నరముఖ వినాయకుడు, సుముఖ వినాయకుడు
సుముఖ
వినాయకుడు నర ముఖముతోనే జన్మించారు. కానీ గజాసురుడు అనే రాక్షసుడుకి, ముఖ భాగము గజము క్రింది భాగము నరుడు అయిన రూపము కల వాని చేతి లోనే మరణించాలని వరము ఉండడముతో ఈశ్వరుడు, నర ముఖము తొలగించి గజముఖముతో ప్రాణ ప్రతిష్ట చేసారుట. ఆ తరువాత వినాయకుడు ఆ రాక్షసుడిని సంహరించారుట.
లోకకల్యాణము కొరకు తన తలను తీసివేసి, ఏనుగు తలను ధరించారు కనుక సుముఖము అన్నారు. ఏ ముఖము ప్రసన్నముగా, సంతోషముగా, లోక హితము కోరుతుందో, ప్రేమగా ఉంటుందో ఆ ముఖము “సుముఖము” అని, కావున ఉదయాన్నే నిద్ర లేవగానే వినాయకుని ముఖమును చూసి నమస్కరిస్తే లక్ష్మీ కటాక్షము సిద్ధిస్తుంది అని అంటారు.
లక్ష్మీదేవి 5 ప్రదేశాలలో స్థిర నివాసము ఉంటుంది.
1. ఏనుగు కుంభ స్థలములో
2. ఆవు వెనుక తట్టులో
3. తామర పువ్వులో
4. బిల్వ దళములో
5. పాపిట బొట్టు పెట్టుకునే స్థలములో ఉంటారని అంటారు.
చిదంబరములోను, తిరుచ్చిలోను నర వినాయక విగ్రహాలు ఉన్నాయి. కానీ, జాగ్రత్తగా పరిశీలిస్తేగాని గుర్తుపట్టడము కష్టము. ఎందుకంటే ఆయన నరముఖముతోఉంటారు కనుక, మనకి గజముఖము మాత్రమే తెలుసు కనుక.
No comments:
Post a Comment