
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 29 December 2016
పితృకర్మలు కర్మలు
పితృకర్మలు కర్మలు ఎందుకు చేయాలి ?
వేదబోధిత కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి . నవమాసాలు కడుపులో పెట్టుకొని , రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లికి , పాతికేళ్ళవరకు కంటికి రెప్పలా కాపాడి పోషణభారము వహించిన తండ్రికి క్రుతజ్ఞత చూపడము మానవత్వము ... విశ్వాసము ఉన్నట్లయితే వారికి ఉత్తరగతులు కల్పించడం విధి .
శ్లోకం : "దేవకార్యదపి సదా పితృకార్యం విశిష్యతే "
దేవ కార్యాలు కంటే పితృకార్యాలు చాలా ముఖ్యమైనవి. పితృకర్మలు, పితృతర్పణలు చేసిన వారికి దేవతలు కూడా గొప్ప ఫలాలనిస్తారు అనగా దేవ కార్యాలను వదిలి వేయాలని చెప్పడం కాదు. పితృకార్యాలు మాని ఎన్ని పూజలు, స్తోత్రాలు, జపాలు చేసినా ఫలం లేదు పితృకార్యాలు చేసిన వారికే దేవ కార్యాలు ఫలిస్తాయి. అబీష్టసిద్దికి, వంశ వృద్దికి, సంతాన క్షేమానికి పితృకార్యాలు ప్రధానం.
మనం తల్లితండ్రుల ఆస్తిపాస్తులనే కాక వారి ఆదర్శాలను పాటించుచు, సత్కీర్తిని పొందుతూ తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలి. వీటి కోసమే మాసికాలు, ఆబ్దీకాలు నిర్దేశించ బడ్డాయి. మాసికం అంటే మరణించిన సంవత్సరం లోపు ప్రతీ నెలా వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికం. ఆబ్దీకం అంటే ప్రతి సంవత్సరం ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి నాడు జరిపించేదే ఆబ్దీకం.అంటే నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రియంగా జరిపించి, మంత్రాలతో ఆవాహన చేసుకొని వివిధ దానాలు చేసి సత్కరించటం మన విధి. అంటే మనం ఆ తిథి నాడు అందించిన ఆహారాదులు మాసికం అయితే నెల వరకు, ఆబ్దీకం అయితే సంవత్సరం వరకు పితృదేవతలకు సరిపోతాయని మన నమ్మకం.
మనం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లితండ్రులు మన అవసరాలను అనుక్షణం ఏ విధంగా తీర్చారో ఆ విధంగానే మనం వారు ఈ లోకం వీడిన తర్వాత కూడా మనం అంతే భాద్యతతో మన కర్తవ్యం మనం నెరవేర్చి వారికి మాసికాలు ఆబ్దీకాలు పెట్టాలి.
పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే , లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రం లో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.
ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు , వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబం లో స్త్రీ కి చిన్న వయసు లో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యం గా సంతాన భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితం లో పితృఋణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది.
మృత్యువు తరువాత సంతానము వారి తండ్రి గారికి శ్రార్ధము చేయని ఎడల లేదా వారి జీవితావస్థను అనాదరణ చేసిన ఎడల పునర్ జన్మలో వారి కుండలిలో పితృ దోషము కలుగును.సర్ప హత్య లేదా ఏదైనా నిరపరాధిని హత్య చేసినా కూడా పితృ దోషము కలుగును.
పితృ దోషమును నివారించుటకు నియమించ బడ్డ పితృ కార్యములు చేయవలెను పితృ పక్షములో శ్రార్దము చేయవలెను.నియమిత కాకులకు మరియు కుక్కలకు భోజనము పెట్టవలెను. వట వృక్షమునకు నీరు పోయవలెను. భ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. గోవును పూజించవలెను. విష్ణువును పూజించుట లాభదాయకము.
Read More
వేదబోధిత కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి . నవమాసాలు కడుపులో పెట్టుకొని , రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లికి , పాతికేళ్ళవరకు కంటికి రెప్పలా కాపాడి పోషణభారము వహించిన తండ్రికి క్రుతజ్ఞత చూపడము మానవత్వము ... విశ్వాసము ఉన్నట్లయితే వారికి ఉత్తరగతులు కల్పించడం విధి .
శ్లోకం : "దేవకార్యదపి సదా పితృకార్యం విశిష్యతే "
దేవ కార్యాలు కంటే పితృకార్యాలు చాలా ముఖ్యమైనవి. పితృకర్మలు, పితృతర్పణలు చేసిన వారికి దేవతలు కూడా గొప్ప ఫలాలనిస్తారు అనగా దేవ కార్యాలను వదిలి వేయాలని చెప్పడం కాదు. పితృకార్యాలు మాని ఎన్ని పూజలు, స్తోత్రాలు, జపాలు చేసినా ఫలం లేదు పితృకార్యాలు చేసిన వారికే దేవ కార్యాలు ఫలిస్తాయి. అబీష్టసిద్దికి, వంశ వృద్దికి, సంతాన క్షేమానికి పితృకార్యాలు ప్రధానం.
మనం తల్లితండ్రుల ఆస్తిపాస్తులనే కాక వారి ఆదర్శాలను పాటించుచు, సత్కీర్తిని పొందుతూ తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలి. వీటి కోసమే మాసికాలు, ఆబ్దీకాలు నిర్దేశించ బడ్డాయి. మాసికం అంటే మరణించిన సంవత్సరం లోపు ప్రతీ నెలా వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికం. ఆబ్దీకం అంటే ప్రతి సంవత్సరం ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి నాడు జరిపించేదే ఆబ్దీకం.అంటే నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రియంగా జరిపించి, మంత్రాలతో ఆవాహన చేసుకొని వివిధ దానాలు చేసి సత్కరించటం మన విధి. అంటే మనం ఆ తిథి నాడు అందించిన ఆహారాదులు మాసికం అయితే నెల వరకు, ఆబ్దీకం అయితే సంవత్సరం వరకు పితృదేవతలకు సరిపోతాయని మన నమ్మకం.
మనం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లితండ్రులు మన అవసరాలను అనుక్షణం ఏ విధంగా తీర్చారో ఆ విధంగానే మనం వారు ఈ లోకం వీడిన తర్వాత కూడా మనం అంతే భాద్యతతో మన కర్తవ్యం మనం నెరవేర్చి వారికి మాసికాలు ఆబ్దీకాలు పెట్టాలి.
పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే , లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రం లో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.
ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు , వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబం లో స్త్రీ కి చిన్న వయసు లో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యం గా సంతాన భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితం లో పితృఋణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది.
మృత్యువు తరువాత సంతానము వారి తండ్రి గారికి శ్రార్ధము చేయని ఎడల లేదా వారి జీవితావస్థను అనాదరణ చేసిన ఎడల పునర్ జన్మలో వారి కుండలిలో పితృ దోషము కలుగును.సర్ప హత్య లేదా ఏదైనా నిరపరాధిని హత్య చేసినా కూడా పితృ దోషము కలుగును.
పితృ దోషమును నివారించుటకు నియమించ బడ్డ పితృ కార్యములు చేయవలెను పితృ పక్షములో శ్రార్దము చేయవలెను.నియమిత కాకులకు మరియు కుక్కలకు భోజనము పెట్టవలెను. వట వృక్షమునకు నీరు పోయవలెను. భ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. గోవును పూజించవలెను. విష్ణువును పూజించుట లాభదాయకము.
బ్రహ్మం గారి కాలజ్ఞాన అంశాలు
బ్రహ్మం గారి
కాలజ్ఞాన అంశాలు
1)వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి ఔతారు. మనుషులు వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు వారికి డబ్బే ప్రధానం ఔతుంది.
2)రాజులు తమ ధర్మాన్ని మరచి విందులూ వినోదాలలో మునిగి ధర్మ భ్రష్టూలౌతారు.
3)శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం ఔతారు.
4)పంటలు సరిగా పండక పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది.
5)బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించటం వలన దేశం కల్లోలితమౌతుంది.
6)చోళమండలం నష్టాలపాలౌతుంది.
వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దూషిస్తారు.
7)ప్రజలు కొరువులను నోట పెట్టుకుని తిరుగుతారు.కొడలు మండుతాయి.
8)జనుల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ, రోగాల పాలై జనులు మరణిస్తారు. జంతువులూ అలాగే చస్తాయి.
9)దుర్మార్గులు రాజులౌతారు. మంచి ప్రవర్తాన కలవారు భయంకర కష్టాలపాలై హీనంగా మరణిస్తారు.
10)మతకలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు.
11)అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి.
12)నీళ్ళతో దీపాలను వెలిగిస్తారు.
ఇతర దేశస్తులు భారతదేశాన్ని పాలిస్తారు.
13)మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు.
14)పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతువౌతాయి.
15)ఒకరి భార్యను ఒకరు వశపరచుకుంటారు. స్త్రీ పురుషులిర్వురూ కామపీడితులౌతారు.
16)వేంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు.
17)ఐదువేల ఏళ్ళ తరువాత కాశీలో గంగ కనిపింకుండా మాయమై పోతుంది.
18)చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమౌతాయి.
19)కృష్ణానది మధ్య బంగారు తేరు పుడుతుంది. అది చూసినవారికి కండ్లు పోతాయి.
20)ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది.
21)ఐదువేల ఏళ్ళ తరువాత నేను వీరభోగ వసంతరాయలుగా అవతరించి ధ్ర్మాత్ములను కాపాడి పాపాత్ములను శిక్షిస్తాను. నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు.
22)వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు.
23)కృష్ణా గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి.
24)తూర్పు నుండి పడమరకు ఒక యోజనము ప్రమాణం వెడల్పుగా ఆకాశంలో చెంగావి చీర కట్టినట్లు కనపడుతుంది.
25)ఎంతో మందిమార్బలం ఉన్నా రాజులు సర్వనాశనమైపోతారు.గ్రామాలలో చోరులు పెరిగిపోతారు.
26)పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి.
విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారు.
27)రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తామ చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి.
28)శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది భ్రమరాంబ గుడిలో దూరి ఎనిమిది రోజులుండి మేకలా కూసి మాయమౌతుంది.
29)శ్రీశైలంలో అగ్ని వర్షం పుడుతుంది. గుగ్గిళ్ళ బసవన్న(నందీశ్వరుడు)రంకెలు వేస్తాడు ఖణ ఖణమని కాలు దువ్వుతాడు.
30)సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది.
31)విషవాయువు కొట్టినప్పుడు శివునికంట నీరు కారుతుంది.
32)గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వానకురుస్తుంది.
33)సూర్య్డు చంద్రుడు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి. నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడు. అతడు నేనే దేవుడినని నన్ను పూజించండి అని పలుకుతాడు.
34)నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది.
35)విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది.అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది.అది మొదలు దేశంలో తీవ్రమైన కరువుకాటకాలు ఏర్పడతాయి.
36)ఈ కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి.ఆధాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు.జనులు అరచి అరచి చస్తారు.
37)కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవుకూడా మిగలదు.
38)బనగాన పల్లె నవాబు పాలనకూడా క్రమంగా నాశనమౌతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది.
39)నేను శ్రీ వీరభోజ్యుడినై ఈ ప్రపంచంలో ఉద్భవిస్తాను. కలియుగం 5000 సంవత్సరములు గడిచిన తరువాత దుష్ట శిక్షణ శిష్ట రక్షనార్ధం వస్తాను.
నేను వచ్చే ముందు సంభవించే పరిణామాలు విను.
40)ఉప్పుకొడూరులో ఊరచెరువులో ఉత్పాతాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించి పోతారు.
41)14 నగరాలను జలప్రవాహాలు ముంచెత్తుతాయి. నేను రావటానికి ఇది ప్రబల నిదర్శనం.
44)నాలుగు వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుని మరణిస్తారు.
45)5972 ధాతు నామ సంవత్సరాన మాఘ శుద్ధ బుధవారం రోజున పట్ట పగలే 18 పట్టణాలు దోపిడీకి గురౌతాయి.
46)కోటిదూపాటిలో కొచ్చర్లకోటలో కోడి మాట్లాడుతుంది. జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ము దిగమ్రింగి అబద్ధాలాడి బాకీలు ఎగకొడతారు.
47)కోమటి కులంలో 25 గోత్రాలవారు మాత్రం మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ భేరీ కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు.
48)మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది.
49)పట్ట పగలు ఆకాశంలోనుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు.
50)పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుంది.
51)బనగాన పల్లెలో కాలజ్ఞాన పాతర మీద వేపచెట్టుకు చేమంతిపూలు పూస్తాయి.
52)గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు. బనగాన పల్లె నవాబు కొంతకాలం మాత్రమే పాలన చేస్తాడు.ఆ తరువాత బనగాన పల్లెను ఇతరరాజులు స్వాధీనపరచుకుంటారు.
53)అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది.అందువల్ల ఎందరో నష్టపోతారు.
54)గోలుకొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణం ఏలుతారు.
55)మహానంది మరుగున మహిమలు పుడతాయి.
56)నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను. నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు మేమే వీరభోజ వసంతరాయలమని చెబుతారు. నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు. మూఢులు మాత్రం నమ్ముతారు.
56)మరొక విచిత్రం పుడుతుంది. వీపున వింజామరలు అరికాలున తామరపద్మం కలిగినవారు వస్తారు. వారిని చూసి నేనని భ్రమపడవద్దు. నారాకకు గుర్తు ఏమిటంటే కందిమల్లయ పల్లెలో నవరత్న మండపం కడతారు. ఆ పల్లెపెరిగి పట్టణంగా మారుతుంది.
57)కంచి కామాక్షమ్మ కన్నులవెంట నీరు కారుతుంది. ఈ సంఘటన తరువాత వందలాది మంది మరణిస్తారు.
58)ఆవు కడుపులోని దూడ అదేవిధంగా బయటకు కనిపిస్తుంది.
59)పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు.
60)కృష్ణ గోదావరుల మధ్య మహాదేవుడను పేర శైవుడు జన్మించి మతభేదం లేక గుడులూ గోపురాలు నిర్మించి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. ఊరూరా గ్రామ దేవతలు ఊగిసలాడతారు.
61)కాశీ కుంభకోణ గోకర్ణ క్షేత్రాల మహిమలు తగ్గి పోతాయి. కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది.
62)ఆనంద నామ సంవత్సరాలు పదమూడు గడిచేవరకూ ఈ నిదర్శనాలు కనిపిస్తుంటాయి.
63)పతివ్రతలు పతితలౌతారు. వావి వరసలు పాటించకుండా ప్రవర్తిస్తారు. ఆచారాలన్నీ సమసి పోతాయి.
64)రాయలవారి సింహాసనం కంపిస్తుంది. కురుమ సంతతి రాజులందరినీ జయించి దక్షిణంగా బోయి రామేశ్వరం దిక్కున రాయల దళాలను తరిమి యుద్ధాలు చేసి నర్మదానదిలో కత్తులు కడిగి కాశీకి వచ్చి రాయల తల చూస్తారు. ఈ సమయంలో హస్థినాపురిలో మహామారి అనేశక్తి పుడుతుంది. రామేశ్వరం వరకు ప్రజలను నాశనం చేస్తుంది. రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది.
65)శ్రీశైల క్షేత్రాన కల్లు, చేపలు అమ్ముతారు. వేశ్యాగృహాలు వెలుస్తాయి. మందుమాకులకు లొంగని వ్యాధులు ప్రబలుతాయి. స్త్రీ పురుషులంతా దురాచార పరులౌతారు. స్త్రీలు భర్తలను దూషిస్తారు.
66)ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు.
67)వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవ మతం తగ్గి పోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలుతాయి. బెండ్లు మునుగుతాయి. చివరకు శివశక్తి అంతా లేకుండా పోతుంది.
68)విజయనగరాన కోటలో రాయల సింహాసనం బయట పడుతుంది. ఇందుకు గుర్తుగా గ్రామంలో రాతి విగ్రహాలు ఊగిసలాడతాయి. అప్పుడు బిజ్జల రాయుని కొలువులో రాయలసింహాసనం బయట పడుతుంది.
ఇలా బ్రహ్మంగారు కడపనవాబుకు కాలజ్ఞానంబోధించి, మంత్ర దీక్ష ఇచ్చి ఆశీర్వదించాడు.
పుష్పగిరిసవరించు
నేను కలియుగం 5,000 సంవత్సరంలో వీరభోగవసంత రాయలుగా దుష్ట శిక్షణా, శిష్టరక్షణార్ధం భూమిపై అవతరిస్తాను. మార్గశిర మాసంలో దక్షిణభాగంలో ధూమకేతువనే నక్షత్రం ఉదయించి అందరికీ కనపడుతుంది. క్రోధినామ సంవత్సరమున మార్గశిర శుద్ధ పంచమి రోజున పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో నేను అవతరించే సమయంలో దక్షిణాన ఒక నక్షత్రం పుడుతుంది. అది జరగబోయే వినాశనానికి సూచన అని గ్రహించాలి.
నాలుగు వర్ణాలు మద్యపానంతో భ్రష్టులౌతారు.
వేదములు అంత్య జాతుల పాలౌతాయి. విప్రులు కులహీనులై తక్కువ కులస్థుల పంచన చేరుతారు. విప్రులు విధవా వివాహాలు చేస్తారు. స్వవృత్తి, ధర్మాలు మాని ఇతరులకు బానిస వృత్తి చేస్తారు.
బ్రాహ్మణులను పిలిచేవారు ఉండరు. బ్రాహ్మణులు ఇతర విద్యల కోసం పంటభూములు అమ్ముకుంటారు. నేను వచ్చేసరికి వారికి తిండి గుడ్డ కరువు ఔతాయి. మీనరాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీరభోగ వసంత రాయలుగా ఉద్భవిస్తాను. నాలుగు మూరల ఖడ్గం చేత పట్టి శ్రీశైల పర్వతం మీదకు వచ్చి అక్కడి ధనం అంతా పుణ్యాత్ములైన వారికి దానం చేస్తాను.
నేను భూమి మీదకు ఎలా వస్తానో మరొకసారి చెప్తాను వినండి. కేదారి వనంలో నిరాహారినై జపము చేస్తాను. మూడు వరాలు పొంది అక్కడి నుండి విక్రమ నామ సంవత్సరం చైత్రశుద్ధ దశమి బుధవారం ఇంద్రకీలాద్రి పర్వతం చేరుకుని తపసు చేసి అక్కడ మహామునులను, మహర్షులను దర్శనం చేసుకుంటాను. అటు నుండి బయలుదేరి శ్రీశైలం మల్లిఖార్జునుని సేవించి దత్తాత్రేయుడిని దర్శనం చేసుకుంటాను. మహానందిలో రెండు రోజులుండి అక్కడి నుండి శ్రావణ శుద్ధ పౌర్ణమినాటికి నారాయణపురం చేరుకుని అక్కడ కొంతకాలం నివసిస్తాను.
నేను తిరిగి వచ్చేసరికి జనులు ధనమధాంధులు, అజ్ఞానులై కొట్టుకు చస్తారు.
నా రాకకు ముందు సముద్రంలోని జీవరాశులన్నీ నశిస్తాయి. పర్వతాలమీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండలను పగుల కొడతారు.
కాశీదేశంలో కలహాలు చెలరేగుతాయి.
నేను వచ్చేసరికి విధవావివాహాలు జరగటం మామూలై పోతుంది.
వావి వరసలు లేకుండా వివాహాలు జరుగుతాయి. కుల గోత్రాలు నీతి జాతీ లేని పెళ్ళిళ్ళు జరుగుతాయి. పార్వతీ అవతారాలను డబ్బులకు అమ్ముకుంటారు.
అరణ్యంలోనూ భూమిలోనూ ధనం ఉండేను. నేను భూమిపై పెక్కు దృష్టాంతాలు పుట్టిస్తాను. పాతాళంలో నీరు ఇంకిపోతుంది. భూమిపై మంటలు పుడతాయి.
నాలుగు సముద్రాల మధ్య ఉన్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది. నూట ఇరవై తిరపతులు పాడయ్యేను.
నా రాకకు ముందు అనేక చిత్రములు జరిగేను. శృంగేరి,పుష్పగిరి పీఠములు పంచాననం వారి పాలౌతాయి.
ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి. తూర్పు దేశం ధూళి అయిపోతుంది.
హరిద్వారంలోని మర్రి చెట్టుపై మహిమలు పుడతాయి. అక్కడి దేవాలయం తలుపులు మూసుకుంటాయి.
