What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 21 September 2015

భారతీయ అతి గొప్ప శాస్త్రవేత్తల్లో వరాహమిహిరులు ఒకరు. జ్యోతిష్యం, ఖగోళం, గణితం, వృక్ష, జల శాస్త్రాలు, భౌతిక శాస్త్ర్రం, ఇలా ఒకటి కాక అనేక శాస్త్రాల్ని చక్కగా వివరించారు.



వరాహమిహిరులు........

దయ చేసి పూర్తిగా చదివి, నచ్చితే షేర్ చేయగలరు.

భారతీయ అతి గొప్ప శాస్త్రవేత్తల్లో వరాహమిహిరులు ఒకరు. ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఈయన ఎన్ని విషయాలలో పరిశోధనలు చేసి,ఎన్ని వైజ్ఞానిక అంశాలు చెప్పారో లెక్కే లేదు. అందులో కొన్ని మాత్రమే ఇక్కడ చెబుతున్నాం. జ్యోతిష్యం, ఖగోళం, గణితం, వృక్ష, జల శాస్త్రాలు, భౌతిక శాస్త్ర్రం, ఇలా ఒకటి కాక అనేక శాస్త్రాల్ని చక్కగా వివరించారు.


1) వీరు రచించిన అనేక గ్రంథాల్లో బృహత్సంహిత చాలా గొప్పది.

2) ఇందులో గల 32వ "దకార్గళాధ్యాయం" లో ఎలాంటి స్థలాలలో నీరు ఎంతెంత లోతుల్లో దొరుకుతుందో వివరించారు.

3) మనుష్యుని శరీరంలోని రక్త నాడులలో రక్తము ప్రవహించునట్లే, భూమిలో గల జల నాడులలో జల ప్రవాహములు గలవని, వాటిని గుర్తించటానికి భూమిపై నున్న చెట్లూ పుట్టలూ ఉపయోగ పడతాయని నిరూపించారు.

4) ఇదే గ్రంథంలో 32వ అధ్యాయంలో భూకంపాలను ముందుగానే పసిగట్టవచ్చుననీ, భూకంపం రావడానికి కనీసం ఏడు రోజులు ముందు నుంచే ప్రకృతిలో మార్పులు సంభవిస్తాయనీ, భూకంపాలకు గ్రహాల ప్రభావం, జలవనరుల ప్రభావం కూడా ఉంటుందనీ, పశు పక్ష్యాదులలో ఏవి ఎలా స్పందిస్తాయో కూడా స్పష్టంగా చెప్పారు.

5)భూకంపం జరిగే ముందు వద్ద అతి వేడిమి పుట్టి, ఆ వేడిమి ఆవిరిగా మారి, అది మేఘాకృతి దాలుస్తుందనీ, ఇది వింత వింత ఆకారాల్లో ఉంటుందనీ, ఆయా మేఘాకృతుల్ని బట్టి భూకంపాల్ని గుర్తించవచ్చని చక్కగా వివరించారు.

6) నీటి జాడలకు సంబంధించి ఆయన చెప్పిన అనేక విషయాలలో ఒకట్రెండు ఇక్కడ ప్రస్తావిద్దాం.

7) జలము లేని ప్రదేశంలో నేరేడు చెట్టున్నట్లైతే, దానికి మూడు హస్తముల ఉత్తరంలో, 240 అంగుళముల లోతులో జల రాశి ఉండును. ఇక్కడ త్రవ్విన 12 అంగుళాల లోతులో లోహపు వస్తువులూ, వాసన కలిగిన మట్టీ, దాని క్రింద కొంచెం తెల్లని మట్టీ, దాని కింద కప్ప ఉండును. దాని కింద దీర్ఘకాలమూ ఉండే జలముండును.

8) వర్షం నీటికి రంగూ రుచీ ఉండవనీ, అది స్వచ్ఛమైనదనీ, నేలమీద పడ్డ వాన నీరు నేల స్వభావాన్ననుసరించి రంగు రుచీ సంతరించుకుంటుందనీ వివరించారు.

