What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 10 July 2019

ఆదిపర్వం.: వ్యాస భగవానుడు మహాభారత కథను అనర్గళంగా ఆశువుగా చెప్పసాగాడు గణపతికి.

ఆదిపర్వం.
----------------
వ్యాస భగవానుడు మహాభారత కథను అనర్గళంగా  ఆశువుగా చెప్పసాగాడు గణపతికి.  గణేశుడు కూడా అంతే నేర్పుతో చకచకా వ్రాయసాగాడు.  అయితే, యెక్కడైనా విరామం వస్తే వ్రాయడం ఆపేస్తానన్నాడుకదా మన గణేశుడు !  వ్యాసుడేమో నీవు అర్ధం చేసుకుని వ్రాయాలని చెప్పాడుకదా !  అందుకే వ్యాసుడు వుపాయంగా తాను ఆలోచించుకొని వీలు చిక్కడానికి మధ్య మధ్యలో ' గ్రంథ గ్రంధి ' ని  వాడుకుంటూ,  అది గణేశుడు అర్ధం చేసుకొనే లోపు  తాను కావాలసిన శ్లోకాలను మనస్సులో సమకూర్చుకునేవాడు.  ఆహా ! ఒకప్రక్క వ్యాసుని చమత్కారం తో కూడిన పాండిత్యము.  వేరొక ప్రక్క గణేశుని శ్లోకాలు అర్ధంచేసుకోవాలనే జిజ్ఞాస.  ఇరువురికిరువురూ సమఉజ్జీలుగా గ్రంథ రచన సాగింది. ఇట్టి కఠినమైన శ్లోకాలు 8,800  వివిధ దశలలో వాడినట్లు  వ్యాసులవారే చెప్పారు.

ఇక భారత కథావిశేషాలు శౌనకాది మహామునులకు సూతుడు చెప్పిన ప్రకారం :

శ్రీకృష్ణ అవతార సమాప్తి అనంతరం కలియుగం ప్రారంభం కాగానే, పరీక్షిత్తు రాజ్యాధికారం స్వీకరించాడు. వ్యాసుడు ఆ సమయానికే బదరికాశ్రమంలో భారత రచన ప్రారంభించి మూడు సంవత్సరాలలో విఘ్నేశుని సహకారంతో పూర్తిచేశాడు. ఆ తరువాత ఈ కథను వ్యాసుడు తన కుమారుడైన శుకునికి, వైశంపాయనుని సమక్షంలో వినిపించాడు.  

పరీక్షిన్మహారాజు, ధర్మనిష్ఠతో ధర్మాన్ని నాలుగు పాదాలా నడిపిస్తుండడంతో,  కలి పురుషుడు తన ప్రతాపం చూపించడానికి సమయం కోసం వేచి వున్నాడు. ధర్మదేవత కలి
యొక్క దుష్ట చింతనను పరీక్షిత్తుకు తెలియజేసి, తనను కలిపురుషుని నుండి కాపాడమని మొరబెట్టుకున్నది.  కలిని,  పరీక్షిత్తు తన రాజ్యంలో కలిమాయను ప్రవేశపెట్టడానికి వీలులేదని హెచ్చరించాడు.  అయినా యుగధర్మం నెరవేర్చాలని తన ప్రయత్నంలో తాను వున్నాడు కలి అవకాశం కోసం ఓపికగా యెదురుచూస్తూ.  

ఆ రోజుల్లోనే, పరీక్షిత్తు అరణ్యానికి వేటకై వెళ్లి,దప్పికతో బాధపడుతూ దగ్గరలో వున్న ' శమీక ముని '  ఆశ్రమానికి వెళ్ళాడు.   ఆయన ధ్యాన నిష్ట లో వుండి పరీక్షిత్తు పిలిచినా సమాధానం చెప్పలేదు.  దానికి రాజు ఆగ్రహించి తనను లక్ష్యపెట్టలేదనే క్షణికమైన అహంకారంతో, ఊగిపోయాడు.  అవకాశం కోసం యెదురుచూస్తున్న కలి వెంటనే పరీక్షిత్తు ని ఆవహించాడు.  అంతే, ఆ కోపాగ్ని శగలలో తప్పొప్పులు మర్చిపోయి, పరీక్షిత్తు ప్రక్కనే చచ్చిపడివున్న ఒక సర్పకళేబరాన్ని, తన ధనుస్సుతో తీసి, శమీకముని మెడలో దండగా వేసి అక్కడనుంచి నిష్క్రమించాడు.  

ఒక్కసారి ఆ సన్నివేశం నుంచి ప్రక్కకు తొలగగానే, కలి పరీక్షిత్తు నుండి వైతొలగడం,  జరిగిన సంగతి గుర్తుకు తెచ్చుకుని, పరీక్షిత్తు కుమిలిపోవడం జరిగింది.  చూద్దాం !  ఈ క్షణికావేశం యే విధమైన పరిణామాలకు దారి తీస్తుందో! 

పరీక్షిత్తు శమీకునినుండి వెళ్లిన క్రొద్దిసేపటికి, శమీకుని కుమారుడు ' శృంగి ' తపస్సంపన్నుడు రావడం,  తండ్రి గారి మెడలో ఆ మృతసర్పం వ్రేలాడుతుండడం చూడడం,  దివ్యదృష్టితో జరిగినది తెలుసుకోవడం వెంటవెంటనే   జరిగిపోయింది.   యువకుడైన శృంగి కూడా ఆవేశం చంపుకొనలేక, తన తండ్రిని యీ విధంగా అవమానించిన పరీక్షిత్తు వారం రోజులలో పాముకాటుతోనే మరణించునట్లు శాపం పెట్టాడు.   శమీకుడు ధ్యానం నుండి మేలుకుని తనకుమారుని ఆవేశానికి మందలించి రాజుకు శాపమివ్వడం తగదని హితవు పలికాడు.  అయినా అప్పటికే జరగవలసింది జరిగిపోయింది.

ఇంతకీ ఈ పరీక్షిత్తు అంటే యెవరో కాదు.పాండవుల మనుమడు. సుభద్రకు అర్జునునకు పుట్టిన అభిమన్యుని కుమారుడు.  ఎంతటివాడైనా తన శాప విముక్తికోసం ఒంటి స్తంభపు మేడలో వారం రోజులు భాగవత కథా సప్తాహం శుకమహర్షి ద్వారా జరిపించుకొని చివరకు,  ఆ వొంటి స్తంభపు మేడలో తాను వున్న గదిలోకి అరటిపండు ద్వారా ప్రవేశించిన ' తక్షకుడు ' అనే సర్పం విషపు కాటుకు బలికాక తప్పలేదు.  ఆహా విధి వైపరీత్యం.  అది తప్పించుకొనే విషయము కాదని తెలుసుకునే, భాగవత కథామృతం లో తేలియాడి పరమపదం పొందాడు పరీక్షిత్తు.  

మహాభారత మొదటి దశలోనే యీ గాథ యందలి సూక్ష్మ విషయము,  ' విధి కి యెంత వారైనా బద్ధులే ' అని జనావళికి చెప్పారు వ్యాస మహర్షి.  శ్రీ వ్యాసాయ నమోనమ: 

 పరీక్షిత్తునకు నలుగురు కుమారులు.  వారు జనమేజయుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు, శ్రుతశ్రేణుడు.  నలుగురూ అశ్వమేధయాగములు చేసిన ఘనులే.  అందులో పెద్దవాడైన జనమేజయుడు పరీక్షిత్తు తర్వాత రాజ్యాధికారం చేపట్టాడు.  కలి ప్రభావం వలన తన తండ్రిని చంపిన తక్షకునిపై ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నాడు.