అహోబిలంలో ఉక్కు స్థంభానికి కొమ్మలు పుట్టి జాజిపూలు పూస్తాయి.
నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు. నన్ను నమ్మిన వారికి నా రక్షణ కలుగుతుంది.
వైశాఖ శుద్ధ పంచమిన నేను బయలుదేరి సూర్యమండలం నుండి కొలువు పాకకు వస్తాను. అక్కడి నుండి అహోబిలం, తర్వాత సూర్యనంది చేరుకుంటాను.
శ్రీకృష్ణ నిర్యాణం ఆదిగా 4,999 సంవత్సరాలకు కలిరూపం కొంత నాశనం ఔతుంది.
శ్రీశైలాన పొగమంటలు పుడతాయి. బసవడు నాట్యమాడ 'గణ గణ'మని గంటలమోత వినబడుతుంది.
బ్రమరాంభ దేవాలయంలో ఒక ముసలి 7 రోజులుండి అదృశ్యం అవుతుంది. బ్రమరాంభ మెడలోని మంగళసూత్రాలు తెగి పడిపోతాయి. ఆమె కంట నీరు కారుతుంది. పాలిండ్లనుండి పాలుకారుతాయి.
కందనూరి గోపాలుని గుడి ముందు చింతచెట్టు పుడుతుంది. మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది. దేవాలయంలో రెండు పాములు తిరుగుతాయి. వాటిలో పెద్ద పాము శిఖరాన మూడు రోజులుండి అదృశ్యమౌతుంది.
సూర్యనందీశ్వరుని ముందట పనసమాను పుడుతుంది. ఆ చెట్టు ఆ క్షణాన పూలుపూచి, కాయలుకాచి,పండ్లు పండి వెనువెంటనే మాయమౌతుంది.
శిరువెళ్ళ నరశింహుని దుట గంగిరావిచెట్టు మొలుస్తుంది. బహుధాన్య నామ సంవత్సర వైశాఖ శుద్ధ తదియ శుక్రవారం నాడు పల్లెకు తురకలు వస్తారు.
బసవన్న రంకె వేస్తాడు. తిరువళ్ళూరు వీరరాఘవస్వామికి చెమటలు పడతాయి. భద్రకాళి కంపస్తుంది. కంచి కామాక్షమ్మ దేహాన చెమట పడుతుంది. కంట నీరు,పాలిండ్ల పాలూ కారుతాయి.
శాలివాహన శకం 1541న ధూమకేతువు పుడుతుంది. 1555నాటికి వివిధ దేశాలలో జననష్టం కలుగుతుంది.
పెమ్మసాని తిమ్మన్న వంశం నిర్వంశమయ్యేను. ఉదయగిరి, నెల్లూరు రూపు మాసి పోయేను. గండికోట, గోలకొండ, ఆదలేని, కందనూరు పట్టణాలు నశించి తురకలు పారి పోతారు. విజయపురంలాంటి పట్టణాలు క్షయనామ సంవత్సరం నాటికి నశించేను.
స్త్రీల కంట నెత్తురు బిందువులు రాలుతాయి. వడగండ్ల వాన కురుస్తుంది. బాణవర్షం కురుస్తుంది. బావులూ, చెరువులూ, నదుల నీరు ఇంకినా జజ్జేరు నీరు మాత్రం ఇంకిపోదు.
పంచాననంవారికి జ్ఞానబోధసవరించు
మహానందికి ఉత్తరాన అనేక మంది మునులు పుట్టుకు వస్తారు. భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు.
నేను వచ్చేసరికి బ్రాహ్మణులు వర్ణసంకర వృత్తులు చేస్తూ తమ వైభవం కోల్పోతారు. ఏ కులంవారు కూడా బ్రాహ్మణులను గౌరవించరు. సిద్దులూ యోగులూ జన్మించిన ఆ బ్రాహ్మణ కులం పూర్తిగా వర్ణసంకరమౌతుంది.
ఆనాటికి ప్రజలలో దుర్బుద్ధులు అధికమౌతాయి.
కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుంది.
రాజాధిరాజులు అణిగి ఉంటారు. శూద్రులు వలాసాలను అనుభవిస్తూ రాజుల హోదాలో ఉంటారు. వారి ఇంట ధనలక్ష్మీ నాట్యమాడుతుంది. నా భక్తులైన వారికి నేనప్పుడే దర్శనమిస్తాను. కానివారి నెత్తురు భూమి మీద పారుతుంది. దుర్మార్గుల రక్తంతో భూమి తడుస్తుంది. భూభారం కొంత తగ్గుతుంది.
చీమలుండు బెజ్జాల చోరులు దూరుతారు. స్త్రీలందరూ చెడుతలపుతో ఉంటారు. అందువలన చోరులు ప్రత్యేకంగా కనపడరు. బిలం నుండి మహానంది పర్వతం విడిచి వెళుతుంది. గడగ్ లక్ష్మీపురం, రాయచూర్, చంద్రగిరి అలిపేది, అరవరాజ్యం, వెలిగోడు, ఓరుగల్లు, గోలుకొంక్ల్డల్క్ల్క్ల్ మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. నా మఠంలో ఏడుసార్లు దొంగలు పడతారు. క్షత్రియులు అంతరిస్తారు. చలననేంద్రియములు, ఆయుధాలచేత బాణముల వల్ల నశిస్తారు.
గతజన్మ వృత్తాంతంసవరించు
ఒకకరోజు సిద్ధయ్య బ్రహ్మంగారితో "స్వామీ! మీరు గతంలో త్రేతా, ద్వాపర యుగంలో కూడా జన్మించానని చెప్పారు. మీ పూర్వ జన్మ వృత్తాంతం నాకు వివరిస్తారా?" అని అడిగాడు. బదులుగా బ్రహ్మంగారు "నా గతజన్మల గురించిన వివరములు రహస్యములే అయినా, నీకు మాత్రం వివరించగలను. అని తన పూర్వ జన్మల గురించి చెప్పడం ప్రారంభించారు.
"బ్రహ్మలోకంలో నేను భైరవుడనే పేరుతో అనేక బ్రహ్మ కల్పాలు రాజ్యపాలన చేసాను. ఆ తరువాత వెండి కొండ మీదకు వెళ్ళి 54 బ్రహ్మ కల్పాలు రాజ్యపాలన చేశాను. అప్పుడే మూడు యోజనాల పొడవైన సింహాసనమును నిర్మించి 290 బ్రహ్మ కల్పాలు విష్ణు సేవ చేశ్శాను. నేను చేసిన సేవలను గుర్తించిన మాధవుడు నాకు 'పంచవిద ముక్తి' అనే వరం ఇచ్చాడు. ఆ తరువాత సిద్ధాంత శిరోమణి ఆనందాశ్రితువు ఆశ్రమం వద్ద అన్ని విద్యలు అభ్యసించి మూడేళ్ళ తరువాత అనేక యోగశాస్త్ర విద్యలను నేర్చుకున్నాను. 12,000 గ్రంధములు పఠించి అందులోని అన్ని మర్మములు గ్రహించాను. వీటి ఫలితంగా నేను అకాలమృత్యువును జయించే శక్తిని సంపాదించాను. ఆ తరువాత నా యోగబలం వలన దివ్య శరీరం ధరించి మూడు వేల బ్రహ్మకల్పాలు చిరంజీవిగా ఉన్నాను. ఆతరువాత నా అవతారముల గురించి వివరముగా తెలుపుతున్నాను విను. మొదట అవతారమెత్తి ఆనందాశ్రితులకు శిష్యుడిగా 99,662 బ్రహ్మ కల్పాలు ఉన్నాను, మూడవ అవతారంలో 1,09,00,000 బ్రహ్మ కల్పాలు ఉన్నాను. నాల్గవ అవతారములో 1,00,01,317 కల్పాలు ఉన్నాను. అయిదో అవతారంలో 4కోట్ల పదఞాలుగు లక్షల 55 వేల బ్రహ్మకల్పాలు ఉన్నాను. ఆరవ అవతారంలో ఆరు వందల బ్రహ్మ కల్పాలు ఉన్నాను. ఏడవ అవతారంలో 27,63,03,400 బ్రహ్మ కల్పాలు జీవించాను. ఎనిమిదో అవతారంలో 22,60,000 బ్రహ్మ కల్పాలు ఉన్నాను. పదవ అవతారంలో కనిగిరిలో ఉన్నాను ఆ జన్మలో 70 లక్షల బ్రహ్మ కల్పాలు జీవించాను. ఇప్పుడు బనగాన పల్లెలో వీరప్పయాచార్యుడనై 125 సంవత్సరములు తపసు చేశాను. వీరబ్రహ్మేంద్ర స్వామిగా మొత్తం 175 సంవత్సరములు జీవించి జీవసమాధి పొందుతాను."
నేను చనిపోయేలోగానే హరిహరరాయలు మొదలు రామరాయల వరకు చరిత్ర అంతమౌతుంది.
ఆ తరువాతకాలంలో ఈ అఖండం మహమ్మదీయుల వశమౌతుంది.
శ్వేతముఖులు భరతఖండాన్ని పాలిస్తారు.
పల్నాటిసీమలో నరులు పచ్చి ఆకులు తిని జీవిస్తారు.
మొగలాయి రాజ్యాన ఒకనది పొంగి చేలు నాశనమైన రీతిగా జనాన్ని నశింపచేస్తుంది.
వ్యభిచార వృత్తి అంతరించి పోతుంది. ఆ వృత్తిలోని వారు వివాహం చేసుకుని కాపురం చేస్తారు.
గురువులు ఆడంబరంగా జీవిస్తారు.
కుటుంబంలో సఖ్యత ఉండదు. తల్లి, తండ్రి, పిల్లలు మధ్య వాత్సల్యాలు ఉండవు. ఒకరిని ఒకరు మీద ఒకరికి నమ్మకం నశిస్తుంది.
నారాకకు ముందు నా భక్తులు వారి శక్త్యానుసారం నాధ్ర్మ పాలనకు అంకురార్పణ చేస్తారు. అని సిద్ధయ్యకు బ్రహ్మంగారు వివరించాడు.
కర్నూలు నవాబుకు జ్ఞానబోధసవరించు
క్రోధనామ సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమి సోమవారంలో పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో వీరభోగ వసంతరాయుడిగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశనకరమైన గొప్ప నక్షత్రం ఉద్భవించి అందరికీ కనిపిస్తుంది.
చండిపూర్,అలంపూర్ స్థలములలో ఉత్పాతములు పుడతాయి. ఆ ప్రాంతంలో పాలెగాళ్ళు తమలో తాము కలహించుకుని చెడి భ్రష్టులై పోతారు.
నలు దిక్కులయందు దివ్యమైన నక్షత్రాలుపుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి.
అమావాస్య రోజున పున్నమి చంద్రుని చూసిన జనులు నశిస్తారు. నిజమని నా మహిమను తలచుకుంటారు.కార్తీక శుద్ధ ద్వాదశినాటికి విష్ణుభక్తి పుడుతుంది. అప్పటికి సామవేద ఘోష వినిపిస్తుంది.
తూర్పున శిరసు పడమర తోకగా ఇరువది బారల ధూమకేతువనే నక్షత్రం పుడుతుంది. పుట్టిన ముప్పై రోజుల వరకు అందరికి కనిపిస్తుంది. ఆకాశం ఎర్రపడుతుంది. ఆవులు పైకి చూసి అరుస్తాయి. ఆకాశంలో శబ్ధాలు పుడతాయి.
ఈశ్వరమ్మని రంగరాజుకు ఇచ్చి వివాహం చేసే నాటికి నవరత్న మండపాలతో పన్నెండామడల పట్నం ఔతుంది. నా భక్తులు యావన్మంది ఇక్కడకు వచ్చి కల్యాణం చూస్తారు. అదే మీకు నిదర్శనం. ఈ కాలజ్ఞానం విని నవాబు బ్రహ్మంగారికి అనేక బహుమతులిచ్చి సత్కరించాడు.
పుత్రుడు గోవిందాచార్యులకు జ్ఞానబోధ
భార్య గోవిందమ్మకు జ్ఞానబోధసవరించు
వైశాఖ శుద్ధ దశమి అభిజిత్ లగ్నం మధ్యాహ్నం రెండున్నర గంటలకు సమాధి కాలం నిర్ణయించాడు. ఇది విని విలపిస్తున్న గోవిందమ్మను పిలిచి "నాకు మరణం లేదు నీకు వైధవ్యంలేదు. నీవు సుమంగళిగా జీవించు. నేను సమాధినుండి వీరభోజ వసంతరాయలుగా వచ్చి నాభక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నేను వచ్చే వరకు ఏమేమి జరుగుతాయో నీకు జ్ఞానబోధ చేస్తాను" అని బ్రహ్మంగారు చెప్పాడు.
బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది.
మాహాలక్ష్మమ్మ నృత్యంచేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది.
కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కుపుడక తాకుతుంది.
కంచి కామాక్షమ్మ కంట కన్నీరు కారుతుంది.
కుంభకోణంలోని ఆలయం కుప్పకూలుతుంది.
అచ్చమ్మ వంశం సర్వనాశనమై వారి వంశం అంతరించి పోతుంది.
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి
గౌరి ప్రణయాయ గౌరి ప్రవణాయ గౌరభావాయ ధీమహి
తొండమునేకదంతము తోరపు బొజ్జయు వామ హస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలు మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై
యుండెడు పార్వతీ తనయ ఓయి గణాధిపా! నీకు మ్రొక్కెదన్
Read More
గజేశానయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి
గౌరి ప్రణయాయ గౌరి ప్రవణాయ గౌరభావాయ ధీమహి
తొండమునేకదంతము తోరపు బొజ్జయు వామ హస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలు మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై
యుండెడు పార్వతీ తనయ ఓయి గణాధిపా! నీకు మ్రొక్కెదన్
మొక్కలు పెంచడం అనే అలవాటు మంచిదనే కాదు, అదృష్టం, ఆరోగ్యం, అవసరం కూడా. ఈ విషయం మనలో చాలా మందికి తెలుసు. అయితే ఏ మొక్క పెంచడం వలన ఎలాంటి అదృష్టం వస్తుందో తెలుసుకుందాం…
మొక్కలు పెంచడం అనే అలవాటు మంచిదనే కాదు, అదృష్టం, ఆరోగ్యం, అవసరం కూడా. ఈ విషయం మనలో చాలా మందికి తెలుసు. అయితే ఏ మొక్క పెంచడం వలన ఎలాంటి అదృష్టం వస్తుందో తెలుసుకుందాం…
తులసి మొక్క;
తులసి మొక్క చాలా ముఖ్యమైనది. తులసి మొక్క అమ్మవారు స్వరూపం., పవిత్రమైనది. ఈ మొక్క పెంచడం వలన అదృష్టం తో పాటు ఆరోగ్యం కూడా. ప్రతిరోజు తులసి కోటకు పూజ చేసుకోవడం ఆ ఇంటి ఇల్లాలి భాగ్యమని అనుకోవాలి.
ఉసిరి మొక్క;
ఉసిరి మొక్కను సాక్షాత్తు విష్ణుమూర్తి అని అంటారు. ఆ స్వామి ఎక్కడ ఉంటె అక్కడ లక్ష్మి ఉంటుంది. లక్ష్మి ఉంటె కరువు అనేది ఉండదు. కార్తీక మాసంలో ఉసిరి మరియు తులసికి పూజ చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది.
కలకంద;
కలకంద మొక్క ఇంటి ముందు ఉండటం వలన దిష్టి దోషం పోతుంది. నర దిష్టి ఉంటె మనం ఎత్తుకు ఎదగలేము. అందుకే ఈ మొక్క మన ఇంటి ముందు ఉండటం వలన దిష్టి అనేదానిని మన దరికి రానివ్వదు.
మనీ ప్లాంట్
మనీ ప్లాంట్ ఇంట్లో ఉండటం వలన ధనం పుష్కలంగా సమకూరుతుంది. దీని వలన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ రావడం వలన అన్ని పనులు పాజిటివ్ గా అయ్యి ఇల్లు ఇంట్లో వాళ్ళు శుభంగా ఉంటారు.
పరమ శివుడు పంచావతారమూర్తి.
పరమ శివుడు పంచావతారమూర్తి.
విష్ణుమూర్తి లోక కళ్యాణార్ధం దశావతారాలుగా అవతరించినట్లు, అందరికి విదితమే ! కాని పరమశివుడు బ్రహ్మ కోరికపై ఐదు అవతారాలు దాల్చిన విషియం కొందరికి మాత్రమే విదితం.
ఈశ్వరుడు త్రిలోచనుడు , త్రిశూలి, ధవళ శరీరుడని మాత్రమే అందరూ ఎరిగిన విషియము. అమృత మధనం సమయంలో గరళ్ళాన్ని త్రాగి కంఠమున నిలుపుకున్నందున గరళకంఠుడూ, నీలకంఠుడు అని కంఠము మాత్రమే నీలినలుపు రంగుల్లో ఉంటుందని మన విశ్వాసం.
కాని బ్రహ్మ కోరిక పై ఐదు సందర్భాలలో అయిదే వతారమౌలను ధరించినందున ఆయ్న శరీర ఛాయలు
,నామములు కూడా పంచావతారమూర్తి పేరును సార్ధకం చేశాయి.
బ్రహ్మదేవుడు శ్వేతవరాహకల్పంలో పరమేశ్వరుని ధ్యానించి,తన విధులను నిర్వర్తించడానికి తగిన ఙ్ఞానాని ప్రసాదించమని ప్రార్ధించాడు. నిస్చల భక్తితో కొలచిన వారిని అనుగ్రహించడం కోసం వెంటనే ప్రత్యక్షమయ్యేవాడే పరమేశ్వరుడు. ఆయన గౌరిదేవితో కూడి సద్యోజాత శివరూపం తో ప్రత్యక్షం కాగా,తనకు పుత్ర ప్రాప్తి కలగాలన్నారు. వెంటన్నే నలుగురు కుమారులు కలిగారు, వారే సునందుడు, నందనుడు,
విశ్వనందనుడు, ఉపనందుడు. మరలా రక్తకల్పంలో బ్రహ్మదేవుడు పరమశివుణ్ణి ధ్యానించగా, ఆయన ఎర్రటి కళ్ళతోనూ,కెంపు రంగు శరీరంతోనూ, రక్త వర్ణ వస్త్రభూషణాలను ధరించడమే కాకుండా, అగ్నిగోళాల వంటి ఎర్రని కన్నులతో ప్రసాంత వదనంతో ప్రత్యక్షమై, ఙ్ఞానభిక్షతో బాటు, ఎర్రనివస్త్రాలను ధరించిన నలుగురు కుమారులను అనుగ్రహించారు. వారే విరజుడు,వివాహుడు,
విశోకుడు, విశ్వభావనుడు. దీనితో శివుని రెండవ అవతారమైన వామదేవ అవతారం. అటు తరువాత పీతవాసకల్పంలో బ్రహ్మ, శివుని ధ్యానించడం,ఆయన పసుపు వర్ణపు వస్త్రాలను ధరించి,బంగారు వర్ణంలో,మిలమిల మెరిసే పసిడి తెజస్సుతో,భుజబలశక్తిగల ఆజానుబాహునిలా ప్రత్యక్షమయ్యారు.అదే మూడవ అవతరామైన తత్పురుషవతారం.
తరువాత వచ్చిన కల్పం శివకల్పం. ఈ కల్పంలో సర్వం జల మయమైపోయింది. ఏ దిశ చుచిన జలమయమే .ఇలా సహస్ర వర్షాలు గడిచిపోయాయి. సృష్టి కార్యం ఎలా నిర్వర్తించాలన్నది బ్రహ్మకు సమస్యై పోయింది. మరలా గడ్డు పరిస్థితి ఏర్పడిందని ,శివుని గూర్చి తపస్సు చేసారు. అప్పుడు పరమేశ్వరుడు నల్లటి శరీరధారియై,నళ్ళటి కిరీటాన్ని ధరించడమే కాకుంద,
శరీరంపై లేపనాన్ని పూసుకుని, ఓ దివ్యమైన,నలుపు లోను కూడా తెజస్సు గల " అఘోరమూర్తి "గా పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. సృష్టికార్యానికి సహకారులుగా కొందరిని అనుగ్రహించమని మరీమరీ వేడుకోగా,నల్లని దేహం, నల్లని ముఖం,నల్లని శిఖ కలిగిన నలుగుర్ని బ్రహ్మ సృష్టికి ఆ నలుగురూ ఎంతగానో తోడ్పద్దారు, బ్రహ్మ అంతర్గత మధనాన్ని గ్రహించాడు. ఆ ఙ్ఞానన శక్తి వెనుకగల స్తిథిని గ్రహించాడు. బ్రహ్మ అడిగిన ఙ్ఞానప్రసాదమేమిటో గ్రహించారు.
