు ప్రపంచానికంతా ఏం చేశాడు..? అని అంటారా,? చేశాడు, ఆయన రేఖా గణితంలో పిల్లలు కేంద్రం ఒక చోట వుంచి కోణమానితో వృత్తం గీసినట్లు భారతదేశాన్ని కేంద్రంగా చేసి,ఆధ్యాత్మికతను,విజ్ఞానాన్ని,అందించా

డు. మీరు భలేవారండి..! ప్రపంచానికంతా అంటారేంటి, బ్రిటీష్ వాడువచ్చేవరకు బ్రిటన్ తెలియదు, అమెరిగో విస్పూచి కనిపెట్టేంతవరకు అమెరికా తెలియదు అంటారా.! అయితే మీరు పప్పులో కాలేసినట్లే. క్రింది శ్లోకం చదవండి.
‪#‎మేరోర్హరేశ్చద్వేవర్షే‬ వర్షం హైమవతం తతః
క్రమేణైవ సమాగమ్య భారతం వర్ష మాసదత్,
సదృష్ట్యావివిధాన్ దేశాన్ చీన హుణనిషేవితాన్.(మహాభారతం,శాంతిపర్వ,మోక్షధర్మం)
‪#‎పైశ్లోకంలో‬:: ఒకప్పుడు వ్యాసుడు తన పుత్రుడు శుకుడితో,శిష్యులతో పాతాళమున(అమెరికా)నివసించుచుండిరి.అప్పుడు శుకాచార్యుడు తన తండ్రిని "తండ్రి"! ఆత్మ విద్య ఇంతేనా,ఇంకనూ ఉన్నదా!" .అని అడిగెను. వ్యాసుడు ఆప్రశ్నకు సమాధానమీయలేదు. ఎందుకంటే అంతకముందే ఆయన చెప్పి ఉండెను.ఓ కుమారా.! నీవు మిథిలాపురానికి వెళ్ళి ఈ ప్రశ్ననే "జనకుడి"నడుగుము.అని చెప్పెని. తండ్రి మాటను విని శుకుడు పాతాళము(అమెరికా) నుండి బయలుదేరెను.(మేరువుకు) హిమాలయమునకు ఈశాన్య,ఉత్తర, వాయువ్య దిశలందున్న దేశాలకు హరివర్షమని పేరుండెను.అవి నేడు "యూరప్" అని పిలవపడుచున్నవి.శుకుడు ఆదేశములు జూచుచూ (హుణ,) "చైనా" యాహుదు దేశములను కూడా దాటి మిథిలాపురి చేరెను.
ఇంకాచూడండి పాండురాజు పత్ని మాద్రి "ఈరాన్" దేశరాకుమారి. గాంధారి "కాందహార్" ఆఫ్ఘనిస్తాన్ కు చెందినది.ధర్మరాజు చేసిన రాజ సూయ యాగమునకు చైనా దేశపు 'రాజు భగదత్తుడు,అమెరికారాజు బభ్రువాహనుడు,'ఐరోపా' దేశపు రాజు బిడలాక్షుడు,'గ్రీకు' దేశపురాజు యవనుడు,ఈరాన్ కు చెందిన శల్యుడు వచ్చిరి. అంటే నేటికి సుమారు 5,000 సంవత్సరాల క్రితమే అమెరికా,యూరోపు ,సౌత్ఆఫ్రికా (శంఖద్వీపం)వంటి అన్ని ఖండాలలో హిందూ (భారతీయ) సంస్కృతి ఉండేదని మనకు అర్థం అవుతోంది. (ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ సంస్కృతి గురించి మరిన్ని వివరాల కోసం "విశ్వమంతా వ్యాపించిన భారతీయ సంస్కృతి" అన్న శ్రీరాం సాఠే గారి పుస్తకం చూడండి.). ఇలా భారతదేశం నుంచీ ఆధ్యాత్మికత విశ్వవ్యాప్తం అయ్యింది. ఈ క్రమంలో భారతదేశంతో 'యేసు'కు ఉన్న ఆధ్యాత్మికత సంబంధం కూడా చాలా అధ్బుతమైనది. యేసుకు పూర్వం పశ్చిమాసియా అంతటా భారతీయ సాంప్రదాయాలు ఉండేవి. నూతన సం|| మార్చి ఏప్రిల్ లలో మొదలయ్యేదని, బైబిల్ పాతనిబంధనలోని "ఎజ్రా పుస్తకం ద్వారా తెలుస్తుంది. అలాగే 'యేసు' పెరిగి తన 13 సం|| వయసులో భారతదేశం వచ్చాడనీ కాశ్మీర్ లో యోగుల వద్ద యోగ విధ్య అభ్యసించాడనీ, గౌతమ బుద్దుడి భోదనలపట్ల ,శ్రీ కృష్ణుడు చెప్పిన "భగవద్గీత" పట్ల అమితంగా ఆకర్షితుడయ్యాడనీ ,భారతదేశంలోని పలు పుణ్యక్షేత్రాలు దర్శించాడని,అమెరికాకు చెందిన "బార్బరా థియరింగ్" తన ' జీసస్ ది మ్యాన్ ' అన్న పరిశోధాత్మక గ్రంధంలో తెలిపింది. ఈ పరిశోధనకు మెచ్చి అమెరికన్ ప్రభుత్వం ఆమెకు డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఇదే విషయాన్ని"ది హిడెన్ లైఫ్ ఆఫ్ జీసస్" గ్రంధంలో రష్యాకు చెందిన అలగ్జాండర్ నోటోవిచ్ కూడా 1890 లలోనే పేర్కొన్నాడు. అలా భారతదేశంలో ఆధ్యాత్మిక విధ్య ను అభ్యసించిన 'యేసు' తిరిగి తన దేశంకు పయనమయ్యాడు. అక్కడ తన దేశంలో ఈ ఆధ్యాత్మిక విధ్యను వారికర్థమయ్యేలా ఉపమానాలతో భోధించడం మొదలుపెట్టాడు.ఆయన భోధించడం మొదలు పెట్టే నాటికి ఆయన వయస్సు సుమారు 32 ||సంవత్సరాలు ఉండవచ్చు-- (‪#‎లూకా‬ 3;23). అందుకే మొత్తం బైబిల్ గ్రంధంలోనే యేసు 12సం|| లనుండి 32||సం వరకు ఏం చేసినది, ఎక్కడున్నది, ఎలా గడిపినది వంటి వివరాలు మనకు లభ్యం కావట్లేదని బార్బరా థియరింగ్ పేర్కొంది. అంతటితో ఇది ముగిసిపోలేదు. ఆ తర్వాత మళ్ళీ యేసు భారతదేశానికి వచ్చి ,తన చరమాంకమంతా భారతదేశంలోనే గడిపి,తన 80 సం|| వయసులో కాశ్మీరులోనే,ఈ పుణ్యభూమిలోనే,ఈ ఆధ్యాత్మక భూమిలోనే తనువు చాలించాడు. ఈ విషయం పట్ల యేసుకు భారతదేశం పట్ల ఎంత ప్రేమ ఉందీ అన్నది తెలుస్తుంది. ఆ యేసు తనువు చాలించిన ప్రదేశము, అతని సమాధి నేటికీ మనకందరికీ " శ్రీనగర్" లో దర్శనీయమే. ఆశ్చర్యపోతున్నారా!..? అసలు యేసు భారతదేశానికి రావటమేంటి.? అని మేము ఆశ్చర్యపోతుంటే ,ఆయన శ్రీనగర్ లో చనిపోయాడు, అతని సమాధి ఇక్కడే ఉందని "షాక్ "ఇస్తారేంటి అని అనుకుంటున్నారా..? ఆయన శిలువపై మరణించాడు కదా..! ఆ తర్వాత 3వ రోజు బ్రతికి,శరీరంతో కూడా ఆకాశంలో దేవుడి వద్దకు వెళ్ళాడు కదా,అంటున్నారా,.! అయితే ఇది చదవండి. యేసు భారతదేశం ఎలా వచ్చాడో,ఎలా ఇక్కడ చచ్చాడో ఇక్కడ చదవండి. చాలా ఆశ్చర్యం గొలిపే యేసు మరణం గురించి బైబిల్ గ్రంధం ఇలా తెలుపుతోంది.. అప్పటికే యేసును,మరో ఇద్దరినీ శిలువ వేసిరి...
మధ్యాహ్నం 3గం||లకు యేసు ప్రాణం విడిచాడు.(మార్కు 15: 33-34) సాయంత్రం అనగా అరిమతయ గ్రామస్థుడు యేసేపు ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని అడిగాడు. యేసు అప్పుడే చచ్చిపోయాడా అని పిలాతు ఆశ్చర్యపోయినాడు.(మార్కు 15-42-45).
"ఆదినము సిద్దపరుచు దినము: మరుసటి విశ్రాంతి దినము మహాదినము కనుక ఆదేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండుకుండునట్లు వారి కాళ్ళు విరగ్గొట్టించి వారిని తీసి వేయించుమని యూదులు పిలాతిని అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను,రెండవ వాని కాళ్ళను విరుగగొట్టిరి.వారు యేసు వద్దకు వచ్చి అంతకముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు గానీ సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను.వెంటనే రక్తము,నీళ్ళును కారెను.ఇది చూచినవాడు సాక్షమిచ్చుచున్నాడు.అతని సాక్షము సత్యమే.మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయనెరుగుదును.-(యోహాను 19:31-36).
అటు తర్వాత ఆయన మృతి పొందినాడని,ఆయన దేహము యేసేపునకు శిష్యులకు,బంధువులకు,అప్పగించిరి.వారు ఆయనను సమాధి చేసి,దానిపై నొక బండరాయిని ఉంచి.రాత్రి ఇళ్ళకు వెళ్ళిరి.మరుసటి దినము మగ్ధలిన,మరియ,యాకోబు తల్లి,సలోమే వచ్చి చూడగా సమాధి తెరువబడి,అందులోని యేసు దేహము లేకుండెను.ఆ తర్వాత 3వ రోజు ఆయన తిరిగి బ్రతికి కనిపించుట అఐదరికీ తెలిసిన విషయమే.
మరి ఇంత విషాదంగా ఆయన మరణం గురించి,ఆయన పునరుద్దానం,స్వర్గారోహణం గురించి బైబిల్ చెబుతుంటే మళ్ళీ ఆయన కాశ్మీరులో చావటమేమిటి.?అంటారా.? చూడండి యోహాన్ సువార్త 19:31-36 చదివితే అందులో చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే ఒక విషయం ఉంది.అదేమిటంటే "యేసు అప్పటికే మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టక, సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను.అప్పుడు "రక్తము,నీళ్ళునూ కారినవి".అని ఉంది.
చూశారా.! ఇప్పుడు మీక్కూడా తెలిసిపోయిందికదా.!అవును అదే.!"నిజంగా యేసు చనిపోయి ఉంటే ,చనిపోయిన యేసుకు రక్తం ఎలా కారుతుంది".? "ఆశ్చర్యంగా ఉందా.! వైద్య శాస్త్రం ఏం చెబుతోందంటే,ఏ ప్రాణికైనా చనిపోగానే శరీరంలో ఉష్ణోగ్రత పడిపోయి ,శరీరం చల్లబడి,రక్తం గడ్డకడుతుంది.అప్పుడు ప్రాణిని పొడిచినా,నరికినా రక్తం కారదు.మనం కోడి ,మేక వంటి వాటిని కసాయివాడు చంపినప్పుడు కూడా చూసే ఉంటాము.అది చచ్చిపోయాక దాని శరీరాన్ని వాడు ముక్కలుగా కోసినా రక్తం కారదు కదా.! కాబట్టి వైద్యశాస్రం ప్రకారం జీసస్ మరణించలేదని ఆయన మరణించి ఉంటే ఆయన శరీరం నుంచి రక్తం రాదని,కానీ ఆయన ఆ సమయానికి అపస్మారక స్థితిలో ఉండటం వల్ల పొడిచినా ఆయనకి నొప్పి తెలియలేదని ఫ్రొఫెసర్ బార్బరాథియరింగ్ తన పుస్తకంలో తెలిపింది.
ఆ తరువాత ఆయన నిజంగా మరణించాడనుకొని సైనికులు యేసు శరీరాన్ని ఆయన బంధువులకు,శిష్యులకు అప్పగించారు.దగ్గరగా పరిశీలించిన ఆయన శిష్యులు ఆయన ఇంకా బ్రతికి ఉండటం చూచి,ఆయన శరీరంపైన గాయాలకు సుగంధ,ఆయుర్వేద లేపనాలు, పూసి ఎవరికీ అనుమానం రాకుండా సమాధి నందు ఉంచారు.దానిపై ఒక పెద్ద బండనుంచారు.తరువాత రాత్రి సమయంలో మళ్ళీ శిష్యులు వచ్చి ఆబండను తొలగించి,యేసును సమాధి నుంచి వెలుపలికి తెచ్చి,రహస్య ప్రదేశంలో ఉంచి ,వైద్యం చేయించారు .(ఈ విషయాలు జీసస్ ది మ్యాన్ పుస్తకంలోచాలా వివరంగా సాక్ష్యాలతో ఇవ్వబడ్డాయి.)
ఆతర్వాత కొద్దిగా కోలుకున్న యేసు తిరిగి తన (అపోస్తులులతో) శిష్యులతో సమావేశాలు జరిపాడు. దీనినే బైబిలు నందు పునరుద్దానం అని చెప్పారు. ఆ తర్వాత అపోస్తులుల అభ్యర్థనల మేరకు యేసు తన ప్రాణానికి ముప్పు ఉన్నందువలన మరికొందరితో కలిసి ఆ దేశాన్ని వదిలి భారత దేశానికి వెళ్ళినాడని "బార్బరా థియరింగ్" తన పరిశోధనలో తెలిపారు.
ఓ.కే ఇంతవరకు బాగానే ఉంది.యేసు మన పాపాల నిమిత్తం శిలువపై మరణించలేదు అని సువార్తలోని సాక్షమే ఋజువు చేస్తుంది. గనుక ఒప్పుకుంటాము.మరి ఆయన భారతదేశం వచ్చాడనీ,ఇక్కడ శేష జీవితం గడిపాడని,మరి శ్రీనగర్ లో ఉన్నది వారి సమాధేనని ఎలా నమ్మేది..?అంటారా! అందుకు సాక్ష్యము ఉంది.అవును అందుకు బలమైన సాక్ష్యమే మన "భవిష్యపురాణం" ప్రక్షిప్తమో ,క్షిప్తమో గానీ,కలియుగ ఆరంభం నుంచి భారతదేశానికి సంబంధించిన ప్రతి సంఘటన "భవిష్యపురాణము లో ఇవ్వబడింది.
భవిష్యపురాణంలో కలి పురుషుడు యజ్ఞం చేసి మహా విష్ణువు వరంతో పశ్చిమాశియాలో ఆదాముడు,హవ్యవతులను(ఆదాము,హవ్వ) పుట్టించటం.
(చాలా మంది సృష్ఠి మొదలైంది ఆదాము,హవ్వలతోనే వారు ఒక పండు తినటంతోనే అనుకుంటారు.కానీ ఆదాము,హవ్వలు పశ్చిమాశియాలో పుట్టక ముందే తూర్పు దేశాలలో అంటే భారతదేశంలో మనుష్యులు ఉన్నారు.అందుకు సాక్ష్యము బైబిల్ లోని ఈ క్రింది దేవుని వాక్యము చూడండి.
"అప్పుడు కయూను యోహోవా సన్నిధి నుంచి వెళ్ళిపోయాడు. ఏదేనుకు తూర్పున ఉన్న నోదు దేశంలో కయూను నివసించాడు.కయూను తన భార్యతో కలిసినప్పుడు గర్భవతియై హనోకు అన్న కుమారుని కన్నది".-(ఆది కాండము 4:16-17).
(అప్పటికే దేవుడు సృష్టించిన మానవులు కేవలం ఇద్దరు,ఆదాము,హవ్వ వారికి కలిగిన సంతానము ఇద్దరు ,హేబేలు,కయూను,వారిలో కయూను, హేబేలును అసూయతో చంపాడు.అంటే ఇక మిగిలింది ముగ్గురు.కానీ పై సువార్త ప్రకారం కయూను తూర్పున ఉన్న నోదు దేశానికి వెళ్ళాడు. కేవలం భూమి మీద ముగ్గురే ఉంటే మళ్ళీ ఈ దేశమెక్కడిది.?అలాగే "కయూను తన భార్యతో కలవగా హనోకు పుట్టెను."ఉన్నది ముగ్గురే అయితే ఈ భార్య ఎక్కడిది.?" కనుక ఈ ముగ్గురు పుట్టుక మునుపే తూర్పున ఇంకా దేశాలు,ప్రజలు ఉన్నట్లు తెలియుచున్నది.).
ఆదాము ,హవ్వల పుట్టుక,మోషే పుట్టుక,ఏసు పుట్టుక,జీవనం .భారతదేశంపై ముస్లింల దండయాత్రలు,బ్రిటీష్ దండయాత్రలు,అక్బర్,ఔరంగజేబు,వంటి వారి గురించి, శివాజీ గురించి, ఆఖరుకు ఆంగ్ల భాష గురించి కూడా భవిష్యపురాణంలో వివరంగా వర్ణించబడింది.
భవిష్యపురాణంలో "యేసు హిమాలయాలలో ధ్యానం చేస్తుండగా శాలివాహనుడు శకులను తరిమివేసి వస్తూ (యేసు,శాలివాహన చక్రవర్తి సమకాలీకులు) ఆయనను చూచి ఓ మహానుభావా ! మీరెవరు, మీరు మా దేశస్థుడిలా లేరు?మీ గురించి తెలపండి అని అడుగగా .సమాధానంగా యేసు,
"ఈశపుత్రంచమాంవిద్ధి
కుమారీ గర్భ సంభవం
మ్లేశ్ఛదర్మస్యవక్తారం
మసీహుహం సమాగతః
ప్రతి సర్గ-3 వ ఖండం- 2వ ఆధ్యాయం 23-24) .నేను ఈశపుత్రుడను,కన్య గర్భాన జన్మించాను,మసీహ్(మెస్సయ్య)అని నన్ను పిలుస్తారు అని సమాధానం చెప్పాడు.
ఇంకా నేను ప్రవక్తను ,మసీహుగా పిలువబడ్డాను.మా ధర్మ లక్షణం ఇలా ఉంటుంది.శరీరం మలినంగా ఉన్నాసరే మనసు నిర్మలంగా ఉంటే చాలు.ఇలా శుభ,అశుభ సమన్వితమైనది మా ధర్మం.మనసును ఏకాగ్రం చేసి ఆకాశంలో వెలిగే సూర్యభగవానునిపై మనసు పెట్టి పరిపూర్ణమయిన శరణాగతి చేసి ఆయనను.నమ్మితే చేసిన చెడు కర్మలన్నీ నశించి,మనిషి ఉత్తమగతిని పొందుతాడు.సూర్యుడే దివిలో వెలిగే మాతండ్రి ,ఆయనను చేరుటమే మా లక్ష్యం.ఇదే మా ధర్మం అని చెప్పాడు.25-31 శ్లోకాలు
. ఇలాంటి సంభాషణలు ,వివరాలు మన భవిష్యపురాణంలో ఉన్నాయి.ఇవి ఎవరో స్వార్థపరులు మన భవిష్యపురాణంలో కేవలం యేసు గురించి మాత్రమే రికార్డు చేసినవి కావు.కలియుగారంభం నుంచీ చీమ చిటుక్కుమన్న ,భవిష్యపురాణంలో తెలుపబడింది.ఇంతకంటే సాక్ష్యం కావాలా యేసు తన శేష జీవితం భారతదేశంలో గడిపాడని చెప్పడానికి.? అలా ఈ దేశంలో స్థిరపడిన యేసు ,ఇక్కడే తనువు చాలించాడు. ఆయన సమాధి ప్రక్కనే ఆయన పాదాలు మొలచబడి ఉన్నాయి.ఆ పాదాలపై శిలువ వేసినపుడు చీలలు కొట్టిన గుంతలు గుర్తులు కూడా మొలచబడ్డాయి.అలాగే ఆయన సమాధిపై హబ్రూ భాషలోని లిపి ఉంది. భారతీయుడా! నీ దేశం చాలా గొప్పది.నీ ధర్మం అత్యున్నతమైనది.ప్రపంచంలోని అన్ని ఇతరమతాలు ఒక నిర్ణీత సమయంలో,నిర్ణీత వ్యక్తులపై ఆధారపడి పుట్టాయని సాక్ష్యం ఉంది.కానీ నీ హిందూ ధర్మం భూమి పుట్టినప్పుడే పుట్టింది.నీ వయిన వేదాలు ప్రపంచానికే వెలుగునిచ్చాయి,బ్రతకటం నేర్పాయి.
బైబిల్ నందు యోహోవా "తాను కేవలం ఇజ్రాయిలీ ప్రజల దేవుడను" అని చెప్పుకున్నాడు.ఎక్కడా ఆయన తాను ప్రపంచ ప్రజలకు ముఖ్యంగా భారతీయులకు దేవుడనని చెప్పలేదు.ఆయన ఇజ్రాయిలీలను మాత్రమే ప్రేమించాడు.వారికోసం ఈజిప్ట్ వంటి ఇతర దేశాల,జాతులను ప్రజలను శిక్షించాడు.(చూడండి నిర్గమ కాండం.)
అలాగే యేసు కూడా "తప్పిపోయిన ఇజ్రాయిలీ ప్రజల కోసం మాత్రమే దేవుడు నన్ను పంపాడు".అని స్వయంగా చెప్పాడు.(మత్త 15:24) అంతేకాక ఆయన తన భోధనలు కేవలం ఇజ్రాయిలీలకే చెప్పమని,ఇతర దేశాలలో ప్రవేశించవద్దని కూడా స్వయంగా చెప్పాడు.(మత్త 10:5-6) అంటే వీరిరువురూ ఇజ్రయిలీ ప్రజలకే రక్షకులని తామే చెప్పుకున్నారు కానీ,
మన వేదాలలో ,ఇతిహాసాలలో,పురాణాలలో,భాగవతంలో,శ్రీమన్నారయణుడు అయిన శ్రీకృష్ణుడే ఈ సకల చరాచర సృష్టికి మూల కారణమని,పద్నాలుగు భువన భాండములు,అన్ని దేవతలు,ఆయన నుంచే పుట్టాయని,చీమ నుంచీ బ్రహ్మ వరకూ అన్ని ఆయన ఆజ్ఞ ప్రకారమే నడుస్తాయనీ,ప్రాణులన్నింటికీ,తండ్రి,పోషకుడు,రక్షకుడు శ్రీకృష్ణుడే అని తెలుపుతున్నాయి. శ్రీ కృష్ణుడు కేవలం ఒక దేశానికి,ఒక జాతికి చెందిన దేవుడు కాదు.ప్రపంచాని కంతా దేవుడు. నిజంగా నీ కష్టాలు తీర్చేవాడే శ్రీ కృష్ణుడే.కన్న తండ్రి తన బాగోగులు చూసినంతగా పినతండ్రి చూడలేడు. కబ మన కన్న తండ్రి శ్రీకృష్ణుడే కనుక నీ కన్న తండ్రి ని ఎన్నడూ మరచిపోకు., ఎప్పుడూ మార్చుకోకు. ఇజ్రాయిలీల దేవుడు నీ కన్నతండ్రి కాలేడు. మన పాపాల నిమిత్తం యేసు శిలువపై చనిపోలేదు,బైబిల్ నందలి యోహాన్ సువార్త(19:31-36) తెలుపుతోంది.కనుక విశ్వసించిన నీ పాపాలు పోతాయన్నది అబద్దం. అయినా నేను అన్నం తింటే నీకు కడుపు నిండదు.అలాగే నీ పాపానికి వేరొకరు శిక్ష అనుభవించలేరు.ఇది ప్రకృతి విరుధ్ధం,దైవ విరుద్ధం.
"ఉద్ధరేత్మానాత్మానం-ఆత్మానమవసాదయేత్"-భగవద్గీత. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి.నిన్ను అధోగతి పాలు చేసుకోరాదు.అని శ్రీకృష్ణుడు గీతలో చెప్పిఉన్నాడు. కనుక కృష్ణభక్తి కలిగి కృష్ణ చైతన్య మార్గంలో జీవించు.
అలాగే ప్రార్థనలు జరిపినంత మాత్రానే రోగాలు పోతాయి అనేది నిజమే అయితే ప్రపంచంలో క్రైస్తవులకు ఆసుపత్రులెందుకు.? క్రైస్తవులు ఆసుపత్రులకు పోవటెమెందుకు.?
యేసును విశ్వశించిన వారు."తమ చేతులతో పాములు పట్టుకోగల్గుతారు.వారు విషం త్రాగినా వారికే హాని కలగదు.అని చెప్పాడు (మార్కు 16:18) ప్రియ సోదరుడా! మరి యేసును విశ్వసించినవారినందరిని విషం త్రాగి కూడా డాక్టరు వద్దకు వెళ్ళకుండా నీ ముందు నిలబడమని అడిగి చూడు.! ఏమవుతుందో అలా చేయడానికి ఏ విశ్వాసి కూడా ముందుకు రాడు.ఎందుకంటే అది ప్రకృతి విరుద్ధం.
"జాతస్యహి ధృవోమృత్యుః"-భగవద్గీత. జన్మించిన వాడికి మరణము తప్పదు.
పూర్వజన్మనందలి నీ పనులే నేటి ఈ జన్మలో నీ భాధలకు,కష్టాలకు,రోగాలకు,కారణం.కనుక ఈ జన్మలో,రేపటి జన్మలో నీవు సుఖంగా బ్రతకాలంటే నీతి, నిజాయితీలతో మంచిగా బ్రతుకు. జన్మ,వ్యాధి,ముసలి తనము,మరణం,వీటి నుండి దేవేంద్రుడయినా తప్పించుకోలేడు. అయితే శ్రీ కృష్ణుడు తన గీతావాణిలో దేవాదిదేవుడను,సర్వలోకరక్షకుడను,శ్రీ కృష్ణుడను అయిన నన్ను అనన్య భక్తితో పూజించేవారి యోగక్షేమములను నేనే చూసుకుంటాను అని చెప్పాడు.(భగవద్గీత 9ఆ-22).
యోగము అంటే అప్రాప్యవస్తు ప్రాప్తి.క్షేమము అంటే వారి రక్షణము కనుక శ్రీకృష్ణుడికి శరణాగతులయిన వారి యోగ క్షేమములు ఆయనే చూసుకుంటాడు.
ఇంకా "లోకంలో అల్ప బుద్ధిగల ప్రజలు ఇతర దేవుళ్ళను ఆరాధించినా,నిజానికి ఆ దేవుళ్ళ రూపంలో వారి కోరికలు తీర్చునది నేనే"-(భగవద్గీత 7ఆ-22శ్లో||)అని కూడా శ్రీకృష్ణుడే చెప్పాడు.
భాగవతంలో వ్యాసుడు "కృతయుగంలో ప్రజలు తపస్సులు చేసేవారు.త్రేతా యుగంలో యజ్ఞాలు చేసేవారు.ద్వాపరయుగంలో పరిచర్యలు చేసేవారు.మరి కలియుగంలో ప్రజలు తరించుటకు గల ఏకైక మార్గం "హరి నామ సంకీర్తనమే"అని తెలిపారు. కనుక ప్రతిరోజూ 108 సార్లు జపించండి.
""హరేకృష్ణ హరేకృష్ణ హరేహరే.!హరేరామ హరేరామ రామరామ హరేహరే.!!
ప్రతిరోజు భగవన్నామ జపం చేయండి.-మీ జీవితంలో మార్పు చూడండి.
ఆదాము,హవ్వలు కూడా శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేసినట్లు భవిష్య పురాణం చెబుతోంది.
కనుక భారతీయులారా.!ప్రతిరోజు హరినామ జపం చేయండి,కలిమాయ నుండి,కష్టాల నుండీ బయటపడి,సుఖంగా ఉండండి. -లోకాసమస్తాసుఖినోభవంతు "హిందువునని గర్వించు హిందువుగా జీవించు."
గమనిక::- బైబిల్ నుంచీ ఉదహరించబడ్డ వ్యాక్యలేవి స్వంత వ్యాక్యలు కావు. అన్నింటికీ సువార్త నెంబర్లు ఇవ్వబడ్డాయి. దారి తప్పిన క్రైస్తవ సోదరులు గమనించగలరు.