Read More

మన హైందవ సనాతన సంస్కృతిలోని ముఖ్యమైన సమాచారం ఈ తరం పిల్లలకు అందుబాటులో నేర్పించండి, చదివించండి!

మన హైందవ సనాతన సంస్కృతిలోని ముఖ్యమైన సమాచారం ఈ తరం పిల్లలకు అందుబాటులో నేర్పించండి, చదివించండి!

1. లింగాలు : 3
        పుం, స్త్రీ, నపుంసక.

2. వాచకాలు : 3.
      మహద్వా, మహతీ, అమహత్తు.

3. పురుషలు : 3.
    ప్రథమ, మధ్యమ, ఉత్తమ.

4. దిక్కులు : 4.
      తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం.

 5. మూలలు : 4.
         ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం,          
         ఈశాన్యం.

6. వేదాలు : 4.
          ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, 
          అధర్వణ వేదం.

7. ఉపవేదాలు : 4.
         ధనుర్వేద, ఆయుర్వేద, గంధర్వ, శిల్ప.

8. పురుషార్ధాలు : 4.
          ధర్మ, అర్థ, కామ, మోక్షాలు.

9. చతురాశ్రమాలు : 4.
      బ్రహ్మ చర్యం, గార్హస్య్ద, వానప్రస్థం, 
      సన్యాసం.

10. పంచభూతాలు : 5.
        గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని.

 11. పంచేంద్రియాలు : 5.
        కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం.

 12. భాషా భాగాలు : 5.
         నామవాచకం, సర్వనామం, విశేషణం,         
         క్రియ, అవ్యయం.

13. కళలు : 5.
         కవిత్వం, చిత్రలేఖనం, నాట్యం, 
         సంగీతం, శిల్పం.

14. పంచకావ్యాలు : 5.
     ఆముక్తమాల్యద, వసుచరిత్ర, మనుచరిత్ర,   
     పారిజాతాపహరణం, శృంగార నైషధం.

15. పంచగంగలు : 5.
      గంగ, కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర.

16. దేవతావృక్షాలు : 5.
       మందారం, పారిజాతం, కల్పవృక్షం,     
       సంతానం, హరిచందనం.

17. పంచోపచారాలు : 5.
        స్నానం, పూజ, నైవేద్యం, ప్రదక్షిణం,       
        నమస్కారం.

18. పంచాగ్నులు : 5.
        బడబాగ్ని, జఠరాగ్ని, కష్టాగ్ని, వజ్రాగ్ని,        
        సూర్యాగ్ని.

19. పంచామృతాలు : 5.
        ఆవుపాలు, పెరుగు, నెయ్యి, చక్కెర,      
        తేనె.

20. పంచలోహాలు : 5.
       బంగారం, వెండి, రాగి, సీసం, తగరం.

21. పంచారామాలు : 5.
        అమరావతి, భీమవరం, పాలకొల్లు, 
        సామర్లకోట, ద్రాక్షారామం.

22. ధర్మరాజు అడిగిన ఊళ్ళు : 5.
         ఇంద్రప్రస్థం, కుశస్థం, వృకస్థలం, 
         వాసంతి, వారణావతం.

23. వేదాంగాలు(స్మ్రతులు) : 6.
         శిక్ష , వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం,   
         జ్యోతిష్యం, కల్పం.

24. షడ్రుచులు : 6.
        తీపి, పులుపు, చేదు, వగరు, కారం,  
        ఉప్పు.

25. అరిషడ్వర్గాలు(షడ్గుణాలు) : 6.
         కామం, క్రోధం, లోభం, మోహం, 
         మదం, మత్సరం.

26. ఋతువులు : 6.
         వసంత, గ్రీష్మ, వర్ష, శరద్ఋతువు, 
          హేమంత, శిశిర.

27. షట్చక్రాలు : 6.
        మూలధార, స్వాధిష్టాన, మణిపూరక, 
        అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలు.

28. షట్చక్రవర్తులు : 6.
         హరిశ్చంద్రుడు, నలుడు,సగరుడు,         
         పురుకుత్సుడు, పురూరవుడు,  
         కార్తవీర్యార్జునుడు.

29. సప్త ఋషులు : 7.
         కాశ్యపుడు, గౌతముడు, అత్రి, 
         విశ్వామిత్రుడు, భరద్వాజ, జమదగ్ని, 
         వశిష్ఠుడు.

30. తిరుపతి సప్తగిరులు : 7.
       శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి,       
       వృషభాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి.

31. కులపర్వతాలు : 7.
       మహేంద్ర, మలయ, సహ్యం,    
       శుక్తిమంతం, గంధమాధనం, వింధ్య, 
       పారియాత్ర.

32. సప్త సముద్రాలు : 7.
          ఇక్షు, జల, క్షీర, లవణ, దది, సూర, 
          సర్పి.

33. సప్త వ్యసనాలు : 7.
          జూదం, మద్యం, దొంగతనం, వేట, 
         వ్యబిచారం, దుబారఖర్చు, కఠినంగా 
         మాట్లాడటం.

34. సప్త నదులు : 7.
          గంగ, యమునా, సరస్వతి, గోదావరి,            
           సింధు, నర్మద, కావేరి.

35. ఊర్ధ్వలోకాలు : 7.
          భూ, భువర్ణో, సువర్ణో, తపో, జనో,        
          మహా, సత్య.

36. అధోః లోకాలు : 7.
           అతల, వితల, సుతల, తలాతల, 
           రసాతల, మహాతల, పాతాళ.

37. జన్మలు : 8.
          దేవ, మనుష్య, రాక్షస, పిశాచి, పశు, 
          పక్షి, జలజీవ, కీటక.

38. కర్మలు : 8.
            స్నానం, సంధ్య, జపం, హోమం,            
            స్వాధ్యాయం, దేవపూజ, ఆతిథ్యం, 
            వైశ్యదేవం.

39. అష్టదిగ్గజాలు : 8.
        ఐరావతం, పుండరీకం, కుముదం,     
        సార్వభౌమం, అంజనం, సుప్రతీకం, 
        వామనం, పుష్పదంతం.

40. అష్టదిగ్గజకవులు : 8.
          నందితిమ్మన, పెద్దన, ధూర్జటి,       
          పింగళి సూరన, తెనాలిరామకృష్ణ,    
          రామరాజభూషణుడు, 
          అయ్యలరాజురామభద్రుడు, 
          మాదయగారిమల్లన.

41. శ్రీ కృష్ణుని అష్ట భార్యలు : 8.
         రుక్మిణి, సత్యభామ, జాంబవతి, 
         మిత్రవింద, భద్ర, సుదంత, కాళింది, 
         లక్షణ.

42. అష్ట భాషలు : 8.
        సంస్కృతం, ప్రాకృత, శౌరసేని, పైశాచి, 
        సూళికోక్తి, అపభ్రంశం, ఆంధ్రము.

43. నవధాన్యాలు : 9.
            గోధుమ, వడ్లు, పెసలు, శనగలు, 
            కందులు, నువ్వులు, మినుములు, 
            ఉలవలు, అలసందలు.

44. నవరత్నాలు : 9.
        ముత్యం, పగడం, గోమేధికం, వజ్రం, 
        కెంపు, నీలం, కనకపుష్యరాగం, పచ్చ 
        (మరకతం), ఎరుపు (వైడూర్యం).

45. నవధాతువులు : 9.
         బంగారం, వెండి, ఇత్తడి, రాగి,  
         ఇనుము, కంచు, సీసం, తగరం, 
         కాంతలోహం.

46. నవరసాలు : 9.
            హాస్యం, శృంగార, కరుణ, శాంత,        
            రౌద్ర, భయానక, బీభత్స, అద్భుత, 
            వీర.