మరలా విశ్వకల్పం వచ్చింది. కల్పకల్పానికి జరిగినట్టుగానే ఇక్కడ బ్రహ్మకు మళ్ళి సమస్యలే! ఈ సారి బ్రహ్మ శరీరం నుంచే మహానాదం,సరస్వతి రూపావిర్భావం జరిగింది. పరమశివుడేఅ అలా అవతరించగా, బ్రహ్మ అది " ఈసానవతారంగా" భావించారు.
ఈ ఐదవ అవతారమే ఈశ్వరుని అన్ని అవతారలకంటే విశిష్టమైనది. ఇక్కడ ఆయనకు నలుగురు సహాయకులను కూడా ప్రదానం చేసారు. వారే జటి,ముండి, శిఖండి, అర్ధముండీలు.
ఇలాగ ఐదు సందర్భాల్లోని ఐదు అవతారాల్లోనూ బ్రహ్మ సృష్టి నిర్మాణ సౌలభ్యానికి,ముల్లోకముల హితానికే ముక్కంటి అనుగ్రహించినట్టు శతరుద్రసమ్హిత చెబుతోంది.
హర హర మహా దేవ శంభో శంకర !
Read More
విష్ణుమూర్తి లోక కళ్యాణార్ధం దశావతారాలుగా అవతరించినట్లు, అందరికి విదితమే ! కాని పరమశివుడు బ్రహ్మ కోరికపై ఐదు అవతారాలు దాల్చిన విషియం కొందరికి మాత్రమే విదితం.
ఈశ్వరుడు త్రిలోచనుడు , త్రిశూలి, ధవళ శరీరుడని మాత్రమే అందరూ ఎరిగిన విషియము. అమృత మధనం సమయంలో గరళ్ళాన్ని త్రాగి కంఠమున నిలుపుకున్నందున గరళకంఠుడూ, నీలకంఠుడు అని కంఠము మాత్రమే నీలినలుపు రంగుల్లో ఉంటుందని మన విశ్వాసం.
కాని బ్రహ్మ కోరిక పై ఐదు సందర్భాలలో అయిదే వతారమౌలను ధరించినందున ఆయ్న శరీర ఛాయలు
,నామములు కూడా పంచావతారమూర్తి పేరును సార్ధకం చేశాయి.
బ్రహ్మదేవుడు శ్వేతవరాహకల్పంలో పరమేశ్వరుని ధ్యానించి,తన విధులను నిర్వర్తించడానికి తగిన ఙ్ఞానాని ప్రసాదించమని ప్రార్ధించాడు. నిస్చల భక్తితో కొలచిన వారిని అనుగ్రహించడం కోసం వెంటనే ప్రత్యక్షమయ్యేవాడే పరమేశ్వరుడు. ఆయన గౌరిదేవితో కూడి సద్యోజాత శివరూపం తో ప్రత్యక్షం కాగా,తనకు పుత్ర ప్రాప్తి కలగాలన్నారు. వెంటన్నే నలుగురు కుమారులు కలిగారు, వారే సునందుడు, నందనుడు,
విశ్వనందనుడు, ఉపనందుడు. మరలా రక్తకల్పంలో బ్రహ్మదేవుడు పరమశివుణ్ణి ధ్యానించగా, ఆయన ఎర్రటి కళ్ళతోనూ,కెంపు రంగు శరీరంతోనూ, రక్త వర్ణ వస్త్రభూషణాలను ధరించడమే కాకుండా, అగ్నిగోళాల వంటి ఎర్రని కన్నులతో ప్రసాంత వదనంతో ప్రత్యక్షమై, ఙ్ఞానభిక్షతో బాటు, ఎర్రనివస్త్రాలను ధరించిన నలుగురు కుమారులను అనుగ్రహించారు. వారే విరజుడు,వివాహుడు,
విశోకుడు, విశ్వభావనుడు. దీనితో శివుని రెండవ అవతారమైన వామదేవ అవతారం. అటు తరువాత పీతవాసకల్పంలో బ్రహ్మ, శివుని ధ్యానించడం,ఆయన పసుపు వర్ణపు వస్త్రాలను ధరించి,బంగారు వర్ణంలో,మిలమిల మెరిసే పసిడి తెజస్సుతో,భుజబలశక్తిగల ఆజానుబాహునిలా ప్రత్యక్షమయ్యారు.అదే మూడవ అవతరామైన తత్పురుషవతారం.
తరువాత వచ్చిన కల్పం శివకల్పం. ఈ కల్పంలో సర్వం జల మయమైపోయింది. ఏ దిశ చుచిన జలమయమే .ఇలా సహస్ర వర్షాలు గడిచిపోయాయి. సృష్టి కార్యం ఎలా నిర్వర్తించాలన్నది బ్రహ్మకు సమస్యై పోయింది. మరలా గడ్డు పరిస్థితి ఏర్పడిందని ,శివుని గూర్చి తపస్సు చేసారు. అప్పుడు పరమేశ్వరుడు నల్లటి శరీరధారియై,నళ్ళటి కిరీటాన్ని ధరించడమే కాకుంద,
శరీరంపై లేపనాన్ని పూసుకుని, ఓ దివ్యమైన,నలుపు లోను కూడా తెజస్సు గల " అఘోరమూర్తి "గా పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. సృష్టికార్యానికి సహకారులుగా కొందరిని అనుగ్రహించమని మరీమరీ వేడుకోగా,నల్లని దేహం, నల్లని ముఖం,నల్లని శిఖ కలిగిన నలుగుర్ని బ్రహ్మ సృష్టికి ఆ నలుగురూ ఎంతగానో తోడ్పద్దారు, బ్రహ్మ అంతర్గత మధనాన్ని గ్రహించాడు. ఆ ఙ్ఞానన శక్తి వెనుకగల స్తిథిని గ్రహించాడు. బ్రహ్మ అడిగిన ఙ్ఞానప్రసాదమేమిటో గ్రహించారు.
మరలా విశ్వకల్పం వచ్చింది. కల్పకల్పానికి జరిగినట్టుగానే ఇక్కడ బ్రహ్మకు మళ్ళి సమస్యలే! ఈ సారి బ్రహ్మ శరీరం నుంచే మహానాదం,సరస్వతి రూపావిర్భావం జరిగింది. పరమశివుడేఅ అలా అవతరించగా, బ్రహ్మ అది " ఈసానవతారంగా" భావించారు.
ఈ ఐదవ అవతారమే ఈశ్వరుని అన్ని అవతారలకంటే విశిష్టమైనది. ఇక్కడ ఆయనకు నలుగురు సహాయకులను కూడా ప్రదానం చేసారు. వారే జటి,ముండి, శిఖండి, అర్ధముండీలు.
ఇలాగ ఐదు సందర్భాల్లోని ఐదు అవతారాల్లోనూ బ్రహ్మ సృష్టి నిర్మాణ సౌలభ్యానికి,ముల్లోకముల హితానికే ముక్కంటి అనుగ్రహించినట్టు శతరుద్రసమ్హిత చెబుతోంది.
హర హర మహా దేవ శంభో శంకర !
రవిసుధాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణీ
రవిసుధాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణీ
ప్రవిమలంబుగ మమ్మునేలిన భక్తజన చింతామణీ
అవని జనులకు కొంగుబంగారైన దైవశిఖామణీ
శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబికా || 1 ||
కలియుగంబున మానవులకును కల్పతరువై యుండవా
వెలయగును శ్రీ శిఖరమందున విభవమై విలసిల్లవా
ఆలసింపక భక్తవరులకు అష్టసంపద లీయవా
జిలుగు కుంకుమ కాంతిరేఖల శ్రీగిరి భ్రమరాంబికా || 2 ||
అంగ వంగ కళింగ కాశ్మీరాంధ్ర దేశములందునన్
పొంగుచును వరాహ కొంకణ పుణ్యభూముల యందునన్
రంగుగా కర్ణాట రాట మరాట దేశములందునన్
శృంగిణీ దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబికా || 3 ||
అక్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణ భవానివై
సాక్షిగణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవీ
మోక్షమొసగెడు కనకదుర్గవు మూలకారణ శక్తివి
శిక్షజేతువు ఘోరభవముల శ్రీగిరి భ్రమరాంబికా || 4 ||
ఉగ్రలోచన వరవధూమణి కొప్పుగల్గిన భామినీ
విగ్రహంబుల కెల్ల ఘనమై వెలయు శోభనకారిణీ
అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్ధ విచారిణీ
శీఘ్రమేకని వరములిత్తువు శ్రీగిరి భ్రమరాంబికా || 5 ||
నిగమగోచర నీలకుండలి నిర్మలాంగి నిరంజనీ
మిగుల చక్కని పుష్పకోమలి మీననేత్ర దయానిధీ
జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి సీమంతినీ
చిగురుటాకులవంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబికా || 6 ||
సోమశేఖర పల్లవాధరి సుందరీమణీ ధీమణీ
కోమలాంగి కృపాపయోనిధి కుటిలకుంతల యోగినీ
నా మనంబున బాయకుండెడి నగకులేశుని నందినీ
సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబికా || 7 ||
భూతనాథుని వామభాగము పొందుగా చేకొంటివా
ఖ్యాతిగను శ్రీశైలమున ప్రఖ్యాతిగా నెలకొంటివా
పాతకంబుల పాఱద్రోలుచు భక్తులను చేకొంటివా
శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమారాంబికా || 8 ||
వెల్లివిరిసెను నీదుభావము విష్ణులోకము నందున
పల్లవించును నీ ప్రభావము బ్రహ్మలోకము నందున
తెల్లముగ కైలాసమందున మూడులోకము లందున
చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబికా || 9 ||
తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామినీ
కరుణతో మమ్మేలు మెప్పుడు కల్పవృక్షము భంగినీ
వరుసతో నీ యష్టకంబును వ్రాసి చదివిన వారికి
సిరులనిచ్చెద వెల్ల కాలము శ్రీగిరి భ్రమరాంబికా || 10 ||
శ్రీ మహాలక్ష్యష్టక స్తోత్రము
హరహర శివశివా శ్రీరామా
అరుణాచలశివ పూజ్యులైన బ్రాహ్మణోత్తములకు మాతృముర్తులకు పూజ్యులకు పాదాభివందనం
స్నేహితులకు నమస్కారాలు
౪౪౪ శుభ శివప్రీతీ కాలము ౪౪౪
శ్రీ మహాలక్ష్యష్టక స్తోత్రము
ఇంద్ర ఉవాచ-
నమస్తేஉస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోஉస్తు తే || 1 ||
నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోஉస్తు తే || 2 ||
సర్వఙ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోஉస్తు తే || 3 ||
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోஉస్తు తే || 4 ||
ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
యోగఙ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోஉస్తు తే || 5 ||
స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోஉస్తు తే || 6 ||
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోஉస్తు తే || 7 ||
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోஉస్తు తే || 8 ||
మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ |
ద్వికాల్ం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ||
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ |
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ||
[ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్]
Wednesday, 28 December 2016
దేశంలో ఏ శివాలయానికి లేని విశిష్టత “గుడిమల్లం” శివాలయానికి ఉంది. మరేంటి ఆ విశిష్టత చదవండి.
దేశంలో ఏ శివాలయానికి లేని విశిష్టత “గుడిమల్లం” శివాలయానికి ఉంది. మరేంటి ఆ విశిష్టత చదవండి.
దేశంలోని శివాలయాలకు లేని విశిష్టత ” గుడిమల్లం” లో ఉన్న శివాలయానికి ఉంది.ఈ గుడి మల్లం గురించి చాలామందికి ఇప్పటికి తెలీదు.
తిరుపతి సమీపం లోని రేణిగుంట కు దగ్గరలో ఈ గుడిమల్లం గ్రామం ఉంది.”గుడిమల్లం” శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు.
ఇక్కడి శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది.ఈ ఆలయములో గర్భాలయము… అంతరాలయము ముఖమండపముల కన్నా లోతులో ఉంటాయి.ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుష అంగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల ఈ శివ లింగం పై ఒక చేత్తో పశువును,మరో చేత్తో గొర్రెను పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుడు ఇక్కడ మనకు కనిపిస్తాడు.అత్యంత అద్భుతంగా ఆ నాటి శిల్పులు రుద్రుడి ప్రతిరూపాన్ని చెక్కారు.తలపాగా,దోవతి ధరించిన ఈ రుద్రుని వస్త్రధారణ రుగ్వేద కాలం నాటిదని శాస్త్రకారుల అంచనా. ప్రాచీన శైవపూజా విధానాన్ని సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆలయ గర్భ గుడి సైతం గజ పుష్పాకారంలో గంభీరంగా ఉంటుంది.
శివలింగం ముదురు కాఫీరంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష లింగము. లింగము సుమారుగా ఏడు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పులో ఉంటుంది.శివుడు రెండు చేతులతో …. ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని దర్శనమిస్తాడు.స్వామి జటాభార (జటలన్నీ పైన ముడివేసినట్లు) తలకట్టుతో, చెవులకు కర్ణాభరణాలు ధరించి, నడుముచుట్టూ చుట్టి, మధ్యలో క్రిందకు వ్రేలాడుతున్నట్లు ఉన్న అర్ధోరుకము (నడుము నుండి మోకాళ్ళ వరకూ ఉండే వస్త్రము) ధరించి కనిపిస్తాడు. ఆ వస్త్రము మధ్యలో వ్రేలాడుతున్న మడతలు అతి స్పష్టముగా కనిపిస్తాయి. ఆ వస్త్రము అతి సున్నితమైనది అన్నట్లుగా శివుని శరీరభాగములు కనపడుతుంటాయి. శివునికి యజ్ఞోపవీతం లేకపోవడం ఒక విశేషం.
లింగపు అగ్రభాగము… క్రింది పొడవైన స్థంభ భాగములను విడదీస్తున్నట్లుగా ఒక లోతైన పల్లము పడిన గీత స్పష్టముగా ఉండి, మొత్తము లింగము పురుషాంగమును పోలి ఉంటుంది. ఈ లింగము, అతిప్రాచీనమైన లింగముగా గుర్తించబడింది.
ఆకాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది.గుడిమల్లం 2009 వరకు పురావస్తు శాఖ వారి ఆధీనంలో వున్నది.
ఈ కారణంగా శివుడికి పూజా పునస్కారాలు ఏవీ జరగలేదు.దీంతో ప్రజలు ఎక్కువగా వచ్చేవారు కాదు..
పురావస్తు శాఖ వారి ఉద్యోగి ఒకరు గుడికి సంరక్షకుడిగా వుండి అరుదుగా వచ్చే సందర్శకులకు చూపిస్తూ ఉంటారు.
గుడిమల్లం చిన్న పల్లెటూరు. తిరుపతికి సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో వున్నది. ఈ ఆలయాన్ని పరశురామేశ్వారాలయం అని కూడ అంటారు.
అంత దూరం వెళ్ళి చూడ లేని వారికి ఈ ఆలయంలోని మూల విరాట్టును అన్ని విధాల పోలిన ప్రతి రూపాన్ని చంద్రగిరి కోటలోని ప్రదర్శన శాలలో ప్రదర్శనకు పెట్టారు. అక్కడ దీన్ని చూడవచ్చు.
ఇది ప్రపంచంలో అత్యంత పురాతన శివలింగం అని., క్రీస్తుపూర్వం 1వ శతాబ్దపు కాలం నాటిదని చరిత్రకారులంటున్నారు.
1911లో గోపీనాధరావు అనే పురాతన శాస్త్రవేత్త సంవత్సరం పాటు పరిశోధించి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి చాటాడని అంటారు.
ఆలయంలో దొరికిన శాసనాలలో దీనిని పరమేశ్వరాలయంగా పేర్కొన్నారు.
ఈ లింగం చుట్టూ జరిపిన తవ్వకాలలో క్రీస్తు శకం రెండవ శతాబ్దానికి చెందిన ప్రాచీన గుడి అవశేషాలు బయట పడ్డాయి.
ఈ గుడి ఏనాటిదో ఖచ్చితంగా చెప్పటానికి తగిన శాసనాలేవీ లభించ లేదు. కానీ పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధన ఇది క్రీ.పూ. రెండో శతాబ్దం నాటిదని నిర్ణయించింది. (జిల్లా గజిటీర్లు పరిశీలిస్తే క్రీ.శ. 1908 నాటికే బిటీష్ ప్రభుత్వం ఈ ఆలయాన్ని గుర్తించినట్లుగా తెలుస్తుంది). అయితే ఆలయంలోని లింగాన్ని ఎవరు, ఎప్పుడు ప్రతిష్ఠించారో మాత్రం తెలియటం లేదు.
కొంత శాతవాహన నిర్మాణ శైలి కనిపిస్తుంది. తవ్వకాల్లో లభించిన శాసనాల బట్టి 12వ శతాబ్దంలో విక్రమచోళుడి కాలంలో పునర్నిర్మిత మైంది. గర్భాలయంపై కప్పు గజ పృష్ఠాకారంలో (ఏనుగు వెనుక భాగం) ఉంటుంది. చోళుల తర్వాత పల్లవులు కొంత కాలం ఈ ఆలయ నిర్వహణ చేశారు. చోళ శాసనాల్లో ఈ ప్రాంతాన్ని ”తిరువిప్పరమ్ బేడు” అని పిలిచినట్టు తెలుస్తోంది.అంటే తెలుగులో ‘శ్రీ విప్రపీఠం’ అంటారు. పల్లవుల నిర్వహణ లోకి వచ్చాక ఇది గుడిపల్లమైంది. కాలక్రమంలో అదే గుడి మల్లంగా మారి ఆలయం చుట్టూ నిర్మితమైన ఊరే గుడిమల్లంగా మారిపోయింది. చోళ,పల్లవ,గంగపల్లవ,రాయల కాలంలో నిత్యం ధూప,దీప,నైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయాన్ని 1954లో గుడిమల్లం గ్రామస్తుల నుండి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది.ఆనాటి నుండి గుడిలో పూజలు ఆగిపోయాయి. చాలా విగ్రహాలు చోరికి గురయ్యాయి.
ఆర్కియాలజీ వెబ్సైట్లో ఇంత ప్రముఖమైన శివలింగం గురించి కనీస సమాచారం లేదు.
గుడి చుట్టూ పచ్చిక పెంచడం మినహా ఆ శాఖ సాధించిన మార్పు ఏమీ లేదు.ఆ శాఖ పుణ్యమా అని కనీసం పూజలు కూడా చేసుకోలేక పోయామని గుడిమల్లం గ్రామస్తులు వాపోయారు. గ్రామస్తుల్లో ఒకరైన వున్నం గుణశేఖర నాయుడు 2006 నుండీ 2008 వరకు డైరెక్టర్ జనరల్ ఆర్కియాలిజీతో సమాచార చట్టం ఆయుధంగా యుద్దం చేసి వారిని కేంద్ర సమాచార చట్టం ముందు నిలబెట్టాడు.
ఈ గుడికి సంబంధించిన ఆస్తుల వివరాలు అటుంచితే కనీసం గుడికి సంబంధించిన సాహిత్యం కూడా వారి దగ్గర లేదనే నగ్నసత్యం బయట పడింది.
ఈ క్రమంలో గుణశేఖర నాయుడు చేసిన కృషి ఫలితంగా 2009లో గుడిలో పూజలు జరిపేందుకు గ్రామస్తులకు అనుమతి సంపాదించారు
గతంలో ఎపుడో ఉజ్జయినిలో దొరికిన రాగి నాణాలపై ఈ అంగాన్ని పోలిన బొమ్మ ఉంది. మధుర మ్యూజియంలో ఇట్లాంటి శిల్పం ఉంది.
ఇక ఇంగువ కార్తికేయ శర్మ రాసిన ‘పరమేశ్వర టెంపుల్ ఎట్ గుడిమల్లం’ ‘డెవలప్ మెంట్ ఆఫ్ ఎర్లీ శైవ ఆర్ట్ అండ్ అర్కిటెక్చర్ ‘ అనే రెండు పుస్తకాలు ,మరి కొన్ని శిల్ప,కళా చరిత్ర పరిశోధన పత్రాలు మినహా ఈ గుడి గురించి మరే ఇతర సమాచారం లేదు.
మొద ట్లో ఈ శివలింగం ఆరుబయటే పూజలు అందుకునేదట. క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దం మొదలుకొని కొన్ని రాజవంశాలు దానిచుట్టూ గుడిని నిర్మించాయి. ఆలయ సముదాయాలన్నీ పరిపల్లవ, బాణ, చోళుల శిల్పశైలిని పోలి ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో పార్వతి, సుబ్రమణ్యస్వామి, సూర్య దేవాలయాలున్నాయి.