అనంతర కాలంలో భారతీయ శాస్త్రవేత్తలు ఎవరూ వీటి మీద పరిశోధన చేసి ప్రాచుర్యములోనికి తీసుకు రాలేదు. ఈ అధ్యాయములోని విషయాలు అధారముగా ప్రస్తుతం వేగంగా పరిశోధనలు చేయడం జరుగుతోంది. భూగర్భ లోహం కనుక్కునేందుకు వరాహమిహిరుని సిద్ధాంతాలు ఉపయోగిస్తున్నారు. చెట్లు,ఆకులు పరిశీలించి, వీటి అంచనాయే గాక, ఖనిజ సంపత్తిని అంచనా వేసే క్రొత్త శాస్త్రము ఈ అధ్యాయం ఆధారంగా ఉధ్బవించింది. అయితే భూకంపాల్ని ముందుగా తెలుసుకునే పరిజ్ఞానం ఇంకా ఆధునికులు కనిపెట్టలేదు.
Read More

ఇది నిజమేనా ?? ఉక్కుమనిషి పటేల్ లేకుంటే - తెలంగాణ మరో పాకిస్తాన్ అయ్యేది : హిందూ వాహిని: 21/09/2015, KMIT,

ఉక్కుమనిషి పటేల్ లేకుంటే - తెలంగాణ మరో పాకిస్తాన్ అయ్యేది : హిందూ వాహిని: 21/09/2015, KMIT, నారాయణ గూడా, భాగ్యనగర్ : నిరంకుశ చివరి నిజాం పీడా తెలంగాణ ప్రాంతాన్ని వీడిన రోజును పురస్కరించుకుని , హిందూ వాహిని భాగ్యనగర్ శాఖా అధ్వర్యంలో తేది : 20/09/2015 నాడు భాగ్యనగర్ నారాయణ గూడా లోని కేశవ్ మెమోరియల్ కళాశాల పటేల్ హాల్ ఆడిటోరియం లో " నిజాం పరిపాలన విముక్తి దినోత్సవం " జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన ప్రముఖ చరిత్రకారులు శ్రీ ముదికొండ శివ ప్రసాద్ గారు మాట్లాడుతూ " భారత దేశానికి ఆంగ్లేయ పాలన నుండి స్వాసంత్ర్యం పొందిన రోజుకు దేశ చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందొ అంతే ప్రాధాన్యత నిరంకుశ నిజాం పాలన నుండి తెలంగాణ ప్రాంతం విముక్తి పొందిన రోజుకూ ఉంది, ఆగస్టు 15 లా సెప్టెంబర్ 17 ను ఎందుకు మనం ఘనంగా జరుపుకోలేకపోతున్నాం, ఇది ఆలోచించాల్సిన అంశం నిజాం పాలనా విముక్తి దినాన్ని జరపాలంటే అంతకు ముందు నిజాం నిరంకుశ పరిపాలన విషయం చెప్పాల్సి వస్తుంది, నిజాం పరిపాలన లో ఈ ప్రాంతం లోని హిందువులు అనుభవించిన ప్రత్యక్ష నరకాన్ని గురించి చెప్పాల్సి వస్తుంది, హిందువుల మన బిందువులైన మహిళలను నగ్నంగా బతుకమ్మలు ఆడించిన క్రూరత్వాన్ని, కనీసం సామూహికంగా గణేష్ ఉత్సవాలను జరుపుకోలేని నిర్భంద్దాన్ని, పూజారుల నోట్లో బలవంతంగా ఆవు మాంసాన్నికుక్కిన వికృత విధర్మీయ మనస్తత్వాన్ని గురించి చెప్పాల్సి ఉంటుంది, వీటితో పాటు ఇంత విపత్కర పరిస్తితులలోను తమ అస్తిత్వం కోసం పోరాడిన, కొమరం భీం, చాకలి ఐలమ్మ, సురవరం ప్రతాప రెడ్డి, భహిరంగ ఉరిని సైతం పొందిన ఆచార్య నరేంద్ర ఆర్య లాంటి ' హైందవ వీరుల పరాక్రమ గాధలను ' గురించి చెప్పాల్సి వస్తుంది, వీటితో తమ నోటు - వోటు బ్యాంకు చిల్లు పడుతుందనే ఈ ప్రభుత్వాలు ఈ మహోజ్వల చరిత్రను మన ముందుకు రాకుండా కుట్ర పూరితంగా వ్యవహరించడం జరిగింది " అని అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ రాజవర్ధన్ గారు రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ విశ్వ ప్రసాద్ గారు విభాగ్ అధ్యక్షులు, శ్రీ త్రివిక్రమ్ జి హిందూ వాహిని రెండు తెలుగు రాష్ట్రాల సంఘటన కార్యదర్శి, శ్రీ వెంకట్ నివాస్ గారు హిందూ వాహిని తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి, పెద్ద సంఖ్యలో హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More

