What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 16 June 2017

ఈ కింద దేవాలయాల్లో ఒక విషయం కామన్ గా వుంది...



మీకు తెలుసా??

ఈ కింద దేవాలయాల్లో ఒక విషయం కామన్ గా వుంది...

1.Kedarnath (కేదారినాద్)


2. Kalahashti( కాళహస్తి)

3. Ekambaranatha- Kanchi(ఏకాంబరనాద్)

4. Thiruvanamalai(తిరువనమలై)

5. Thiruvanaikaval(తిరువనయ్ కావల్)

6. Chidambaram Nataraja(చిదంబర నటరాజన్)

7. Rameshwaram(రామేశ్వరం)

8. Kaleshwaram N-India(కాళేశ్వరం)

ఇవన్నీ శివుని దేవాలయాలు

కానీ దేవాలయాల్లో కామన్ గా వున్న ఒక గొప్ప విషయం.. ఈ దేవాలయాలన్నీ "79 డిగ్రీల రేఖాంశం" మీద వున్నాయి..

1. Kedarnath 79.0669°

2. Kalahashti 79.7037°

3. Ekambaranatha- Kanchi 79.7036°

4. Thiruvanamalai 79.0747°

5. Thiruvanaikaval 78.7108

6. Chidambaram Nataraja 79.6954°

7. Rameshwaram 79.3129°

8. Kaleshwaram N-India 79.9067°

ఎటువంటి GPS పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ పూర్వపు రోజుల్లో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయాలు అన్ని ఒకే రేఖాంశం పైన నిర్మించిన మన పూర్వీకుల గురించి ఏంత పొగిడిన తక్కువే కదా....
Read More

త్రిపురాంతకం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మ వారి దేవాలయం.



త్రిపురాంతకం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మ వారి దేవాలయం.
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

త్రిపురాంతకం బాల త్రిపుర సుందరీ దేవి, పార్వతీ సహిత త్రిపురాంతకేశ్వరుల నివాస భూమి త్రిపురాంతకం. స్వామి వారు కొండ ఎగువన ఉంటారు. అమ్మ వారు కొండ దిగువ భాగాన ఉండి భక్తులను కటాక్షిస్తారు…అమ్మ వారు చిదగ్ని గుండం నుండి ఆవిర్భవించారు.జపమాల పుస్తకాన్ని ధరించి శ్వేతకమలాన్ని అధిష్టించి అమ్మవారు చిన్న రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారిని దర్శించినంతనే దేవీ ఉపాసన సిద్ధి లభిస్తుంది. ప్రశాంతతకు మారుపేరుగా, ప్రకృతి అందాలకు నెలవుగా మారిన ఈ పుణ్యక్షేత్రం శ్రీశైల క్షేత్రానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతుంది…



శివుడు కొలువు దీరిన అతి పురాతన ప్రదేశం ఈ త్రిపురాంతకం. శ్రీశైలం కంటే అతి పురాతనమైన మహా శైవ ధామం. పరమశివుడు శ్రీశైలం వెళుతూ ఇచ్చట నడయాడాడు. అందుకే త్రిపురాంతకం శ్రీశైలానికి ప్రధాన ద్వారం అయింది.అమ్మ వారి గర్భాలయం, పంచముఖ స్వయంభుజాల లింగం,మేరు చక్రం మధ్యగల జలలింగం పై, అభిషేకం చేయబడ్డ జలం భూ చక్రపీఠము గుండా క్రిందకు జారి పాతాళచక్రము మధ్య రాసాలింగం పై పడటం ఒక అద్భుత దృశ్యం ఇది చూసి తీరాలి.


స్వామి వారు శ్రీ చక్ర ఆకార నిర్మిత ఆలయంలో దర్శనమిస్తారు.ఆకాశం నుండి చూస్తే శ్రీ చక్ర ఆకారం స్పష్టంగా కనబడుతుంది.ఈ పుణ్య క్షేత్ర అభివృద్ధికి చోళ,రాష్ట్ర కూట,విజయనగర సామ్రాజ్య దీశులు విశిష్ట కృషి చేశారు. గర్భాలయానికి ఆగ్నేయదిశలో నాగారేశ్వరస్వామి, దక్షిణ భాగంలో అపరాధేశ్వరస్వామి ఉన్నారు. కాశీ, ఉజ్జయిని తరువాత అమ్మవారికి ఇష్టమైన కదంబ వృక్షాలు ఉన్న ఆలయం. ఈ కదంబ వృక్షాలు కాశీలో తప్ప మరెక్కడా కనపడవు.