ఏకలింగంపై శివుని అనేక రూపాలను మలచిన తీరు నాటి శిల్పుల విశిష్టతకు నిదర్శనం. భూగర్భ జలమట్టం ఈ లింగం కింద 350 అడుగుల లోతున ఉన్నప్పటికీ ఒత్తిడి పెరిగితే ఆ నీరు లింగంపై పడేలా నిర్మాణచాతుర్యం చూపారు. అలా 2005 డిసెంబర్ 4న నీళ్లు వచ్చాయి. ఈ గుడిని తాళం లాంటి ఆకారంలో నిర్మించడం వల్ల లింగాన్ని కదిలిస్తే గుడి మొత్తం కూలిపోతుందని కొందరంటారు. ఆనందకుమారస్వామి, జితేంద్రనాథ్బెనర్జీ వంటి అంతర్జాతీయ పురాతత్వవేత్తలు, శాస్త్రవేత్తలు శిల్పచరిత్రలోనే అపురూపమైన ఈ శివలింగాన్ని తమ రచనల్లో అభిమానించి ఆరాధించి ప్రేమించారు.
తిరుపతికి గానీ, రేణిగుంటకి గానీ రైల్లో చేరుకుంటే తిరుపతి నుంచైతే 22 కి.మీ., రేణిగుంట నుంచైతే 11కి.మీ. రోడ్డు ప్రయాణం చేసి ఈ ఊరు చేరుకోవచ్చు. అయితే ఇక్కడ ఉండేందుకు వసతి, హోటల్స్ లాంటివేమీ లేవు. మంచినీళ్లతో సహా మనమే తీసుకుని వెళ్లాలి. ఇటీవలే యాత్రీకులు ఎక్కువగా వస్తున్నారు. ……..
౹౹ శ్రీ ఆంజనేయం ౹౹
౹౹ శ్రీ ఆంజనేయం ౹౹
కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు . . . ఇవే.
హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.
1. విద్యా ప్రాప్తికి:-
పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!
2. ఉద్యోగ ప్రాప్తికి :-
హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!
3. కార్య సాధనకు :-
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!
4. గ్రహదోష నివారణకు :-
మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!
5. ఆరోగ్యమునకు :-
ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!
6. సంతాన ప్రాప్తికి :-
పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!
7. వ్యాపారాభివృద్ధికి :-
సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!
8. వివాహ ప్రాప్తికి :-
యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!
ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 40 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.
జై శ్రీ రామ్
నమో శ్రీ అంజనేయ నమః
శుభోదయం మిత్రులకు
అమెరిక హిందూ దేశమే
అమెరిక హిందూ దేశమే
అమెరిక అనగానే మనకు గుర్తొచ్చేది క్రిస్టియన్ మతమే, కానీ ఇందుకు బిన్నంగా అనేకమైన
హిందుత్వ ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నాయి.
హిందూ ధర్మం అనగానే మనకు గుర్తువచ్చేది ఆసియాలోని దేశాలే
అందులో ముఖ్యంగా మనకు గుర్తొచ్చేది ఉపఖండమైన ” హిందూస్తాన్ “
ఇది హిందూ పురిటి గడ్డ.
భారతదేశం తరువాత హిందూ ధర్మం ఇప్పటికి ఉన్న దేశాలు కొన్ని ఉన్నాయి. కానీ
కొందరు అంటారు ఆ దేశాలకు హిందుత్వం వ్యాప్తి చెందిందని, అది కానే కాదు ఎందుకంటే ఒకప్పుడు అదంతా ఈ
అఖండ భారత తల్లి ఒడినుండి ముక్కలైపోయిన దేశాలు.
మీకందరికీ తెలిసిన విషయమే ఈ ప్రపంచంలో అత్యంత పురాతనమైన ధర్మం హిందూ ధర్మమే
క్రిస్టియన్ మతం పుట్టి 2000 సంవత్సారాలు
తర్వాత ఇస్లాం అది 1400
మరి అంతకు పూర్వం ఈ ప్రపంచంలో ఉన్నవాళ్లు ఈ ధర్మం యొక్క జీవన విధానాన్ని
అవలంభించే వారో ఆలోచించండి.
వారంతా పంచభూతాలను పూజించేవారు.
సరే పైన మనం పెట్టన పోస్ట్ యొక్క హెడ్డింగు వివరానికి వస్తే
అమెరికాలో ఒరగాన్ అనే ప్రదేశంలో ఎండిపోయిన ఒక చెరువు ఉంది. అందులో నమ్మలేని ఒక అద్భుతమైన
శ్రీ యంత్రాన్ని గుర్తించారు.
శ్రీయంత్రం మిస్టరీ!!
~ USA లోని Oregon ప్రాంతం లో ఎండిపోయిన ఒక చెరువు ఉండే ప్రాంతం లో కనుగొన బడిన శ్రీయంత్రం ఇది.
~ సుమారు 13 మైళ్ళ పొడవు,వెడల్పు ఉన్న శ్రీ యంత్రాన్ని August 10, 1990 న గుర్తించారు.
~ దీనిని భూమికి 9000 అడుగుల ఎత్తు నుంచి ఫోటో తీసారు. ఒక్కో గీత 10 అంగుళాలు వెడల్పు, మూడు అంగుళాలు లోతు ఉంది.
~ ఒక శ్రీ యంత్రాన్ని కాగితం పై గీయాలంటేనే ఎన్నో పరికరాలు అవసరం. చాలా సమయం తో కూడుకున్న పని. అటువంటిది 13
మైళ్ళ పొడవున్న శ్రీ యంత్రం మట్టిలో చక్కగా చిన్న తప్పు కూడా లేకుండా గీయడం మానవ మాత్రులకు అసాధ్యం అని తేల్చి
చెప్పేశారు.~ మరి దీన్ని ఎవరు గీసి ఉంటారు?క్రీస్తు అంతకు పూర్వమే హిందూమతం అమెరికాలో పుట్టింది అనడానికి నిదర్సనం.
Tuesday, 11 October 2016
ధ్వాదశ జ్యోతిర్లింగ. స్తోత్రము
ధ్వాదశ జ్యోతిర్లింగ. స్తోత్రము
}}}}}}}}}}}}}{{{{{{{{{{{{{{{{
సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే జ్యోతిర్మయం
చంద్రకాళావతంసమ్ !
భక్తిప్రదానాయ కృపావతీర్థం తం సోమనాధం
శరణం ప్రపద్యే !! ........
శ్రీశైలశృంగే విబుధాతినంగే తలాద్రితుంగేపి
ముదా వసంతమ్
తమర్జునం మల్లికపూర్వమేకం నమామి
సంసారసముద్రసేతుమ్ !! ........
అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ !
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే
మహాకాళమహాసురేశమ్ !! ........
కావేరికానర్శదయోః పవిత్రే సమాగమే
సజ్జనతారణాయ. !
సదైవ. మాంధాతృపురే వసంత మోంకారమీశం
శివమేకమీదే !! ........
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసంతం
గిరిజాసమేతమ్ !
సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం
తమహం నమామి !! ........
యం డాకినీశాకినీకాసమాజైః నిషేవ్యమాణం
పి శితాశనైశ్చ. !
సదైవ. భీమాదిపదప్రసిధ్దం తం శంకరం
భక్తహితం నమామి !! .........
సుతాష్రుపర్ణీ జలరాశియోగే నిబద్ద్య. సేతుం
నవిశిఖైరసంఖ్యైః !
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం
నియతంనమామి !! .........
యామ్యేసదంగే నగరేతిరమ్యే విభూషితాంగం
వివిధ్యైశ్చ. భోగైః !
సద్బక్తిముక్తి ప్రదమీశమేకం శ్రీనాగనాధం
శరణం ప్రపద్యే !! .........
సానందమానందవనే వసంత మానందకందం
హతపాపబృందమ్ !
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాధం
శరణం ప్రపద్యే !! .........
సహ్యాద్రిశీర్చే విమలే వసంతం గోదావరీతీర
పవిత్రదేశే !
యద్దర్శనాత్మతకమాశు నాశం ప్రయతి
తం త్ర్యంబమీశమీడే !! .........
మహాద్రిపార్శ్యే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః !
సురాసురైర్యక్షమహోరగాద్యైః కేదారిమీశం
శివమేకమీడే !! ..........
ఇళాపురే రమ్యవిశాలకే స్మిన్ సముల్లసంతం
చ. జగద్వరేణ్యమ్ !
వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం
శరణం ప్రపధ్యే !! .........
జ్యోతిర్మయద్వాదశలింగకానాం శివాత్మనాం
ష్రోక్తమిదం క్రమేణ. !
స్తోత్రం పఠిత్వా మనోజో 2తిభక్త్యా ఫలం
తధాలోక్య. నిజం భజేచ్చ. !! .........
*************************************
శ్రీ శివ కవచమ్
శ్రీ శివ కవచమ్
అస్య శ్రీ శివకవచ స్తోత్రమహామంత్రస్య ఋషభయోగీశ్వర ఋషిః |
అనుష్టుప్ ఛందః |
శ్రీసాంబసదాశివో దేవతా |
ఓం బీజమ్ |
నమః శక్తిః |
శివాయేతి కీలకమ్ |
మమ సాంబసదాశివప్రీత్యర్థే జపే వినియోగః ||
కరన్యాసః
ఓం సదాశివాయ అంగుష్ఠాభ్యాం నమః | నం గంగాధరాయ తర్జనీభ్యాం నమః | మం మృత్యుంజయాయ మధ్యమాభ్యాం నమః |
శిం శూలపాణయే అనామికాభ్యాం నమః | వాం పినాకపాణయే కనిష్ఠికాభ్యాం నమః | యమ్ ఉమాపతయే కరతలకరపృష్ఠాభ్యాం నమః |
హృదయాది అంగన్యాసః
ఓం సదాశివాయ హృదయాయ నమః | నం గంగాధరాయ శిరసే స్వాహా | మం మృత్యుంజయాయ శిఖాయై వషట్ |
శిం శూలపాణయే కవచాయ హుమ్ | వాం పినాకపాణయే నేత్రత్రయాయ వౌషట్ | యమ్ ఉమాపతయే అస్త్రాయ ఫట్ | భూర్భువస్సువరోమితి దిగ్బంధః ||
ధ్యానమ్%
వజ్రదంష్ట్రం త్రినయనం కాలకంఠ మరిందమమ్ |
సహస్రకరమత్యుగ్రం వందే శంభుమ్ ఉమాపతిమ్ ||
రుద్రాక్షకంకణలసత్కరదండయుగ్మః పాలాంతరాలసితభస్మధృతత్రిపుండ్రః |
పంచాక్షరం పరిపఠన్ వరమంత్రరాజం ధ్యాయన్ సదా పశుపతిం శరణం వ్రజేథాః ||
అతః పరం సర్వపురాణగుహ్యం నిఃశేషపాపౌఘహరం పవిత్రమ్ |
జయప్రదం సర్వవిపత్ప్రమోచనం వక్ష్యామి శైవమ్ కవచం హితాయ తే ||
పంచపూజా%
లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి |
హమ్ ఆకాశాత్మనే పుష్పైః పూజయామి |
యం వాయ్వాత్మనే ధూపమ్ ఆఘ్రాపయామి |
రమ్ అగ్న్యాత్మనే దీపం దర్శయామి |
వమ్ అమృతాత్మనే అమృతం మహానైవేద్యం నివేదయామి |
సం సర్వాత్మనే సర్వోపచారపూజాం సమర్పయామి ||
మంత్రః
ఋషభ ఉవాచ
నమస్కృత్య మహాదేవం విశ్వవ్యాపినమీశ్వరమ్ |
వక్ష్యే శివమయం వర్మ సర్వరక్షాకరం నృణామ్ || 1 ||
శుచౌ దేశే సమాసీనో యథావత్కల్పితాసనః |
జితేంద్రియో జితప్రాణశ్చింతయేచ్ఛివమవ్యయమ్ || 2 ||
హృత్పుండరీకాంతరసన్నివిష్టం స్వతేజసా వ్యాప్తనభోஉవకాశమ్ |
అతీంద్రియం సూక్ష్మమనంతమాద్యం ధ్యాయేత్ పరానందమయం మహేశమ్ ||
ధ్యానావధూతాఖిలకర్మబంధ- శ్చిరం చిదానంద నిమగ్నచేతాః |
షడక్షరన్యాస సమాహితాత్మా శైవేన కుర్యాత్కవచేన రక్షామ్ ||
మాం పాతు దేవోஉఖిలదేవతాత్మా సంసారకూపే పతితం గభీరే |
తన్నామ దివ్యం పరమంత్రమూలం ధునోతు మే సర్వమఘం హృదిస్థమ్ ||
సర్వత్ర మాం రక్షతు విశ్వమూర్తి- ర్జ్యోతిర్మయానందఘనశ్చిదాత్మా |
అణోరణియానురుశక్తిరేకః స ఈశ్వరః పాతు భయాదశేషాత్ ||
యో భూస్వరూపేణ బిభర్తి విశ్వం పాయాత్స భూమేర్గిరిశోஉష్టమూర్తిః |
యోஉపాం స్వరూపేణ నృణాం కరోతి సంజీవనం సోஉవతు మాం జలేభ్యః ||
కల్పావసానే భువనాని దగ్ధ్వా సర్వాణి యో నృత్యతి భూరిలీలః |
స కాలరుద్రోஉవతు మాం దవాగ్నేః వాత్యాదిభీతేరఖిలాచ్చ తాపాత్ ||
ప్రదీప్తవిద్యుత్కనకావభాసో విద్యావరాభీతి కుఠారపాణిః |
చతుర్ముఖస్తత్పురుషస్త్రినేత్రః ప్రాచ్యాం స్థితో రక్షతు మామజస్రమ్ ||
కుఠారఖేటాంకుశ శూలఢక్కా- కపాలపాశాక్ష గుణాందధానః |
చతుర్ముఖో నీలరుచిస్త్రినేత్రః పాయాదఘోరో దిశి దక్షిణస్యామ్ ||
కుందేందుశంఖస్ఫటికావభాసో వేదాక్షమాలా వరదాభయాంకః |
త్ర్యక్షశ్చతుర్వక్త్ర ఉరుప్రభావః సద్యోஉధిజాతోஉవతు మాం ప్రతీచ్యామ్ ||
వరాక్షమాలాభయటంకహస్తః సరోజకింజల్కసమానవర్ణః |
త్రిలోచనశ్చారుచతుర్ముఖో మాం పాయాదుదీచ్యాం దిశి వామదేవః ||
వేదాభయేష్టాంకుశటంకపాశ- కపాలఢక్కాక్షరశూలపాణిః |
సితద్యుతిః పంచముఖోஉవతాన్మామ్ ఈశాన ఊర్ధ్వం పరమప్రకాశః ||
మూర్ధానమవ్యాన్మమ చంద్రమౌలిః భాలం మమావ్యాదథ భాలనేత్రః |
నేత్రే మమావ్యాద్భగనేత్రహారీ నాసాం సదా రక్షతు విశ్వనాథః ||
పాయాచ్ఛ్రుతీ మే శ్రుతిగీతకీర్తిః కపోలమవ్యాత్సతతం కపాలీ |
వక్త్రం సదా రక్షతు పంచవక్త్రో జిహ్వాం సదా రక్షతు వేదజిహ్వః ||
కంఠం గిరీశోஉవతు నీలకంఠః పాణిద్వయం పాతు పినాకపాణిః |
దోర్మూలమవ్యాన్మమ ధర్మబాహుః వక్షఃస్థలం దక్షమఖాంతకోஉవ్యాత్ ||
మమోదరం పాతు గిరీంద్రధన్వా మధ్యం మమావ్యాన్మదనాంతకారీ |
హేరంబతాతో మమ పాతు నాభిం పాయాత్కటిం ధూర్జటిరీశ్వరో మే ||
ఊరుద్వయం పాతు కుబేరమిత్రో జానుద్వయం మే జగదీశ్వరోஉవ్యాత్ |
జంఘాయుగం పుంగవకేతురవ్యాత్ పాదౌ మమావ్యాత్సురవంద్యపాదః ||
మహేశ్వరః పాతు దినాదియామే మాం మధ్యయామేஉవతు వామదేవః |
త్రిలోచనః పాతు తృతీయయామే వృషధ్వజః పాతు దినాంత్యయామే ||
పాయాన్నిశాదౌ శశిశేఖరో మాం గంగాధరో రక్షతు మాం నిశీథే |
గౌరీపతిః పాతు నిశావసానే మృత్యుంజయో రక్షతు సర్వకాలమ్ ||
అంతఃస్థితం రక్షతు శంకరో మాం స్థాణుః సదా పాతు బహిఃస్థితం మామ్ |
తదంతరే పాతు పతిః పశూనాం సదాశివో రక్షతు మాం సమంతాత్ ||
తిష్ఠంతమవ్యాద్ భువనైకనాథః పాయాద్వ్రజంతం ప్రమథాధినాథః |
వేదాంతవేద్యోஉవతు మాం నిషణ్ణం మామవ్యయః పాతు శివః శయానమ్ ||
మార్గేషు మాం రక్షతు నీలకంఠః శైలాదిదుర్గేషు పురత్రయారిః |
అరణ్యవాసాది మహాప్రవాసే పాయాన్మృగవ్యాధ ఉదారశక్తిః ||
కల్పాంతకాలోగ్రపటుప్రకోప- స్ఫుటాట్టహాసోచ్చలితాండకోశః |
ఘోరారిసేనార్ణవ దుర్నివార- మహాభయాద్రక్షతు వీరభద్రః ||
పత్త్యశ్వమాతంగరథావరూథినీ- సహస్రలక్షాయుత కోటిభీషణమ్ |
అక్షౌహిణీనాం శతమాతతాయినాం ఛింద్యాన్మృడో ఘోరకుఠార ధారయా ||
నిహంతు దస్యూన్ప్రలయానలార్చిః జ్వలత్త్రిశూలం త్రిపురాంతకస్య | శార్దూలసింహర్క్షవృకాదిహింస్రాన్ సంత్రాసయత్వీశధనుః పినాకః ||
దుః స్వప్న దుః శకున దుర్గతి దౌర్మనస్య- దుర్భిక్ష దుర్వ్యసన దుఃసహ దుర్యశాంసి | ఉత్పాతతాపవిషభీతిమసద్గ్రహార్తిం వ్యాధీంశ్చ నాశయతు మే జగతామధీశః ||
ఓం నమో భగవతే సదాశివాయ
సకలతత్వాత్మకాయ సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రాధిష్ఠితాయ సర్వతంత్రస్వరూపాయ సర్వతత్వవిదూరాయ బ్రహ్మరుద్రావతారిణే నీలకంఠాయ పార్వతీమనోహరప్రియాయ సోమసూర్యాగ్నిలోచనాయ భస్మోద్ధూలితవిగ్రహాయ మహామణి ముకుటధారణాయ మాణిక్యభూషణాయ సృష్టిస్థితిప్రలయకాల- రౌద్రావతారాయ దక్షాధ్వరధ్వంసకాయ మహాకాలభేదనాయ మూలధారైకనిలయాయ తత్వాతీతాయ గంగాధరాయ సర్వదేవాదిదేవాయ షడాశ్రయాయ వేదాంతసారాయ త్రివర్గసాధనాయ అనంతకోటిబ్రహ్మాండనాయకాయ అనంత వాసుకి తక్షక- కర్కోటక శంఖ కులిక- పద్మ మహాపద్మేతి- అష్టమహానాగకులభూషణాయ ప్రణవస్వరూపాయ చిదాకాశాయ ఆకాశ దిక్ స్వరూపాయ గ్రహనక్షత్రమాలినే సకలాయ కలంకరహితాయ సకలలోకైకకర్త్రే సకలలోకైకభర్త్రే సకలలోకైకసంహర్త్రే సకలలోకైకగురవే సకలలోకైకసాక్షిణే సకలనిగమగుహ్యాయ సకలవేదాంతపారగాయ సకలలోకైకవరప్రదాయ సకలలోకైకశంకరాయ సకలదురితార్తిభంజనాయ సకలజగదభయంకరాయ శశాంకశేఖరాయ శాశ్వతనిజావాసాయ నిరాకారాయ నిరాభాసాయ నిరామయాయ నిర్మలాయ నిర్మదాయ నిశ్చింతాయ నిరహంకారాయ నిరంకుశాయ నిష్కలంకాయ నిర్గుణాయ నిష్కామాయ నిరూపప్లవాయ నిరుపద్రవాయ నిరవద్యాయ నిరంతరాయ నిష్కారణాయ నిరాతంకాయ నిష్ప్రపంచాయ నిస్సంగాయ నిర్ద్వంద్వాయ నిరాధారాయ నీరాగాయ నిష్క్రోధాయ నిర్లోపాయ నిష్పాపాయ నిర్భయాయ నిర్వికల్పాయ నిర్భేదాయ నిష్క్రియాయ నిస్తులాయ నిఃసంశయాయ నిరంజనాయ నిరుపమవిభవాయ నిత్యశుద్ధబుద్ధముక్తపరిపూర్ణ- సచ్చిదానందాద్వయాయ పరమశాంతస్వరూపాయ పరమశాంతప్రకాశాయ తేజోరూపాయ తేజోమయాయ తేజోஉధిపతయే జయ జయ రుద్ర మహారుద్ర మహారౌద్ర భద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంతభైరవ కపాలమాలాధర ఖట్వాంగ చర్మఖడ్గధర పాశాంకుశ- డమరూశూల చాపబాణగదాశక్తిభిందిపాల- తోమర ముసల ముద్గర పాశ పరిఘ- భుశుండీ శతఘ్నీ చక్రాద్యాయుధభీషణాకార- సహస్రముఖదంష్ట్రాకరాలవదన వికటాట్టహాస విస్ఫారిత బ్రహ్మాండమండల నాగేంద్రకుండల నాగేంద్రహార నాగేంద్రవలయ నాగేంద్రచర్మధర నాగేంద్రనికేతన మృత్యుంజయ త్ర్యంబక త్రిపురాంతక విశ్వరూప విరూపాక్ష విశ్వేశ్వర వృషభవాహన విషవిభూషణ విశ్వతోముఖ సర్వతోముఖ మాం రక్ష రక్ష జ్వలజ్వల ప్రజ్వల ప్రజ్వల మహామృత్యుభయం శమయ శమయ అపమృత్యుభయం నాశయ నాశయ రోగభయమ్ ఉత్సాదయోత్సాదయ విషసర్పభయం శమయ శమయ చోరాన్ మారయ మారయ మమ శత్రూన్ ఉచ్చాటయోచ్చాటయ త్రిశూలేన విదారయ విదారయ కుఠారేణ భింధి భింధి ఖడ్గేన ఛింద్ది ఛింద్ది ఖట్వాంగేన విపోధయ విపోధయ ముసలేన నిష్పేషయ నిష్పేషయ బాణైః సంతాడయ సంతాడయ యక్ష రక్షాంసి భీషయ భీషయ అశేష భూతాన్ విద్రావయ విద్రావయ కూష్మాండభూతవేతాలమారీగణ- బ్రహ్మరాక్షసగణాన్ సంత్రాసయ సంత్రాసయ మమ అభయం కురు కురు మమ పాపం శోధయ శోధయ విత్రస్తం మామ్ ఆశ్వాసయ ఆశ్వాసయ నరకమహాభయాన్ మామ్ ఉద్ధర ఉద్ధర అమృతకటాక్షవీక్షణేన మాం- ఆలోకయ ఆలోకయ సంజీవయ సంజీవయ క్షుత్తృష్ణార్తం మామ్ ఆప్యాయయ ఆప్యాయయ దుఃఖాతురం మామ్ ఆనందయ ఆనందయ శివకవచేన మామ్ ఆచ్ఛాదయ ఆచ్ఛాదయ