Read More

Tuesday, 27 January 2015

లలితా సహస్ర నామము - 118. భక్తప్రియా - భక్తుల యెడ ప్రేమ, వాత్సల్యము గలది.



లలితా సహస్ర నామము - 118.
భక్తప్రియా - భక్తుల యెడ ప్రేమ, వాత్సల్యము గలది.

Sri Matre Namaha

Bhakti-priya – The One Hundred & Eighteenth name in Lalitha Sahasranamam.

Bhaktipriya

bhaktih priya yasyah sa

She who likes devotion to her

She who is pleased with worship

Bhakti = Devotion or worship. It is of two kinds, i.e., mukhya, primary and gauni, secondary. Of these the first type, primary bhakti is a particular mental modification called anurage about Isvara. This bhakti is otherwise called para (supreme). The secondary devotion is in the form of service (i.e., sevarupa) to the Lord and by this devotion one can attain the concentration. Moreover, the root bhaj means to serve. There are many kinds of devotions. According to some Puranas there are nine varieties of bhakti; according to some, ten kinds. All of those types are included here in the word bhakti.

She likes devotion. Sivananda lahari verse 61 describes devotion. “The way a needle seeks a magnet, the way in which a creeper seeks a tree, the way in which a river unites with an ocean and in the same way when the mind seeks the lotus feet of Shiva it is called devotion”. ‘Devotion is beyond the three gunas – rajas, tamas and satwa. It is beyond desire. It grows every second. It remains connected with the Brahman. It is subtle and realized out of experience. Once realized, he always remains with That.’ This is what sage Narada has said about devotion. Sri Ramakrishna compares devotion to the flood that flows powerfully to the ocean in spite of the dams built to control the floods. Our mind, he continues, is not flowing but stagnant like a pond. Our mind gets stagnated towards devotion, which has to grow in every second. Viveka Chudamani verse 31 says that “amongst things conducive to liberation, devotion alone holds the supreme place. The seeking after one’s real nature is designated as devotion”. The point driven home in this nama is that nothing prevents a true devotee in realizing Her irrespective of the hurdles. She is delighted with such devotion and such devotees. What type of devotion and devotees? Those who worship internally, those who seek Her within. Devotees do not mean those who perform external rituals for a longer time. We have already seen that there should be a gradual transition to internal exploration from external rituals.

As the mother goddess of all, Devi has a special creative power beyond all the Gods. The Hindu term for this creative power is shakti and, so, Devi is called Shaktas. She the single original reality from which the three gods of the Trimurti emerge. Her creative power is the source of the origination (pravrti) and dissolution (pralaya) of the successive universes. Although the Puranas focus mainly on the Trimurti, the Devi Bhagavata Purana is devoted specifically to Devi and her creative powers. About one thousand pages in length, the text is classified as one of the 18 great Puranas,where in devotion towards devi is specifically dealt with in detail.

The text vividly describes the concept of supreme devotion (parabhakti), a central component of all the Puranas. One passage explains that there are three kinds of Yoga: that of action (karma), knowledge (jnana), and devotion (bhakti). According to Devi, who narrates the text herself, “Of these three, the Yoga of devotion is the easiest in all respects.” However, she explains, there are three lower forms of devotion that should be avoided. Some people worship Devi to spite other people. Others worship Devi hoping to attain some personal desire, such as fame. Still others worship Devi as a means of purifying their actions. A fourth type of devotion, though, is supreme devotion, which is completely selfless. As described below, it is so selfless that the worshiper does not even desire the experience of release itself.

“Now listen attentively about the supreme devotion (parabhakti) which I will now describe to you. He always hears my glories and recites my name. His mind always dwells in me, like the incessant flow of oil, and he is the receptacle of all good qualities and gunas. But he does not have the least trace of any desire to get the fruits of his actions (karma). Indeed, he does not want the various levels of release (moksha), including being on the same plane as God (salokya), nearness to God (samipya), having the form of God (sarsti), union with God (sayujya) and other forms of release. “

Devi continues noting that true worshipers abandons all concepts of themselves, completely identify themselves with Devi, and make no distinctions between themselves and anything else. Worshipers find Devi in everything, including other souls:

He becomes filled with devotion for me alone, worships me only, knows nothing higher than to serve me, and he does not even want final release. He does not like neglecting the notions of “serving” (sevya) and the “servant who serves” (sevaka). He always meditates on me with a constant vigilance, actuated by a feeling of supreme devotion. He does not think of himself as separate from me, but rather thinks to himself, “I am the Lord (Bhagavati).” He considers all souls (jivas) as myself, and loves me as he loves himself. He makes no distinction between the souls and myself since he finds the same pure consciousness (caitanya) everywhere and manifested in all. He does not quarrel with anyone since he has abandoned all ideas of separateness. He bows down and worships the pure consciousness and all the souls. He becomes filled with the highest love when he sees my place, sees my devotees, hears the scriptures, describes my deeds, and meditates on my mantras. His hairs stand on end out of love for me and his tears of love flow incessantly from both of his eyes. He recites my name deeds in a voice that is choked with feelings of love for me. With intense feeling he worships me as the mother of this universe and the cause of all causes. [Devi Bhagavata Purana, 7.37]

When it comes to devotion who can forget tulasi and her devotion for Lord Krishna.

Srimati Tulasi devi is one of the most exalted devotees of the Sri Krishna. All scriptures stress on the importance of getting the mercy of Tulasi devi if one has to make progress in the path of devotion. In the Skanda Purana it is said: ‘Tulasi is auspicious in all respects. Simply by seeing, simply by touching, simply by remembering, simply by praying to, simply by bowing before, simply by hearing about or simply by sowing this tree, there is always auspiciousness. Anyone who comes in touch with the Tulasi tree in the above-mentioned ways lives eternally in the Vaikuntha world.”

Five thousand years ago when Sri Krishna descended on Earth to do His pastimes, Vrinda devi created the proper environment for His pastimes in Vrindavana. Millions of years before the descent of Sri Krishna, Vrinda devi had appeared as the daughter of the pious Emperor Kedera. Then she performed penances for sixty thousand years. Pleased by her penances, Lord Vishnu gave the benediction that any austerities performed in Vrindavana would be very potent. Thus Vrinda devi sanctified the place and it got the name Vrindavana. Later Vrinda devi once again descended here as Tulasi devi, the daughter of King Kushadvaja to perform penances and attain perfection here.

Once Tulasi devi descended as the daughter of King Kushadvaja. She was married to Jalhandara. It is said that Samudra deva the demigod controlling the nether regions had Lakshmi devi as a daughter (since she appeared from him at time of the churning of the ocean) and Jalandara (one who is born from water).

Jalandara was married to Tulasi devi and drew strength from her purity and chastity. So firm was her chastity that even Lord Shiva could not defeat Jalandara in battle and all the demigods went to Lord Vishnu for help.

At this time, Lord Vishnu went to Tulasi devi assuming the form of her husband, Jalandara. When Tulasi devi greeted Him, thinking Him to be her husband, her chastity was momentarily broken. Taking advantage of this the demigods killed Jalandara.

When Tulasi devi understood what happened, Lord Vishnu revealed His original form. An enraged Tulasi devi cursed Lord Vishnu for His stone hearted behavior to become a stone. Honoring His pure devotee, Lord Vishnu accepted this curse and promised to appear as the Saligrama shila in the Gandika river (now in Nepal). He also gave Tulsai devi the benediction that she will eternally reside with Him as His consort in Vaikuntha. He said that for the benefit of every one she will assume the form of a plant which will be most auspicious for anyone performing devotional service.

Thus devotees never offer anything to Krishna without a Tulasi leaf. He always adorns Himself with a Tulasi garland. The goddess of fortune, Laksmi, is sometimes envious of the Tulasi leaves which are placed at the lotus feet of the Lord, for they remain fixed there and do not move, whereas Laksmi, although stationed by the chest of the Lord, sometimes has to please other devotees who pray for her favor. Laksmi sometimes has to go to satisfy her numerous devotees, but tulasi leaves never forsake their position, and the Lord therefore appreciates the service of the tulasi more than the service of Laksmi.

Quoting from the Gautamiya-tantra, the Hari-bhakti-vilasa states:

tulasi-dala-matrena

jalasya culukena va

vikrinite svam atmanam

bhaktebhyo bhakta-vatsalah

‘Sri Krishna, who is very affectionate toward His devotees, sells Himself to a devotee who offers merely a tulasi leaf and a palmful of water.’

In the Nectar of Devotion, service to Tulasi is glorified as one of items of devotional service.

In the Srimad Bhagavatam (3.15.19) it is said that although flowering plants like the mandara, kunda, kurabaka, utpala, campaka, arna, punnaga, nagakesara, bakula, lily and parijata are full of transcendental fragrance, they are still conscious of the austerities performed by tulasi, for tulasi is given special preference by the Lord, who garlands Himself with tulasi leaves.

In the Skanda Purana there is a statement praising the Tulasi tree as follows: ‘Let me offer my respectful obeisances unto the Tulasi tree, which can immediately vanquish volumes of sinful activities. Simply by seeing or touching this tree one can become relieved from all distresses and diseases. Simply by offering obeisances to and pouring water on the tulasi tree, one can become freed from the fear of being sent to the court of Yamaraja [the King of death, who punishes the sinful]. If someone sows a tulasi tree somewhere, certainly he becomes devoted to Lord Krishna. And when the tulasi leaves are offered in devotion at the lotus feet of Krishna, there is the full development of love of Godhead.’
Read More

HOW TO PERFORM BHISHMASHTAMI TARPANAM ?



HOW TO PERFORM BHISHMASHTAMI TARPANAM ?
Bhishma Ashtami 2015 - January 27 (Tuesday)

Bhishma Ashtami is an important ritual observed by Hindus as part of their respect to King Bhishma. As per the incidents related to Mahabharata, Bhishma is regarded as the youngest son of King Shantanu and Ganga Devi. According to the Hindu mythology, Ganga agreed to marry Shantanu only on the condition that he will never question her for whatever she does. However, seven of the eight children were drowned in River Ganga as per a curse about which King Shantanu was unaware of. Out of agony, he finally asks Ganga why she is drowning all kids in such a ruthless manner. As Shantanu protested breaking his word, Ganga leaves him by offering Bhishma to him.


Ardent devotees belonging to the Hindu community are known to take Bhishma Ashtami Snan, which falls on the eighth day of the Shukla Paksha of Magh (February) month as per the Lunar calendar. People observe Bhishmashtami Fast on this very day as part of paying their tribute to King Bhishma. Perhaps, the king himself had chosen this day for his death after he was left on a bed of arrows by Arjun during the Mahabharata war. Bhishma, who was a Bal Bramhachari and an ancestor to Kauravas, he never married in his life and remained a bachelor throughout.

Legend Associated with Bhishma Ashtami
Bhishma's birth name is was Devavrata. As he grew up, Ganga took him along with her to Daitya Guru Shukracharya to teach him all the skills needed. Eventually, he learnt the incomparable art of fighting because of which he earned the unique distinction of never getting defeated as long as he was waging a war in the battlefield. As time passed by, King Shantanu married Satyavati after getting enchanted by her beauty. However, she agreed to be his queen only on the condition that her son would be made king and not Bhishma. Shantanu agreed reluctantly to this on the insistence of Bhishma.

During the war phase in Mahabharata, he chose to take the sides of Kauravas and decided to fight against Pandavas against his will. Lord Krishna employs the tactic of pitting Shikandi against him as King Bhishma had pledged that he would never fight against a eunuch. Eventually, he was confined to the deathbed for a period of 18 days after he reached the divine abode. The day when he died is observed as Bhishma Ashtami. People consider this day important and prominent for practicing celibacy.

Importance of Bhishma Ashtami
People who would like to get rid of the putradosh (lack of a child) find this day as the most significant one for sure. Childless couples and newly married couples who look forward to having a son consider this day to be most auspicious to observe vrat (fast). Performing a Tarpan on this day will eventually consummate the fast kept by people in this regard. Perhaps, it is considered for offering peace to Bhishma Pitamaha’s soul. It is widely believed that by seeking the blessings of Bhishma on the day, it is possible to have a male child who is equally capable of being a pitamaha himself.

Bhishma Ashtami 2015

Magha Shukla Ashtami is death anniversary of Bhishma Pitamah, one of the most prominent characters of the great Indian epic, the Mahabharata and this day is known as Bhishma Ashtmai. Bhishma bowed for celibacy and followed it throughout his life. Due to his loyalty and devotion to his father Pitamah Bhishma was blessed with boon to choose the time of his death.

When he got injured in the battle of Mahabharata he didn’t leave his body due to his boon. He waited for the auspicious moment to give up his body. According to Hindu belief God Suryadev moves in South direction during half of year which is inauspicious period and all auspicious activities are postponed till Suryadev starts moving back in North direction. Pitamah Bhishma chose Magha Shukla Ashtami to give up his body and by this time Suryadev started moving back in North direction or Uttarayana (उत्तरायण).

This day People do Ekodishta (एकोदिष्ट) Shradhha for him. His Shradhha has been prescribed for those who have lost their father. However many believe that his Shradhha rituals can be performed by all irrespective of their father being alive or dead.
HOW TO PERFORM BHISHMASHTAMI TARPANAM ?
Ratha SaptamI is for invoking Sun God.

TarpaNam to SrI BhIshma has to be offered on BhIshmAshtamI which is normally the day next to ratha saptamI.

Procedure:

(a)On BhIshmAShtamI day morning, perform sandhyA vandanAdi nitya karmas.

(b)Be seated facing East .

(c) Say the sankalpa " BhIshmAshtamI puNyakAle BhIshma TarpaNam karishye"

(d) Having YajnopavIta in NivIta mode, offer Arghyam by both hands in pure water without mixing tila by chanting the following Slokas:

1. bhIshmah SAntanavo vIrah satyavAdI jitendriyah !
AbhiradbhiravApnotu putrapautrocitAm kriYAm !!

bhIshmAya namah idamarghyam !

2. vaiyAghrapAda gotrAya sAnkritya pravarAya ca !
aputrAya dadAmyarghyam salilam bhIshma varmaNe !!

bhIshmAya namah idamarghyam !

3. gangAputrAya SAntAya Santanoh AtmajAya ca !
aputrAya dadAmyarghyam salilam bhIshma varmaNe !!

bhIshmAya namah idamarghyam !
anena arghyapradAnena bhIshmah PrIyatAm !

In fact all BrahmaNas should necessarily offer their respects to SrI BhIshma pitAmaha. In my humble view, he alone deserves the first praise of honour by all vipras as he considers them dearer than his own father.

My respectful salutations to SrI BhIshma.

Panchami according to Jabali is the duration from Panchami to Ashtami. For those who had taken SANYASA in the family DWADASHI is the apt TITHI and for those who died by weapons CHATURDASHI is the apt day for performing the rites. Those who perform Shraddha for the entire Paksha should do two TARPANAS on the Amavasya day. One should not do two Shraddhms in a day. But on the day of AMAVASYA, TARPANA shall be done for two sides of the family (ie) PITRUS from the father’s side and PITRUS from the mother’s side. During the MAHALAYA PAKSHA TARPANA ought to be done to KARUNIKA PITRUS too.
KARUNIKA PITRU DEVATAS
The following are called KARUKINA PITRU DEVATAS:
1. Younger brother of the father
2. Elder brother of the father
3. Elder brother
4. Younger brother
5. Sisters
6. Ones own sons
7. Aunt (Sisters of father)
8. Aunt’s son (Amman)
9. Wife of father’s elder brother
10. Wife of father’s younger brother
11. Daughters and sons of father’s brothers
12. Wife
13. Father in law
14. Mother in law
15. Daughter in law
16. Wife’s brothers
17. Guru
18. Master under whom one serves
19. Friends

భీష్మాష్టమిని మాఘ శుద్ద అష్టమి అని కోడా అంటారు .. ఈ భీష్మాష్టమి రోజునే మహా పితుడు అయినటువంటి భీష్ము డు మోక్షప్రాప్తి పొందాడు ... ఈ భీష్మాష్టమి రోజున భీష్ముని కి తర్పణములు వొదిలితే పిల్లలు ( సంతానము ) లేని వారికి సంతానము పొందుతారు .
!! మాఘ మాసే సీతాష్టమ్యాం సలిలం భీష్మతర్పణం
శ్రాద్దంచ యే నరాః కుర్యుః తేస్సు: సంతతి భాగినః. !!
అంటే మాఘ శుక్ల అష్ట మీ నాడు భీష్ముడికి తర్పణము వదలడము , శ్రాద్దము చేసింవారికి సంతానము కలుగుతుంది అని పద్మ పూరణము లో చెపుతుంది.
!! శుక్లాష్టమ్యాన్తు మాఘస్య దద్యాద్బీష్మాయ యోజలం
సంవత్సర కృతం పాపం తక్షణాదేవి నశ్యతి !!
అంటే భీష్మాష్టమి నాడు భీష్ముడికి జలాంజలి చేసినట్లు అయితే మనము సంవత్సర కాలము లో చేసిన పాప కర్మలు పోతాయి అని మహా భారత వచనం .
“ భీష్మశ్శాంతనవో వీరః సత్యవాదీజితేంద్రి యః
అభిరద్దీ రవాప్నొతి పుత్ర పౌత్రో చితాం క్రియాం
వైయాఘ్ర పాదగోత్రాయ సాంకృత్యప్రవరాయ చ
అపుత్రాయ దదా మ్యేతజ్జలం భీష్మాయవర్మణే !!
ఈ శ్లోకాన్ని పఠిస్తు తర్పణములు వదలాలి .. ( ఒక దోసిలలో నీరు తీసుకొని పై మంత్రము చదువుతూ నీరు వదలాలి .. ఇలా చేసిన తర్పణము వదిలినట్లే ) .
తర్పణము చేసి , విష్ణు , శివ దేవలయములకి వెళ్ళి పూజలు అర్చనాలు చేయించుకోవాలి . క్షీరన్నాము (పాయసము) నైవేద్యము గా పెట్టి నా తరువాత ఎవరి కైన దానము , లేక పంచి పెట్టాలి ..
Read More

నవగ్రహధ్యానమ్,మన్త్రః|,పీడాహరస్తోత్రమ్,నవగ్రహ స్తోత్రం |



నవగ్రహధ్యానమ్,మన్త్రః|,పీడాహరస్తోత్రమ్,నవగ్రహ స్తోత్రం |


|| నవగ్రహధ్యానమ్||
Navagraha dhyana sloka
Chant these slokas before starting of any graha mantra jap.
శ్రీగణేశాయ నమః|
అథ సూర్యస్య ధ్యానం (Dhyana sloka for Sun)
ప్రత్యక్షదేవం విశదం సహస్రమరీచిభిః శోభితభూమిదేశమ్|
సప్తాశ్వగం సద్ధ్వజహస్తమాద్యం దేవం భజేऽహం మిహిరం హృదబ్‍జే||


అథ చన్ద్రస్య ధ్యానం (Dhyana Sloka for Moon)
శఙ్ఖప్రభమేణప్రియం శశాఙ్కమీశానమౌలిస్థితమీడ్యవృత్తమ్|
తమీపతిం నీరజయుగ్మహస్తం ధ్యాయే హృదబ్‍జే శశినం గ్రహేశమ్||

అథ కుజ ధ్యానం (Dhyana sloka for Mars)
ప్రతప్తగాఙ్గేయనిభం గ్రహేశం సింహాసనస్థం కమలాసిహస్తమ్|
సురాసురైః పూజితపాదపద్మం భౌమం దయాలుం హృదయే స్మరామి||

అథ బుధ ధ్యానం (Dhyana sloka for Mercury)
సోమాత్మజం హంసగతం ద్విబాహుం శఙ్ఖేన్దురూపం హ్యసిపాశహస్తమ్|
దయానిధిం భూషణభూషితాఙ్గం బుధం స్మరే మానసపఙ్కజేऽహమ్||

అథ గురు ధ్యానం (Dhyana sloka for Jupiter)
తేజోమయం శక్తిత్రిశూలహస్తం సురేన్ద్రజ్యేష్ఠైః స్తుతపాదపద్మమ్|
మేధానిధిం హస్తిగతం ద్విబాహుం గురుం స్మరే మానసపఙ్కజేऽహమ్||

అథ శుక్రస్య ధ్యానం (Dhyana Sloka for Venus)
సన్తప్తకాఞ్‍చననిభం ద్విభుజం దయాలుం
పీతామ్బరం ధృతసరోరుహద్వన్ద్వశూలమ్|
క్రౌం‍చాసనం హ్యసురసేవితపాదపద్మం
శుక్రం స్మరే ద్వినయనం హృది పఙ్కజేऽహమ్||

అథ శనేర్ధ్యానం (Dhyana sloka for Saturn)
నీలాం‍జనాభం మిహిరేష్టపుత్రం గ్రహేశ్వరం పాశభుజఙ్గపాణిమ్|
సురాసురాణాం భయదం ద్విబాహుం శనిం స్మరే మానసపఙ్కజేऽహమ్||

అథ సైంహికేయస్య ధ్యానం (Dhyana Sloka for Rahu)
శీతాంశుమిత్రాన్తకమీడ్యరూపం ఘోరం చ వైడుర్యనిభం విబాహుమ్|
త్రైలోక్యరక్షాప్రదంమిష్టదం చ రాహుం గ్రహేన్ద్రం హృదయే స్మరామి||

అథ కేతోశ్చ ధ్యానం (Dhyana Sloka for Ketu)
లాఙ్గులయుక్తం భయదం జనానాం కృష్ణామ్బుభృత్సన్నిభమేకవీరమ్|
కృష్ణామ్బరం శక్తిత్రిశూలహస్తం కేతుం భజే మానసపఙ్కజేऽహమ్||
|| ఇతి నవగ్రహధ్యానం సమ్పూర్ణమ్||

|| నవగ్రహమన్త్రః||
Tantrokta Navagra Mantra
Here I am giving Tantrokta Navagraha Mantra with Beejakshar. Please chant these carefully. If you pronunce wrongly you may get adverse result. Its better to learn from a pundit before chating.
శ్రీగణేశాయ నమః|

అథ సూర్యస్య మన్త్రః
ఓమ్ హ్సౌః శ్రీం ఆం గ్రహాధిరాజాయ ఆదిత్యాయ స్వాహా||

అథ చన్ద్రస్య మన్త్రః
ఓమ్ శ్రీం క్రీం హ్రాం చం చన్ద్రాయ నమః||

అథ భౌమస్య మన్త్రః
ఐం హ్సౌః శ్రీం ద్రాం కం గ్రహాధిపతయే భౌమాయ స్వాహా||

అథ బుధస్య మన్త్రః
ఓమ్ హ్రాం క్రీం టం గ్రహనాథాయ బుధాయ స్వాహా||

అథ జీవస్య మన్త్రః
ఓమ్ హ్రీం శ్రీం ఖ్రీం ఐం గ్లౌం గ్రహాధిపతయే బృహస్పతయే బ్రీంఠః ఐంఠః శ్రీంఠః స్వాహా||

అథ శుక్రస్య మన్త్రః -
ఓమ్ ఐం జం గం గ్రహేశ్వరాయ శుక్రాయ నమః||

అథ శనైశ్చరస్య మన్త్రః
ఓమ్ హ్రీం శ్రీం గ్రహచక్రవర్తినే శనైశ్చరాయ క్లీం ఐంసః స్వాహా||

అథ రాహోర్మన్త్రః
ఓమ్ క్రీం క్రీం హూఁ హూఁ టం టఙ్కధారిణే రాహవే రం హ్రీం శ్రీం భైం స్వాహా||

అథ కేతు మన్త్రః
ఓమ్ హ్రీం క్రూం క్రూరరూపిణే కేతవే ఐం సౌః స్వాహా||

|| ఇతి నవగ్రహమన్త్రః సమ్పూర్ణమ్||

|| నవగ్రహపీడాహరస్తోత్రమ్||
Navagraha Peedahara Stotra
If you are suffering due to ill placed planets in your birth chart, this stotra will be helpful. Chant this stotra daily to remove all kind of problems caused by Planets.
గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః|
విషమస్థానసంభూతాం పీడాం హరతు మే రవిః|| ౧||
రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః|
విషమస్థానసంభూతాం పీడాం హరతు మే విధుః|| ౨||
భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా|
వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః|| ౩||
ఉత్పాతరూపో జగతాం చన్ద్రపుత్రో మహాద్యుతిః|
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః|| ౪||
దేవమన్త్రీ విశాలాక్షః సదా లోకహితే రతః|
అనేకశిష్యసంపూర్ణః పీడాం హరతు మే గురుః|| ౫||
దైత్యమన్త్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః|
ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః|| ౬||
సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః|
మన్దచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః|| ౭||
మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః|
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ|| ౮||
అనేకరూపవర్ణైశ్చ శతశోऽథ సహస్రశః|
ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే తమః|| ౯||
|| ఇతి బ్రహ్మాణ్డపురాణోక్తం నవగ్రహపీడాహరస్తోత్రం సంపూర్ణమ్||

|| వ్యాస కృత నవగ్రహ స్తోత్రం ||
Vyasa Krita Navagraha Stotra
Click here for English Version
సూర్య మంత్రం :
జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహద్యుతిమ్‌|
తమోऽరిం సర్వపాపఘ్నం ప్రణతోऽస్మి దివాకరమ్‌|| ౧||

చంద్రమంత్రం:
దధిశఙ్ఖతుషారాభం క్శీరోదార్ణవసంభవమ్‌|
నమామి శశినం సోమం శమ్భోర్ముకుటభూషణమ్‌|| ౨||

కుజమంత్రం:
ధరణీగర్భసంభూతం విద్యుత్కాన్తిసమప్రభమ్‌|
కుమారం శక్తిహస్తం చ మఙ్గలం ప్రణమామ్యహమ్‌|| ౩||