47. నవబ్రహ్మలు : 9.
           మరీచ, భరద్వాజ, అంగీరసుడు,  
           పులస్య్తుడు, పులహుడు, క్రతువు,  
           దక్షుడు, వశిష్ఠుడు, వామదేవుడు.

48. నవ చక్రాలు : 9.
            మూలాధార, స్వాధిష్టాన, నాభి,        
            హృదయ, కంఠ, ఘంటికా, భ్రూవు,      
            గగన, బ్రహ్మ రంధ్రం.

49. నవదుర్గలు : 9.
         శైలపుత్రి, బ్రహ్మ చారిణి, చంద్రఘంట,  
         కూష్మాండ, స్కందమాత, కాత్యాయని,  
          కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి.

50. దశ బలములు : 10.
           విద్య, స్నేహ, బుద్ధి, ధన, పరివార,  
          సత్య, సామర్ధ్య, జ్ఞాన, దైవ, కులినిత.

51. దశ సంస్కారాలు : 10.
           వివాహం, గర్భాదానం, పుంసవనం,  
           సీమంతం, జాతకకర్మ, నామకరణం,  
           అన్నప్రాశనం, చూడకర్మ, 
           ఉపనయనం, సమవర్తనం.

52. దశ మహాదానాలు : 10.
             గో, సువర్ణ, రజతం, ధాన్యం, వస్త్ర,         
             నెయ్యి, తిల, సాలగ్రామం, లవణం, 
             బెల్లం.

53. అర్జునుడికి గల పేర్లు: 10.
             అర్జునుడు, పార్ధుడు, కిరీటి,  
             శ్వేతవాహనుడు, బీభత్సుడు,        
             జిష్ణుడు, విజయుడు, సవ్యసాచి,  
             ధనుంజయుడు, పాల్గుణుడు.

54. దశావతారాలు : 10.
           మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, 
           వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ,  
           బుద్ధ, కల్కి.

55. జ్యోతిర్లింగాలు : 12.     
             హిమలయపర్వతం:
                   1. కేదారేశ్వరలింగం,

                   కాశీ: 2.కాశీవిశ్వేశ్వరుడు,

        మధ్యప్రదేశ్: 3.మహాకాలేశ్వరలింగం,                   
                           4.ఓంకారేశ్వరలింగం.

          గుజరాత్: 5.సోమనాధలింగం,   
                          6.నాగేశ్వరలింగం.

          మహారాష్ట్ర :7.భీమశంకరం, 
                             8.త్ర్యంబకేశ్వరం,             
                             9.ఘృష్ణేశ్వరం, 
                            10.వైద్యనాదేశ్వరం.

           ఆంధ్రప్రదేశ్:
                  11.మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)

            తమిళనాడు:  12.రామలింగేశ్వరం.

56. షోడశ మహాదానాలు : 16.
             గో, భూ, తిల, రత్న, హిరణ్య, విద్య,                    
             దాసి, కన్య, శయ్య, గృహ, అగ్రహార, 
             రధ, గజ, అశ్వ, ఛాగ (మేక), మహిషి  
             (దున్నపోతు).

57. అష్టాదశవర్ణనలు : 18.
            నగరం, సముద్రం, ఋతువు, 
            చంద్రోదయం, అర్కోదయం,  
           ఉద్యానము, సలిలక్రీడ, మధుపానం,  
            రతోత్సవం, విప్రలంభం, వివాహం, 
            పుత్రోత్పత్తి, మంత్రము, ద్యూతం, 
            ప్రయాణం, నాయకాభ్యుదయం, 
            శైలము, యుద్ధం.

58. అష్టాదశ పురాణాలు : 18.
              మార్కండేయ, మత్స్య, భవిష్య,         
              భాగవత, బ్రహ్మ, బ్రహ్మవైవర్త, 
              బ్రహ్మాండ, విష్ణు, వాయు, వరాహ, 
              వామన, అగ్ని, నారద, పద్మ, లింగ, 
              గరుడ, కూర్మ, స్కాంద.

59. భారతంలో పర్వాలు : 18.
             ఆది,సభా,అరణ్య,విరాట,ఉద్యోగ,  
             భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్ర్తి,        
             శాంతి, అనుశాసన, అశ్వమేధ, 
             ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థాన, 
             స్వర్గారోహణ.

60. సంస్కృత రామాయణంలో 
                               కాండలు: 6.

           బాల ,అయోధ్య, అరణ్య, కిష్కింద,  
           సుందర,యుద్ధ.
              (తెలుగులో7వకాండ    
                     ఉత్తర. (లవకుశ కథ).


61. శంఖాలు వాటి పేర్లు:
          భీముడు      - పౌండ్రము
          విష్ణువు       -పాంచజన్యం
          అర్జునుడు -  - దేవదత్తం.

62. విష్ణుమూర్తి ఆయుధాల పేర్లు:              
           ధనస్సు - శారంగం,
           శంఖం-పాంచజన్యం,
           ఖడ్గం- నందకం,
           చక్రం - సుదర్శనం.

63. విల్లులు పేర్లు:
               అర్జునుడు   - - గాంఢీవం
               శివుడు        - - పినాకం
               విష్ణువు        - శారంగం

64. వీణలు--పేర్లు:
               కచ్చపి---సరస్వతి,
                మహతి---నారధుడు,
                కళావతి---తుంబురుడు.

65. అష్టదిక్కులు-పాలకులు-ఆయుధాలు:

తూర్పు           ఇంద్రుడు       వజ్రాయుధం 
పడమర         వరుణుడు          పాశం
ఉత్తర             కుబేరుడు          ఖడ్గం
దక్షిణం           యముడు          దండం
ఆగ్నేయం            అగ్ని                 శక్తి 
నైరుతి               నిరృతి            కుంతం 
వాయువ్యం     వాయువు         ధ్వజం 
ఈశాన్యం        ఈశానుడు        త్రిశూలం. 

66. మనువులు                   మన్వంతరాలు 
------------------         - - - - - - - - - - 
స్వయంభువు    -             స్వారోచిష 
ఉత్తమ             -            తామసి 
రైతవ                  -              చాక్షువ 
వైవస్వత             -            సవర్ణ 
దక్ష సువర్ణ        -              బ్రహ్మ సువర్ణ
ధర్మసవర్ణ   - ----------     రుద్రసవర్ణ 
రౌచ్య       ----------------    బౌచ్య .

67. సప్త స్వరాలు :
స -   షడ్జమం    - (నెమలిక్రేంకారం) 
రి    - -   రిషభం    - -    (ఎద్దురంకె) 
గ   - -    గాంధర్వం - -   (మేక అరుపు) 
మ  - -   మధ్యమ - - ( క్రౌంచపక్షికూత) 
ప - -     పంచమం  - - (కోయిలకూత) 
ద   - -   దైవతం     -  (గుర్రం సకిలింత) 
ని - -     నిషాదం   - (ఏనుగుఘీంకారం)

68. సప్త ద్వీపాలు:
జంబూద్వీపం   - -   అగ్నీంద్రుడు 
ప్లక్షద్వీపం         - -    మేధాతిధి
శాల్మలీద్వీపం    - -   వప్రష్మంతుడు
కుశద్వీపం        - -    జ్యోతిష్యంతుడు
క్రౌంచద్వీపం      - -     ద్యుతిమంతుడు
శాకద్వీపం         - -    హవ్యుడు
పుష్కరద్వీపం    - -   సేవకుడు



69. తెలుగు నెలలు: 12
              చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, 
              శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజం, 
              కార్తీకం, మార్గశిరం, పుష్యం, 
              మాఘం, ఫాల్గుణం.

 70. రాశులు :12.
మేషం, వృషభం, మిథునం, కర్కాటకం,
సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం.

71. తిథులు 15.
పాఢ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య /పౌర్ణమి.