హర హర మృత్యుంజయ త్ర్యంబక సదాశివ పరమశివ నమస్తే నమస్తే నమః ||
పూర్వవత్ – హృదయాది న్యాసః |
పంచపూజా ||
భూర్భువస్సువరోమితి దిగ్విమోకః ||
ఫలశ్రుతిః%
ఋషభ ఉవాచ ఇత్యేతత్పరమం శైవం కవచం వ్యాహృతం మయా |
సర్వ బాధా ప్రశమనం రహస్యం సర్వ దేహినామ్ ||
యః సదా ధారయేన్మర్త్యః శైవం కవచముత్తమమ్ |
న తస్య జాయతే కాపి భయం శంభోరనుగ్రహాత్ ||
క్షీణాయుః ప్రాప్తమృత్యుర్వా మహారోగహతోஉపి వా |
సద్యః సుఖమవాప్నోతి దీర్ఘమాయుశ్చ విందతి ||
సర్వదారిద్రయశమనం సౌమాంగల్యవివర్ధనమ్ |
యో ధత్తే కవచం శైవం స దేవైరపి పూజ్యతే ||
మహాపాతకసంఘాతైర్ముచ్యతే చోపపాతకైః |
దేహాంతే ముక్తిమాప్నోతి శివవర్మానుభావతః ||
త్వమపి శ్రద్దయా వత్స శైవం కవచముత్తమమ్ |
ధారయస్వ మయా దత్తం సద్యః శ్రేయో హ్యవాప్స్యసి ||
శ్రీసూత ఉవాచ
ఇత్యుక్త్వా ఋషభో యోగీ తస్మై పార్థివ సూనవే |
దదౌ శంఖం మహారావం ఖడ్గం చ అరినిషూదనమ్ ||
పునశ్చ భస్మ సంమంత్ర్య తదంగం పరితోஉస్పృశత్ |
గజానాం షట్సహస్రస్య త్రిగుణస్య బలం దదౌ ||
భస్మప్రభావాత్ సంప్రాప్తబలైశ్వర్య ధృతి స్మృతిః |
స రాజపుత్రః శుశుభే శరదర్క ఇవ శ్రియా ||
తమాహ ప్రాంజలిం భూయః స యోగీ నృపనందనమ్ |
ఏష ఖడ్గో మయా దత్తస్తపోమంత్రానుభావతః ||
శితధారమిమం ఖడ్గం యస్మై దర్శయసే స్ఫుటమ్ |
స సద్యో మ్రియతే శత్రుః సాక్షాన్మృత్యురపి స్వయమ్ ||
అస్య శంఖస్య నిర్హ్రాదం యే శృణ్వంతి తవాహితాః |
తే మూర్చ్ఛితాః పతిష్యంతి న్యస్తశస్త్రా విచేతనాః ||
ఖడ్గశంఖావిమౌ దివ్యౌ పరసైన్యవినాశకౌ |
ఆత్మసైన్యస్వపక్షాణాం శౌర్యతేజోవివర్ధనౌ ||
ఏతయోశ్చ ప్రభావేన శైవేన కవచేన చ |
ద్విషట్సహస్ర నాగానాం బలేన మహతాపి చ ||
భస్మధారణ సామర్థ్యాచ్ఛత్రుసైన్యం విజేష్యసే |
ప్రాప్య సింహాసనం పిత్ర్యం గోప్తాஉసి పృథివీమిమామ్ ||
ఇతి భద్రాయుషం సమ్యగనుశాస్య సమాతృకమ్ |
తాభ్యాం సంపూజితః సోஉథ యోగీ స్వైరగతిర్యయౌ ||
ఇతి శ్రీస్కాందమహాపురాణే బ్రహ్మోత్తరఖండే శివకవచ ప్రభావ వర్ణనం నామ ద్వాదశోஉధ్యాయః సంపూర్ణః || ||
దారిద్ర్యదహన శివస్తోత్రం
దారిద్ర్యదహన శివస్తోత్రం
విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ శశిశేఖరధారణాయ |
కర్పూరకాంతిధవళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౧ ||
గౌరీప్రియాయ రజనీశకళాధరాయ
కాలాంతకాయ భుజగాధిపకంకణాయ |
గంగాధరాయ గజరాజవిమర్దనాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౨ ||
భక్తిప్రియాయ భవరోగభయాపహాయ
ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ |
జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౩ ||
చర్మంబరాయ శవభస్మవిలేపనాయ
భాలేక్షణాయ మణికుండలమండితాయ |
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౪ ||
పంచాననాయ ఫణిరాజవిభూషణాయ
హేమాంశుకాయ భువనత్రయమండితాయ |
ఆనందభూమివరదాయ తమోహరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౫ ||
భానుప్రియాయ దురితార్ణవతారణాయ
కాలాంతకాయ కమలాసనపూజితాయ |
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౬ ||
రామప్రియాయ రఘునాథవరప్రదాయ
నాగప్రియాయ నరకార్ణవతారణాయ |
పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౭ ||
ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ |
మాతంగచర్మవసనాయ మహేశ్వరాయ
దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౮ ||
క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల క్రితం సాగర గర్భంలో మునిగిపోయిన కృష్ణుడి ద్వారక గురించి అధ్భుతమైన విషయాలు.
క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల క్రితం సాగర గర్భంలో మునిగిపోయిన కృష్ణుడి ద్వారక గురించి అధ్భుతమైన విషయాలు.
September 19, 2016 Admin 0 Comment bhakthi, dwaraka, hindu, krishna
192 కిలోమీటర్ల పొడవు…192 కిలోమీటర్ల వెడల్పు..36864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం..బారులు తీరిన వీధులు..వీధుల వెంట బారులు తీరిన చెట్లు..రాయల్ ప్యాలెస్లు..రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు..కమర్షియల్ మాల్స్.. కమ్యూనిటీ హాల్స్.. క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాల నాడే అపూర్వ నగరం.. రత్నస్తంభాలు.. వజ్ర తోరణాలు.. సాటిలేని ఆర్కిటెక్చర్..
సముద్రం మధ్యలో మహా నిర్మాణం..జగన్నాథుడి జగదేక సృష్టి..క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాటి లెజెండ్ సిటీ…ద్వారక..ఇప్పుడు సాగర గర్భంలో..మన నాగరికత..మన సంస్కృతి..మన ప్రతిభకు పట్టం కట్టిన నాటి కాస్మోపాలిటన్ సిటీ.. ద్వారక అవును, రామాయణం నిజం.. మహా భారతం నిజం.. ద్వాపర యుగం నిజం.. వేల ఏళ్ల నాటి మన సంస్కృతి నిజం.. అద్భుతమైన మన నాగరికత నిజం.. అపూర్వమైన మన సైన్స్ నిజం.. సాటి లేని మన ఇన్వెన్షన్స్ నిజం.. ఇందుకు ఈ సముద్ర గర్భంలో కనిపిస్తున్న మహానగరమే తిరుగులేని ఉదాహరణ.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ద్వారక.. గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా..
శ్రీకృష్ణుడు జన్మించిన సమయం క్రీస్తుపూర్వం3222 జూలై 27 శుక్రవారం అర్ధరాత్రి… మధురలో కంసుడి జైలులో జగద్గురువు జన్మించాడు.. కంసుడిని చంపిన తరువాత మధురను ఏలుతున్న కృష్ణుడిపై మగధ రాజు జరాసంధుడు, కాలయవనుడితో కలిసి 17 సార్లు యుద్ధం చేశాడు.. చివరకు ప్రజలకు రక్షణ కల్పించటం కోసం ఏకంగా పశ్చిమ తీరానికి వచ్చి గోమతి తీరంలో ద్వారకను కృష్ణుడు నిర్మించాడు.. శ్రీకృష్ణ నిర్యాణానంతరం సునామీ రూపంలో ప్రళయం వచ్చి ద్వారక సాగర గర్భంలో కలిసిపోయింది. కాలగర్భంలో ఆనవాలే లేకుండా పోయింది. మనకంటూ చరిత్రే లేదని అనిపించేలా అదృశ్యమైంది..
1980వ దశకంలో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలు భారతీయ చారిత్రక నిర్మాణంలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. పశ్చిమాన గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో సాగర గర్భంలో ఒక మహానగరం బయటపడింది.. మహాభారత కాలాన్ని, శ్రీకృష్ణుడి ఉనికిని ఈ నగరం బయటి ప్రపంచానికి చాటి చెప్పింది.. ఇదే ఇవాళ మనం చెప్పుకుంటున్న ద్వారక.. .కృష్ణుడి ద్వారక.. విశ్వకర్మ నిర్మించిన ద్వారక..
ఈ తవ్వకాల్లో ఏవో చిన్న చిన్న రాళ్ల కట్టడాలు దొరికాయనుకుంటే పొరపాటే.. శిథిలాల రూపంలోనే అయినా, ఒక మహా నగరమే బయటపడింది.. సముద్రం అట్టడుగున ముందుకు వెళ్తున్న కొద్దీ వెళ్తున్నట్లే.. కిలోమీటర్ల కొద్దీ, అంతమెక్కడో తెలియనంత విస్తీర్ణంలో అపురూపమైన నిర్మాణం వెలుగు చూసింది..
మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఆర్కియాలజిస్ట్ ఏస్.ఆర్. రావు నేతృత్వంలో సాగిన ఈ పరిశోధనలు ఈ మహానగరాన్ని దాదాపు క్రీస్తుపూర్వం 3150 సంవత్సరాల క్రితం నాటిదిగా నిర్ధారించారు.. మహాభారత కాలంలో కృష్ణుడు నిర్మించిన ద్వారకగా స్పష్టమైంది..
ద్వారక సముద్రంలో మునిగిపోయిన తరువాత భారత్ నాగరికత కూడా మాయమైపోయింది.. మనం అన్నీ మర్చిపోయాం.. మన కల్చర్ గురించి మనకు అందించేవాళ్లే లేకుండా పోయారు. ఇప్పుడు అయిదు వేల ఏళ్ల తరువాత ఒక్కటొక్కటిగా బయటపడుతున్న మన మూలాల్ని చూస్తుంటే మనకే కాదు.. ప్రపంచ దేశాలన్నింటికీ కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
సాగర గర్భంలో బయటపడిన ద్వారక నగరం ఆషామాషీ నగరం కానే కాదు.. ఇవాళ మనకు తెలిసిన గొప్ప గొప్ప నగరాలకంటే వెయ్యి రెట్లు అడ్వాన్స్డ్ మెట్రోపాలిటన్ సిటీ అని చెప్పవచ్చు. శ్రీకృష్ణుడు పర్ఫెక్ట్ ప్లాన్తో ద్వారక నిర్మాణానికి పూనుకున్నాడు.. విశ్వకర్మతో ఈ నగరాన్ని నిర్మించాడు.. గోమతి నది, సముద్రంలో కలిసే చోటును నగర నిర్మాణానికి ఎంచుకున్నాడు.
అక్కడ సుమారు 36 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర నిర్మాణం జరిగింది.ద్వారకలో తొమ్మిది లక్షలు.. అవును.. అక్షరాలా తొమ్మిది లక్షల రాజభవనాలు ఉండేవి.. శ్రీకృష్ణుడి అష్ట భార్యలతో పాటు 16వేల మంది గోపికలకూ ఒక్కో రాజభవనం ఉండేదిట.. ఈ భవనాలన్నీ కూడా క్రిస్టల్స్, ఎమరాల్డ్, డైమండ్స్ వంటి అపురూప రత్నాలతో నిర్మించారు..ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ ఆఫ్ గోల్డ్గా ద్వారకను చెప్పుకోవాలి..
పొడవైన అతి పెద్ద పెద్ద వీధులు.. వీధుల వెంట బారులు తీరిన చెట్లు.. మధ్యమధ్యలో ఉద్యానవనాలు.. వాటి మధ్యలో రాజభవనాలు.. ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకమైన నివాస గృహాలు.. వ్యవసాయ క్షేత్రాలు.. ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక నగరం ప్రజలందరికీ ఎలాంటి సౌకర్యాలు ఉండాలో.. ఇవే కాకుండా ఆ కాలంలోనే భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ ,ఇంటింటికి కుళాయిలు నాటి నిర్మాణ కౌశల్యానికి మచ్చు తునకలు.. అలాంటి సౌకర్యాలన్నింటితో నిర్మించిన ఏకైక నగరం ద్వారక..
నగర నిర్మాణం ఇళ్లు, వీధుల నిర్మాణంతోనే అయిపోయిందనుకుంటే పొరపాటే.. హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ కమర్షియల్ జోన్లు ఉండాలో, ఎక్కడ రెసిడెన్షియల్ జోన్లు ఉండాలో ఇప్పుడు మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు.. ఇప్పటికే కట్టిన నిర్మాణాలను ఎలా తొలగించాలో తెలియక సిగపట్లు పడుతున్నారు.. కానీ, ద్వారకలో ఆనాడే ఇవన్నీ ఉన్నాయి.. కమర్షియల్ జోన్లు, ప్లాజాలు, అవసరమైన ప్రతిచోటా పబ్లిక్ యుటిలిటీస్, భారీ షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి.. బ్యూటీకే.. బ్యూటీ… అందమైన గార్డెన్లు, పూల సువాసనలు, సరస్సులతో ద్వారక గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా అలరారిందనటంలో సందేహం లేదు.
రామాయణ కాలంలో రావణుడి ఎయిర్పోర్ట్లను కనుగొన్నాం.. అతని ఆర్కిటెక్చర్ నైపుణ్యాన్ని తెలుసుకున్నాం.. భారత కాలంలో ద్వారక శ్రీకృష్ణుడి దార్శనికతకు దర్పణం పట్టింది.. భారత దేశంలో వేల ఏళ్ల నాడే అపూర్వ నాగరికత ఉన్నదన్న వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.. కాల గర్భంలో కలిపేందుకు చూసినా కలిసేది కాదని నిరూపించింది.. న్యూయార్క్ సిటీ, వాషింగ్టన్ డిసి, లండన్, మాస్కో, బీజింగ్, టోక్యో, ముంబయి.. ఇవన్నీ ఏమిటని అనుకుంటున్నారా? ఇవాళ ప్రపంచం గొప్పగా చెప్పుకునే, చాటుకునే మహానగరాలు.. మెట్రో పాలిటన్ సిటీలు.. కాస్మో పాలిటన్ సిటీలు.. ఏళ్ల తరబడి కష్టపడితే తప్ప ఇవాళ్టి రూపానికి రాలేని నగరాలు..
ఉడిపి :-
ఉడిపి :-
ఉడిపి కర్ణాటక రాష్ట్రములోని ఒక జిల్లా. ప్రపంచ ప్రసిద్ధ కృష్ణ మందిరము ఉడిపిలో ఉన్నది.
ఉడిపి జిల్లాను ఆగష్టు 1997లో యేర్పాటు చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని మూడు ఉత్తర తాలూకాలు (ఉడిపి, కుందాపూర్ మరియు కార్కళ్) కలిపి ప్రత్యేక ఉడిపి జిల్లాను చేశారు. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనసంఖ్య 11,12,243. అందులో 18.55% పట్టణ జనాభా. కన్నడ, తుళు మరియు కొంకణి జిల్లాలో మాట్లాడే ప్రధాన భాషలు. తుళు మాతృభాషగా కలిగిన ప్రజలు గణనీయంగా ఉండటం వలన ఉడిపి మరియు దక్షిణ కన్నడ జిల్లాలను కలిపి కొన్నిసార్లు తుళునాడుగా వ్యవహరిస్తారు.
* కృష్ణాలయం
ఉడుపి పూర్వపు పేరు శివళ్ళీ. ఇది పరశురామక్షేత్రాలలో మెదటి స్థానం కలిగి ఉన్నది. ప్రతి సంవత్సరం, లక్షలాది భక్తులు కృష్ణుని దర్శనం చేసుకోవటానికి ఉడిపిని సందర్శిస్తారు. స్వామి దర్శనం నవరంధ్రాలున్న కిటికీ ద్వారా చేసుకోవలసి ఉండటం ఈ దేవాలయము యొక్క ప్రత్యేకత. ఉడిపి రథవీధిలో శ్రీకృష్ణ మందిరంకలదు. ఉత్తర ద్వారంద్వారా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడి వైపు దేవాలయకార్యాలయం, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళితే మధ్వ సరోవరం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీనిద్వారా గర్భగుడిలో ప్రవేశం పిఠాధిఫతులకు తప్పితే అన్యులకు ఉండదు. చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండిచే తాపడం పెట్టపడిన నవరంధ్రాల కిటికీ నుండి చేసుకోవచ్చు. గర్భగుడికి కుడి వైపు ముఖ్యప్రాణ దేవత ( హనుమంతుడు), వామభాగాన గరుడ దేవరు ఉన్నరు. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి దక్షిణ మార్గం వైపు ప్రదెక్షం చేసినట్లైతే ఎడమభాగాన మధ్వాచ్యారులు మంటపం కనిపిస్తుంది. ఇప్పటికి పర్యాయంలో ఉన్న పీఠాధిపతి ఆశీర్వచనాలు ఇక్కడేఇస్తారు.
* అష్ట మఠాలు
ఉడిపి శ్రీకృష్ణ మఠానికి అనుసంధానంగా అష్ట మఠాలు కృష్ణ మఠాలు ఉన్నాయి. ఈ ఎనిమిది మఠాలు ఉడిపి రథవీదిలో, శ్రీకృష్ణ దేవాలయానికి చుట్టూ ఉంటాయి.