ప్రాంతం- చిత్తురు జిల్లాలోని కాణిపాకం



ప్రాంతం- చిత్తురు జిల్లాలోని కాణిపాకం
దైవం- వరసిద్దివినాయక స్వామి
ఆలయం నిర్మించిన సం- 11వ శతాబ్దం
మాట్లాడే భాషలు- తెలుగు,తమిళం,ఇంగ్లిష్


తనునమ్మి వచ్చిన భక్తులను చల్లగా కాపాడుతూ వారికి సిద్ది,బుద్దులను ప్రసాదించే విఘ్ననాయకుడు శ్రీకాణిపాకం వినాయకుడు.కాణిపాక క్షేత్రం చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలో కాణిపాకం అనే గ్రామంలో కొలువైవుంది.స్వామివారు ఇక్కడబావిలో స్వయంభూగా వెలిసాడు.ఇంచుమించు తిరుపతిని దర్శించిన ప్రతీ భక్తుడు స్వామివారిని దర్శించుకుని వెళ్ళడం అనవాయితిగా వస్తుంది.ఈ క్షేత్రం యొక్క విశేషమేమిటంటే స్వామివారు కొలువైవున్న బావిలోనీరు భూభాగానికి సమానంగా ఉంటుంది.అదే నీటిని భక్తులకు తీర్ధం కింద ఇస్తారు ఇక్కడ అర్చకులు.మరో విశేషమేమిటంటే ఎపూడూ నీళ్ళతో ఉండే ఈ బావిచుట్టూపక్కల ఉన్న ప్రదేశంలో 40 అడుగుల లోతు తవ్వినా నీరు దొరకదట. స్వామివారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు అయిన కుల్తుంగ చోళుడు నిర్మించాడని తెలుస్తుంది.ఈ ఆలయం యొక్క పూర్వాపరాలను తెలిపే స్ధలపురాణమ్ను ఒక్కసారి పరిశిలిస్తే...
స్ధలపురాణం -
పూర్వం ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో మూగ,చెవిటి,గుడ్డి వారైన ముగ్గురు అన్నదమ్ములకు కాణి మడి ఉండేదట.అభూమిలో ఏతంతొక్కడానికి ఒక చిన్నబావిని తవ్వరట.అయితే కొంతకాలానికి ఆప్రాంతంలో కరువు రావడంతో నీరు చాలకపోవడంతో బావిని ఇంకాలోతుగా తవ్వాలని నిర్ణయించుకుని ముగ్గురూ కలిసి తవ్వడం ప్రారంభించారట.తవ్వగా తవ్వగా కొంతసేపటికి గునపం రయికి తగిలి ఉవ్వెత్తున రక్తం వారిమీద చిందిందట.ఆ రక్తం మీద పడగానే మూగ,గుడ్డి,చెవిటి వారైన ఆ అన్నదమ్ములకు వారి వైకల్యాలు పోయి మాములుగా తయారయ్యారట.ఈవార్త ఆప్రాంతం అంతా దావానంలా వ్యాపించి ప్రజలు తండోపతండాలుగా వచ్చి అక్కడ ఉన్న మట్టిని శుభ్రపరిచి చుడంగానే వారికి వినాయక విగ్రహం కనిపించిందట. దీనితో ఆ విగ్రహనికి ఆలయం నిర్మించారట.ఇప్పటికి స్వామి అంతరాలయం బావిలోనే ఉంటుంది.
కాణిపాకం చుట్టూ ఉన్న ఆలయాలు -
వరదరాజస్వామి ఆలయం
మణికంటెశ్వరస్వామివారి ఆలయం
ఆంజనేయస్వామి ఆలయం
దగ్గరలో ఉన్న ఆలయాలు -
అత్దగిరి ఆంజనేయస్వామి(22కిమీ) -తవనంపల్లి
సిరిపురం (55కిమీ) -నారాయణిపట్నం
బోయకోండ గంగమ్మ ఆలయం - బొయకొండ
వెంకటెశ్వరస్వామి(65కిమీ) - తిరుపతి
Read More

Powered By Blogger | Template Created By Lord HTML