72. నక్షత్రాలు 27.
అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వాబాద్ర, ఉత్తరాబాద్ర, రేవతి
Read More

త్రివిధ త్యాగాలు:

త్రివిధ త్యాగాలు:

ఏదో ఒక కర్మ చెయ్యకుండా ఏ ప్రాణీ ఉండలేదు. మంచి పనులు చేస్తే కీర్తి ప్రతిష్టలు, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు వస్తాయి. చెడ్డపనులు చేస్తే సంఘంలో చెడ్డపేరు, నరకయాతనలు, పాపఫలాలు వస్తాయి. 

ఇలా పాపపుణ్యాలు చేస్తూ, స్వర్గనరకాలనుభవిస్తూ, మరల మరల జన్మలెత్తుతూ ఈ జనన మరణ సంసారచక్రంలో ఉండిపోవలసిందేనా? లేక మోక్షం పొందడం ఉందా? అని మనం విచారించడం సహజం.     మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికే గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు.

యత్కరోషి, యదశ్నాసి, యజ్జుహోషి దదాసియత్
యత్తపస్యసి, కౌంతేయ! తత్కురుష్వమదర్పణమ్

తా" అర్జునా! నువ్వేపని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, అదంతా నాకు సమర్పించు.

అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి? 

ఇలా చేస్తే, మనం మూడు త్యాగాలు చేసినట్లవుతుంది. 

మొదటిది కర్తృత్వ త్యాగం. ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి. ఏ కర్మయినా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవత్పరంగా చెయ్యాలి. ఇలా చేస్తే, మనం పాపపు పనులు చేయడానికి జంకుతాము. కర్మసాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కర్యాలకు పూనుకుంటాము.

రెండవది ఫలత్యాగం. ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి. అంతేగాని ఇది చేస్తే నాకీ ఫలం వస్తుంది అని కోరికతో చెయ్యవద్దు. నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి.

మూడోది సంగత్యాగం. ఇది నాది, ఇది నేనే చెయ్యాలి. అంతా నా ఇష్టప్రకారం జరగాలి. ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు. అంతా భగవన్ముఖ వికాసం కోసం, ఆయన ఆనందమే 
నాఆనందం అని మనస్పూర్తిగా అనుకోవాలి. 

సరే! ఈ త్రివిధ త్యాగాలు ఎలా చేయాలి? 
ఏ పనిచేసినా, ఒక్క నమస్కారం పెట్టి, ఒక్క మాట చెపితే చాలు. 

ఏమిటండీ ఆ బంగారాల మాట? అదే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 

పై త్రివిధ త్యాగలను త్రికరణ శుద్ధిగా అవలంబిస్తూ, ఇంకొక్క మాటను కూడా జోడించాలి. అది...
 సర్వేజనా స్సుఖినోభవంతు
Read More

శ్రీకాకుళం గొప్ప చరిత్రకు ప్రసిద్ది.

శ్రీకాకుళం గొప్ప చరిత్రకు ప్రసిద్ది. 

ఈ అద్భుతమైన జిల్లా ఒకసారి కళింగలో భాగంగా ఉంది, 3 వ శతాబ్దపు బి.సి. యొక్క భూస్వామ్య గణతంత్రం, ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నుండి ఒడిషాలోని ఆధునిక కటక్ వరకు విస్తరించి ఉంది. 

చక్రవర్తి అశోకా బి.సి.లో దానిని స్వాధీనం చేసుకునే వరకు, మౌర్యులకు వ్యతిరేకంగా దీర్ఘకాలం ఉన్నది ఈ ప్రాంతం మాత్రమే. 

బి.సి 262-261. అశోకుని ప్రభావంతో, బౌద్ధమతం శ్రీకాకుళం జిల్లాలోని దంతపురి, శాలిహుండం, జగతీమెట్ట మరియు కళింగపట్నం వంటి అనేక ప్రాంతాలకు వ్యాపించింది. శ్రీకాకుళం పట్టణం శివార్లలో బౌద్ధ స్థలాలను కనుగొన్నారు. ఖరీవాలా సమయంలో జైనమతం కళింగ ప్రాంతానికి కూడా ప్రభావితమైంది. చరిత్రకారులు, సంగమయ్యకొండ, శ్రీ ముఖలింగం, విష్ణుకొండ మరియు ఇతర ప్రాంతాల్లో జైనమతం అనుసరించినట్టు ఆధారాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తం చేసారు.

మొదటి మరియు మూడో శతాబ్దాల మధ్య 
ఈ ప్రాంతం శక్తివంతమైన శాతవాహన రాజుల అధికార పరిధిలోకి వచ్చింది. 

ఏ.డి. 350 నాటికి, ఈ ప్రాంతం పిఠాపురం యొక్క వశిష్టపుట శక్తీర్మా రాజ్యంలో భాగంగా ఉంది. ఇది గంగ రాజవంశంలో ఏ.డి. 440 నాటిది. గంగ మరియు మాతారా రాజవంశాలు అనేక శతాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని నియంత్రించాయి, మరియు వారి పాలనలో శ్రీకూర్మం మరియు శ్రీ ముఖలింగం వంటి ప్రధాన ఆలయాలు నిర్మించబడ్డాయి. 

విజయనగర వంశం యొక్క కృష్ణదేవరాయలు ఈ ప్రాంతంపై ప్రయాణిస్తూ మూడుసార్లు దాడి చేశారు, ప్రతాపరుద్ర గజపతి పాలనలో ఇది జరిగింది,     ప్రతాప రుద్ర మంత్రి గోవింద్రరాజా ఈ ప్రాంతాన్ని పాలించారు, 1572 నుండి గోల్కొండ నవాబులు ఈ ప్రాంతాన్ని పాలించారు.

1687 లో శ్రీకాకుళం గుల్షానాబాద్ పాలనలో ఒక గ్రామం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఒడిషాలోని కొన్ని ప్రాంతాలకు తమ డబ్బు లావాదేవీలకు ఫౌజ్దారి కేంద్రంగా ఏర్పడింది. గుల్షానాబాద్ అనే పదం పెర్షియన్ పదాలు, గులాబీ తోట మరియు బెందీ (బెండింగ్) నుండి వచ్చింది. 

1707 నుండి హైదరాబాద్ నిజాం రాష్ట్రంలో ఆదాయ సేకరణ కోసం శ్రీకాకుళం ప్రధాన కార్యాలయంగా ఉంది. ఆంగ్లో-ఫ్రెంచ్ యుద్ధాల సమయంలో 1756 లో బ్రిటీష్ ఇంపీరియలిస్టులు ఫ్రెంచ్ సామ్రాజ్యవాదులు ఈ జిల్లా నుండి బయటపడ్డారు. 1759 లో ఫాజ్దారీ పరిపాలన ముగిసింది మరియు బ్రిటిష్ పాలన మొదలైంది, మరియు శ్రీకాకుళం పట్టణం గంజాం జిల్లాలో భాగంగా ఉంది మరియు విశాఖ జిల్లాలో పాలకొండ మరియు రాజాంగం ప్రాంతాలు చేర్చబడ్డాయి.

బ్రిటిష్ పాలన తరువాత, శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం జిల్లా నుండి విభజన ద్వారా 1950 లో ఏర్పడింది, కొంతకాలంగా దాని ప్రాదేశిక అధికార పరిధి చెక్కుచెదరలేదు. అయితే 1969 నవంబర్లో, విశాఖపట్నం జిల్లాలోని కొత్తగా ఏర్పడిన గజపతినగరం తాలూకా బొబ్బిలి తాలూకా నుండి 44 గ్రామాలు సాలూరు తాలూకా నుండి 63 గ్రామాలు కోల్పోయాయి. 1979 మేలో విజయనగరంలోని ప్రధాన జిల్లాతో కొత్త జిల్లా ఏర్పడటం వలన ఈ జిల్లా ప్రధాన భూభాగ మార్పులకు దారితీసింది. ఇది సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, చీపురుపల్లి తాలూకాలు కొత్త జిల్లాకు మార్చబడ్డాయి.

