
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 13 November 2015
ఆశ్వీయుజ కృష్ణ ద్వాదశి ------ గోవత్స ద్వాదశి
ఆశ్వీయుజ కృష్ణ ద్వాదశి ------ గోవత్స ద్వాదశి
ఆశ్వీయుజ బహుళ ద్వాదశి. ఈ రోజున దూడతో కూడిన గోవును పూజించాలి. ప్రదోష కాలంలో నున్న ద్వాదశీ రోజున చేయాలి. ఈ రోజున వత్స (దూడ) తో కూడి వున్న గోవును పూజించాలి. రాగి పాత్రతో దాని పాదమందు అర్ఘ్యము ఇవ్వాలి.
క్షీర సాగర మదనంలో కామధేనువై జన్మించి దేవాసురులచే పూజించ బడినట్టి సకల దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతా నీకు నమస్కారము. ఈ అర్ఘ్యం గ్రహించు అని అర్ధం.
ఋగ్వేదంలో "ఋక్కులు" పశువుల యొక్క ప్రాముఖ్యతను వివరించాయి. ఋగ్వేద కాలమునాటి ఆర్యులు పశు సంపద మీద ఎక్కువగా ఆధార పడ్డారు కాబట్టి ఆవుకు అతి పవిత్రమైన స్థానమిచ్చి చాలా ప్రాముఖ్యతను ఆపాదించారు. ఈ కాలంలో పశువులను "గోధనముగా"భావించడమే కాకుండా, ఎవరికి ఎక్కువ పశు సంపద వుంటుందో, వారిని "గోమతులు" అని పిలిచేవారు.
ఈ రోజున తైల పక్వము, స్థాలీ పక్వము గోసంభందమైన పాలు, పెరుగు, నెయ్యి మొదలగు అన్నింటిని విడిచి పెట్టాలి. రాత్రి పూత మినుముతో చేసిన ఆహారాన్ని తిని భూమి మీదనే విశ్రమించాలి. ఇలా ఐదు రోజులు ఈ విధిని ఆచరించాలి. ఈ ఐదు రోజులు రాత్రి తోలి అర్ధ భాగంలో నీరాజన విధి నిర్వర్తించాలి. ఈ ద్వాదశి వెళ్ళిన మరునాడు త్రయోదశి రోజున అపమృత్యు నివారణార్ధం యమునికి బలిదీపాన్ని ఇవ్వాలి.
వల్లూరి పవన్ కుమార్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment