What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 23 February 2017

పంచాంగము అంటే ?? మానములు ఎన్ని రకములు వివరించండి ??

మానములు ఎన్ని రకములు వివరించండి ??

చాంద్ర మానం 
సౌర మానం 
సావన మానం 
నక్షత్ర మానం 
బార్హస్పత్య మానం 

చాంద్ర మానం = శుక్ల పాడ్యమి మొదలు చైత్రాది 12   మాసములు ఉండును. ఇందు ప్రభావాది ౬౦ నామములు కలది . 354  దినములు ఉండును 

సౌర మానం  = మేషాది ద్వాదశ రాశులందు  సూర్య సంక్రమణ చే ఏర్పడి 365  దినములు కలదు.

నక్షత్ర మానం = అశ్విని  మొదలు రేవతి వరకు ౨౭ నక్షత్రములలో చాంద్ర చారము చేత ఏర్పడి 12  నెలలు లేక 324  దినములు ఉండును. 

బార్హస్పత్య మానం = మేషాది రాశులందు గురు చారము చేత 361  దినములు ఉండును . 

పంచాంగము అంటే = 5 - అంగములు కలది . 1 . తిధి 2 .వారము 3 .నక్షత్రము 4. యోగము 5. కరణము
Read More

Sunday, 5 February 2017

వేదాలు పురాణాలు



వేదాలు పురాణాలు




వేదాల తరువాత అంత ప్రాముఖ్యత కలవి పురాణాలు . వేదాల్లో చెప్పిన ధర్మాల్ని కధల రూపం లో, ఆఖ్యానాల రూపం లో సామాన్యులకు సైతం తెలియ చెప్పేవే పురాణాలు. అందుకే పురాణాలను పంచమ వేదం గా కీర్తించారు.

అసలు పురాణం అంటే : పురా అపినవం = పురాతనం అయినప్పటికీ నూతనం గా ఉండేది

అలాగే పురా ఆనతి అంటే పురాతన కాలం లో జరిగినది అని అర్ధం

వాయుపురాణం ప్రకారం = పురా ఏతత్ అభూత్ ( పూర్వం ఇలా జరిగింది అని అర్ధం )



Read More

Saturday, 4 February 2017

మన రాజ్యాంగం, చట్టాలు



మన రాజ్యాంగం, చట్టాలు
****************************

1) కొడుకు గాని కోడలు కాని మతం పుచ్చుకున్నాక పిల్లల్ని కంటే వారికి తాత ఆస్తిలోగాని,మరి ఎ ఇతర హిందూ బందువుల నుండిగాని,వారసత్వపు హక్కుగాని వాటా పంచమని అడిగే హక్కు గాని లేదు.


2)తల్లిదండ్రులు మతం మారినట్లైతే వారు పిల్లలకు ,పిల్లల ఆస్తికి గార్డియన్ గా (సంరక్షకులుగా) ఉండే హక్కు కోల్పోతారు.
(సెక్షన్ 6,హిందూ మైనార్టీ &గార్డియన్ షిప్ చట్టం)
అటువంటి అప్పుడు దగ్గర బందువులు గాని,చుట్టుపక్కల హిందువులుగాని స్వచ్చందంగా ముందుకు వొస్తే సంబంధిత జిల్లా కోర్టు వచ్చిన వారిని ఆ పిల్లలకు సంరక్షకులుగా కోర్టు నియమిస్తుంది. అంతేకాదు మత మార్పిడిల కార్యక్రమంపై (బాప్టిజం లేదా ముస్లిం మతంలపై) ముందుగా ఎవరైనా కోర్టుకు వొస్తే , మైనర్లను మతం మార్చకుండా సివిల్ కోర్టులకు తాత్కాలిక ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చే హక్కు ఉంది.

3) భార్యగాని భర్త గాని మతం మారితే లేక కూటములకు ,దర్గాలకు వెలుతుంటే వారి నుండి విడాకులు పొందవచ్చు. (సెక్షన్ 18(3) ii హిందూ వివాహ చట్టం)

4) భార్య గాని, తల్లీగాని, కుమార్తే గాని దర్గాలకు,కూటములకు వెల్తున్నారా??
ఐతే వారికి‌ మీరు మనోవర్తి చెల్లించనవసరం లేదు.
(సెక్షన్ 18(3) ఆఫ్ ఆక్ట్ 78 ఆఫ్ 1956)

5) మతం మారిన వారు B.C -A,B,D గ్రూపుల
వారు O.C గా పరిగణించబడతారు.
అదే విధంగా క్రైస్తవ మతం పుచ్చుకున్న S.C లు B.C-C గాను ,ముస్లిం మతం పుచ్చుకున్న S.C లు O.C లుగా పరిగణింపబడుతారు.

6) మతం మార్చుకొని కూడా రిజర్వేషన్ సౌకర్యాలు ప్రభుత్వం నుండి పొందుతున్న వారిపై సెక్షన్ 420 IPC ప్రకారం చీటింగ్ కేసులు పెట్టవచ్చు.

7) S.C కోటాలో ఉద్యోగం సంపాదించి తరువాత చర్చికి వెల్లడం లేదా క్రైస్తవం నమ్ముకోవడం చేస్తే వారి ప్రమొషన్ వారి పిల్లల సౌకర్యాల నిమిత్తం B.C-C. మాత్రమే అవుతారు. అలాంటి వారి పైన తాసిల్దార్కు కంప్లైంట్ చేయవచ్చు.

8) మతం మార్చుకున్న వారు S.అట్రాసిటి కేసు పెట్టే హక్కు ఉండదు. పాస్టర్లు B.C- C అవుతారు వారిపై S.C.,అట్రాసిటి చెల్లుతుంది.S.C కోటాలొ వొచ్చే ఉద్యోగాలు,పెన్శల్లు ,ఆస్తి హక్కులు ,లోన్ లు ,గవర్నమెంట్ రాయితీలు మొదలగునవి పోతాయి.

9) వేరు వేరు మతాల వారు చేసుకునే పెళ్ళి చెల్లదు - మద్రాస్ హైకోర్టు

మన దేశంలో రాజ్యాంగం లోని ఆర్టికల్ 25(1) ప్రకారం మత ప్రచారం హక్కు అంటే ఇతరులను‌ మతం మార్చే హక్కు కాదు అని (AIR 1977 SC ) 908 కేసులు సుప్రీంకోర్టు తీర్చుచెప్పింది.అనేక సంధర్భాలలొ ఆశ చూపి,అబద్దం చెప్పి,భయపెట్టి ప్రలొభాలకు,వొత్తిడికి గురిచేసి మతం మార్చడం నేరమని అనేక న్యాయస్తానాలు తీర్పుచెప్పాయి...

మీరు తెలుసుకోండి అందరికి తెలియజేయండి జాగొ హిందు జాగో,
Read More

పతనానికి దగ్గరలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ???

పతనానికి దగ్గరలో ఉన్న   తిరుమల తిరుపతి దేవస్థానం :  అన్య మతస్తుల కబంద హస్తాలలో దేవస్థానం