*అరసవల్లి:
అరసవల్లి గ్రామంలో ఉన్న సూర్యనారాయణస్వామి దేవస్థానం సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

ఆంధ్రప్రదేశ్లోని తీరప్రాంత జిల్లాలోని శ్రీకాకుళం పట్టణానికి తూర్పున ఉంది. ఇది మన దేశంలో రెండు సూర్య దేవాలయాలలో పురాతనమైనది. పద్మ పురాణం ప్రకారం, మానవజాతి యొక్క సంక్షేమం కొరకు కశ్యపారాజు అరసవల్లిలో సూర్య విగ్రహంను స్థాపించారు. సూర్యడు కశ్యపాస గోత్రం అందువలన, అతను గ్రహ రాజుగా కూడా పిలువబడ్డాడు. దేవాలయం యొక్క 'స్ధలపురాణం ' ప్రకారం కశ్యపారాజు ఈ దేవాలయాన్ని స్థాపించి, సూర్యుని యొక్క ఇప్పుడు ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసాడు.

*శ్రీకూర్మము:
విష్ణుమూర్తికి అంకితం చేయబడిన పురాతన మరియు ప్రసిద్ధ దేవాలయాలలో శ్రీకూర్మము ఒకటి. శ్రీకూర్మము విష్ణువు యొక్క రెండవ రూపం, అతను ఒక తాబేలు యొక్క అవతారరంలో ఇక్కడ "శ్రీ కుర్మానాథ" రూపంలో శ్రీకూర్మం అనే గ్రామంలో వెలిసాడు. విష్ణువు "కుర్మావతారా" లో చూడబడిన ఆలయం మొత్తం దేశంలో ఇది ఒక్కటి మాత్రమే. కొన్ని శిలాశాసనాలు ప్రకారం ఈ ఆలయం శివునికి ప్రధాన ఆలయం మరియు శైవులచే (శివ భక్తులు) పూజింపబడినవి. ఇది తరువాత శ్రీ రామనుజాచార్యులు చే వైష్ణవకు మార్చబడింది. ఆలయం ఏకముఖి శిల నుండి నిర్మించబడి ఉంటుంది. దేవాలయ స్తంభాలపై అనేక శాసనాలు ఉన్నాయి, వాటిలో ఎక్కువ భాగం దేవనాగరి (స్క్రిప్టింగ్ లాంగ్వేజ్) లిపిలో 11 వ నుండి 19 వ శతాబ్దం AD వరకు ఉండేవి. ఈ ఆలయ నిర్మాణ శైలి అందమైన శిల్పాలతో అద్భుతంగా నిర్మించబడింది.

*శాలిహుండం:
శాలిహుండం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని గార మండలం లో ఒక గ్రామం మరియు పంచాయితీ. ఇది కళింగపట్నానికి 5 కిలోమీటర్ల దూరంలో పశ్చిమాన, వంశధార నదికి దక్షిణాన ఉంది, శ్రీకాకుళం పట్టణం నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలామంది దీనిని సాలివాటికా, సలియపటికా అని పిలిచేవారు. సుందరమైన పరిసరాల మధ్య అనేక కొండల స్తూపాలు మరియు కొండపై ఉన్న భారీ సన్యాస సంక్లిష్టాలు ఉన్నాయి. 1919 లో ఈ స్థలాన్ని గుడిగు వెంకట రామమూర్తి కనుగొన్నారు. త్రవ్వకాలలో స్మారక కట్టడాలు, నాలుగు స్తూపాలు, చైత్యగ్రిహా, నిర్మాణ ప్రాంతాలు మరియు బౌద్ధమతం యొక్క మూడు దశలను ప్రతిబింబించే అనేక శిల్పాలు, తెరవాడ, మహాయాన మరియు వజ్రయానలు సుమారు 2 వ దశాబ్దంలో కనుగొన్నారు. 'తారా' మరియు మారిచిల విగ్రహాలు ఈ ప్రదేశంలో కనుగొనబడ్డాయి, మరియు ఇక్కడ నుండి బౌద్ధమతం సుమిత్ర మరియు ఇతర దూర ప్రాచ్య దేశాలకు విస్తరించింది.

*శ్రీముఖలింగం:
శ్రీముఖలింగం దేవాలయం వంశధార నది ఎడమ ఒడ్డున ఉన్న శివునికి అంకితం చేయబడింది. అందంగా చెక్కబడిన ఈ దేవాలయం శివుని మూడు రూపాలకి చెందిన ముకులింగేశ్వర, భీమేశ్వర మరియు సోమేశ్వర మూడు దేవాలయాల సమూహం. ఈ ఆలయం ఇండో-ఆర్యన్ శైలిలో నిర్మించబడింది. అద్భుతమైన శిల్పాలు, క్లిష్టమైన శిల్ప శైలి చూడడానికి ఈ ఆలయాన్ని సందర్శించాలి. ఈ దేవాలయ నిర్మాణ శైలి చాలా సొగసైనది. పెద్ద ఆలయ ప్రవేశ ద్వారం, మెట్ల మార్గం మరియు రెండువైపుల రెండు సింహాలు నిర్మించారు. మొదటి గేటు బయటి ప్రకారానికి మిమ్మల్ని తీసుకెళుతుంది.

*కళింగపట్నం:
కళింగపట్నం గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఇది భారతదేశంలో పశ్చిమ ఆక్రమణదారుల ఆగమనం వరకు ఉంది. ఐరోపా వర్తకులు వారి నౌకల సరుకు రవాణా కోసం ఓడరేవును తయారు చేశారు. 1958 వరకు, మలేషియా మరియు సింగపూర్ నుండి భారీ నౌకలు ఈ నౌకాశ్రయానికి వచ్చాయి, ఇందులో సుగంధాలు, వస్త్రాలు మరియు అనేక ఇతర వస్తువులు ఎగుమతి చేయబడ్డాయి. స్థానిక బీచ్ లలో విస్తృతమైన భారీ కోకో తోటలు ఉన్నాయి. బ్రిటీష్ పాలనలో, దేశంలో ప్రవేశించడానికి ఇతర ఆక్రమణదారులను నివారించడానికి ఈ ఓడరేవు మూసివేయబడింది. అయితే బ్రిటిష్ కాలంలో నిర్మించిన లైట్ హౌస్ ఇప్పటికీ పోర్ట్ సమీపంలో ఉంది.

*కవిటి:
కవిటి గ్రామం జిల్లా కేంద్రం నుండి 130 కిలోమీటర్ల దూరంలో రెండు ప్రాంతాల నుండి సోంపేట మరియు ఇచ్చాపురం మధ్య తూర్పు వైపు ఉంది. ఉద్దానం (ఉద్యానవనం) అని పిలవబడే కవిటి మండల ప్రాంతం. ఈ ప్రదేశం తీరప్రాంతంలో, కొబ్బరి, కాషెవత్ట్, జాక్ మరియు ఇతర పండ్ల చెట్లతో విస్తరించి ఉన్న ఒక ఆహ్లాదకరమైన ప్రదేశం. ఉద్దానం ప్రాంతం సందర్శకులకు ఒక సుందరమైన ప్రదేశం. రెండు ప్రసిద్ధ ఆలయాలు చింతామణి అమ్మవారి మరియు శ్రీ సీతారామ స్వామి ఆలయం ఈ గ్రామంలో ఉన్నాయి.