నైరుతి దిశలో ఆగస్త్యమహార్షి చే నిర్మించబడిన ఒక బిల మార్గం ఉంది. ఈ బిలము గుండా మునులు, తాపసులు, కాశీ,రామేశ్వరం, శ్రీశైలంకు ప్రయాణించే వారని ప్రతీతి.కానీ అది ప్రస్తుతం రాళ్లతో, విరిగిపోయిన దూలములతొ మూసుకుపోయి ఉంది. ఆలయానికి చుట్టూ కోటికి పైగా శివలింగాలు, శతాధిక జలాశయాలు ఉన్నాయని పూర్వీకులు చెబుతారు…
ప్రతి పౌర్ణమి రాత్రి కొన్ని వందల మంది భక్తులు ఇక్కడ నిద్ర చేసి వేకువజామునే అమ్మవారిని దర్శించుకొని అమ్మ వారి కృప కి పాత్రులవుతారు

ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి

శ్రీ బాల త్రిపురసుందరి దేవి దేవాలయం ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం లో ఉంది.ప్రకాశం జిల్లా మార్కాపురానికి 40 కి. మీ. ఒంగోలు కి 93 కి.మీ కర్నూలు – గుంటూరు రహదారిలోని ఉన్న వినుకొండకు 35 కి. మీ.యర్రగొండపాలెంకు 19 కి. మీ. దూరంలో ఉంది. ఇక్కడికి ముఖ్యమైన ప్రాంతాల నుండి ఆర్టీసీ బస్సు సదుపాయం కలదు.
Read More

Rss అంటే ఏమిటి ఏం చేస్తుంది.



Rss అంటే ఏమిటి ఏం చేస్తుంది.

కానీ నాకు తెలిసి కొన్ని ప్రాంతాల్లో అత్యంత నీచ రాజకీయాలు సంఘం లో చోటు చేసుకుంటున్నాయి. ఎదవలకి భాద్యతలు అప్పగించడం , మిగిలిన సంస్థలతో కలుపుకొని పోకుండా పిచ్చ రాజకీయాలు చేయడం సంఘంలో ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరికి అలవడింది....

వీటిని సరిచేసుకొని పోతే సంఘం మర్యాద ఉంటుంది లేకుంటే గాలిలో దీపమే!!

సంఘ కార్యం విచిత్రంగా ఉంటుంది. రోజు ఒక నిర్దిష్ట సమయంలో ఒక ప్రదేశం లో స్వయంసేవకులు కలుస్తారు. గంట సేపు కార్యక్రమం. 45 నిమిషాలు శారీరక శిక్షణ, 10 నిమిషాలు ఒక దేశ భక్తిగీతం, సంస్కృత సుభాషితం,చిన్న కథ కాని, చర్చ కాని తరువాత 5 నిమిషాలు ప్రార్థన.

ఇంత విశాల సంస్థకు ఏ మనిషి గురువు కాదు. త్యాగానికి ప్రతీక అయిన భగవా పతాకమే గురువు. రోజూ పిల్లలని నిద్రలేపి, సమయానికి చేరుకునేట్టుగా చేయడానికి ఒక బృందం ఉంటుంది. శాఖా కార్యక్రమం తరువాత స్వయం సేవకుల ఇళ్లకు పోతారు. వ్యక్తుల కుటుంబాలతో సంబంధం. శాఖకు తీసుకు రావడం ఎంత ముఖ్యమో, వాళ్లకు శారీరక, మానసిక శిక్షణ తో పాటు, వారి మధ్య గరిష్ట స్నేహం కూడా అంతే ముఖ్యం.
అనేక ఇతర కార్యక్రమాల ద్వారా వారిలో దేశానికి కావలిసిన గుణాలు నేర్పిస్తారు. అటువంటి వారి మధ్య స్నేహం లో అనేక అవగుణాలు కడిగేయ బడతాయి. వారి కుటుంబాలకు కూడా సంఘం వారి సంస్థే.