01. పుత్తగె
02. పేజావర
03. పలిమారు
04. అదమారు
05. సోదె
06. శీరూరు
07. కాణియూరు
08. కృష్ణాపుర
* దగ్గరలో ఉన్న మరికొన్ని ముఖ్య ప్రదేశాలు
01. కోల్లూరు ముకాంబికా దేవాలయం
02. మరవంతె బీచ్
03. మల్పే రేవు
04. కాపు దీపస్థంభం (కాపు లైటు హౌసు)
05. కార్కళ లోని గోమటేశ్వరుడు
06. వేణూరు లోని గోమటేశ్వరుడు
07. అత్తూరు లో సెయింట్ లారెన్స్ ఇగర్జి
08. సెయింట్ మేరీస్ ద్వీపం
09. మూడబిదరె లో సావిరకంబద బసది
10. మణిపాల్
11. బైందూరు కోసళ్ళి జలపాతము
శ్రీ నవ దుర్గ స్తోత్రం
శ్రీ నవ దుర్గ స్తోత్రం
రచన: వాగ్దేవీ
గణేశః
హరిద్రాభంచతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ |
పాశాంకుశధరం దైవంమోదకందంతమేవ చ ||
దేవీ శైలపుత్రీ
వందే వాఞ్ఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం|
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||
దేవీ బ్రహ్మచారిణీ
దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||
దేవీ చంద్రఘంటేతి
పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా |
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||
దేవీ కూష్మాండా
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ |
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ||
దేవీస్కందమాతా
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||
దేవీకాత్యాయణీ
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ||
దేవీకాలరాత్రి
ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా |
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ || వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా |
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ||
దేవీమహాగౌరీ
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః |
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ||
దేవీసిద్ధిదాత్రి
సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి |
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||
ఓం శ్రీ మాత్రే నమః
శృంగేరి కర్ణాటక రాష్ట్రం చిక్ మగళూర్ జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున కలదు
శృంగేరి కర్ణాటక రాష్ట్రం చిక్ మగళూర్ జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున కలదు. శృంగేరి అనే పేరు ఋష్యశృంగగిరి నుండి వచ్చిందని చెబుతారు. విభాణ్డక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఆశ్రమము, శృంగేరి దగ్గరగా ఉన్న శృంగపర్వతం వల్ల ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఋష్యశృంగుడు రోమపాదుడి పాలిస్తున్న అంగ రాజ్యములొ అడుగు పెట్టి ఆ రాజ్యాన్ని క్షామము నుండి విముక్తి కలిగించి వర్షాలు పడేటట్లు చేస్తాడు. ఈ వృత్తాంతము రామాయణము బాల కాండములో వస్తుంది. ఈ గ్రామములోనే శంకరాచార్యులు అద్వైతమును వ్యాప్తిచేయుటకై స్థాపించిన శంకర మఠమును దఖ్షిణామ్నాయ మఠం అని అంటారు.
చరిత్ర
శంకరాచార్యులు ధర్మ ప్రచారం కోసం దేశాటన జరుపుతున్న సమయములో,ఆయన తన పరివార శిష్యులతో ఇక్కడకు పర్యటించుచున్నప్పుడు ఒక సర్పము ప్రసవించుచున్న ఒక మండూకానికి నీడ కల్పించే సంఘటన ఆయనకు కనిపిస్తుంది. ప్రాకృతికవైరులైన సర్పమండూకముల మధ్య పరస్పర మైత్రీ భావము మరియు సర్పానికి మణ్డూకంపై అత్యంత దయార్థ్ర భావము చూచి భగవత్పాద శంకరాచార్యుల మనస్సులో ప్రాకృతికవైరులలో మైత్రీభావము మూర్తీభవించి ఉన్నది కాబట్టీ ఈ క్షేత్రము అత్యంత పవిత్రమైనది అని స్ఫురించి అంతే కాకుండా ఇక్కడ వరకు వచ్చేటప్పడికి మండన మిశ్రుడి భార్య అయిన ఉదయ భారతి సరస్వతి మూర్తిగా మారిపోతుంది. ఈ రెండు సంఘటనలు చేశాక ఇక్కడే మెదటి మఠం నిర్మించాలని తలచి మెదటి మఠాన్ని ఇక్కడే స్థాపిస్తారు. ఆది శంకరుడు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపాడు అని చెబుతారు. ఆ తరువాత దేశాటన జరుపుతూ పూరి లో, కంచి లో, బదరి లో ,ద్వారక లో మఠాలను స్థాపించారు.
దర్శించవలసిన ప్రదేశాలు
శృంగేరిలో ప్రసిద్ది చెందిన చారిత్రాత్మక దేవాలయాలు ఉన్నాయి.శృంగేరిలో ముఖ్యమైన దర్శనీయ విశేషాలు
1. శారదాంబ దేవాలయం
2. విద్యాశంకర దేవాలయం
3. ఆది శంకురల దేవాలయం
4. నరసింహవనం
5. తుంగ నది
శబరిమల యాత్ర అంటే
ఒకప్పుడు శబరిమల యాత్ర అంటే భయం భయంగా వెళ్లేవారు. ఎప్పుడు ఏ చోట ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరికీ తెలిసేది కాదు. కాని ఇప్పుడు ఇజీగా వెళ్లి వస్తున్నారు. అప్పట్లో శబరిమల వెళ్ళటానికి ఒకేఒక్క దారి ఉండేది, దాని పేరు ఎరుమేలిమార్గం. ఈ దారిలోనే పూజారులు, సిబ్బంది ఆలయానికి గుంపులు గుంపులుగా, బృందంగా వెళ్లేవారట.
శబరిమల అడవీ ప్రాంతం అవ్వడం వలన అప్పటి నుంచి ఇప్పటి వరకు బృందాలుగా వెళ్ళటం ఆనవాయితీగా వస్తుంది. శబరిమల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం…
స్వామియే … శరణమయ్యప్ప ! అంటూ మొదలు పెడదాం…
1907 లో శబరిమల గర్భగుడి పైకప్పు ఎండుగడ్డి తో, ఆకులతో కప్పబడివుండేది. అప్పట్లో గర్భగుడిలో ఏకశిలా విగ్రహానికి పూజలు చేసేవారు.
1909 లో దేవాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
రెండువందల సంవత్సరాల క్రితం 70 మంది శబరిమల యాత్ర కు వెళ్లారని, ఆ సంవత్సర ఆదాయం 7 రూపాయలని రికార్డ్ లలో పేర్కొనబడింది.
దేవాలయాన్ని మరలా 1909-10 వ సంవత్సరంలో పునఃనిర్మించారని తెలుస్తుంది.
1909-10 వ సంవత్సరంలో శిలా విగ్రహానికి బదులు, పంచలోహాలతో తయారుచేసిన అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుండి పంచలోహ విగ్రహానికె పూజలు చేస్తుండటం గమనార్హం.
1935 తర్వాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరగటంతో మకరజ్యోతి దర్శనానికే కాకూండా మండల పూజ కొరకు కూడా భక్తులను లోనికి ఆహ్వానించారు.
చాలక్కాయమార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడటంతో శబరిమల యాత్రకు వచ్చే వారి సంఖ్య మరింత పెరిగింది.
1945 వ సంవత్సరంలో ఆలయ బోర్డు, కేవలం మకరజ్యోతి సమయంలోనే కాక విషు, పంకుని ఉత్తారం, ఓనం వంటి పండుగల సమయాలలో కూడా ఆలయ ద్వారాలు తెరిచి ఉంచేటట్లు తీర్మానించింది.
1950 వరకు పరుశురామ నిర్మితమైన దేవాలయం మూడు సార్లు అగ్నికి ఆహుతైంది.
1951 లో పంచలోహ విగ్రహాన్ని చెంగనూరు నుండి తెప్పించి వేదపండితుల మంత్రోచ్చారణ ల మధ్య ప్రతిష్టించారు. అప్పటి వరకు కేరళీ కేళీవిగ్రహంగా కిర్తించబడ్డ అయ్యప్ప స్వామి భారతీకాళీ విగ్రహంగా, నేడు భూతళీకేళీ విగ్రహం గా కీర్తించబడుతున్నది.
1984 కు పూర్వం పదునెట్టాంబడి ఎక్కటానికి భక్తులు పరుశురామ నిర్మితమైన రాతిమెట్లనే వాడేవారు. మెట్లను ఎక్కేటప్పుడు ప్రతి మెట్లుపై కొబ్బరికాయ ను కొట్టేవారు. దాంతో భక్తులు మెట్లు ఎక్కటానికి ఇబ్బంది పడేవారు. ఇది దృష్టిలో పెట్టుకొని బోర్డు వారు 1985 లో పదునెట్టాంబడికి పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పేశారు.
2000 వ సంవత్సరంలో బెంగళూరు భక్తుడొకాయన గర్భగుడి పైన, దాని చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయటానికి పూనుకోవడటంతో శబరిమల స్వర్ణ దేవాలయంగా మారిపోయింది.
స్వామి వారి ఆభరణాలను పందళం లో భద్రపరిచి ఉంచుతారు.
ప్రతి ఏటా మకరసంక్రాంతి తారీఖున మూడు పెట్టలలో భద్రపరిచిన ఆ ఆభరణాలను 11 మంది మూడురోజుల పాటు మోసుకుంటూ వచ్చి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న శబరిమల చేరవేస్తారు.
తెచ్చిన ఆభరణాలను స్వామి వారికి అలంకరించి, కర్పూరహారతి గుళ్లో ఇవ్వగానే తూర్పుదిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు మకరజ్యోతి దర్శనం కానవస్తుంది.
ఆభరణాల వెంట పందళం రాజ వంశస్థులలో ఒకరు(పెద్దవాడు) కత్తి పట్టుకుంటూ నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరిగి జనవరి 20 వ తేదీన ఆభరణాలను వెంట పందళం వరకు వెళ్లి వాటిని చేరవేరుస్తాడు.
శివ తాండవాన్ని బ్రహ్మదేవుడు చిత్రించిన ప్రదేశము
తమిళనాడులోని కుట్రాలం అనే పేరు వినగానే, అందరి మదిలో అదొక పర్యాటక స్థలం గానే మెదలుతుంటుంది. కుట్రాలంలోని కొండలు, ఆ ఒందల పైనుండి జాలువారుతున్న జలపాతలే మన మదిలో మెదలడం జహాజం. పేదవాళ్ళ ఊటీగా పేర్కొనబడుతున్న కుట్రాలానికి ఆ పేరు ఏర్పడడానికి కారణం అక్కడ నెలకొన్న కుట్రాలీశ్వరుడు. పంచసభలలోని ఇంద్రసభ ఇక్కడ ఉన్నదని ప్రతీతి. ఇంతటి ఘనచరిత్ర కలిగిన ఈ పుణ్య స్థలం గొప్పదనాన్ని ఎందరో తమిళకవులు తమ కీర్తనలలో నిక్షిప్తం చేశారు. తిరుజ్ఞాన సంబంధర్, తిరునావుక్కరుసు, అరుణగిరినాథర్ వంటి కవులు ఈ క్షేత్రమహాత్యాన్ని తమ కీర్తనల ద్వారా లోకానికి చాటారు. వేదవ్యాస విరచితమైన ‘తామ్రప మహాత్మ్యం’ లో ధరణీపీఠం గురించి, శెన్బగదేవి గురించి, కుట్రాలీశ్వరుని గురించి విపులంగా వివరించబడింది. ఆ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కుట్రాలం యొక్క గొప్పదనం అర్థమవుతుంది.
పూర్వము ఈ పుణ్యభూమిని పృథు మహారాజు పరిపాలిస్తున్న సమయం. నీతి గ్రంథాలలో చెప్పిన నియమాలను అనుసరించి పరిపాలన చేస్తున్న పృథువు రాజ్యంలో ప్రజలంతా సుఖశాంతులతో విలసిల్లసాగారు. ఆ రాజ్యంలో బృహస్పతి వంశావళికి చెందిన రోచిష్మానుడు, సురుచి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. నాలుగు వేదాలను, సకల శాస్త్రాలను ఔపోసన పట్టిన అపరిమితమైన అపర విష్ణుభక్తులు. అయితే, వారు అపరిమితమైన విష్ణుభక్తి పరాయణత్వంలో దేశంలోని అన్ని ప్రాంతాలను పర్యటిస్తూ శివనింద చేయసాగారు. విష్ణువేగొప్ప, శివుడు గొప్ప కాదన్న వాదనలతో దేశమంతా పర్యటిస్తుండేవారు. ఆ నోట, ఈ నోట ఈ విషయం పృథుమహారాజు చెవిన పడింది. విషయం విన్నంతనే ఎంతో కలత చెందిన పృథువు, నేరుగా కైలాసానికి వెళ్ళి శివునితో ఈ విషయాన్ని వినమ్రతతో విన్నవించాడు.
“పరమేశ్వరా! నా దేశంలో శివభక్తి పరాయణులు ఉండాలి. అందుకు నువ్వే ఏదైనా మార్గాన్ని చూపాలి” అని వేడుకున్నాడు. అతని ప్రార్థనను విన్న శివపరమాత్మ, “తగిన సమయంలో అగస్త్య మహాముని ద్వారా అందుకు తగిన ప్రయత్నాలు మొదలవుతాయి” అని పృథువును స్వాంతన పరిచాడు.
అందుకు తగినట్లుగానే, కొన్నాళ్ళ తర్వాత అగస్త్య మహామునీశ్వరుడు కుట్రాలంలో విష్ణు సన్నిధికి శివచిహ్నాలతో వచ్చాడు. ఆ దృశ్యాన్ని చూసిన విష్ణుభక్తులు అగస్త్యుని విష్ణుసన్నిధిలోకి రాకుండా అడ్డుకున్నారు. వారి గొడవకు ఆరోజున తిరిగి వెళ్ళిపోయినా అగస్త్యుడు మరుసటి రోజున ఓ విష్ణుభక్తునివలె వేషాన్ని వేసుకుని విష్ణ్వాలయానికి చేరుకున్నాడు. అగస్త్య మునీశ్వరుని ఆవిధంగా చూసిన విష్ణుభక్తులు, ఆయన్ని సాదరంగా ఆహ్వానించి, ఆలయం లోపలకు తీసుకెళ్ళి, ఆయన్నే పూజావిధులు నిర్వహించమని చెప్పారు.
గర్భగృహంలోకి వెళ్ళిన అగస్త్యుడు, శివుని ధ్యానిస్తూ పూదండంతో విష్ణువును తాకాడు. అంటే ఆ మరుక్షణమే, నిల్చున్న భంగిమలోనున్న విష్ణుమూర్తి ప్రతిమ క్షణ మాత్రములో శివలింగంగా మారిపోయింది. అదే సమయంలో ఆలయ ప్రాంగణంలోనున్న విష్ణు పరివార దేవతలంతా శివపరివార దేవతలుగా మారిపోయారు. ఆ దృశ్యాన్ని చూసిన విష్ణుభక్తులు స్తంభించిపోయారు. అక్కడున్న సురుచి ఆవేశంతో ఊగిపోయాడు. ఫలితంగా అగస్త్యునికి, సురుచికి మధ్య తీవ్రమైన వాగ్యుద్ధం మొదలైంది. అప్పుడు ఆకాశవాణి పలుకుతూ, ఎవరైనా మధ్యవర్తిని పెట్టుకుని వాదనలను కొనసాగించమని చెప్పింది.
ఆ మరుక్షణం శివుని ఎడమభాగం వైపునున్న ధరణి పీఠం నుంచి ఒక దేవి ఆవిర్భవించింది. ఆ దేవి మధ్యవర్తిత్వం వహింకాగా, అగస్త్య, సురుచిల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలో ఎవరైతే ఓడిపోతారో, వారు గెలిచినవారి మతాని అనుసరించాలన్న నిబంధనతో సుమారు ఐదురోజులపాటు వాదన కొనసాగింది. చివరగా అగస్త్యమహామునీశ్వరుడే గెలిచాడు. ఫలితంగా అక్కడున్న విష్ణుభక్తులంతా అగస్త్యుని ద్వార శివదీక్షను స్వీకరించారు. ఈ వాదనకు మధ్యవర్తిత్వం వహించింది ఆ పరాశక్తియే. ఆ ధరణీపీఠ నాయకి సృష్టి, స్థితి, సంహారము అనే మూడింటిని నిర్వహిస్తుంటుంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అనే మూడు వేదాల రూపంగా భాసించే ధరణీపీఠనాయకి తెలుపు, ఎరుపు, నలుపు రంగులతో దర్శనమిస్తుంటుంది. అప్పుడు జరిగిన వాద ప్రతివాదనలకు సాక్ష్యంగా కుట్రాలంలో కొలువైన ధరణీ పీఠ నాయకి, భక్తజనులను తన కరుణాపూరిత దృక్కులతో కరునిస్తోంది.
ఇక, కుట్రాలంలో ప్రధాన నదీదేవి చిత్రానదీ దేవి. ఈ నదికి కొంచెం పైభాగంలో శెన్బగదేవి ఆలయం ఉంది. శెన్బగదేవి ఇక్కడ కొలువై ఉన్నందువల్ల పూర్వకాలంలో ఈ ప్రాంతమంతా శెన్బగవనం అని పిలువబడుతు ఉండేదట. ఒకానొకప్పుడు ఈ ప్రాంతంలో శుంభనిశుంభులు శివునివల్ల అనేక వరాలను పొందారు. పురుషుల వలన మరణం రాకుండా వరాన్ని పొందిన వీరు, యజ్ఞభాగాలను అపహరిస్తూ, అందరినీ బాధిస్తూ ఉండటంతో, మునుల మొరలను ఆలకించిన ఆది పరాశక్తి వారిద్దరినీ సంహరిస్తుంది. ఇదంతా , చూసిన శుంభనిశుంభుల గురువు ఉదుంబరునికి వణుకు పుట్టింది. ఆదిపరాశక్తి తనను కూడ సంహరిస్తుందని వణికిపోయాడు. ఆదిపరాశక్తి కంట్లో పడకుండా ఎక్కడ తలదాచుకోవాలన్న విషయమై ఆశ్రయించాడు. ఉదుంబరుని పరిస్థితిని అర్థం చేసుకున్న మయుడు కుట్రాలం ప్రక్కనున్న ఓ పర్వతారణ్యములో దాక్కుని ఉండమని చెప్పాడు. అలా ఆ పర్వతారణ్యములో దాక్కున్న ఉదుంబరుడు పగలంతా ఎవరికీ తెలియకుండా నక్కి ఉండి, రాత్రయితే బయటకు వచ్చి అన్ని జీవులను పీడిస్తుండేవాడు. ఆ రాక్షసుని ఆగడాలకు తట్టుకోలేకపోయిన మునీశ్వరులు దేవితో మొరపెట్టు కోగా, ఆ రాక్షసుని అతని పరివారముతో సహా అంతమొందించింది.
అనంతరం ఆ ఋషిపుంగవులతో దేవి, “మీకు తోడుగా నేను కూడ ఇక్కడే కొలువై వుంటాను” అని ఓ చెట్టు కింద ధరణీపీఠ నాయకిగా కొలువై భక్తులను కరుణిస్తోంది. ఈ పవిత్ర ప్రదేశం కుత్రాలము జలపాతాలకు సుమారు మూడు కిలోమీటర్ల దూరములో ఉంది. ఇక్కడున్న తీర్ధాన్ని దేవి పేరుతో శెన్బగతీర్థం అని పిలుస్తుంటారు. ఈ దేవికి చైత్రమాసంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. కుట్రాలీశ్వరుని ఉత్సవాలు ముందు ముందుగా ఈ అమ్మవారికే పూజలు జరుతుగుంటాయి. ఈ అమ్మవారి ఆలయానికి పైభాగాములో ‘శివమధుగంగ’ అనే జలపాతం ఉంది. ఇక్కడ గంగాదేవి శివలింగానికి తేనెతో అభిషేకం చేసినందువల్ల ఈ జలపాతదారకు ‘శివమధుగంగ’ అనే పేరు ఏర్పడిందని ప్రతీతి. ఇక్కడ పౌర్ణమి రోజున పసుపువర్ణంతో కూడిన వర్షం పడుతుంటుందని పెద్దలు చెబుతుంటారు.