*బారువ:
సోంపేట మండలంలో బారువా శ్రీ కాకుళం పట్టణం నుండి 109 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రసిద్ధి చెందిన శ్రీ కోటిలింగేశ్వర స్వామి, జనార్ధన స్వామి ఆలయం ఈ ప్రదేశంలో ఉన్నాయి. అంతేకాక ఇక్కడ ఒక కొబ్బరి నర్సరీ మరియు ఇక్కడ ఉన్న ఒక కాయిర్ పరిశ్రమ ఉంది. మహేంద్ర తనయ నది ఈ ప్రదేశంలో సముద్రంలోకి ప్రవేశిస్తుంది. ‘బరువా’ ఒక ముఖ్యమైన ఓడరేవు. సముద్ర మట్టం పైన పదిహేను అడుగుల ఎత్తు, ఓడరేవుని గుర్తించబడింది. కొబ్బరితోటలు మరియు వరి పొలాలు విస్త్రుతంగా ఉన్నాయి.

*తేనెనీలాపురం:
శ్రీకాకుళం నుండి 65 కిలోమీటర్లు మరియు టెక్కలి మండలంలో టెక్కలి నుండి 7 కిలోమీటర్ల దూరంలో తేనెనీలాపురం ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబరులో సైబీరియా నుండి సెప్టెంబరులో 3,000 మందికి పైగా పెలికాన్లు మరియు పెయింటెడ్ కొంగలు సందర్శిస్తాయి మరియు మార్చ్ వరకు ఉంటాయి. ఇది పక్షి పరిశీలకులకు స్వర్గం. ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిశోధకులు 15 ఏళ్ళుగా ఈ పక్షులు వైమానిక మార్గాలను అనుసరిస్తున్నాయి అని పరిశోధనలో తెలిపారు. మొదట 15 సంవత్సరాల క్రితం వలస లు గుర్తించబడినవి. ఆ సమయంలో పక్షులు సంఖ్య 10,000 కు చేరుకుంది. నేడు, ఈ సంఖ్య 3,000 కు తగ్గించబడింది. జిల్లాలో తెలీనిపురం, ఇజ్జువ్రం నౌపద, టెక్కలి మరియు పరిసర ప్రాంతాలలోని గ్రామాలుకు రష్యా, మలేషియా, హంగేరీ, సింగపూర్ మరియు జర్మనీ, సైబీరియాకు చెందిన 113 వివిధ జాతుల పక్షులు సందర్శిస్తాయి.

*మందస:
సోంపేట టౌన్ నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం మెహేంద్రగిరి పాదంలో ఉంది. దక్షిణ భారతదేశంలో ఉన్నతస్థాయిలో ఉన్న ఒక కోట ఈ పర్యాటక ఆకర్షణ. ఈ గ్రామంలో వరాహస్వామి దేవాలయం పర్యాటకుల దృష్టి ఆకర్షిస్తుంది.

*రాజాం:
రాజాం లేదా రజాం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఒక జనాభా గణన పట్టణం, మునిసిపాలిటీ మరియు మండల ప్రధాన కార్యాలయం. రాజాం మండల్ సరిహద్దులు గోంగువరి సిగదం, శానకవాటి మరియు శ్రీకాకుళం జిల్లా మరియు విజయనగరం జిల్లాలోని రెడ్డి ఆమదాలవలస మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. రాజాం శ్రీకాకుళం పట్టణం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్థలం బొబ్బిలి యొక్క వాలియంట్ సర్దార్ అయిన సర్దార్ పాపారాయుడు సంబంధం కలిగి ఉంది.
Read More

ప్ర: సంస్కృతికి, సంస్కారానికీ తేడా ఏమిటి? శాస్త్రపరంగా వాటి అర్థాలేమిటి? వాటి అవసరమేమిటి?

ప్ర: సంస్కృతికి, సంస్కారానికీ తేడా ఏమిటి? శాస్త్రపరంగా వాటి అర్థాలేమిటి? వాటి అవసరమేమిటి?

జ: సంస్కారం, సంస్కృతి- రెండూ సమానార్థకాలే.  ముడిగా దొరికే బంగారాన్ని అగ్ని ద్వారా శుద్ధి చేసినట్లుగా,  పశుప్రాయంగా పుట్టిన మానవుని సంస్కరించడమే సంస్కారం. "సంస్క్రియతే జ్ఞానయోగ్యతామాపాద్యతే పురుషస్య చిత్తమనే నేతి సంస్కారః"- అని ఉత్పత్తి.  చిత్తాన్ని శుద్ధి చేసి, దానిని ఆత్మజ్ఞాన యోగ్యంగా చేయడమే సంస్కారం.  సంస్కారాలు రెండు రకాలు: 1. దోషాన్ని పోగొట్టేవి, 2. యోగ్యతను, గొప్పతనాన్ని కల్పించేవి.జననానికి పూర్వరంగంగా తల్లిదండ్రులకు చెందిన మైథున సంకల్పాది పైతృక బీజ దోషాలను పరిహరించేవి- గరదాన,  జాతకర్మ, చౌలాది సంస్కారాలు. మిగిలనవి యోగ్యతను కలిగించేవి.

తాత్పర్యంగా- అంతఃకరణం శుధ్ధికోసమే సంస్కారాలు. తగిన సంస్కారానిచ్చి దీక్షలను,  ఉపదేశాలను అందించడం సంప్రదాయం. ఆ దీక్షాదుల వల్ల జీవుడు మరింత శుద్ధుడౌతాడు. "ఒక విగ్రహాన్ని శిల్పించదలచిన శిల్పి, రాతిపై అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న సంకేతాలను పెట్టుకొని, దాని ననుసరించి రేఖలను నిర్మించి,  అటుపై చెక్కి తాననుకున్న రూపాన్ని ఎర్పర్చుతాడు. ఇన్ని సంస్కారాల వలన ఆ చిత్రం,  శిల్పం ఒక సృష్టిస్వరూపం ధరించి చూపరులకానందం కలిగిస్తుంది. ఈ విధంగానే మంత్రద్రష్టలైన మహర్షులు ఏర్పరచిన సంస్కారాలతో పశుప్రాయమైన జన్మ,  పరిపూర్ణతకు దారితీస్తుంది"-  అని పరాశర మహర్షి వివరించారు.
Read More

ఛప్పన్న భోగాల నిత్య నైవేద్యాలు

ఛప్పన్న భోగాల నిత్య నైవేద్యాలు

ఛప్పన్న భోగాల నిత్య నైవేద్యాలు ఆరగించే జగన్నాథుని వైభోగం వర్ణనా తీతం. పూరీ ఆలయంలోనిh నైవేద్యాలను సిద్ధం చేసే భోగమంటపం (వంటశాల) ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. జగన్నాథునికి ఛప్పన్న (56) ప్రసాదాలను, రోజుకు ఆరుసార్లు నివేదిస్తారు. జగన్నాథునికి నివేదన పూర్తయిన తర్వాత క్షేత్రపా లిక అయిన విమలాదేవికి నివేదించి, ఆ ప్రసాదాలను ఆలయ ఈశాన్యభాగాన ఉండే 'ఆనంద బజార్' లో భక్తులకు విక్రయిస్తారు. ప్రసాదాలను వండటానికి ఎప్పటికప్పుడు కొత్త మట్టి కుండలనే ఉపయోగిస్తారు. కట్టెల పొయ్యిలపై వండు తారు. భోగ మంటపానికి చేరువలోని 'గంగ', 'యమున' అనే రెండు బావుల్లోని నీటిని మాత్రమే వంటకాలకు ఉపయోగిస్తారు. ప్రతిరోజూ ఏకకాలంలో యాభై వేల మందికి సరిపోయేలా ఇక్కడ ప్రసాదాలను తయారు చేస్తారు. పర్వదినాల్లో | నైతే లక్షమందికి సరిపోయేలా తయారు చేస్తారు. ఏకకాలంలో లక్షమంది కూర్చుని | భోజనం చేయగలిగేంత విశాలమైన భోజనశాల ఇక్కడి ప్రత్యేకత. జగన్నాథునికి నివేదించే ప్రసాదాలను 'మహాప్రసాదం'గా పరిగణిస్తారు. మహాప్రసాదాన్ని ఆర గిస్తే మనోభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. పూరీలో నివేదించే ఛప్పన్న భోగాలేమిటంటే... 1. అన్నం 2. కనికా (బియ్యం , నెయ్యి, పంచదారతో తయారు చేస్తారు) 3. దొహి పొఖాహ్ (నీట్లో నానిన అన్నానికి పెరుగు కలిపి తయారు చేస్తారు) 4. ఒద్దా పొఖాళా (నీట్లో నానిన అన్నానికి అల్లం కలుపుతారు) 5. తీపి కిచిడీ (బియ్యం , పెసరపప్పు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 6. నేతి అన్నం 7. కిచిడీ 8. మిఠా పొఖాళి (నీట్లో నానిన అన్నానికి పంచదార కలుపుతారు)