బుధమంత్రం:
ప్రియఙ్‌గుకలికాశ్యామం రూపేణాప్రతిమం బుధమ్‌|
సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్‌|| ౪||

గురుమంత్రం:
దేవానాం చ ఋషీణాం చ గురుం కాఞ్చనసంనిభమ్‌|
బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్‌|| ౫||

శుక్రమంత్రం:
హిమకున్దమృణాలాభం దైత్యానాం పరమం గురుమ్‌|
సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్‌|| ౬||

శనిమంత్రం:
నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్‌|
ఛాయామార్తణ్డసంభూతం తం నమామి శనైశ్చరమ్‌|| ౭||

రాహుమంత్రం:
అర్ధకాయం మహావీర్యం చన్ద్రాదిత్యవిమర్దనమ్‌|
సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్‌|| ౮||

కేతుమంత్రం:
పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకమ్‌|
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్‌|| ౯||

ఫలశృతి:
ఇతి వ్యాసముఖోద్గీతం యః పఠేత్సుసమాహితః|
దివా వా యది వా రాత్రౌ విఘ్‍నశాన్తిర్భవిష్యతి|| ౧౦||

నరనారీనృపాణాం చ భవేద్దుఃస్వప్ననాశనమ్‌|
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనమ్‌||

గృహనక్శత్రజాః పీడాస్తస్కరాగ్నిసముద్‌భవాః|
తాః సర్వాః ప్రశమం యాన్తి వ్యాసో బ్రూతే న సంశయః||

|| ఇతి శ్రీవ్యాసవిరచితం నవగ్రహస్తోత్రం సంపూర్ణమ్‌||

Navagraha Mantra For Removing Obstacles In Life
We are engaged in providing Navagraha Mantra For Removing Obstacles In Life. The hardships and struggles faced by us despite of the hard work, occurs by the unfavourable position of planets in the horoscope. The karmic influence on the behaviour of the individual is pointed by the placement of the nine planets in the horoscope. For appeasing the ill effects of planets like wearing genuine gemstones chanting mantras related to the planet, astrologist and numerologists use this information to suggest remedial measures. As per the research, mantra is considered as powerful tool for healing. It creates positive vibrations and removes negativity. Navagraha is the mantra of the 9 planets. In other words, its is for pleasing planets and influence them positively. Shri Ved Vyas ji has written mantra's for pleasing nine planets or Navagraha including the Lord Sun, Lord Moon, Lord Mars, Lord Mercury, Lord Jupiter, Lord Venus, Lord Saturn, Lord Rahu and Lord Ketu.



Sun: Planet of Self
sun-100
Sun is the Lord of Simha Rashi [Leo] and occupies the central place amongst the navagrahas. Sun is also known as "The King" in the planetary cabinet. The colour of sun is red and his vahana is a chariot drawn by seven horses.

apaa kusuma Sankaasam – Kaasyapeyam Mahaath’ yuthim Thamo’urim sarva Paapa ganam – Pranathosmi Dhiwaakaram.
One who looks like the Hibiscus flower, Son of Kashyapa, full of radiance, Foe of darkness and the one who dispells all sins, I prostrate that Surya dev.



Moon: Ruler of the Emotions
moon
Moon is the Lord of Karka Rashi [Cancer] which is the Sign of nurturing and mothering. Moon is also known as "The Queen" in the planetary cabinet. It rules white and silver colours.

Dhadhi sanka Thushaaraabham – Ksheero Dhaarnava Sambhavam Namaami sasinam Somam – Sambhor makuta Bhooshanam.
The one who has the hue of curd and icebergs, one who emerges from the milky ocean, Chandra who adorns Shiva, I prostrate. that Chandra ( moon) dev.

Mercury: Planet of Communication
mercury
Mercury is the Lord of Mithua Rashi [Gemini] & Kanya Rashi [Virgo]. It is also known as "The Prince" in the planetary cabinet. It rules green colour and its temperament is volatile and versatile.

Piryangu kali Kaasyaamam – Roope’naa Prathimam Budham Sowmyam sowmya Gunopetham – Tham Bhudham Pranamaam Yaham
The one who is dark like the bud of Priyangu flower, One who is unequalled in beauty and is intelligent, And the son of Chandra, One who is peaceful, I prostrate that Budha dev.


Venus: Planet of Love and Money
venus
Venus is the Lord of Vrishbha Rashi [Taurus] & Tula Rashi [Libra]. It is also known as "The Minister" in the planetary cabinet. It rules royal blue colour and its temperament is easy going, royal, sensual, generous and accommodating.

Hima kundha M’runaalaabam – Dhaithyaanam Paramam Gurum Sarva saasthra Pravruththaaram – Bhaargavam Pranamaam Yaham
The one who has the lustre of the dew, Lotus stem and Thumba flower, High priest of Asuras and the one who preaches the Shatras, I prostrate that ( Bhargava )Sukracharya.


Mars: Planet of Passion
Mars
Mars is the Lord of Mesha Rashi [Aries] & Vrishchika Rashi [Scorpio]. Mars is also known as "The commander-in-chief" in the planetary cabinet. It rules bright red colour and its temperament is violent, angry and rash.

Dharanee garbha Sambhootham – Vidhyuth kaanthi Samaprabham Kumaaram Sakthi Hasthancha – Mangalam Pranamaam Yaham.
The one who is the son of Bhooma Devi, One who has the lustre of lightning, One who has Shakthi in his hand, and the auspoicious one, I prostrate that Angaraka (mangal ) dev.


Jupiter: Planet of Luck
jupiter
Jupiter is the Lord of Dhanu Rashi [Sagittarius] & Meen Rashi [Pisces]. It is also known as "The Minister" in the planetary cabinet. It rules yellow colour and its temperament is mild, benign and soft hearted.

Dhe’vaanaancha Risheenaancha – Gurum Kaanchan sannibham Bhudhdhi bhootham Thrilokesam – Thannamaami Bhruhaspathim.
The one who is the Guru of the Devas and Rishis, the one who is radiant and intelligent, The Lord of all the three worlds, I prostrate that Brihaspathi dev.

Saturn: Planet of Karma
saturn
Saturn is the Lord of Makara Rashi [Capricorn] & Kumbha Rashi [Aquarius]. It is also known as "The Servant" in the planetary cabinet. It rules black, navy blue and bright brown colours and its temperament is selfish and indolent, harsh and hard hearted. It is the leader of low castes.

Neelaanchana Samaabaasam – Raviputhram Yamaagrajam Chaayaa Maarthaanda Sambhootham – Thannamaami Sanaicharam.
The one who is blue, one who is like charcoal, one who is the son of Surya and the brother of Yama, one who is born to Chaya and Surya, I prostrate that Sani dev.

Rahu: Dragon's Head

The Rahu is instrumental in strengthening one's power and converting even an enemy into a friend. Even the effect of snakebite could be removed by his grace. Success of effort is a blessing of Rahu as he stands for vigour and valour.

Ardha kaayam mahaaveeyram – Chandhraadhithya vimardhanam Simhikaagarba Sambhootham – Tham Raahum Pranamaam Yaham.
The one who has half a body and is full of valour, One who opposes Chandra and Surya without fear, One who was born from Simhika’s womb, I prostrate that Rahu dev.

Ketu: Dragon's Tail
ketu
Ketu is a headless half-planet, shadowy as Rahu. Ketu is bestows wisdom, powers of discrimination, and gyana - spiritual knowledge, the knowledge of the self.

Palasha pushpa sankaasham taraka graha mastakam Roudram roudratmakam ghoram tam ketum Pranamamyaham.
I offer my obeisance to the violent and fearsome Ketu who is endowed with the potency of Lord Shiva and having a complexion resembling the flower of a palasa plant, he serves as the head of the stars and planets.

II The Navgraha Mantra II
II नवग्रह मंत्र II

Navagraha Mantra

Surya : Om hram hreem hroum sah suryaya namah
Chandra : Om shram sreem shraum sah chandraya namah
Mangala : Om kram kreem kroum sah bhaumaya namah
Budha : Om bram breem broum sah budhaya namah
Guru : Om jhram jhreem jroum sah gurave namah
Shukra : Om dram dreem droum sah shukraya namah
Shani : Om pram preem proum sah shanaischaraya namah
Rahu : Om bhram bhreem bhroum sah rahave namah
Ketu : Om shram shreem shroum sah ketave namah

In the natal chart or in Gochara, if any planet is not well disposed, or Lord of the house is not well disposed and the native is suffering with various kinds of problems it is advised to recited the following Shanti mantra that will minimize the negative effects of the planet.

Ravi - Bheeja Mantram

Om Ghruni Suryaya namaha

Ravi - Vaidika Mantram

Om Aa Krishnena rajasa vartamaanonvesayunnamrutam martyancha Hiranyayena savita radhena devo yaati bhavanani pasyan!

Ravi - Gayatri Mantram

Om Adhityaya cha vidmahe prabhakaraya deemahi
Tanmo Surya prachaodayat

Chandra - Bheeja mantram

Om Sooom somaya namaha

Chandra - Vaidika mantram

Om Aapyayaswa sametu
te viswasooma vrushniyam!
Bhavaa vajasya samgadhe!

Chandra - Gayatri Mantram

Om Amrutamgaya vidmahe kalaroopaya dheemahi, tanmo soma prachodayat!

Kuja - Bheeja mantram

Om Am angarakaya namaha

Kuja - Vaidika mantram

Om agniromdhardiva :kakutpati:prudviayam!
Apari retasijinwati!! Bhowmaaya namaha:

Kuja - Gayatri Mantram

Om Angarakaya vidmahe shaktihastaya deemahi,
Tanmo bhooma prachodayat!!

Budha - Bheeja mantram

Om Brhum Budhaya namaha

Budha - Vaidika mantram

Om Vudbhudyasagne pratijaagruhi twmishapoorte sa Sprujydayam cha asminootsa daste adyuttarasmin viswe deva yamanaschaseedath!!

Guru - Bheeja mantram

Om Brhum Bruhaspatiye namaha

Guru - Vaidika mantram

Om Brhuhaspatiye atiyadaryo arhadyumadwibhati kratumajjaneshu!
tadasmusu dravinam deehi chitram

Guru - Gayatri Mantram

Om Amgeerasaya vidmahe divyadhehaaya deemahi tanmo jaavah: prachodayat!!

Sukra - Bheeja mantram

Om Sum Sukrayanamaha:

Sukra - Vaidika mantram

Om anmat parisutorasam brahmanaa vyapivatkshatrayampayam: Somam prajapati:Rutena satyamindriyam vipana sukramadhasa, indrasyodriyammidam payoomrutamadhu!!

Sani - Bheeja mantram

Om Sam Sanischaraya namaha:

Sani - Vaidika mantram

Om Sanmo Deveerabheeshtaya apo bhavantu peetaye!Samyorbhisravantu na!!

Sani - Gayatri Mantram

Om Bhavabhavaya vidmahe mrutyuroopaya dheemahi, tanmo sukra: prachodayat!!

Rahu - Bheeja mantram

Om Ram rahave namaha

Rahu - Vaidika mantram

Om kayanaschitra abhuvadhooti sada vrudhah:Sakha Kaya Sachishta vruta!!

Rahu - Gayatri Mantram

Om Siroroopaya vidmahe amrutesaya deemahi, tanmo rahu prachodayat!!

Ketu - Bheeja mantram

Om Kam Kekave namaha:

Ketu - Vaidika mantram

Om Ketum Krunvanna pesomurya apesase: !!
Samushadbhi rajayadha!!

Ketu - Gayatri Mantram

Om padmaputraya vidmahe amrutesaaya deemahi, tanmo ketu prachodayat!!
Read More

శుక్రాచార్యులు కచుడు – ఆదర్శ గురుశిష్యులు



శుక్రాచార్యులు కచుడు – ఆదర్శ గురుశిష్యులు
మహాభారతము లోని

ఇది క్షీరసాగర మంథనమునకు పూర్వం జరిగిన కథ. దేవదానవులకు అమృతకలశం అప్పటికింకా లభించలేదు. దేవదానవ యుద్ధాలు అతి భీకరముగా జరిగేవి. ఇరుపక్షాల ఎందఱో సైనికులు అసువులు బాసేవారు. ఇలావుండగా రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సుచేసి మృతసంజీవనీ విద్యను సంపాదించాడు. ఇంకేమున్నది? యుద్ధములలో చచ్చిన రాక్షసులను సంజీవనీ విద్య ద్వారా బ్రతికించేవాడు శుక్రుడు. వాళ్ళు మళ్ళీ దేవతలపై పడి పోరుసాగించేవారు. దేవతలు ఎంత బలవంతులైనా ఇలా జరిగేసరికి వారి శక్తి క్షీణించసాగినది. మంచికి అపజయం కలుగుట చూడలేని దేవతాగురువు బృహస్పతుల వారు తన కుమారుడైన కచుని పిలిచి శుక్రుని శిష్యుడవై మృతసంజీవని అభ్యసించిరమ్మని ఆదేశించాడు.


పాపభీతి లేని రాక్షసులతో వ్యవహారము తన కుమారుని ప్రాణాలకే అపాయమని తెలిసికూడా ధర్మస్థాపనార్థం తన కుమారుని ఆ అసాధ్యకార్యము నిర్వర్తించుకొని రమ్మని పంపినాడు బృహస్పతి. పిత్రాజ్ఞాపాలకుడైన కచుడు వెంటనే బయలుదేరి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణామము చేసి “గురుభ్యోనమః స్వామీ నేను ఆంగీరస గోత్రజాతుడను. దేవగురువులైన బృహస్పతులవారి తనయుడను. నన్ను కచుడని పిలుస్తారు. విద్యార్థినై మీ వద్దకు వచ్చాను” అని ప్రార్థించాడు. కచుని వినయానికి సంతోషించి శుక్రుడు “నాయనా! వినయవిధేయతలే విద్యార్జనకు ప్రథమ సోపానాలు. నీవంటి అర్హుడిని శిష్యుగా స్వీకరించుట నాకు ఆనందదాయకము” అని ఆశీర్వదించి తన శిష్యబృందములో చేర్చుకొన్నాడు.