Read More

ఏటి సూతకం అన్న మాటకి అర్థం ఏమిటంటే

ఏటి సూతకం అన్న మాటకి అర్థం ఏమిటంటే ఎవరి శరీరం పడిపోతే కర్మ చేయవలసి ఉంటుందో కర్మ చేసినటువంటి వారు ఒక ఏడాది పాటు పాటించే నియమాల తోరణాన్ని ఏటిసూతకం అంటారు. తల్లి, తండ్రి వీళ్ళిద్దరి శరీరాలు పడిపోయినప్పుడు కొడుకు ఒక ఏడాదిపాటు ఏటి సూతకంలో ఉన్నాడు అంటారు. తల్లి కానీ, తండ్రికానీ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆ ఏడాదిపాటు వాళ్ళ అభ్యున్నతికి సంబంధించిన కర్మలు చేయాలి. జీవుడికి ఒక ఏడాది మనుష్యలోకంలో ఉన్న కాలంతో అవకాశాన్నిస్తారు. ఎందుకంటే ఆనంద భావం కలిగితే శరీరంలో కొడుకు పుడతాడు అని చెప్తుంది శాస్త్రం. ఆనంద ధాతువు కదలాలి అంటే హృదయ స్థానం నుండి కదిలితేనే కొడుకు వస్తాడు అని. శరీరంలో ఇంక ఏ భాగం నుంచి పురుషుడికి ఆనంద ధాతువు కలిగినా ఆడపిల్ల పుడుతుంది అని. ఆ కొడుకుకి ఉన్న అధికారం ఏమిటంటే ‘ఆత్మావై పుత్రనామాసి’ – తండ్రియొక్క ఆత్మయే కొడుకుగా భూమిమీద తిరుగుతుంది. తండ్రికి గొప్ప శాంతినిచ్చేవాడు కొడుకు. పుత్రగాత్ర పరిష్వంగము అని సుఖం. కొడుకును కౌగలించుకుంటే తండ్రి ఎంత ఆనంద పడిపోతాడో! అటువంటి కొడుకును కన్నప్పుడు ఎంతో మురిసిపోతుంది భార్య. అంటే కొడుకులు లేనటువంటి వారిని బెంగ పెట్టుకొమ్మని కాదు. కొడుకులు లేకపోయినా కూతురు ఉండి కూతురుకి కొడుకు పుడితే కొడుకు ఉండడంతో సమానమే. తండ్రికి ఆత్మ బహిర్గతంగా తిరుగుతుండడంతో సమానం. శరీరం విడిచిపెట్టే ముందు కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని విడిచిపెడితే కాశీ పట్టణంలో విడిచిపెట్టేసినట్లే. అంటే తండ్రీ కొడుకుల మధ్య అంత గొప్ప అనుబంధాన్నిచ్చింది శాస్త్రం. మరణ వేదన కూడా తగ్గిపోతుంది కొడుకు స్పర్శకి అని. అటువంటి తండ్రి విడిచి పెట్టేస్తే నీకోసం ఆయన సమయం వెచ్చించాడు చిన్నప్పటి నుంచి. మరి ఆ తండ్రికి నువ్వు చేయవలసినది? తండ్రి శరీరం బడలి వృద్ధుడైనప్పుడు కొడుకు తన కళ్ళ ముందు తిరిగితే ఆ తండ్రికి పరమ శాంతి. అందుకే ఒక చూరు క్రింద తండ్రి కొడుకు ఉన్నవాడు ఎవడో వాడు మహద్భాగ్యవంతుడు. రోజూ కొడుకు తిరుగుతూ కనపడుతూ ఉంటే, కొడుకు మాట వినపడుతూ ఉంటే కొడుకుతో కలిసి భోజనం చేస్తూ ఉంటే కొడుకు రాత్రి వచ్చి కాళ్ళు పడితే నా కొడుకు ఇక్కడే ఉన్నాడు, వాడున్నాడు అన్న ధైర్యం తండ్రికి ఆయుర్దాయం పెంచుతుంది. కొడుకు దగ్గర లేడు అన్నది ఆయువును క్షీణింపజేసి అనారోగ్యాన్ని తెస్తుంది. అలా కొడుకు కోసం తండ్రి వెంపర్లాడతాడు కాబట్టి ఆయన శరీరం వెళ్ళిపోయినా ఏడాదిపాటు ఆయన జీవుడి అభ్యున్నతికి పనిచేయాలి. అది కొడుకు యొక్క అధికారం. ఏడాదిపాటు వీడు ఏం చేస్తాడో అవి తండ్రి జీవుడి ఖాతాలో వేస్తారు.
వీడు వెళ్ళి అన్నదానం చేస్తే నాన్నగారి ఖాతాలో వేస్తారు. పురాణం వింటే నాన్నగారి ఖాతాలో వేస్తారు. వస్త్రదానం చేస్తే నాన్నగారి ఖాతాలో వేస్తారు. వీడికి అంత కన్నా పుణ్యం లోకంలో లేదు. ఈశ్వర స్వరూపమైన తండ్రికోసం చేసినది ఏది ఉందో అంతకన్నా పుణ్యం లోకంలో ఇంకొకటి లేదు. అంతేకానీ మా నాన్నగారి కోసం ఏటి సూతకం పట్టాను. నేను ఏ క్షేత్రానికి వెళ్ళడానికి లేదు. ఏ వ్రతమూ చెయ్యట్లేదు అని బెంగ పెట్టుకోకూడదు. అంతకన్నా దుర్మార్గమైన ఆలోచన ఇంకొకటి ఉండదు. తండ్రికోసం విధిగా చేయాలి. అవకాశం ఉంటే గోదానం చేయాలి.