9. ఒరియా పొఖాళి (బియ్యం, నెయ్యి, నిమ్మరసం, ఉప్పుతో చేస్తారు) 10. కాజా 11. గొజ్జా (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేసే మిఠాయి) 12. లడ్డు 18. మగజా లడ్డు (గోధుమపిండితో చేసే లడ్డు) 14. జీరాలడ్డు (గోధుమపిండికి జీలకర్ర చేర్చి తయారు చేసే లడ్డు) 15. వల్లభ (గోధుమపిండితో చేసే ఒక ప్రత్యేక మిఠాయి) 16. ఖురుమా (గోధుమపిండి, పంచదార, ఉప్పుతో చేస్తారు) 17. మొథాపులి (మినుములు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 18. కకరా (గోధుమపిండి, కొబ్బరికోరు, పంచదారతో చేస్తారు) 19. మరిచి లడ్డు (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 20. లుణి ఖురుమా (గోధుమపిండి, నెయ్యి, ఉప్పుతో చేస్తారు) 21. సువార్ పిఠా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 22. జొడెయి లొడా (గోధుమలు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 23. యిలి (వరిపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు) 24. కొంటి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 25. మండా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 26. ఒమాళు (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు) 27. పూరీ 28. లుచి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 29. బొరా (మినప్పప్పుతో చేసే వడలు) 30. దొహిబొరా (పెరుగు గారెలు) 31. అరిసె 32. త్రిపురి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 33. రోసాపాయిక (గోధుమలతో చేస్తారు) 34. ఖిరి (పాయసం) 35. పాపుడి (పాలమీగడ, పంచదారతో చేస్తారు) 36. కోవా 37. రొసాబొళి (పాలు, పంచదార, గోధుమలతో చేస్తారు) 38. తడియా (తాజా పనీర్, నెయ్యి, పంచదారతో చేస్తారు) 39. ఛెనాభాయి (తాజా పనీర్, పంచదార, పాలతో చేస్తారు) 40. బపుడి ఖోజా (పాలమీగడ, నెయ్యి, పంచదారతో చేస్తారు) 41. ఖువా మండా (పాలు, గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 42. సొరాపులి (పాలను గంటల తరబడి మరిగించి చేసే మిఠాయి) 43. డల్లి (కందిపప్పుతో చేసే ముద్దపప్పు) 44. ముగోడల్లి (పెసరపప్పు వంటకం) 45. బిరిడల్లి (మినుములతో చేసే పప్పు) 46. ఉరద్ డల్లి (మినప్పప్పు వంటకం) 47. దాం (కందిపప్పు, కాయగూరలు కలిపి చేసే వంటకం) 48. మవుర్ (పప్పులు, కొర్రలతో చేసే వంటకం) 49. బేసొరొ (కలగూర వంటకం) 50. సగో (తోటకూర వంటకం) 51. పొటోలో రొసా (పొటల్స్/పర్వల్ కూర) 52. గోటి బైగొణా (గుత్తివంకాయ కూర) 53. ఖోటా (చింతపండు గుజ్జు, బెల్లంతో చేసే లేహ్యం) 54. రైతా (పెరుగులో కూరగాయల ముక్కలు వేసి చేస్తారు) 55. పిఠా (గోధుమపిండితో చేసే తీపిరొట్టె) 56. బైగని (వంకాయలతో చేసే వంటకం)
Read More

కర్ణాటక సంగీతం

కర్ణాటక సంగీతం, ప్రపంచ సంగీత రీతులన్నింటిలోకీ విశిష్టతను పొందటానికి,ఆసంగీతంలోని రచనలు ఒక ప్రధాన కారణము.వాటిని రూపొందించిన వాగ్గేయకారులు మనకు సదా స్మరణీయులు.
సంగీత రచనలను రెండు విభాగాలుగా చెప్పుకోవచ్చు.1.అభ్యాస రచనలు, 2.సభా గాన రచనలు.
అభ్యాస రచనలు అంటే,విద్యార్థులు తమ ఇళ్ళలో సాధనచేసుకోవలసినవి.సభా గాన రచనలు అంటే,ఒక స్థాయికి చేరుకొన్న కళాకారులు,సభలలో గానం చేయదగినవి..
1. అభ్యాస రచనలు : సరళీవరుసలు,జంట వరుసలు,దాటు వరుసలు,స్థాయి వరుసలు,గీతములు,శూళాదులు,చిట్ట తానములు,స్వర పల్లవులు,స్వర జతులు,వర్ణములు...మొదలైనవి.