కచుడు రోజూ సూర్యోదయాత్పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సలిలోదకాలతో స్నానాది క్రియలు నిర్వహించి సంధ్యావందనాది ఆహ్నికాలు యథావిధిగా చేసేవాడు. తీవ్రమైన బ్రహ్మచర్య నిష్ఠను అవలంభిస్తూ ఎంతో ప్రీతితో గురుశుశ్రూష చేసేవాడు. భక్తి ఏకాగ్రతలతో వేదశాస్త్రాలు అభ్యసించేవాడు.

శుక్రాచార్యునికి యవ్వని త్రిలోకసౌందర్యవతి దేవయాని అను పేరుగల కుమార్తె ఉండేది. ఆమె సౌందర్యం అద్వితీయమ్. పైగా కచునిపై మనసుపడింది. కానీ కఠోర బ్రహ్మచర్యవ్రతుడైన కచుడు ఆమెను సరిగా చూడనుకూడా లేదు. కచుడు గురుపుత్రి అయిన దేవయానిని సోదరిగా భావించేవాడు. కచుని వినయం సంస్కారం విద్యలపైనున్న కుతూహలం అతనిని శుక్రునికి ఎంతో ప్రియునిగా చేసినాయి.

కచుని మంచితనం చూచి అసూయతో మిగతా రాక్షస శిష్యులందఱూ సమావేశమై ఇలా అనుకొన్నారు “వీడు మన శత్రువుల పక్షము. వీడికి మృతసంజీవనీ విద్య లభిస్తే అది మనకు అపాయకరము. కనుక వీడిని చంపి పారేద్దాము”. శుక్రుని గోవులను కాచి అడవినుంచి ఇంటికి తిరిగివస్తున్న కచుని నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఆ రక్కసులు. కచుడు రావటం ఆలస్యమైనదని చింతించి దేవయాని తండ్రితో “నాన్నా! ఎంత అవసరం వచ్చినా కనీసం సాయంకాల సంధ్యావందన సమయానికైనా ఆశ్రమానికి తిరిగి వచ్చేవాడు కచుడు. కానీ ఇవాళ ఇంత ప్రొద్దెక్కినా ఇంత వరకూ రాలేదు. దయచేసి మీ దివ్యదృష్టితో కచుని జాడ తెలుసుకోండి” అని ప్రార్థించింది. శుక్రుడు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకున్నాడు. వెంటనే తన మృతసంజీవనీ విద్యతో కచుని బ్రతికించాడు.

ఈర్ష్యాగ్నిచే జ్వలించబడుతున్న రాక్షసులకు ఈ విషయము తెలిసినది. మరునాడు మళ్ళీ కచుని సంహరించి దేహాన్ని కాల్చి బూడిద చేసి దాన్ని మదిరలో కలిపి వినయంగా శుక్రిని ఇచ్చారు. శుక్రుడు ఆ మదిరను పానముచేశాడు. కచుడు ఎంతకీ రాకపోయేసరికి దేవయాని మళ్ళీ తండ్రితో మొరపెట్టుకున్నది. శుక్రుడు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకుని ఎంతో బాధ పడి “ఈ రాక్షసులు చాలా కిరాతకులు. తెలియకుండా నేనెంత తప్పుచేసాను! ఈ మదిరాపానము చాలా ఘోరమైనది. దీని మత్తు ప్రభావము వలన నా వివేచన నశించినది” అనుకొని ఇకపై ఎవరిచే ఇట్టి తప్పులు జరుగరాదని ఈ విధముగా కట్టడి చేసినాడు:

“ఎంత కొంచమైననూ మదిరాపానము చేయరాదు. అది మహాపాపము”. ఇలా ధర్మనియమం తెలియజెప్పి మళ్ళీ ఇలా అన్నాడు “కానీ తెలిసిచేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా! నేను చేసిన తప్పును సరిదిద్దుకొనెదను. మృతసంజీవనీ విద్యను నా కడుపులో సూక్ష్మ రూపములో ఉన్న కచునకు ఉపదేశించెదను. ఆపై అతనిని బ్రతికించెదను. కచుడు నా ఉదరము చీల్చుకువచ్చి మృతుడనైన నన్ను బ్రతికించెదడు”. శుక్రుడు అలాగే చేశాడు. కచుడు శుక్రగర్భం నుంచి బయటకు వస్తూనే గురువు గారిని బ్రతికించినాడు. ప్రణామము చేసి శుక్రుని వద్ద సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరినాడు.

అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్త పఱచి తనను వివాహమాడమని నిర్బంధించింది. అంతట కచుడు “సోదరీ! నీవు నా గురు పుత్రికవు. కావున నాకు చెల్లెలివి అవుతావు. నీకిట్టి అధర్మ కోరిక కలుగరాదు” అని హితవు చెప్పాడు. నిరాకరించిన కచునిపై క్రోధిత అయి దేవయాని కచుని ఇలా శపించినది “నన్ను హింసించిన ఫలముగా ఈ విద్య నీకు ఉపకరించదు పో”! దేవయాని అమాయకత్వాన్ని చూసి ఇలా సమాధానమిచ్చాడు కచుడు

“చెల్లీ! విద్య ఎన్నడూ నిరుపయోగం కాదమ్మా! ఈ విద్య నాకు ఉపకరించక పోతేనేమి? అర్హులైన పరులకు నేర్పి వారికి ఉపయోగపడతాను. సమాజశ్రేయస్సుకై నా విద్య ఉపకరించుట కన్న నాకేమి కావాలి”? అని చెప్పి ఆనందముగా తిరిగి వెళిపోయాడు కచుడు.

దేశంకోసం ఒక గ్రామాన్ని, గ్రామం మేలుకై ఒక కుటుంబాన్ని, కుటుంబ శ్రేయస్సుకై ఒక కుటుంబ సభ్యుని త్యజించుట ధర్మము. ఈ సూక్ష్మం ఎఱిగిన బృహస్పతి తన ప్రియ కుమారుని ప్రాణాలను సైతం లెక్కసేయక దేవతలను కాపాడటానికి కచుని రాక్షస గురువు వద్దకు పంపించాడు.
శత్రువని తెలిసి కూడా అర్హుడైన వాడు కాబట్టి కచునికి సంతోషముగా విద్యనేర్పించి ఆదర్శ గురువైనాడు శుక్రుడు. కచుడు శ్రద్ధాభక్తులతో విద్యలను అభ్యసించాడు. దేవయాని పట్ల ప్రవరాఖ్య నిగ్రహం చూపించి ఉత్తమ శిష్యుడైనాడు కచుడు. కావున మనకు ఈ శుక్రకచులు ఆదర్శప్రాయులు కావాలి.
ఈర్ష అనేది పెనుభూతము. మత్సరముచే దారుణముగా కచుని చంపివేసినారు రాక్షసులు. అట్లు చేసి కచునికి సంజీవనీ మంత్రోపదేశం కలుగుటకు చేచేతులారా వారే కారణమైతిరి. వివేకహీనులు తెలియకనే వారికి వారే కీడు కలిగించుకొనెదరు.
మదిరాపానము మహాపాపము (శంఖలిఖితుల కథ చూడండి). ఈ విషయమును మరొక్కమాఱు మనకు తెలియజేశాడు శుక్రుడు.
గురుపుత్రిక సోదరి అని గ్రహించి దేవయానిని సోదరీభావముతో చూసిన కచుని ధర్మజ్ఞత మనకు కనువిప్పు కావాలి.
చోరులచే చోరింపబడనిది అర్హులకు పంచి ఇస్తే పెరిగేదీ విద్యాధనమొక్కటే. విద్య యొక్క గొప్పతనము మనకు కచుని అమృతవాక్కుల ద్వారా ఈ కథలో తెలిసినది. మనమెప్పుడూ సమాజశ్రేయస్సునకే విద్యను ఉపయోగించాలి. విద్యాభ్యాసమునకు సార్థకత అప్పుడే కలుగును.
Read More

మన ఖగోళ విజ్ఞానాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఖగోళ విజ్ఞానాన్ని వేదంయొక్కనేత్రంగా పరిగణిస్తారు

మన ఖగోళ విజ్ఞానాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
ఖగోళ విజ్ఞానాన్ని వేదంయొక్కనేత్రంగా పరిగణిస్తారు. కాలం యొక్క
జ్ఞానం గ్రహగతులతో ముడిపడి ఉంటుంది. ప్రాచీన కాలంనుండి
ఖగోళ విజ్ఞానం వేదాంగము యొక్క అంతర్బాగంగానే ఉండింది.
ఋగ్వేదం, శతపథ బ్రాహ్మణం మొదలైన గ్రంథాలలో నక్షత్రములు,
చాంద్రమానము, సౌరమానము, అధికమాసము, ఋతువులమార్పులు,
ఉత్తరాయణము, దక్షిణాయనము, ఆకాశ చక్రము, సూర్య మహిమ,
కల్పముల గణన మొదలైన వాటిని గురించి తెలియజేయబడింది. వీటిని
గురించి మన ఋషులు ప్రత్యేక పరిశోధనలు చేశారు.
దీర్ఘతమసుడనే ఋషి సూర్యుని గూర్చి అధ్యయనం చేసే
సమయంలో తన కళ్ళు పోగొట్టుకున్నాడని వ్రాయబడింది.
గృత్సమదుడు అనే మహర్షి చంద్రుని గర్బంలో జరిగే
పరిణామాలను వివరించాడు. యజుర్వేదం లోని 18వ అధ్యాయంలోని 40
వ పనస(మంత్రం)లో సూర్యుని వలననే చంద్రుడు ప్రకాశిస్తున్నా
డని చెప్పబడింది.
యత్రాల ను ఉపయోగించి ఖగోళమును పరీక్షించే పద్దతి ఉన్నది.
ఆర్యభట్టు 15వందలసంవత్సరాల పూర్వంవాడు. ఆ కాలంలోనే
పాటలీపుత్రంలో వేధశాల (నక్షత్రశాల – Observatory) ఉండేది. దీనిద్వారా
ఆర్యభట్టు క్రొత్తవిషయాలను సూత్రీకరించాడు.
దీనిని బట్టి మనకు అర్థంకావలసిన విషయాలేమిటంటే
ఆర్యభట్టుకు ముందు కాలం నుండి ఈ విద్య భారతదేశంలో చాలా
ప్రాచుర్యంలో ఉండేది అని. ఖగోళ గణనానికి
యంత్రాలు ఉపయోగించేవారుఅని. మహాభారతం లో కృష్ణ జననం.
ధర్మరాజు జననం, దుర్యోధనుడి జననం, భారత యుద్ద
ప్రారంభం, ధర్మరాజు పట్టాభిషేకం, కృష్ణ నిర్యాణం వీటన్నిటికీ
గ్రహస్థితిని ఇచ్చారు. ఇది ఎవ్వరూ మార్చలేని ఖచ్చితమైన తేదీలను, కాల
గణనాన్ని తెలియజేస్తుంది. కృష్ణ నిర్యాణంతో కలి
శకం ప్రవేశించింది. అంటే క్రీ.పూ 3102 సం. గా గ్రహస్థితిని బట్టి
చెప్పవచ్చు.


Read More

మాఘ మాసం లో ముఖ్యమైన రోజుల్లో ఆచరించ వలసిన విధులు



మాఘ మాసం లో ముఖ్యమైన రోజుల్లో ఆచరించ వలసిన విధులు




ఈ మాసం లో సంకట హర చతుర్థి రోజున ఫిబ్రవరి 7న, వినాయకుణ్ణి పూజించి నువ్వులతో చేసిన 21 లడ్డూలను నివేదన చేసి బ్రహ్మచారులకు దానం ఇవ్వాలి, శ్రవణా నక్షత్రం ఫిబ్రవరి 18 రోజున తులసి దళాలతో విష్ణు పూజ చేస్తే సకలపాపాలు తొలగుతాయి.

సంకటహర చథుర్ది నాడు సాయంత్రం వరకు ఉపవసించి సంధ్యా సమయం లో గణపతి ని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి

భీష్మ ఏకాదశి (ఈ నెల 30) రోజున ఉపవాసం చేసి విష్ణుసహస్రనామ పారాయణం చేస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుంది

తిలద్వాదశి (31) నాడు నువ్వుల తో చేసిన పదార్ధాలను తినడం, నువ్వుల నూనె తో అభ్యంగన స్నానమాచరించడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించి దానమివ్వడం చేస్తే కష్టాలు తొలగుతాయి.

శని త్రయోదశి నాడు నల్ల నువ్వులు, నల్లని వస్త్రం, దక్షిణ తో సహా బ్రాహ్మణునికి దానం ఇచ్చి, శివలింగానికి తైలాభిషేకం చేయించడం వలన శని బాధల నుండి ఉపశమనం లభిస్తుంది.

మాఘ పౌర్ణమి (ఫిబ్రవరి 3) రోజున మాఘ మాసం లో ప్రతి నిత్యం స్నానమాచరించలేని వారు ఈ ఒక్క రోజు మాఘ స్నానం ఆచరిస్తే శుభం కలుగుతుంది. దైవ శక్తి సంపూర్ణం గా విలసిల్లే దివ్యమైన రోజున చేసే జపాలు, పూజలు, దానాలు, హోమాలు అక్షయ ఫలితాన్నిస్తాయి. ఈ రోజున చేసే సముద్ర స్నానం వలన చెప్పలేనంత పుణ్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు చెప్పులు, గొడుగు, వస్త్రాలు దానమిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అమ్మవారికి కుంకుమార్చన చేస్తే సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది. శివాలయం లో ఆవు పాలతో అభిషేకం చేస్తే అన్ని గ్రహాల బాధలు తొలగుతాయి. పంచామృతాలతో అభిషేకం చేస్తే అన్ని కోరికలు తీరుతాయి.