ఒక సారి ఒక శిక్షా వర్గాల్లో వ్రాత పరీక్ష పేపర్ కి మార్కులు వేస్తున్నాను. ఈ పని రోజూ ఎందుకు చేయాలని ప్రశ్న. దానికి ఇంటర్ చదివే ఓ పిల్లాడు వ్రాసిన జవాబు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. దేశం లో 125 కోట్ల జాతీయులు మారడా నికి చేసే ప్రయత్నం రోజూ చేయక పోతే ఎప్పుడు పూర్తి అవుతుంది? ఇది సంఘ కార్యం పట్ల స్వయంసేవకుల నిష్ఠ. పనిపై ఈ శ్రద్ధ వ్యక్తుల్లో మార్పు వారే సాధించు కుంటారు.

గుంటూరు లో పని చేస్తున్నప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు నన్ను పరిచయం చేశారు మా కార్యకర్త. వీరు సంఘ పూర్తి సమయ కార్యకర్త అని చెప్పారు. RSS అంటే ఉదయం / సాయంత్రం వ్యాయామం చూస్తారే, అదేనా అన్నారు. నేను అవును అన్నాను. దానికి పూర్తి సమయ కార్యకర్త ఎందుకు? ప్రశ్న. సంఘంలో కనపడే కార్యక్రమం గంట సేపే కాని దృఢమైన సంస్థను నిర్మాణం చేయాలంటే ఇలాస్టి వారు కావాలి. పరిచయం అయిన ప్రతీ వాడు సంఘానికి నిరంతరం, జీవితాంతం పని చేయడానికి అలా కొంత మంది అయినా పని చేయాలండి, మా కార్యకర్త జవాబు. వారు కన్విన్స్ కాలేదు. ఫర్వాలేదు. వీరు లా చదువుకున్నారు అన్నాడు మా కార్య కర్త. మీరు సమయం వృధా చేస్తున్నారు, అన్నారాయన. నేను చిన్నగా నవ్వి సెలవు తీసుకున్నాను. మా జిల్లా ప్రచారక్ M Sc. Chemistry. వారు చేసే పని పిల్లలను శాఖా పనిలో నియుక్తులను చేయడం. వాళ్లకు వాళ్ళ డబ్బులతో యూనిఫామ్ కుట్టించుకునేట్లు చేయడం, పాట, ప్రార్థన కంఠస్థం చేయించడం, రోజూ శాఖకు తీసుకు రావడం. దీనికి ఇంత చదువు కున్నవాడు కావాలా? అనిపిస్తుంది. దేశం పై శ్రద్ధ నిర్మాణం చేయడం కి అటువంటి వాళ్ళు, బ్రహ్మ చారులుగా తమ జీవితం ఇస్తేనే వారి నుండి ప్రేరణ పొందే పిల్లలు శ్రద్ధా వంతులు అవుతారు. 70 సంవత్సరాల చరిత్ర అంతా అటువంటి శ్రద్ధా పూర్వక కార్య కర్తలు వల్లే.

ఒక దీపం నుండి మరొక దీపం వెలుగుతుంది. అదే చైతన్య దీప్తిని రగిలిస్తుంది. ఇది సంఘ ప్రాక్టికల్ అప్రోచ్.

నాగపూర్ లో మొదలైన ఒక శాఖ ఈ రోజు 55000 శాఖలకు చేరింది. అన్ని రాష్ట్రాలలో, వాటిల్లో అన్ని జిల్లాలలో, అన్ని తాలూకాలో, దాదాపు అన్ని మండలాల్లో స్వచ్చందంగా, వారి ఖర్చులు వారే భరించే విధంగా, మళ్లీ సంఘ పెరుగుదలకు కష్టపడి వారే గురుదక్షిణగా సమర్పించే లక్షలాది సభ్యులు ను నిరంతరమ్ తయారు చేస్తూఎదుగుతున్న సంస్థ, సంఘం. నమ్మాలనిపిస్తుందా? సంఘం లో కొచ్చిన వారికి ఈ నిజం తెలుసు. మీరూ చేరి ఈ సమార్పిత దేశ భక్తులవ్వండి.

ఇన్నేళ్ల సంఘం లో దేశం నాకేం ఇచ్చింది అని అడగడం నేర్పించదు. దేశానికి నేనేమి ఇవ్వాలో ఆలోచింప జేస్తుంది. నేనదే నేర్చు కున్నాను. అదే నేర్పుతున్నాను.
Read More

Thursday, 15 June 2017

ఇది వాల్మికి రామాయణము లోనిది కాదు. హనుమద్వైభవము తెలుపునది కావున మరోసారి చెపుతాను..