అదేవిధంగా పరమశివుడు ఐదుచోట్ల తాండవ నృత్యం చేసాడని ప్రతీతి. ఇక్కడ స్వామివారు నృత్యం చేసిన సభచిత్రసభగా పిలువబడుతోంది. ఈ చిత్రసభ మిగతా సభల కంటే భిన్నమైనది. మిగతా నాలుగు సభలలో శివుడు వగ్రహరూపంలో గోచరిస్తుండగా, ఇక్కడ మాత్రం చిత్ర రూపంలో దర్శనమిస్తుంటాడు. శివతాండవాలలో ఒకటైన త్రిపురతాండవము ఈ చిత్రసభలో జరిగిందట.
ఈ చిత్రసభకు ముందు కోనేరు, దాని మధ్యలో ఓ మంటపం ఉంది. చిత్రసభలో పరమశివుడు దేవేరితో పాటు తాండవం చేస్తుండగా, ఆ దృశ్యాన్ని బ్రహ్మదేవుడు ఓ గోడపై చిత్రీకరించాడని పురాణకథనం. అందువల్లనే వ్యాసభగవానుడు ఈ సభను చిత్రసభ అని పిలుచుకున్నారు. ఇక్కడ మార్గశిర మాసంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. కుత్రాలీశ్వరుని ఆలయ ప్రాంగణంలో కుళళ్ వాయ్ మొళియమ్మన్ ఆలయం ఉంది. నత్తి, మూగ తనంతొ బాధపడేవారు ఈ అమ్మవారిని మొక్కుకుంటే చక్కని ఫలితం ఉంటుందని భక్త జనుల విశ్వాసం.
ఈ కుట్రాలీశ్వరుని ఆలయంలో రోజుకు తొమ్మది సార్లు పూజలు జరుగుతుంటాయి. చిత్రసభలో ఆరుద్ర దర్శనం జరుపబడుతుంటుంది. ఆ సమయంలో తాండవ దీపారాధన జరుగుతుంటుంది. సంవత్సరానికి ఒకసారి జరుపబడే ఆరుద్ర దర్శన పండుగ సమయంలో బ్రహ్మ, విష్ణువులతో పాటు సమస్త దేవతలు ఇక్కడకు వస్తారని ప్రతీతి. ఇంకా చైత్రమాసంలో వసంతోత్సవం, కార్తీకమాసములో పవిత్రోత్సవం, నవరాత్రి, స్కందషష్ఠి అంటూ అన్ని ప్రధాన పండుగలు ఈ ఆలయములో జరుపబడుతుంటాయి.
జూన్ నుంచి సెప్టెంబర్ లోపు కుట్రాలానికి వెళితే వర్షాకాలం కావడం వలన గలగల పారే నిండుజలపాతాలను చూడొచ్చు. కుట్రాలానికి రైలు ప్రయాణ సౌకర్యం లేదు. కాబట్టి బస్సులోనే అక్కడకు చేరుకోవలసి ఉంటుంది. కుట్రాలంలో బస సోకర్యాలకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించాలను కునే వారికి ఇదొక అపూరూప అవకాశం.
మట్టపల్లి – శ్రీ లక్ష్మీ నరసింహస్వామి.
మట్టపల్లి – శ్రీ లక్ష్మీ నరసింహస్వామి.
ఆంధ్రదేశం లో ప్రసిద్ధి పొందిన నరసింహక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. వాని లో సుప్రసిద్ధాలు పంచ నారసింహ క్షేత్రాలు . పంచనారసింహ క్షేత్రాల్లో ఇప్పుడు మనం మూడోదాన్ని చూడబోతున్నాం. ఈ పంచ నరసింహులకు జనులు పెట్టుకున్న ముద్దుపేర్లు ముందుగా చెపుతాను చూడండి.
మట్టపల్లి శ్రీస్వామి వారి ఆలయ రాజగోపురం
కృష్ణా నదీగర్భం లో వెలసిన వేదాద్రి యందు వెలసిన యోగానంద స్వామి. ఇచ్చట నున్న స్వామి, ఉత్తర వాహిని యైన కృష్ణానది లో స్నానం చేసి తనను దర్శిస్తే చాలు పుల కించి పో తాడట. అందుకే వేదాద్రి స్వామిని “ స్నానాలయ్య” అని పిలుచు కుంటారట భక్తులు. గుంటూరు జిల్లా మంగళగిరి లో వెలసిన నృసింహస్వామి. పానకం సమర్పించే వారంటే సంతోషిస్తాడు. సగం పానకం తీసుకొని మిగిలింది మనకే ఇచ్చేస్తాడు.అందుకే ఆ స్వామి” పానకాలయ్య”. ఆ జిల్లాలోనే కేతవరం లో వెలసిన స్వామి “వజ్రాలయ్య”. ఈ స్వామి ని త్రికరణ శుద్ధి గా నమ్మి,కొలిస్తే వజ్రాలు లభిస్తాయి. ఈ దగ్గర లోని కోళ్ళూరు లోనే కోహినూర్ వజ్రం దొరికిందని చెపుతారు. వాడపల్లి లోని” దీపాలయ్య “ను చూసేశాం కదా. ఇప్పుడు మట్టపల్లి లోని” అన్నాలయ్య “ను చూద్దాం పదండి. ఈ రెండు క్షేత్రాలు నల్గొండ జిల్లాలోనివే.
ఆలయ ప్రవేశ ద్వారం
నల్గొండ జిల్లా హుజూర్నగర్ కు 35 కి.మీ దూరం లో కృష్ణా తీరం లో శ్రీ లక్ష్మీ నరసింహుడు కొలువు తీరిన దివ్యక్షేత్రం మట్టపల్లి.
ఆలయ ధ్వజస్థంభం, శిఖరం
స్థల పురాణం.::—– పూర్వకాలమున ఈ ప్రాంతం లో ఇచ్చటి గుహలో నరసింహుని గురించి జపిస్తూ చాలకాలం తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమై భరద్వాజుని అనుగ్రహించాడు.
“ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలన్తం సర్వతోముఖమ్
నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం.!! “
సహస్ర శేష ఫణులతో, ధక్షిణావర్త శంఖం తో, నవసాలగ్రామాలతో, కరాళ నఖ దంష్ట్రికల తో, శంఖ చక్రగదాయుధాలతో అభయ ముద్రతో,చిరునవ్వులు చిందిస్తూ స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఈ స్వామి స్వయంభువు .ఆ కాలంలో భరద్వాజాది మహర్షు లెందరో ఈ స్వామిని సేవించి తరించారు.
గర్భాలయం లో స్వామి వారి దివ్యమంగళ రూపం
అనంతర కాలం లో సుమారు వేయి సంవత్సరాల క్రితం కృష్ణానదీ తీరం లో మట్టపల్లి కి ఆవలి ఒడ్డున గల తంగెడ జనపదమును పాలిస్తున్న తన భక్తుడైన అనుముల మాచిరెడ్డి ప్రభువునకు స్వామి స్వప్న గోచరుడై, “వత్సా! సమీప కృష్ణానదీ తీరం లో ఒకానొక గుహాగర్భం లో నా స్వయంవ్యక్త మూర్తి మునిసుర బృంద సమర్చన లందుకుంటూ గుప్తం గా ఉంది. కలియుగం లో భక్తజన సంతరణకు నాదివ్యమూర్తి సుప్రకటితం కావలసి యున్నది.కావున ఉదయమే నీవు వెళ్ళి గుహాగర్భంలో ఉన్న నా రూపాన్ని లోకానికి సువ్యక్త పరచి ధన్యుడవు కమ్ము” అని ఆజ్ఞాపించాడు. ఆ అదృష్టశాలి మహానందభరితుడై లేచి, వేదపండితులను రావించి వారితో తన స్వప్నవృత్తాంతము ను వివరించినాడు. అతడు చెపితే విన్నవారై, వారు స్వామి ఆజ్ఞను శిరసావహించ వలసిందని మాచిరెడ్డి కి ఉద్బోధించారు. అనంతరం మాచిరెడ్డి విప్ర,పుర, పరి జన సమేతుడై, స్వామి ఆదేశానుసారం మట్టపల్లి వనానికి చేరి గుహలన్నీఅన్వేషించాడు. కాని స్వామి కన్పించలేదు. చివరకు అలసి,సొలసి అందరు చెట్ల క్రింద సొమ్మగిల్లారు. ఇంతలో మాచిరెడ్డికి మరలా కలలో స్వామి కన్పించి” భక్తా! విచారించకు. చూడు. ఇక్కడే ఒక ఆరె చెట్టు. దానిపై ఒక గరుడపక్షి కనబడుతుంది. ఆ చెట్టుకు సూటి గా పొదల చాటున గుహ ఉంది. చూడ మని,అక్కడే నేనున్నానని “ చెప్పాడు.తుదకు అన్వేషణ ఫలించింది.
శ్రీలక్ష్మీ నరసింహస్వామి
అక్కడ గుహాంతర్భాగంలో శ్రీ లక్ష్మీనృసింహుని దివ్య మంగళ రూపాన్ని దర్శించి, సేవించి , అనంతర కాలం లో ఆలయ నిర్మాణాదులు చేసి , స్వామి సేవలో తరించాడు మాచిరెడ్డి.
శ్రీ గోదాదేవి సన్నిథిఆలయ దర్శనం ::——-
మట్టపల్లి శ్రీ లక్ష్మీనృసింహ ఆలయ గాలి గోపురం తూర్పు ముఖం గా ఉంటుంది .ఆలయం లో స్వామి పడమర ముఖం గా ఉంటారు. స్వామి గుహాంతర్భాగం లో ఉండటం వలన ఒక చిన్న గుహ లోకి వెళ్లి స్వామిని దర్శించుకోవాలి. స్వామి స్వయంవ్యక్తం. శంఖ,చక్ర గదాభయ హస్తాలతో కరాళ దంష్ట్రికలతో, వక్షస్థల కౌస్తుభం తో,చిద్విలాసుడై కొండలోనుండి వ్యక్త రూపుడై దర్శనమిస్తాడు. ప్రక్కనే రాజ్యలక్ష్మీ దేవి కొలువు తీరి ఉంటుంది.
శ్రీ స్వామి వారి ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారం
ముఖమండపం నుండి ఒక చిన్న ద్వారం ద్వారా సరాసరి గర్భాలయం లోని స్వామి చెంత కే భక్తులు చేరుకోవచ్చు. ఆలయం ఉత్తర,దక్షిణాలు గా వ్యాపించి ఉంటుంది. తూర్పు వైపు కొండ, పడమర వైపు కృష్ణానది ఉంటాయి. శ్రీ స్వామిని దర్శించుకొని, దక్షిణ ద్వారం గుండా వెలుపలి కి రాగానే గోదాదేవి సన్నిధి, దర్శన మిస్తాయి. అనంతరము విఖనసాచార్య సన్నిధి, అద్దాలమందిరం, యజ్ఞశాలను చూసుకొని ఆలయప్రాగణం లోకి వస్తాము. ధ్వజ స్థంభం వద్ద నాగశిలలు దర్శనమిస్తాయి.
ఆలయ ప్రవేశానికి ఉన్న చిన్న ద్వారం
స్వామివారి గర్భాలయం కొండ కావున ఆలయం చుట్టు ప్రదక్షిణ చేయడానికి వీలుగా ప్రదక్షిణ మార్గాన్నివేరుగా నిర్మించారు. ఇది స్వామి వారి ఆలయానికి కుడివైపున ఉన్న మెట్ల ద్వారా ప్రారంభమై స్వామి వెనుక నుండి కొండ చుట్టు తిరిగి స్వామి ముందుకు వస్తుంది. స్వామి ఆలయానికి ఉత్తరం గా కృష్ణానది లోకి స్నానఘట్టాలు ఉన్నాయి. ఫ్రహ్లాద,మార్కండేయ,బాలాజీ పేర్లతో ఈ స్నానఘట్టాలను పిలుస్తారు.
ఒకనాడు వరదనీటిలో మట్టపల్లి ఆలయం
మెట్లపూజ చేయడం ఇక్కడ భక్తులకు సంప్రదాయం. కృష్ణానదికి వరద వస్తే స్వామి ఆలయం మునిగి పోయిన రోజులున్నాయి. దాని నివారణ కై ఇప్పుడు కరకట్ట పనులకు అనుమతి లభించిందని తెలుస్తోంది.
32 ప్రదక్షిణాలు. :: ——- శ్రీ స్వామి వారికి 32 ప్రదక్షిణలు చేయడం ఇక్కడొక ఆచారం . మట్టపల్లి లో 11 రోజులు ఉండి, రోజూ మూడు పూటలా కృష్ణానది లో స్నానం చేస్తూ,32 ప్రదక్షిణలు చేస్తూ, మట్టపల్లి మంగళాష్టకాన్ని త్రిసంధ్యలలోను 11సార్లు పఠిస్తే భక్తులకు ఎటువంటి కోరిలున్నా తీర తాయని, ఎటువంటి మానసిక,శారీరక రుగ్మతలున్నానశిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే” శ్రీ మట్టపల్లి నాథం ప్రణతోస్మి నిత్యం నమ: “ అనే మంత్రాన్ని 32 వేల సార్లు వ్రాస్తే ఎటువంటి కోరికలైనా తీరుతాయట. ఎటువంటిరుగ్మతలైనా మాయమవుతాయట. అంతేకాదు స్వామి వారికి కట్టే ముడుపు కూడ 32 రూపాయలే కట్టి హుండీలో వేయడం కూడ ఇక్కడ సంప్రదాయం.
శ్రీమాన్ ముక్కూర్ శ్రీ లక్ష్మీ నరసింహాచార్య స్వామి ::——- 107 శ్రీ మహా నార సింహ మహామంత్ర జపహోమతత్పరులైన శ్రీమాన్ ముక్కూర్ శ్రీలక్ష్మీనరసింహాచార్య స్వామి ఈ క్షేత్రం లో3 సార్లు జపహోమాలను నిర్వహించి, స్వామి దర్శన భాగ్యాన్ని పొంది ,స్వామి తనతో చెప్పిన విషయాలన్నింటినీ తమిళం లో వివరించడం మూలంగా తమిళనాడు లోకూడ ఈ క్షేత్రం ప్రాచుర్యాన్ని పొందింది. ప్రతిసంవత్సరం అక్కడనుండి కూడ భక్తులు వందలాది గా తరలి వచ్చి స్వామిని సేవించుకుంటున్నారు .చెన్నై టి.నగర్ లో శ్రీ స్వాతి నరసింహ మహాయజ్ఞ ట్రస్టు తమిళులకు అందుబాటు లో ఉంది. మట్టపల్లి లో “ శ్రీ ముక్కూర్ నృహరి నివాసమ్ “ (శ్రీ యజ్ఞ వాటిక) భక్తులకు సేవలందిస్తున్నారు.
శ్రీ ఆంజనేయుడు. ::—— శ్రీ స్వామి వారికి ఎదురుగా ఉన్నముఖమండపం లోని ఉపాలయం లో గరుడాళ్వారు తో పాటు ఆంజనేయుడు కూడ మనకు దర్శనమిస్తాడు. ఈయనను గురించి ఒక ఐతిహ్యం ఇక్కడ ప్రచారం లో ఉంది.
ఆలయ ముఖమండపం
కొంతకాలం క్రితం అర్చక స్వాములు తీర్థపుబిందె తేవడానికి ప్రాత: కాలం లో కృష్ణానది కి వెళ్లారు. అక్కడ ఎక్కడనుంచో కొట్టుకొచ్చిన ఒక ఆంజనేయ విగ్రహం కన్పించింది. దాన్ని పట్టించుకొచ్చి, ఆలయం ప్రాంగణం లో ఒక మూల ఉంచారు. కాలం గడుస్తోంది. రకరకాల మానసిక , శారీరక రుగ్మతలతో బాధపడుతూ ,శ్రీ నరసింహుని చెంతకు చేరుతారు భక్తులు. ఆ వచ్చిన వారు కృష్ణానది లో స్నానం చేసి, పొర్లు దండాలుపెడుతూ స్వామి సన్నిథిలోనే పగలు,రాత్రి ఉండిపోయేవారు. అలా వచ్చిన భక్తులను ఈ మూలన ఉంచిన ఆంజనేయుడు విజృభించి పిడిగుద్దులతో వాళ్లను హింసించేవాడట. అసలే రకరకాల మానసిక వేదనలతోవచ్చిన భక్తులు ఆ బాధలకన్నా మన ఆంజనేయుని పిడిగుద్దుల బాధలు ఎక్కువై, తాళలేక పొయి శ్రీ నరసింహుని తో మొర పెట్టు కున్నారట. అది విన్న స్వామి, ఆంజనేయుని తెచ్చి తన ముందు ప్రతిష్ఠించమన్నారట. అంతే. స్వామి ముందు ఫ్రతిష్ఠించ బడిన అంజనీపుత్రుడు దాసాంజనేయుడై బుద్దిగా ఉండిపోయాడట,ఇప్పటికి కూడ మనం చూస్తే ఆంజనేయుని దృష్టి నరసింహుని పాదాలపై ఉండటాన్ని గమనించవచ్చు. ఈయన కోసం స్వామి వారి బంటు గరుత్మంతుడు ఉపాలయం లో కొంచెంపక్కకు జరిగి ఈయనకు చోటిచ్చినట్టు కన్పిస్తుంది.
ధ్వజస్థంభం వద్ద నున్న నాగదేవతలు
అన్నాలయ్య ::– శ్రీ స్వామి వారి ఆలయం లో దక్షిణావృత శంఖం ఉంది. దీనిప్రభావం అనిర్వచనీయమైనది.భరద్వాజ మహర్షి ఈ శంఖం తోటే స్వామివారికి నిత్యం అభిషేకం చేసేవారని చెపుతారు. ఈ శంఖం ఉండబట్టే ఇక్కడ నిత్యాన్నదానం నిరాటంకంగా జరుగు తోందని జనశృతి.ఎక్కడా లేని విధంగా ఈ మట్టపల్లి మహా క్షేత్రం లో 23 ఎకరాల స్థలం లో ఎన్నో అన్నదాన సత్రాలు వెలిశాయి. అందరూ తమ తమ కులాల పేరున అన్నదాన సత్రాల నెలకొలిపి, అన్న దానం చేయడం ఇక్కడ ప్రత్యేకత. అన్నదానం శ్రీమట్టపల్లి నరసింహునికి ప్రీతి పాత్రమవ్వటయే ఇందులకు కారణం గా కన్పిస్తుంది. ఇక్కడ మొత్తం 13 అన్నదాన సత్రాలున్నాయి. కళ్యాణోత్సవ సమయంలో వీరందరూ వచ్చిన యాత్రికులందరికీ భోజన ఏర్పాట్లు చేస్తారు.
శ్రీ స్వామి వారి అద్దాలమందిరం
ప్రత్యేక ఉత్సవాలు. ::—- ప్రతి శుక్రవారం అమ్మవారు శ్రీ రాజ్యలక్ష్మీ దేవి కి ప్రత్యేక కుంకుమార్చనలు, పర్వదినాలలో లక్ష మల్లికా పుష్పార్చనలు ఉంటాయి. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ద చతుర్ధశి నృసింహ జయంతి సందర్భంగా శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవం పాంచాహ్నిక దీక్ష తో వైఖానసాగమాను సారం గా ఐదు రోజులు నిర్వహించ బడుతుంది.
ఉపాలయం లో శ్రీ విఖనసాచార్య
రవాణా వసతి సౌకర్యాలు .;;—- కోదాడ, హుజూర్ నగర్ నుండి బస్సు సౌకర్యం ఉంది. దేవాలయం వారి వసతి గదులు ఉన్నాయి. అన్న దాన సత్రాలలో ఆయాకులాల వారికి ఆయా సత్రాలు సేవ లందిస్తూనే ఉన్నాయి . కాఫీ, టీ, టిఫిన్లు దొరుకుతాయి.
శ్రీ స్వామి వారి కళ్యాణమండపం
“ రాజ్యలక్ష్మా సమేతాయ రాగద్వేష వినాశినే !
మట్టపల్లి నివాసాయ శ్రీ నృసింహాయ మంగళమ్.
శనివారం ఆంజనేయస్వామిని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగు తాయి
శనివారం ఆంజనేయస్వామిని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగు తాయి. అన్ని వారాల్లోను మంద వారం అని పిలువబడే శనివారం శ్రేష్టమైనది. “సతతం మంద వారేషు భారతః క్షత్రియో త్తమః –హనూమంతం భజం స్థాస్తౌ నిరంకుశ పరాక్రమః” అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమవంతుడు అయినాడు అని అర్ధం. శ్రవణా నక్షత్రంతో కూడిన శనివారంనాడు రుద్ర మంత్రాలతో తైలాభిషేకం చేయాలి. తైలంతో కూడిన గంధసింధూరాన్ని హనుమంతునికి పూస్స్తే, ప్రీతి చెందుతాడు. అభిషేకం చేస్తే అనుగ్రహప్రాప్తి కలుగుతుంది. వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధిబలం పెరుగుతుంది. శత్రుజయం కల్గి మిత్రసమృద్ధి హెచ్చి, యశోవంతులైన పుత్రులు కలుగుతారు.
మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్టమాసాలలో ఏ మాసంలోనైనా కాని, కార్తీక శుద్ధ ద్వాదశి నాడుకాని శనివార వ్రతం చేయాలి. శనివార వ్రాత విధానం –ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకొని, కొత్త పాత్రలతో బయటి నుండి నీరు తెచ్చుకొని హనుమకు అభిషేకం చేయాలి. అన్ని వర్ణాలవారు, స్త్రీలు కూడా చేయవచ్చు. నలభై రోజులు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. ఆంజనేయస్వామికి చెందిన అనేక మంత్రాలున్నాయి. అందులో ఒక దాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది యధావిథిగా జపించాలి. దీనివల్ల జన వశీకరణ కలుగుతుంది. ధనలాభం, ఉద్యోగ ప్రాప్తి, కారాగృహ విమోచనం లభిస్తాయి.
శనివార వ్రతానికి ఇంకో కారణం కూడా వుంది. శనిగ్రహం ఎంత క్రూర స్వభావుడో అంతటి సౌమ్యమూ ఉన్నవాడు. ఒకసారి శనిదేవుడు, హనుమను సమీపించి “మారుతీ! నేను శనిని, అందర్నీ పట్టి బాధించాను. ఇంత వరకు నిన్ను పట్టుకోలేదు. ఇప్పుడు చిక్కావు.’’ అన్నాడు. దానికి హనుమ “శనీశ్వరా! నన్ను పట్టుకొంటావా? లేక నాలో ఉంటావా? నాలో ఉండదలిస్తే ఎక్కడ ఉండాలని కోరికగా వుంది?’’అని ప్రశ్నించాడు. అప్పుడు శని, హనుమ శిరస్సు మీద ఉంటానని చెప్పాడు. సరేనని శిరస్సు మీద శనిని చేర్చుకున్నాడు మారుతి. ఆయనకు శనిని బాధించాలని మనసులో కోరిక కలిగింది. ఒక మహా పర్వతాన్ని పెకలించి నెత్తిమీదకు ఎత్తుకొన్నాడు హనుమ. “కుయ్యో మొర్రో అని ఆ భారం భరించలేక శని గిలగిల తన్నుకున్నాడు బరువు దించమని ప్రాధేయ పడ్డాడు. జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువుకు ప్రదక్షిణం చేయటం మొదలు పెట్టాడు. ఊపిరాడక శని వల వల ఏడ్చేశాడు. తోకలో బంధింపబడి ఉన్నందున నేలమీద పడి దొర్లుతూ, ఏడుస్తూ ప్రార్ధించాడు. శని స్తోత్రాలకు పవన కుమారుడు సంతోషించి “మందా! నన్ను పట్టుకొని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు. అప్పుడే గిజగిజ లాడిపోతున్నావే?’’అని ప్రశ్నించాడు. “ప్రజలను బాధించటమే నీ ధర్మంగా ప్రవర్తిస్తున్నావు. అందుకని నిన్ను ఒక రకంగా శాశించి వదిలి పెడతాను’’అన్నాడు. గత్యంతరం లేక శని సరేనన్నాడు.
హనుమ “శనీ! నా భక్తులను బాధించరాదు. నన్ను పూజించేవారిని, నా మంత్రాన్ని జపించేవారిని, నా నామస్మరణ చేసే వారిని, నాకు ప్రదక్షిణం చేసేవారిని, నా దేవాలయాన్ని సందర్శించే వారిని, నాకు అభిషేకం చేసేవారిని ఏకాలంలోనైనా ముట్టుకోకూడదు. నువ్వు బాధించరాదు. మాట తప్పితే కఠినాతి కఠినంగా నిన్ను దండిస్తాను”అని చెప్పి, శనితో వాగ్దానం చేయించుకొని వదిలిపెట్టాడు. అందుకే శనివారం ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నది. శనిని తోకతో నేల మీద పడేసి లాగటం వల్ల శని శరీరమంతా గాయాలై బాధించాయి. ఆ బాధా నివృత్తికే శనికి తైలాభిషేకం చేస్తారు. ఈ విధంగా తైలాభిషేకం చేసిన వారిని శనిదేవుడు బాధించటం లేదు.
“మంద వారేషు సం ప్రాప్తే హనూమంతం ప్రపూజ ఎత్ –సర్వేశ్వాపి చ వారేషు మంద వారః ప్రశాస్యతే;
హనూమజ్జన్మనో హేతు స్తస్య ప్రాశస్త్య ముచ్చ్యతే –తస్మాత్తస్మిన్ కృతా పూజా సర్వ కామ ఫలప్రదా”
శని వారం రాగానే హనుమను పూజించాలి. ఆయన శనివారం జన్మించటం వల్ల దానికి అంత ప్రాముఖ్యత లభించింది. అందుకే శనివారం చేసే హనుమపూజ సర్వ కామ్యార్ధ సిద్ధి కల్గిస్తుంది సకల శ్రేయస్సును ఇస్తుంది.
ఇతి శ్రీబ్రహ్మాణ్డపురాణే శుక్రకవచం సమ్పూర్ణమ్
ఈ శుక్ర కవచాన్ని శుక్ర వారం ఉదయం పారాయణ ప్రారంబించాలి రోజు 6నిమిషాలు గాని 60 నిమిషాలు గాని 6సార్లు గాని 60సార్లు గాని పారాయణ చేయచ్చు.ఈ శుక్ర కవచ పారాయణ వల్ల వివాహనికి అడ్దంకులు తొలుగుతాయి షుగరు వ్యాది నయం అవుతుంది అప్పుడె పుట్టిన శిశివు యెక్క ఆరోగ్యం బాగుపడుతుంది .చర్మ వ్యాదులు తొలుగుతాయి ఐతే ముఖ్యంగా గుర్తు పెట్టుకోవల్సిన విషయం ఏంటంటే గురు ముఖత ఉపదేశం లేనిదే పారాయణ చేయరాదు
శ్రీగణేశాయ నమః|
మృణాలకున్దేన్దుపయోజసుప్రభం పీతామ్బరం ప్రసృతమక్షమాలినమ్|
సమస్తశాస్త్రార్థవిధిం మహాన్తం ధ్యాయేత్కవిం వాఞ్ఛితమర్థసిద్ధయే|| ౧||
ఔమ్ శిరో మే భార్గవః పాతు భాలం పాతు గ్రహాధిపః|
నేత్రే దైత్యగురుః పాతు శ్రోత్రే మే చన్దనద్యుతిః|| ౨||
పాతు మే నాసికాం కావ్యో వదనం దైత్యవన్దితః|
వచనం చోశనాః పాతు కణ్ఠం శ్రీకణ్ఠభక్తిమాన్|| ౩||
భుజౌ తేజోనిధిః పాతు కుక్షిం పాతు మనోవ్రజః|
నాభిం భృగుసుతః పాతు మధ్యం పాతు మహీప్రియః|| ౪||
కటిం మే పాతు విశ్వాత్మా ఉరూ మే సురపూజితః|
జానుం జాడ్యహరః పాతు జఙ్ఘే జ్ఞానవతాం వరః|| ౫||
గుల్ఫౌ గుణనిధిః పాతు పాతు పాదౌ వరామ్బరః|
సర్వాణ్యఙ్గాని మే పాతు స్వర్ణమాలాపరిష్కృతః|| ౬||
య ఇదం కవచం దివ్యం పఠతి శ్రద్ధయాన్వితః|
న తస్య జాయతే పీడా భార్గవస్య ప్రసాదతః|| ౭||
|| ఇతి శ్రీబ్రహ్మాణ్డపురాణే శుక్రకవచం సమ్పూర్ణమ్||
కర్మ పరిపక్వత
కర్మ పరిపక్వత
పార్వతి " నాధా ! మానవులు నాలుగు వర్ణములుగా విభజింపబడ్డారు కదా. వారికి కర్మలు విధించారు కదా ! ఆ కర్మలు ఎలా పరిపక్వము ఔతాయి. వివరించండి ? " అని అడిగాడు. పార్వతి " మానవులను వర్ణములుగా విభజించిన తరువాత వారి వారికి తగిన కర్మలు విభజించబడ్డాయి. ఆ కర్మలు శ్రద్ధతోచేయు మానవులు స్వర్గంలో సుఖాలను అనుభవిస్తారు. అలా కాకుండా తమ వృత్తి ధర్మాలను వదిలి ఇతర ధర్మాలు ఆచరించిన మానవులు మరణం తరువాత ఆయాకులములలో తిరిగి జన్మిస్తారు. తరువాత తిరిగిరాని లోకాలు పొందుతారు. దేవతాంశలలో జన్మించిన వారు ఆపదలు వచ్చినప్పుడు కుంగిపోరు. గర్వంతోమదించరు. తన శౌర్యంతో పాపులను గెలుస్తారు. తమ బంధుమిత్రులతో సఖ్యతతో మెలగుతారు. దీనులను కరుణతో చూస్తారు. వారిని రక్షిస్తారు. దైవాంశతో పుట్టిన వారికి కోపం రాదు. సౌమ్యంగా ఉంటారు " అని మహేశ్వరుడు చెప్పాడు.
సంపదలు దరిద్రము
పార్వతీదేవి " నాధా ! మానవ లోకములో కొంతమంది సుఖసంతోషాలతో సిరిసంపదలతో తులతూగుతుంటారు. సుఖాలను అనుభవిస్తుంటారు. కాని కొంతమంది దరిద్రంతో బాధపడుతుంటారు. దీనికి కారణం ఏమిటి ? " అని అడిగింది పార్వతి. పరమశివుడు " గతజన్మలో కాకులకు కూడా మెతుకులు పెట్టకుండా పిడికెడు భిక్షము వెయ్యకుండా పిసినారిగా గడిపిన వాడికి ఈ జన్మలో దారిద్ర్యంచుట్టుకుంటుంది. తినడానికి తిండి కట్టడానికి బట్టలేక బాధపడతాడు. అలా కాక పేదవారికి అన్నపానములు ఇచ్చిన వాడికి తన బంధువులను స్నేహితులను కష్టకాలంలో ఆదుకున్నవాడికి మరుజన్మలో సిరిసంపదలు కలుగుతాయి. సుఖంగా జీవిస్తారు. కనుక సుఖదుఃఖములు వారి వారి పూర్వజన్మ కర్మపరిపక్వత వలన కలుగుతుంది. అంతేకాని బ్రహ్మదేవుడికి ఒకరి మీద ప్రేమ మరొకరి మీద ద్వేషము ఉండదు. దేవుడు ఎవరిని పేదవాడుగా పుట్టించడు. ఎవరైనా ఈ జన్మలో పేదవాడుగా జన్మించి కష్టములు అనుభవిస్తున్నాడంటే అది అతడు పూర్వజన్మలో చేసిన పాపములఫలము అని తెలుసుకోవాలి. పార్వతీ ! కొంత మందికి సంపదలు ఉంటాయి కాని వారు కడుపునిండా తినరు, అనుభవించరు అలా సంపదఉన్నా దరిద్రము అనుభవిస్తుంటారు. ఎందుకో తెలుసా ! వీరు పూర్వ జన్మలో ఎవరికీ పిడికెడు అన్నము పెట్టి ఉండరు. బంధువులు, మిత్రులు పోరగా బలవంతంగా పరులకు ఉపకారం చేసి ఉంటారు. అలాంటి వారు సిరిసంపదలు ఉన్నా అనుభవించలేరు. కొంతమంది తమకు ఏమీ లేకపోయినా బంధుమిత్రుల సహాయంతో తిండికి గుడ్డకు లోటులేకుండా జీవిస్తుంటారు. అలాంటి వారు పూర్వజన్మలో తమకు శక్తి లేకపోయినా ఇతరులకు దానధర్మములు చేయవలెనని మనసులో ఘాఢంగా కాంక్షిస్తుంటాడు. అందువలన ఈ జన్మలో కూటికి గుడ్డకు లోటు లేకుండా జీవిస్తుంటారు. ఈ జన్మలో కొంతమంది అయాచితంగా ధనము లభిస్తుంది. అలాంటి వారు పూర్వజన్మలో పేదలకు అన్నదానము, ధనరూప దానము, వస్త్రదానము చేసి ఉంటారు. ఈ జన్మలో శ్రమతో ధనము సంపాదించే వారు పూర్వ జన్మలో ఎవరిని తిప్పించుకోకుండా పేదవారు అడగగానే దాన ధర్మములు చేసినవారు. కొంతమందికి ఎంత శ్రమపడ్డా ధనముచేకూరదు. అలాంటి వారు పూర్వజన్మలో లోభులై తమను యాచించిన వారిని రేపురా మాపురా అని తప్పించుకుని చివరకు మొండిచెయ్యి చూపి ఉంటారు. కొంత మందికి ముసలితనంలో అలాంటి వారు యవ్వనంలో ఉన్నప్పుడు దానధర్మములు చెయ్యకుండా ముసలితనంలో దానధర్మములు చేసినవారు. కొంతమంది తమకు మిక్కుటంగా ధనము కలిగినప్పటికీ వారికి ఉన్న రోగముల చేత తిండికూడా తినలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారు పూర్వజన్మలో మంచిస్థితిలో ఉన్నప్పుడు దానము చేయకుండా వ్యాధిపీడితుడైన తరువాత దానధర్మములు చేసి ఉంటారు. ఈ జన్మలో అందంగా ఉన్నవారు పూర్వజన్మలో శాకాహారం తిన్నవారు. ఈ జన్మలో కురూపులుగా ఉన్నవారు పూర్వజన్మలో అందగాళ్ళై కురూపులను ఎగతాళి చేసి బాధించిన వారై ఉంటారు. పూర్వజన్మలో ఏకపత్నీవ్రతుడై ఉన్న వాడికి ఈ జన్మలో సౌందర్యవతీ, సౌశీల్యవతీ, గుణవతీ అయిన భార్య లభిస్తుంది. అలా కాక భార్యను కష్ట పెట్టినవాడికి ఈ జన్మలో భార్యాసుఖం దూరమౌతుంది. ఈ జన్మలో విద్యా, విజ్ఞానము, జ్ఞానము కలిగి ఉండికూడా పేదరికంతో బాధపడే వాడు క్రితం జన్మలో దానధర్మములు చేయాలి అని తెలిసి కూడా దానధర్మములు చేయని వాడే. ఈ జన్మలో తెలివితేటలు లేకపోయినా కూడా అధికంగా ధనము సంపాదించిన వాడు. కిందటి జన్మలో తెలివి తక్కువ వాడైనా పేదసాదలకు దానధర్మములు చేసిన వాడై ఉంటాడు. ఈ జన్మలో విద్యావంతుడు మేధావి అయిన వాడు పూర్వజన్మలో గురువులను సేవించి విద్యావంతుడై తాను నేర్చుకున్న విద్యను ఇతరులకు నేర్పించిన వాడై ఉంటాడు. కొంత మందికి విద్య నేర్చుకోవాలని అనుకున్నా విద్య రాదు. అటువంటి వాడు పూర్వజన్మలో విద్యావంతులై గర్వించి సాటి విద్యావంతులను అవమానించి ఉంటారు. ఈ జన్మలో ఏరకమైన బాధలు లేకుండా రోగాలు లేకుండా భార్యా బిడ్డలతో సుఖంగా జీవిస్తున్న వారు పూర్వ జన్మలో సత్యము పలుకుచూ ఇతరుల మీదదయ చూపుతూ దానధర్మములు చేసినవారు. ఈ జన్మలో మాటవినని భార్య, మూర్ఖులైన కుమారులు, ఒంటి రోగముతో నిండా బాధపడే వారు కిందటి జన్మలో కోపంతోనూ, దురాశతోనూ, నాస్థికత్వముతో విర్రవీగిన వారు. ఈ జన్మలో పుట్టుగుడ్డి వాడు లేక మధ్యలో చూపుపోయిన వాడు పూర్వజన్మలో అందగాడై ఉండి ఇతరుల భార్యల వంక చెడుభావనతో చూసిన వాడు. ఈ జన్మలో చెవిపోటుతో బాధపడే వాడు పోయిన జన్మలో మంచి వారిని పరుషమైన మాటలతో బాధపెట్టినవాడై ఉంటాడు. ఉదరవ్యాధులతో బాధపడేవాడు పోయినజన్మలో ఇతరులకు విషం పెట్టినవాడు. మూత్రకోశ వ్యాధులతో బాధపడే వాడు పోయిన జన్మలో కన్యలను, పర కాంతలను శీలము కాజేసిన వాడు. ఈ జన్మలో క్షయరోగముతో బాధపడుతున్న వాడు పోయిన జన్మలో పరుల ఆహారమును అపహరించిన వాడై ఉంటాడు. ఈ జన్మలో కుష్టురోగముతో బాధపడే వాడు పూర్వ జన్మలో పరులను దారుణంగా హింసించిన వాడై ఉంటాడు. ఈ జన్మలో కుంటివాడుగా ఉన్నవాడు పోయిన జన్మలో పరుల కాళ్ళుచేతులు విరిచిన వారై ఉంటారు. ఈ జన్మలో చర్మరోగంతో బాధపడే వారు పోయిన జన్మలో మంచి వారిని హింసించిన వారు. ఈ జన్మలో పాదములకు రోగములు వచ్చిన వారు పోయినజన్మలో పాదములు కడగకుండా దేవుని వద్దకు వెళ్ళిన వారే. ఇంకా పేద వారిని, అమాయకులను నిష్కారణంగా పాదములతో తన్నినవారే. ఈ జన్మలో కడుపులో రోగములతోను, జ్వరముతోనూ, శరీరం అంతా రోగములతో బాధపడేవారు పోయినజన్మలో జంతువులను చంపినవారు గురువులను బాధపెట్టినవారు. ఈ జన్మలో గూనివాడు, మరగుజ్జువాడు పోయిన జన్మలో ధాన్యంలో తాలుగింజలు కలిపి అమ్మినవాడు, తప్పుడు కొలతలతో ప్రజలను బాధపెట్టినవాడు. ఈ జన్మలో వెర్రివాడు పిచ్చివాడు పోయిన జన్మలో అమాయకులను మోసగించి ధనం సంపాదించినవారు. ఈ జన్మలో సంతానము లేనివారు పోయిన జన్మలో తల్లితండ్రులకు శ్రాద్ధం పెట్టనివారు, పసిపిల్లలను చంపినవారు. ఈ జన్మలో నపుంసకులు పోయినజన్మలో ఎద్దులకు వృషణాలు కొట్టినవారు. ఈ జన్మలో వైధవ్యము పొందిన వనిత పోయిన జన్మలో భర్తనుమోసగించి ధనము సంపాదించినది, తనభర్తను వదిలి మరియొకరి భర్తనుకోరింది. ఈ జన్మలో గొప్పవంశంలో పుట్టి కూడా చేయకూడని పనులు అందరూ ఏవగించుకునే పనులు చేసిన వారు పూర్వజన్మలో అహంకారంతో, గర్వంతో, మదంతో ఇతరులను అవమానించిన వారు. ఈ జన్మలో సేవకులుగా సేవకావృత్తి చేస్తూ యజమానులు పెట్టే బాధలను భరిస్తున్న వారు పూర్వజన్మలో అమాయకులను నిరపరాధులను కొడుతూ తిడుతూ హింసించినవారే. ఈ జన్మలో చెయ్యని నేరానికి శిక్ష అనుభవించేవారు. పూర్వజన్మలో నిరపరాధిని శిక్షించినవాడే. ఈ జన్మలో ఒక్కసారిగా బంధుమిత్రులను పోగొట్టుకున్నవాడు. పూర్వజన్మలో నిర్దాక్షిణ్యంగా ఎందరినో చంపినవాడు. ఈ జన్మలో తనకున్న ధనమును పోగొట్టుకున్న వాడు పూర్వజన్మలో తనదగ్గర దాచిన ఇతరుల ధనమును వారిని మోసము చేసి అపహరించిన వాడు. పార్వతీ నేను పైన చెప్పిన పాపములు చేసిన వారందరూ ముందు నరకము అనుభవించి తరువాత మానవులుగా పుట్టి ఆ కర్మ ఫలము అనుభవిస్తున్న వారే. క్రితము జన్మలో తక్కువ పాపములు చేసిన వాడు మానవుడుగా జన్మిస్తాడు. ఏ జన్మలో చేసిన పాపాలు ఆ జన్మలో అనుభవానికి రావు " అని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు.
Subscribe to:
Posts (Atom)