విశాఖ నక్షత్రం ( ఫిబ్రవరి 12 ) రోజున సుబ్రమణ్య స్వామి ని భస్మం తో పూజిస్తే పాపక్షయం కలుగుతుంది, బిల్వపత్రాలతో పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయి. స్వామివారికి వస్త్రాలు సమర్పించి పూజించి ఉపవాసం చేస్తే ఉద్యోగమార్గాలు లభిస్తాయి.

విజయ ఏకాదశి ఫిబ్రవరి 15 - శ్రీ రామచంద్రుడు లంకను చేరుకోవడానికి సేతువు నిర్మించడం పూర్తైన రోజు కావున విజయ ద్వాదశి అని అంటారు. ఈ రోజు ఉపవాసం ఉంది శ్రీ మహా విష్ణువు ని పూజిస్తే విజయాలు ప్రాప్తిస్తాయి

మహా శివరాత్రి ( ఫిబ్రవరి 17 ) పర్వదినాన శివారాధన, రుద్రాభిషేకం, జాగరణ, ఉపవాసం ఏది చేసిన పుణ్యం లభిస్తుంది. విభూది, రుద్రాక్ష ధారణ వలన మంచి ఫలితాలు పొందుతారు. శివ పార్వతుల కల్యాణం చేస్తే భార్య భర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహ దోషాలు ఉన్న వారికి దోషాలు తొలగి వివాహం జరుగుతుంది.
Read More

సూర్య జయంతి



సూర్య జయంతి
ఆదిత్యార్చన.. అద్భుత శక్తి . పవిత్ర మాఘమాసం మహిమాన్వితం. ఈ మాసంలో అన్ని శుభ దినాలే. మాఘమాసంలో చేసే స్నానం, దేవతార్చన అనంత పుణ్యఫలాలు ఇస్తుందని భక్తుల విశ్వాసం. ఏటా మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమిగా, సూర్యజయంతిగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. రథసప్తమి రోజున సూర్యనారాయణస్వామి నిజరూపాన్ని దర్శించుకోవడం భక్తులు మరపురాని మధురానిభూతిగా భావిస్తారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే అరసవల్లిలో భక్తుల సందడితో ఆదిత్యుని జయంత్యుత్సవాల సందడి కనిపించిది.
ఆరోగ్య ప్రదాత..
మాఘశుద్ధ సప్తమి రోజున అరసవల్లి సూర్యనారాయణస్వామిని దర్శించి, సేవించడం ద్వారా రోగ, శోక, దారిద్య్రాలు పోతాయని భక్తుల నమ్మకం. అందుకే రథసప్తమి రోజున భక్తులు స్వామివారి నిజరూప దర్శనం, మహాక్షీరాభిషేకం సేవలో పాల్గొని తరిస్తారు. మాఘశుద్ధ సప్తమి వేకువజామున ఆకాశంలో నక్షత్రాలు రథం ఆకారంలో ఏర్పడుతుంటాయని, ఉత్తరాయణంలో వచ్చే చర్మ, కుష్ఠి, బొల్లి వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే సూర్యారాధన చేయాలని ఆదిత్యుని ఆలయ అర్చకులు నగేష్‌శర్మ వివరించారు.

అరుణశిల.. అత్యద్భుతం
ఆదిత్యాలయంలో రథసప్తమి రోజున శ్రీసూర్యనారాయణస్వామి నిజరూప దర్శనం భక్తులకు మరపురాని మధురానిభూతి కలిగిస్తుంది. అరుణశిల దర్శించినంత మాత్రానే అద్భుతశక్తి శరీరంలోకి ప్రవేశించిన భావన కలుగుతుంది. ఆదిత్యాలయంలోని అయిదున్నర అడుగుల అరుణశిలతో దేవశిల్పి విశ్వకర్మ స్వామి మూలవిరాట్‌ను చెక్కినట్లు పురాణాలు చెబుతున్నాయి. మూలవిరాట్‌ కిందన వైజయంతి సప్త అశ్వరథం ఉంటుంది. రథంపై గుర్రాలు తాళ్లు పట్టుకుని సూర్య రథసారథి అనూరుడు ఉంటారు. స్వామి పాదాల ముందర ఛాయాదేవి, స్వామి ఎడమవైపు, కుడివైపు ఉషా, పద్మినిదేవి ఉంటారు. ముగ్గురు దేవేరుల్లో ఉషా, పద్మిని ధనుస్సులు ధరించి ఉంటారు. స్వామికి ఎడమవైపున ద్వారపాలకుడైన మాఠరుడు కత్తి, డాలు ధరించి ఉంటాడు. స్వామికి కుడివైపున చిన్న గడ్డంతో కూడిన పింగళుడు ఎడమవైపు సిరాబుడ్డీ, కుడిచేతిలో కలం పట్టుకుని ఉంటాడు. ఈయనే భక్తులు చేసే విజ్ఞాపనలు, కోరికలు స్వీకరించి స్వామికి నివేదిస్తారు. స్వామికి శిరస్సుకు ఎడమవైపు సనకుడు ఛత్రంలోను, కుడివైపున సనందుడు అనే మహర్షి ఛామరం పట్టుకుని సేవలు అందిస్తారు. స్వామికి రెండు చేతులు అభయ ముద్రలలో ఉంటాయి. స్వామి భుజాలకు ఇరువైపుల తామరపూలు, మొగ్గులను ధరించి ఉంటారు. స్వామి నిజరూప దర్శనంలో వస్త్రాల కిందన బెల్టును ధరించి ఉంటారు. సూర్యనారాయణస్వామి మెడలో హారాలు, మకర కుండలాలు, కేయూరాలు, రత్నఖచిత సూర్యమణి కిరీటంతో చిరునవ్వుతో స్థానక భంగిమలో భక్తులకు స్వామి దర్శనం ఇస్తుంటారు. స్వామి శిరస్సు మీద శరభ సాల్వం అనే పతాక చిహ్నం ఉంటుంది.

పాయసాన్నం.. పరమౌషధం
రథసప్తమి రోజున ఉదయం 8 గంటల లోపు వాకిట్లో పొయ్యిను పెట్టి కొత్తబెల్లం, కొత్తబియ్యం, చెరకు, ఆవుపాలతో పాయాసన్నం చేసి స్వామికి నివేదించి భక్తులు తింటే నరాలు, కీళ్ల నొప్పులు, హృద్రోగ సంబంధ వ్యాధులు నశిస్తాయని నగేష్‌ శర్మ తెలిపారు. స్వామికి సమర్పించిన తీపి పదార్థంపై లేలేత సూర్యకిరణాలు పడడం వల్ల శరీరంలో రోగ నిరోధకశక్తి పెరిగి, మధుమేహవ్యాధిని తగ్గిస్తుంది. పాయాసన్నంలో వాడే చెరకు వల్ల పళ్లు, దవడలు, నరాలకు శక్తి వస్తుంది. రథసప్తమి రోజు నదులు, చెరువుల్లో తలపై దీపం పెట్టి వదిలివేస్తే మరుజన్మ ఉండదని భక్తుల విశ్వాసం. జిల్లేడు ఆకులు శిరస్సున, రెండు భుజాలపైన రేగుపళ్లు పెట్టుకుని స్నానం చేస్తే ఏడు జన్మల రోగాల పోయి, మనస్సు, నవరంధ్రాలు, పంచేంద్రియాలు సుషుప్తావస్థ నుంచి జాగృతావస్థలోకి వస్తాయని చెబుతారు. రథసప్తమి రోజున స్వామి నిజరూప దర్శనం వల్ల అభిషేకం చేసిన అరుణశిల కిరణాల స్పర్శతో భక్తులకు రోగనివారణ కలుగుతుందని నమ్ముతారు.
....ఓం ఆదిత్యాయ నమః
Read More

కర్ణాటక రాష్ట్రం లో పడమటి కనుమలలో వున్న దివ్య క్షేత్రమే శృంగేరి

కర్ణాటక రాష్ట్రం లో పడమటి కనుమలలో వున్న దివ్య క్షేత్రమే శృంగేరి .ఋష్య శృంగ మహర్షి పావనం చేసిన ప్రదేశం .శృంగ గిరే శృంగేరి గా మారింది .ఆది శంకరా చార్యులు ఇక్కడ శారదా పీఠం నెలకొల్పారు .శారదాలయానికి కుడి ప్రక్కన విద్యా శంకరాలయం వుంది .శ్రీ విద్యారణ్య స్వామి గురువు శ్రీ విద్యా శంకరులు..105 సంవత్స రాలు పీఠాది పత్యం వహించిన పుణ్య పురుషులు .అందుకని శిష్యుడు కృతజ్ఞత గా ఈ ఆలయాన్ని కట్టించారు .ఇది 1338 లో నిర్మిత మైంది . ముఖ మండపం లో 12 రాతి స్తంభాలున్నాయి .ఇవి 12 రాశుల పేర్లతో వుంటాయి.సూర్యుడు ఏ రాశి లో ప్రవేశిస్తే ,ఆ పేరు గల స్థంభం మీద ఆ రోజున సూర్య కిరణాలు పడటం ఇక్కడ విశేషం .ఖగోళ ,జ్యోతిష ,గణిత ,వాస్తు శాస్త్రాలలో అపూర్వ పాండిత్యం గల శిల్పులు మలచిన అద్భుత విన్యాసం .స్తంభాల పై సింహం ఆకారం లో జీవ మృగ మూర్తులున్డటం విచిత్రం .వాటి నోటిలో వ్రేలాడే రాతి బంతులు ,పై కప్పు నుంచి వేలాడే రాతి గొలుసులు ,అన్నీ ఒకే శిలతో నిర్మింప బడి ఉండటం ఆశ్చర్య కరం .ఆలయం బయట గోడలు కోణాలు ,కోణాలుగా చెక్క బడి వుండటం ఇంకో విచిత్రాను భూతి .పొడ వైన రాతి పలకలు ప్రక్క ప్రక్కగా నిలబెట్టి అతికించి నట్లు గా అని పిస్తుంది .ఇక్కడి శిల్ప సంపద అసదృశం గా వుంటుంది .
Read More

Ved Vaani :

Ved Vaani :

================ from Krishna Yajur Veda ================

(Explanation by Jagadguru Sri Bharati Tirtha Mahaswami Ji, Peethadhipati, Dakshin Aamnaya)

Teaching from the Yajurveda :

From the Yajur Veda, we get multifarious teachings.The Yajurveda contains a number of arthavādās (portions which are not to be taken literally, which are in the form of stories, for the purpose of highlighting a certain value, practice, or certain knowledge). From such arthavādās, we however get several important teachings.

In the 3rd khāṇḍa, 1st praśna of Taittiriya Samhita, we have the mantra :

प्रजापतिर्कामयत प्रजासृजेयेति स सर्पानसृजत |

........ Taittiriya Samhita 3.1.1

Brahmāji had the desire to create human beings, for that he did tapas. However, when he did tapas for progeny, he did not get what he desired, but only snakes appeared.

Therefore he did tapas again.

स तपो तप्यत | वयाग्स्यसृजत |

........ Taittiriya Samhita 3.1.1

The second time he did tapas, birds appeared. Brahmāji was not satisfied once more, so he did tapas again. Then finally human beings appeared. Now, this is an arthavāda, a story portion in the Yajur Veda. But we learn something from this. The teaching here is that if we start any activity for śreyas , any good activity, we should not leave it until it is completed and its result is obtained. This teaching appears in other śāstrās literally -

विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमानाः |
प्राराब्धं उत्तमगुणाः न परित्याजयन्ति ||

Amongst the human beings, there are three types. There are some who start some Dharmic activity, they undertake that saṁkalpa , that commitment. In between the performance of that activity, some obstruction or problem arises. Once that comes, these people stop continuing that Dharmic activity because they do not have the interest in facing the problem and overcoming it. This is one category of people, a mediocre category.

A worse category are those who don't even start such Dharmic activities because they feel that there is no point in doing it as anyway obstacles are going to come and they cannot be bothered to handle them.

प्राराभ्येते न खलु विघ्नभयेन नीचैः |

Thus, the worse category of people do not even start any good activity fearing obstacles, while the mediocre category of people start the activity but leave it in between. However, the best category, the uttamās, overcome all obstacles and problems and complete the activity which they have undertaken. Thus, the story of Brahmāji reveals this teaching to us, for just like these uttamās, Brahmāji also undertook a Dharmic enterprise and persevered through several obstacles to overcome them and finally achieve his goal.This is one teaching we gain from the Yajur Veda .

Amongst the many other teachings in the Yajur Veda , there is also another very important one.The Yajur Veda gives us another arthavāda, a story portion, to teach us that if there is a satsanga happening somewhere, then we have to take the initiative ourselves to go there and become a part of it. We should not wait for anyone's invitation to go there. The arthavāda in the Yajur Veda tells us about the palāśa tree did this.

देवा वै ब्रह्मन्नवदन्त | तत्पर्ण उपाश्रुणोत् |

........ Taittiriya Samhita 3.5.7

It seems the Devas were doing Brahma-vichāra, discussing the highest knowledge that is the knowledge of Brahman. That time, this palāśa tree went there and was listening to this.