ఇది వాల్మికి రామాయణము లోనిది కాదు. హనుమద్వైభవము తెలుపునది కావున మరోసారి చెపుతాను..
.
శ్రీరామ పట్టాభిషేకమునకు ఏర్పాట్లలో స్వామి హనుమ అన్నిటా తానై మునిగి తేలుతున్నాడు. ప్రపంచము నలుమూలలనుండి రాజులు అయోధ్యకు తరలి వస్తున్నారు. వారికి రాజప్రాసాదాలలో వసతులు, ఆహారపానీయాదులు సరైన సమయానికి అందుతున్నాయో లేదో కనుక్కుంటూ స్వామి హనుమ క్షణం తీరికలేకుండా శ్రమిస్తూన్నాడు. పైగా కోట్లాది వానర వీరులను వివి
ధ పనులలో నియంత్రించడము సామాన్యమైన విషయం కాదు గదా! ఇదంతా తల్లి సీతమ్మ గమనిస్తూ
స్వామి హనుమను పిలిచి " నాయనా శ్రీరామ పట్టాభిషేకము నీవు అనుకున్నట్లుగా సవ్యంగానే జరుగుతుంది. ముందు నీవు భోజనము చెయ్యి. నాలుగు ముద్దలు నీకు వడ్డిస్తాను. ఇలారా నాయనా! ఇలా కూర్చుని నేను వడ్డించే పదార్ధములు తృప్తిగా ఆరగించు!" అని ఆప్యాయంగా పిలిచించింది. సీతామాత అలా అప్యాయంగా పిలిచేసరికి స్వామి హనుమ కాదనలేక మాత వడ్డించిన ఆహారపదార్ధములు ఆరగించటము ప్రారంభించాడు. మాత వడ్డన, స్వామి ఆరగింపు సాగుతునే ఉన్నాయి. కోట్లాది అతిధులకై చేయించిన ఆహారపదార్ధములు " వడ్డించమ్మా! వడ్డించు" అని మెచ్చుకుంటూ స్వామి హనుమ ఇట్టే స్వాహా చేసేస్తున్నాడు. మాత సీత కంగారు పడుతూ చెలికత్తెలను పరుగులు తీయిస్తోంది. వారు ఇతర ప్రసాదాల వంటకాలు తరలిస్తూనే ఉన్నారు. అన్ని వంటకాల పాత్రలు ఖాళీ అవుతున్నాయి. శ్రీరామచంద్రుడు అక్కడ జరుగుతున్న సమాచారం తెలుసుకుని వచ్చి గోడవారగా నిలబడ్డాడు. సీతామాత ఆయన దగ్గరకు వెళ్ళి " అనంతమైన ఆహారపదార్ధములు హనుమ క్షుద్బాధ తీర్చలేక పోతున్నాయి. స్వామీ! ఏమి స్వామి! తరుణోపాయం చెప్పండి! " అని చేతులు జోడిస్తే, అప్పడు శ్రీరాముడు " సీతా! హనుమ అనుకుంటే ఎవరు అనుకున్నావు? రుద్రాంశ సంభూతుడు. నిన్ను, నన్ను కాపాడటానికి ఈ భువికి దిగిన పరమేశ్వరుడు. ఆయనకు పంచాక్షరీ మంత్రము మనస్సున తలచుకొని ఒక ముద్ద వడ్డించు. ఆయన తృప్తి పడతాడు" అని ఉపదేశిస్తాడు. సీతామాత ఒక ముద్ద చేతిలో తీసుకుని " నిన్ను సామాన్యునిగా తలచి, మాయలో పడ్డాను. నీ తల్లిని క్షమించు తండ్రీ! ఓం నమ:శివాయ" అంటూ స్వామి హనుమ విస్తరిలో వడ్డిస్తుంది. స్వామి హనుమ ఆ ముద్ద తృప్తిగా ఆరగించి " శ్రీరామా తృప్తాత్మా! " అంటూ త్రేన్చి ఉత్తారోపసనం చేసి " అన్నదాతా! సుఖీభవ! ! " అని భోజనం ముగిస్తాడు. ఆయన అలా అనగానే ఖాళీ అయిన ఆహారపదార్థాలు యధాతధంగా ఆయా పాత్రలలో వచ్చి చేరాయి.
Read More

Powered By Blogger | Template Created By Lord HTML