అలా ఏడాదిపాటు శరీరం విడిచిపెట్టేసినటువంటి తండ్రి/తల్లి ఎవరిని ఉద్దేశించి కర్మ చేస్తున్నారో ఒక్కొక్కరు వేరొకరికి కర్మ చేయవలసి రావచ్చు. అలా కర్మ చేయవలసి వస్తే ఎవరు కర్మ చేస్తున్నారో వాళ్ళు ఏడాది పాటు ఏటి సూతకంలో ఉన్నారు అంటారు.
ఏటి సూతకంలో ఉంటే నిత్యపూజ చేసి తీరాలి. ఏటి సూతకంలో ఉన్నాము, రోజూ చేసే పూజ చేయము అన్న మాట అనడానికి అధికారం లేదు. పంచోపచారములు జరిగి తీరాలి. అధవా షోడశోపచారములు కూడా చేయవచ్చు. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు లేని ఇల్లు ఉండడానికి లేదు. చక్కగా దీపం పెట్టవచ్చు. ఈశ్వరుడికి పూజ చేయవచ్చు. నైవేద్యం పెట్టవచ్చు. ప్రసాదం తినవచ్చు.
చేయకూడనివి: నోములు చేయడం, వ్రతాలు చేయడం, భార్యాభర్త కలిసి పీటల మీద కూర్చుని నోములు, వ్రతాలు ఆచరించడం, నిత్యపూజలో ఇద్దరూ కూర్చుని చేసినా దోషం ఏమీ ఉండదు. పీటల మీద కూర్చోవడం అంటే నైమిక్తికానికి సంబంధించిన కల్పంతో ఉంటుంది. అటువంటి పనులు చేయకూడదు. కొండలు ఎక్కకూడదు. కొండల మీద ఉన్న దేవాలయాల దర్శనం చేయడానికి వెళ్ళకూడదు. పండుగలు మొదలైన సంబరాలు చేసుకోకూడదు. చేసుకోకూడదు అంటే బలవంతంగా మనస్సు నిగ్రహించమని కాదు. అయ్యో నా గురించి అంత వెంపర్లాడిన ఆయన వెళ్ళిపోయాడే! కనీసం ఒక్క ఏడాది. ఈ పండుగకు మా అమ్మ అభ్యున్నతికి ఏం చేయాలో అది చేస్తాను అని ఎవరికైనా బ్రాహ్మణుడికి పంచెల చాపు దానం చేస్తాను. నాకు పండుగ అని నా సంతోషం కోసం చేసుకోను. అందుకు పండుగ చేసుకోవద్దు అంటారు. బలవంతంగా నిగ్రహించి పిల్లల్ని పండుగకి ఎక్కడికో పంపి మేము మాత్రం ఇలా కూర్చున్నాం అండీ ఎందుకది? ఎందుకా ఏటి సూతకం? అలా ఉండకూడదు. నువ్వు నేర్పాలి పిల్లలకి. నీ తాత/నాయనమ్మ అంత గొప్పవాళ్ళు. ఆ నాయనమ్మ/తాత వెళ్ళిపోయింది. అందుకని చేసుకోవడం లేదు. అంటే మీరు మానేయండి మేం వెళ్తాం అంటాడా పిల్లవాడు? అందుకే పండుగలు చేసుకోకండి, నోములు, వ్రతాలు, కొండలు ఎక్కకండి, ఎవరికి కర్మ చేస్తున్నారో వాళ్ళకి అభ్యున్నతి కొరకు ఏడాది పాటు ఆ జీవుడు ఏం చేస్తే తృప్తి పొందుతాడో, పుణ్యాన్ని పొందుతాడో ఆ పనులు చేయాలి. వేసవి కాలం వస్తే చలివేంద్రం పెట్టు. రోహిణీ కార్తెలో మజ్జిగ ఒక బిందెలో పట్టుకుని పదిమందికి మజ్జిక ఇయ్యి. దేవాలయంలో ఉత్సవం జరుగుతుంటే నాన్నగారి పేరు మీద అన్నదానం చేయమని కొంత డబ్బు ఇవ్వు. నియమం తప్పకుండా తల్లికి/తండ్రికి కర్మ చేస్తున్న వాళ్ళకి ఏవిధమైన ఆరాధన చేయాలో అది లోపం లేకుండా నిర్వర్తించు. అలా చేయడం ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి సంబంధించినది. దానిని ఏటి సూతకం అంటారు. ఏటి సూతకంలో నిత్యపూజ చేయకూడదు అన్న నియమం లేదు. నిత్యపూజ మాత్రం ఇంట్లో నడుస్తూ ఉండాలి.
Read More

Powered By Blogger | Template Created By Lord HTML