The Veda says that because the palāśa tree went there and was listening to this divine discussion, it has got lot of glory and greatness. Therefore, one should use the palāśa tree and its constituents to prepare a certain material called juhū which is used in the yajnās.The palāśa tree got this glory because it went by itself to participate in the satsanga.The point here is not to question how the palāśa tree can walk, how it can go and listen to something, etc. This is an arthavāda, a story portion. However, the grand teaching we obtain here is that wherever a satsanga is happening, we have to go there and participate in it by ourselves without waiting for any special invitation from someone.The reason is that by going to the satsanga we can get to know several good Dharmic ideals.

Thus, in this manner, we get several teachings from the arthavādās present in the Yajur Veda. Apart from this we get many direct teachings also.

For example, in the Taittirīya upaniṣad, we come across the teachings -

वेदमनुचचार्योऽन्तेवासिनमनुशास्ति | सत्यं वद | धर्मं चर | स्वाध्यायान्मा प्रमदः |

...... Taittiriya Upanishad, Shikshavalli, Anuvaka 11

(One has to speak the truth always. One has to follow Dharma always. One has to respect and honor one's parents. One has to revere one's ācārya very much. One has to serve one's guests well. If one gets any confusion regarding what is Dharma, one has to approach the great Dharmic heros, perform the actions as done by them, and go in the same path as they have.)

In this manner we obtain several teachings from the Yajur Veda.

Teaching from the Sāma Veda :

Similarly if we take the Sāma Veda , the teachings we obtain from it is no less. Just because it is set in a musical fashion, that doesn't mean that there are no teachings for us in the Sāma Veda .

To illustrate this, we can take up the Setu Sāma. In the Setu Sāma, we have a very essential upadeśa given to us. The Setu Sāma says that for a human being to attain śreyas , complete fulfillment and security, there are four obstacles. If the four obstacles are removed, then one gets śreyas. The four obstacles are krodha (anger), lobha (greed), asatya (lack of truth), and aśraddhā (lack of śraddhā ). These four are obstacles in the path to śreyas and they should be removed.

Krodha (anger) should be removed by the practice of akrodha, which is nothing but kṣamā or patience. By the practice of patience, krodha should be removed. Lobha (greed) should be removed by the practice of dāna (giving).

The Veda says,

" एषा गतिः एतदमृतं स्वर्गछ ज्योतिर्गछ "

If you remove these four inner enemies, then you can enjoy not only the temporal happiness available in svarga but also the highest happiness which is union with the Lord. Having told this, the śruti , the Sāma Veda addresses us, " he catura " (हे चतुर), " O intelligent one, understand this teaching and implement it in your life. This is a teaching available to us from the Sāma Veda.

" Om Shanti Shanti Shanti "




Read More

LOTHAL: ANCIENT WORLD'S MOST MODERN PORT WAS IN INDIA !!!



LOTHAL: ANCIENT WORLD'S MOST MODERN PORT WAS IN INDIA !!!

Lothal : is one of the most prominent cities of the ancient Indus valley civilization. Located in the modern state of Gujarat and dating from 2400 BCE, it is one of India's most important archaeological site that dates from that era. Discovered in 1954, Lothal was excavated from February 13, 1955 to May 19, 1960 by the Archaeological Survey of India (ASI).

Lothal's dock—the world's earliest known—connected the city to an ancient course of the Sabarmati river on the trade route between Harappan cities in Sindh and the peninsula of Saurashtra when the surrounding Kutch desert of today was a part of the Arabian Sea. It was a vital and thriving trade centre in ancient times, with its trade of beads, gems and valuable ornaments reaching the far corners of West Asia and Africa.


Lothal's people were responsible for the earliest-known portrayals of realism in art and sculpture, telling some of the most well-known fables of today. Its scientists used a shell compass and divided the horizon and sky into 8–12 whole parts, possibly pioneering the study of stars and advanced navigation—2000 years before the Greeks. The techniques and tools they pioneered for bead-making and in metallurgy have stood the test of time for over 4000 years.

Lothal is situated near the village of Saragwala in the Dholka taluka of Ahmedabad district. It is at a distance of six kilometres (south-east) from the Lothal-Bhurkhi railway station on the Ahmedabad-Bhavnagar railway line. It is also connected by all-weather roads to the cities of Ahmedabad (85 km/53 mi), Bhavnagar, Rajkot and Dholka.


Read More

రుద్రాక్ష



రుద్రాక్ష

మన హిందువులలో "రుద్రాక్ష" పేరు విననివారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఐతే ఈ రుద్రాక్షలు ఏమిటి? వాటి ప్రాముఖ్యత ఏమీటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. రుద్రాక్ష వృక్షం ప్రపంచంలోని ప్రాచీన వృక్షాలలో ఒకటి. రుద్రాక్ష వృక్షం భారతదేశంలో దిగువ హిమాలయాలలో, నేపాల్ లో మరియూ ఇండోనేషియాలో విరివిగా పెరుగుతాయి. ఈ వృక్షం పెరిగి పుష్పించి ఫలించటానికి కనీసం 15 నుండి 16 సంవత్సరాలు పడుతుంది. పురాణ కథ: "రుద్రాక్ష" అనే పదం రుద్ర + అక్ష అనే రెండు పదాల కలయిక వలన ఏర్పడింది. రుద్రాక్ష అనగా రుద్రుని అశ్రువులు (కన్నీటి బొట్లు) అని అర్ధం.

రుద్రాక్షల గురించి వాటి ఉపయోగాల గురించి శివపురాణం, దేవీ పురాణం, పద్మ పురాణం, మరియు రుద్రాక్ష జబలోపనిషత్ లలో వివరంగా చర్చింపబడింది. శివపురాణం ప్రకారం రుద్రాక్ష పుట్టుక ఇలా ఉంది. రాక్షసరాజైన త్రిపురాసురుడు వరబలం వలన అత్యంత శక్తివంతుడై, దేవతలకు కంటకుడిగా మారాడు. దేవతలంతా పరమ శివుని వద్దకు వచ్చి తమ బాధలు మొరపెట్టుకున్నారు. అప్పుడు శివుడూ త్రిపురాసుర సంహారం కోసం అత్యంత శక్తిమంతమైన ' అఘోరాస్త్రం ' తయారుచేయదలచి సమాధిలోకి వెళ్ళిపోయాడు. అలా సమాధిలోకి వెళ్ళిన పరమశివుడు చాలా కాలం తరువాత కళ్ళు తెరచినప్పుడు శివుని కన్నుల నుండి కొన్ని ఆశ్రు బిందువులు భూమి మీద పడ్డాయి. ఆ అశ్రువులే విత్తనాలుగా మారి వాటి నుండి రుద్రాక్ష వృక్షాలు పుట్టాయి. రుద్రాక్ష చెట్టు నుండి వచ్చే ఫలాలలో ఉండే బీజములే మనం రుద్రాక్షలని అంటాము.

పరమశివుని త్రినేత్రములు సూర్య, చంద్ర, అగ్ని రూపాలు. అందులో సూర్యనేత్రం నుండి పుట్టిన రుద్రాక్షలు గోధుమరంగులో ఉంటాయి. ఇవి పన్నెండు రకాలు. చంద్రనేత్రం నుండి పుట్టిన రుద్రాక్షలు లేత ఎరుపురంగులో ఉంటాయి. ఇవి మొత్తం 16 రకాలు. అగ్ని నేత్రం నుండి పుట్టిన రుద్రాక్షలు నల్లగా ఉంటాయి. ఇవి మొత్తం 10 రకాలు. సూర్యనేత్రం నుండిపుట్టిన గోధుమరంగు రుద్రాక్షలను లేత గోధుమరంగు రుద్రాక్షలు, ముదురు గోధుమరంగు రుద్రాక్షలు గా విభజించ వచ్చు. అన్ని రకాల రుద్రాక్షలు కలిపి మొత్తం ముప్పైఎనిమిది రకాల రుద్రాక్షలు మనకు దొరుకుతున్నాయి. ఎవరైతే 108 రుద్రాక్షలను ధరిస్తారో వారికి అశ్వమేధయాగం చేసిన ఫలితం వస్తుందని, వారి 21 తరాలవారు శివలోక సాయుజ్యం పొందుతారని, ఎవరైతే 1100 రుద్రాక్షలని ధరించినా, 555 రుద్రాక్షలను కిరీటంలా ధరించినా, 320 రుద్రాక్షలను జంధ్యంగా మూడు వరుసలో ధరించినా వారు పరమశివునితో సమానమని పురాణాలు చెప్తున్నాయి.

రుద్రాక్షలు - రకాలు
ముందుగా చెప్పినట్టు మనకు మొత్తం 38 రకాల రుద్రాక్షలు దొరుకుతున్నాయి. రుద్రాక్షల విలువ వాటీ ప్రమాణాన్ని బట్టి ఉంటుంది. మినుము గింజప్రమాణం గల రుద్రాక్షలకు చాలా రోగనిరోధక శక్తులున్నాయని, ఆధ్యాత్మిక చింతనకు శ్రేష్ఠమైనవని శాస్త్రం. భారతదేశంలో దిగువ హిమాలయాలలో లభించే రుద్రాక్షలు పరిమాణంలో చిన్నవి. నేపాల్ లో లభించే రుద్రాక్షలు పెద్దవిగా ఉంటాయి. "పత్రి" అనే రుద్రాక్ష చదునుగా ఉండే ఒక విషేషమైన రుద్రాక్ష. ఈ రుద్రాక్ష ప్రస్తుతం అంత విరివిగ లభించటంలేదు.

ప్రత్యేకమైన రుద్రాక్షలలో చెప్పుకోదగినవి "గౌరీ-శంకర రుద్రాక్ష", "గణేష రుద్రాక్ష"

వివిధ రుద్రాక్షలను వాటి ' ముఖాల ' ద్వారా గుర్తించవచ్చు. ఒక రుద్రాక్ష ఎన్ని ముఖాలదో తెలుకోవాటానికి సులభమైన మార్గం ఏమిటంటే ! ఆ రుద్రాక్షమీద ఎన్ని గీతలున్నాయో అది అన్ని ముఖాల రుద్రాక్ష.

పురాణాలు వివిధ రుద్రాక్షలను వివిధ దేవతలతో పోల్చారు.
ముఖాలు - దేవత - సంబంధిత గ్రహం
1 ముఖి - శివుడు / సూర్యుడు - సూర్యుడు
2 ముఖి - అర్ధనారీశ్వరుడు - చంద్రుడు
3 ముఖి - అగ్ని - కుజుడు
4 ముఖి - బ్రహ్మ - బుధుడు
5 ముఖి - కాలాగ్ని రుద్ర - గురుడు
6 ముఖి - కార్తికేయుడు - శుక్రుడు
7 ముఖి - అనంగ - శని
8 ముఖి - గణేష - రాహు
9 ముఖి - భైరవుడు - కేతు
10 ముఖి - విష్ణుమూర్తి - బుధుడు
11 ముఖి - ఏకాదశ రుద్రులు - కుజుడు/గురుడు
12 ముఖి - ఆదిత్యుడు - సూర్యుడు
13 ముఖి - కార్తికేయుడు - కుజుడు
14 ముఖి - శివుడు / హనుమంతుడు శని
21 ముఖి - కుబేరుడు
గమనించవలసింది ఏమిటంటే రుద్రాక్షలు ధరించటం వలన ఎటువంటి చెడు ఫలితాలు ఉండవు.

ముఖాలు : ఫలితాలు
1 ముఖి : సర్వతోముఖ అభివృద్ధి. అన్ని పాపాలను హరించి అన్ని కోరికలను సిద్ధింపచేస్తుంది.
2 ముఖి : సౌభాగ్య ప్రదాయని, సర్వపాపహారిణి. ఈ రుద్రాక్ష ఏకత్వాన్ని సూచిస్తుంది. దుష్ట ఆలోచనలు అదుపుచేస్తుంది. వైవాహిక సంబంధాలను మెరుగు పరుస్తుంది.
3 ముఖి : సకల సౌభాగ్య దాయని. తరచుగా వచ్చే జ్వరం వంటి వ్యాదులనుండి ఉపశమనం
4 ముఖి : ధర్మార్ధ కామ మోక్ష ప్రదాయని. మానవుడు హత్య ద్వారా చేసిన పాపాన్ని హరిస్తుంది. జ్ఞాపకశక్తి ని, తెలివితేటలను పెంపొందిస్తుంది. నరాలకు సంబంధించిన వ్యాధులకు మంచిది
5 ముఖి : కోపాన్ని అదుపుచేసి మనసుకు శాంతిని కలగ చేస్తుంది. రక్తపోటు, చక్కెర వ్యాధి, పంటి నొప్పులు మూల వంటి వ్యాదులను నివారిస్తుంది.
6 ముఖి : కుడి చేతికి కట్టుకుంటే లోబిపి తగ్గుతుంది. బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి
7 ముఖి : ధన మరియు అభివృద్ధిని ప్రసాదిస్తుంది
8 ముఖి : ప్రమాదాల నుండి, ఆపదల నుండి రక్షణ
9 ముఖి : వివాహ సంబంధిత సమస్యల నుండి విముక్తి. ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తుంది
10 ముఖి : నరాలకు సంబంధించిన వ్యాధులకు, జ్ఞాపకశక్తికి సంబంధించిన వ్యాధులకు పనిచేస్తుంది
11 ముఖి : సంతాన ఆరోగ్య సమస్యలకు మంచిది
12 ముఖి : రక్త, హృదయ సంబంధిత వ్యాధులకు మంచిది. ధైర్యాన్ని పెంచి శత్రువుల నుండి రక్షణ కలిగిస్తుంది
13 ముఖి : అభివృద్ధి, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది
14 ముఖి : శని సంబంధిత సమస్యలకు మంచిది.
అభిప్రాయం
Read More

Powered By Blogger | Template Created By Lord HTML