--సరళీ వరుసలు--
ఆరోహణ,అవరోహణ తో ప్రారంభించి,సప్తస్వరాలను వివిధరకాలుగా అమర్చి,పాడే అభ్యాసం
--జంట స్వరాలు--
ప్రతి స్వరాన్ని రెండు సార్లు పలుకుతూ స్ఫురిత గమకంతో చేసే స్వర అభ్యాసం
--దాటు స్వరాలు--
స్వరాల క్రమంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా వదలి,దాటుతూ చేసే అభ్యాసం
--స్థాయి వరుసలు--
స్వరాలను మంద్ర,మధ్యమ,తార స్థాయిలలో పాడే అభ్యాసం
( పైన తెలిపిన అభ్యాస రచనలను 'కర్ణాటక సంగీత పితామహులు' పురందరదసులవారు మాయామాళవగౌళ రాగంలో రూపొందించారు).
--గీతములు--
గీతములు సులభతరమైన సంగీత రచనలు.సరళీవరుసల నుండి స్థాయి వరుసల వరకూ ధాతు(స్వర) సాధన చేసిన సంగీత విద్యార్థికి,మాతు(సాహిత్యం) పరిచయం,గీతాల నుండే ప్రారంభమౌతుంది.వీటిలో పల్లవి,అనుపల్లవి,చరణం వంటి విభాగాలు ఉండవు.సంగతులుండవు.క్రియకు ఒక అక్షరం చొప్పున గమనముంటుంది.
గీతాలలో విఘ్నేశ్వర స్థుతితో కూడుకొన్న వాటికి 'పిళ్ళారి గీతాలు' అని పేరు.పురందరదాసులవారు ఇవి రచించారు.
రాగలక్షణాలను వివరించే గీతాలను లక్షణ గీతాలని, నాట,గౌళ,ఆరభి,వరాళి,శ్రీరాగము-ఈ అయిదు రాగాలలో రచింపబడిన గీతాలను 'ఘనరాగ గీతాలని', వివిధ రాగాలు ఒకే గీతములో ప్రయోగించబడితే, వాటిని 'రాగమాలికా గీతాలని' పిలవటం కద్దు.
వెయ్యికి పైగా గీతాలను రచించిన కారణంగా, పైడాల గురుమూర్తి శాస్త్రిగారిని,' వేయి గీతాల శాస్త్రి' అని పిలిచేవారు.
--సూళాదులు--
గీతాలను పోలిన రచనలు ఇవి.పురందరదాసు,అన్నమయ్య వీటిని రచించారు.వీటిలో తాళమాలికలు కూడా ఉన్నవి.
--చిట్ట తానములు--
మనోధర్మ అంశమైన తాన సాధనకు ఉపకరించే రచనలు.వీణవాదకులు,ఈరచనలను వివిధ రాగాలలో సాధన చేస్తే,తానములోని మీటు చక్కగా పలుకుతుంది.వీటికే 'కటకములు' అనికూడా పేరు ఉంది.ఘనరాగ కటకాలు కూడా వాగ్గేయకారులచే రచింపబడ్డాయి.
--స్వరపల్లవులు--
వీటికే 'జతి స్వరములు' అని పేరు కూడా ఉంది.వీటిలో స్వరము మాత్రమే ఉంటుంది.పల్లవి,చరణాలను కలిగిన రచనలివి.సాధారణంగా ఇవి,క్రియకు ఒక అక్షర కాలము కాక,నాలుగు అక్షరకాలము నడుస్తాయి.కాల,పైకాలాలు పాడుకొనేందుకు అనుకూలంగా ఉంటాయి.
--స్వరజతులు--
వీటిలో పల్లవి,చరణాలు ఉంటాయి.మంచి రాగ,సాహిత్య భావములతో కూడి,కచేరీలలో సైతం పాడుకొనేందుకు అనుకూలంగా ఉంటాయి.సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్యామశాస్త్రిగారు స్వరజతులు వ్రాసినవారిలో ప్రసిద్ధులు.
--వర్ణములు--
సంగీత విద్యార్థికి,రాగాలను గురించిన సంపూర్ణ అవగాహన కల్పించేది వర్ణము.పల్లవి,అనుపల్లవి,చరణము,చిట్టస్వరాలతో కూడుకొని ఉంటుంది.తాన సాధనకు ఎంతో దోహదకారి కనుక,దీనిని 'తాన వర్ణం' అని పిలుస్తారు.ఆది,అట,ఝంపె తాళాలలో వర్ణరచన ఎక్కువగా జరిగింది.సంగతులతో కూడి,స్వర సాహిత్య సహితంగా ఉండే వర్ణాలను 'పద వర్ణాలు' అంటారు.మనోధర్మ సంగీత అంశాలైన రాగాలాపన,స్వర ప్రస్థారం,నెరవు,తానం,పల్లవి-వీటిని సాధించాలంటే,సంగీత విద్యార్థికి వర్ణ సాధన తప్పనిసరి. అభ్యాస రచనలైనప్పటికీ,కచేరీలో మొదటి అంశంగా వర్ణం తీసుకుంటే, గాయకుని గాత్రం సానుకూలమౌతుంది.వాదకునికి చేయి స్వాధీనమౌతుంది.స్వరజతులు,వర్ణాలు నృత్య ప్రదర్శనకు కూడా ఉపయుక్తంగా ఉంటాయి.

2. ఇక, సభాగాన రచనల విషయానికొస్తే..అవి అసంఖ్యాకాలు.వాటిలో కొన్నింటిని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం...
--కృతులు--
రాగప్రధానమైన రచనలు.అనేక సంగతులతో కూడుకొని,పల్లవి,అనుపల్లవి,చరణము/లు,అనుబంధము,వంటి విభాగాలతో ఉంటాయి.కొన్ని కృతులలో చిట్టస్వరాలు,సోల్కట్టు స్వరాలు(మృదంగ జతులతో కూడుకొన్నవి) కూడా కనిపిస్తాయి.సంగీత త్రిమూర్తులైన త్యాగరాజు,శ్యామశాస్త్రి,ముత్తుస్వామి దీక్షితులు కృతులు వ్రాసిన తొలి వాగ్గేయకారులు.వారు మువ్వురూ తమ కృతుల ద్వారా భగవదాకృతిని,తాము దర్శించి,మనకు దర్శింపచేశారు.వారి స్ఫూర్తితో ఎందరో మహానుభావులు కృతులు రచించారు.
--కీర్తనలు--
భక్తి ప్రధానమై,సంగీత జ్ఞానం పరిమితంగా ఉన్నవారు సైతం పాడుకోగలిగిన రచనలివి.సాధారణంగా కీర్తనలు పల్లవి,చరణాలను కలిగి ఉంటాయి.చరణలన్నీ ఒకే విధంగా పాడుకొనదగినవిగా ఉంటాయి.అన్నమయ్య తొలి సంకీర్తనాచార్యుడు.
--పదాలు--
శృంగార రస ప్రధాన రచనలు.రాగ నిధులైన పదాలు,విలంబ గతిలో పాడుకోవటానికి,నృత్యాభినయానికి కూడా అనుకూలంగా ఉంటాయి.క్షేత్రయ్య రచించిన పదాలు బహుళ ప్రసిద్ధాలు.
--జావళీలు--
పదాల వలెనే ఉండే, మరింత సులభ తరమైన శృంగార రచనలు.పల్లవి,అనుపల్లవి,చరణాలను కలిగియుంటాయి.
పదాలు,జావళీలు తెలుగువారి సొత్తు.
--తిల్లానాలు--
మృదంగ తాళ జతులతో నడిచే అద్భుత రచనలు.పల్లవి,అనుపల్లవి,చరణం,చరణానుపల్లవులతో కూడి,చరణములో సాహిత్యాన్ని కలిగి ఉంటాయి.నృత్యానికెంతో అనుకూలమైనవి.
--శబ్దములు--
నాట్య ప్రదర్శనకు మాత్రమే అనువైన రచనలు.సాహిత్యం,మృదంగ శబ్దం కలసి ఉండే రచనలు.
--దరువులు--
పదమును పోలియుండే నాట్య రచనలు.గేయ నాటకాలలో పాత్రధారి ప్రవేశిస్తున్నప్పుడు పాడేది ప్రవేశ దరువు,ఇద్దరు పాత్రధారుల సంభాషణను తెలిపేది సంవాద దరువు,పాత్ర స్వగతాన్ని తెలిపేది స్వగత దరువు,జతులతో ఉండేది జక్కిణ దరువు..ఈ విధంగా అనేక రకాల దరువులున్నాయి.
--సంచారి--
రాగలక్షణాన్ని తెలిపే గీతము వంటి రచన.
--రాగమాలిక--
3 గాని,అంతకన్నా ఎక్కువ గాని,రాగాలతో కూడుకొన్న రచన.
--తాళమాలిక--
3 గాని,అంతకన్నా ఎక్కువ గాని,తాళాలతో కూడుకొన్న రచన.
--రాగతాళ మాలిక--
3 గాని,అంతకన్నా ఎక్కువ గాని,రాగ,తాళాల మాలికా రచన
--గుఛ్ఛ కృతులు--
ఒకే రచనావస్తువుపై చేయబడిన సామూహిక కృతులు.ఉదాహరణ:దీక్షితుల నవావరణ కృతులు,త్యాగరాజ పంచరత్న కృతులు.
--అష్టపదులు--
జయదేవకవి రచించిన 'గీతగోవింద' కావ్యములోని ఎనిమిది చరణములను కలిగిన సంస్కృత రచనలు.
--తరంగాలు--
శివనారాయణతీర్థు
Read More

Powered By Blogger | Template Created By Lord HTML